కొత్త ఇంట్లోకి కేసీఆర్...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు తన కొత్త ఇంటిలోకి ప్రవేశించారు. ఈరోజు ఉదయం5గంటల 22నిమిషాలకు గృహప్రవేశం చేశారు. తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనానికి ‘ప్రగతిభవన్’గా నామకరణం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులు సుదర్శన యాగం నిర్వహించారు. ప్రగతిభవన్లో సీఎం నివాసం, సమావేశం మందిరం,క్యాంపు కార్యాలయాలను నిర్మించారు. సమావేశ మందిరానికి ‘జనహిత’ గానామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో చినజీయర్స్వామి, మంత్రులు మహమూద్ అలీ, హరీశ్రావు, కేటీఆర్, ఎంపీ కవిత తదితరులు హాజరయ్యారు.