CM Chandrababu

ప్రపంచ వ్యాప్తంగా సీఎం చంద్రబాబు బర్త్ డే సెలబ్రేషన్స్..ట్రెండింగ్‌లో #HBDBabu

  ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నారై టీమ్ ఆధ్వర్యంలో పలు నగరాల్లో అంగరంగ వైభవంగా చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. టీడీపీ అభిమానులు, చంద్రబాబు అభిమానులు కేట్ కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ఐటీని ప్రోత్సహించడంతోపాటు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లాగే నవ్యాంధ్రప్రదేశ్‌ను కూడా అభివృద్ధి పథంలో నడిపించారని పేర్కొన్నారు.  చంద్రబాబు నాయుడు బర్త్‌డే ఈ సందర్భంగా ఆయనకు దేశవిదేశాల నుంచి నాయకులు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నేటితో ఆయన 75వ ఏటలోకి ప్రవేశించారు. వయసు పైబడినా యువకులకి తీసిపోని ఆరోగ్యం ఆయనది. మండుటెండల్లో ఆయన ప్రజల కోసం, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనింపజేయడం కోసం కృషి చేస్తున్నారు. ఇప్పటికీ హైదరాబాద్ ఐటీ రంగం పేరు చెబితే CBN అనే పేరు ప్రపంచ వ్యాప్తంగా వినబడుతుంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు సామాజిక మాధ్యమాలలో శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. #HBDBabu హ్యాష్ ట్యాగ్ దేశ వ్యాప్తంగా ట్వీట్టర్‌లో ట్రెండ్ కొనసాగుతుంది.

Hyderabad MLC election

హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక రగడ...గులాబీ పార్టీ వైఖరింటో?

  రాష్ట్రంలో హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక వేడి రాజుకుంది. ఎన్నికల బరిలో ప్రధానంగా బీజేపీ, ఎంఐఎం ఉన్నాయి. ఈ ఎలక్షన్‌లో మజ్లిస్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వనుట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎవరికీ ఓటు వేస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల్లో మజ్లిస్‌కు పోటీ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధం అవుతోంది. బలం లేకపోయినా పోటీ ఏకగ్రీవం కావడం కోసం కమలం పార్టీ కసరత్తు చేస్తున్నారు. మరోవైపు గులాబీ పార్టీ నేతలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విప్ జారీ చేస్తామని హెచ్చరించారు. పార్టీ విప్ ధిక్కరిస్తే వేటు తప్పదని కేటీఆర్ హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ వద్దు ఎంఐఎం వద్దని ఇరు పార్టీలకు సమదూరం పాటించాలని కేటీఆర్ ఆదేశించారు. ఈనెల 24వ తేదీన ఎమ్మెల్సీ ఓటింగ్‌కు అందరూ దూరంగా ఉండాలని పార్టీ నేతలకు కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతంరావును ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు కాంగ్రెస్ ఓటు వేయనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎవరికీ ఓటు వేస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.   బీజేపీకి గెలిచే అంతా బలం లేకపోయినప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎవరికీ మద్దతిస్తాయనేది చూసిన తర్వాత కమలం పార్టీ ఓ నయా ప్లాన్ రూపొందించనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్‌ జిల్లా ప్రజా ప్రతినిధులు మాత్రమే ఓటర్లుగా ఉంటారు. అంటే ,హైదరాబాద్ జిల్లా పరిధిలోని కార్పొరేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ఉంటుంది. ఈ ప్రకారం చూస్తే ఎలెక్టోరల్ కాలేజీలో మొత్తం 113 మంది ఓటర్లు ఉన్నారు. ఈ 113 ఓట్లలో 49 ఓట్లతో ఎంఐఎంకు, తిరుగులేని ఆధిక్యత వుంది. బీఆర్ఎస్‌కు 25, బీజేపీకి 22, కాంగ్రెస్‌కు 14 ఓట్లు ఉన్నాయి.  ప్రస్తుత ఎమ్మెల్సీ ప్రభాకర్ పదవి కాలం, త్వరలో ముగియనుండడంతో జరుగతున్న, ఈ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్ధి, మీర్జా రియాజ్ ఉల్ హసన్ గెలుపుకు ముందు గానే ఖారారైనట్లు తెలుస్తోంది.  క్రాస్ ఓటింగ్‌పై కాషాయ పార్టీ హోప్స్ పెట్టుకుంది. బీజేపీ, బీఆర్ఎస్‌ల మధ్య రహస్య ఒప్పందం ఉందని, అధైర్యంతోనే బీజేపీ సంఖ్యా బలం లేక పోయినా తమ అభ్యర్ధిని బరిలో దించిందని ఆరోపిస్తున్నారు.    

Liquor scam case

లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డిని 8 గంటలు విచారించిన సిట్

  ఏపీలో మద్యం కుంభకోణం కేసులో వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిపై సిట్‌ అధికారుల విచారణ  ముగిసింది. విజయవాడ సిట్ ఆఫీసులో మిథున్‌రెడ్డిని దాదాపు 8 గంటల పాటు సిట్‌  అధికారుల బృందం విచారించింది. ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసి సంతకాలు తీసుకుంది. వివిధ అంశాలపై ఆరా తీసిన అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై మరోసారి ఆయన్ను పిలిచే అవకాశముంది. లిక్కర్ పాలసీ రూపకల్పన, మిథున్‌రెడ్డి ప్రమేయం, డిస్టిలరీ నుంచి ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మద్యం కొనుగోళ్లపై సుదీర్ఘంగా ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. రాజ్‌ కసిరెడ్డికి చెందిన ఆడాన్‌ డిస్టిలరీ, డికార్ట్‌ నుంచి ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎంతమేర కొనుగోళ్లు చేసిందని ప్రశ్నించినట్లు సమాచారం.  రాజ్‌ కసిరెడ్డి, ఆయన అనుచరులు చాణక్య రాజ్‌, అవినాష్‌రెడ్డిలతో మిథున్‌రెడ్డికి ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీల గురించి విజయవాడ సీపీ, సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు ప్రశ్నించారు. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇంట్లో 2 దఫాలుగా జరిగిన చర్చలపై మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ అనంతరం మళ్లీ విచారణ కొనసాగించారు. హైకోర్టు ఆదేశాల మేరకు న్యాయవాది సమక్షంలో మిథున్‌ రెడ్డిని సిట్‌  ప్రశ్నించారు. ఈ సందర్భంగా రాజ్‌ కసిరెడ్డి, అవినాష్‌ రెడ్డి, చాణక్యరాజ్‌లతో సంభాషణలపై అతడిని ఆరా తీసినట్లు తెలిసింది. లిక్కర్ పాలసీపై జరిగిన సంభాషణలపైనా ప్రశ్నలు వేసినట్లు సమాచారం. విజయసాయిరెడ్డి వెల్లడించిన వివరాల ఆధారంగా మిథున్‌రెడ్డిని సిట్‌ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం మిథున్ రెడ్డి నుంచి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసి, దానిపై ఆయన సంతకాన్ని తీసుకున్నారు

ycp lost pride in vizag

బొత్స, గుడివాడ ఎత్తులు చిత్తు.. వైసీపీ పరువు గల్లంతు

విశాఖ కార్పొరేషన్ తెలుగుదేశం కూటమి వశం అనుకున్నట్టే జరిగింది... విశాఖ కార్పొరేషన్ తెలుగుదేశం కూటమి వశం అయింది. మాజీ మంత్రులు బొత్ససత్యనారాయణ,  గుడివాడ అమర్నాథ్ ఎత్తులు చిత్తయ్యాయి. ఈ మొత్తం వ్యవహారంలో అమాయకపు బీసీ మహిళ బలయ్యారు. సొంత పార్టీ కార్పొరేటర్లే ఎదురుగా తిరగడంతో ఆ పార్టీ పరువు మరోసారి గంగలో కలిసింది.  విశాఖ మేయర్ పీఠంపై అవిశ్వాస తీర్మానం శనివారం జరిగింది.  పూర్తి భద్రత ఏర్పాట్ల మధ్య గుర్తింపు అనంతరం కార్పొరేటర్ లను అనుమతించారు ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత విశాఖ కార్పొరేషన్ లో కార్పొరేటర్ల పార్టీ బలాబలాలు మారాయి. నాలుగేళ్ల క్రితం మేయర్ పదవి దక్కించుకున్నప్పుడు వైసిపి బలం 58 కాగా ఇప్పుడు మారిపోయింది జనసేన బలం 11 కి చేరింది ఈ దశలో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడం ద్వారా కూటమి పార్టీలు మేయర్ పదవిని దక్కించుకుంటాయని ముందుగానే అందరూ అంచనాలు వేశారు. కానీ మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ గుడివాడ అమర్నాథ్ రాజకీయ ఎత్తులు వేశారు.  ముందుగా శిబిర్యాలను ఏర్పాటు చేసి కార్పొరేటర్ లను శ్రీలంక తరలించారు. కానీ కరుడుగట్టిన వైసిపి కార్పొరేటర్లుగా పేరుందిన గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు తిప్పల వంశీ బెహరా భాస్కరరావు, అవంతి శ్రీనివాసరావు కుమార్తె ప్రియాంక తదితరులు అవిశ్వాసానికి ముందే పార్టీకి రాజీనామా చేశారు. దీంతో కూటమి చేతుల్లోకి విశాఖ కార్పొరేషన్ రావడం ఖాయమని అందరికీ అర్థమైంది. కానీ విప్ జారీ చేయడం ద్వారా అవిశ్వాసానికి తమ కార్పొరేటర్లు దూరంగా ఉంటారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రకటించారు. మరోవైపు విప్ పాటించినట్లయితే అనర్హత వేటు వేస్తామని మరో మంత్రి బొత్స సత్యనారాయణ బెదిరింపులు, హెచ్చరికలకు దిగారు.  అయితే వీరి హెచ్చరికలను భయపడే స్థాయి నుంచి వైసీపీ తిరుగుబాటు కార్పొరేటర్లు ఎప్పుడో ఎదిగిపోయారు. అధికారంలో ఉన్నప్పుడు తమను పట్టించుకోలేదని పార్టీ పనులు అన్నీ కూడా ఓ కోటరీ చుట్టూ తిరిగాయనీ,  తిరుగుబాటు కార్పొరేటర్లు బహిరంగంగా ఆరోపణలు చేశారు.  ఈ దశలో అవిశ్వాస తీర్మా నానికి అనుకూలంగా మ్యాజిక్ ఫిగర్ కు చేరుకుంది కూటమి. కూటమికి చెందిన 11 మంది ఎక్స్ అఫీషియల్ సభ్యులు తో పాటు 63 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు.  ఇందులో ప్రధానంగా తిప్పల వంశీ ముత్తం శెట్టి ప్రియాంక బెహరా తదితరులు ఉన్నారు. ఒకరకంగా కూటమి పరువును  వైసీపీ తిరుగుబాటు కార్పొరేటర్లు దక్కించినట్లు అయింది.  ఏడాది కాలంలో ఎప్పుడు కార్పొరేషన్ వైపు రాని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తదితరులు కూడా కౌన్సిల్ కు హాజరై అవిశ్వాసానికి అనుకూలంగా చెయ్యి ఎత్తారు.    అదలా ఉంటే.. నాలుగేళ్లపాటు మేయర్ గా కొనసాగిన గొలగాని హరి వెంకట కుమారి  అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి కోల్పోయారు.  తొలి  నుంచీ సౌమ్యంగా ఉండే ఆమె పట్ల ఏ పార్టీకీ వ్యతిరేకత లేదు కానీ..  ఒక్కటయ్యారు.  దాదాపు మూడు నెలలుగా అవిశ్వాస తీర్మానం ద్వారా మేయర్ పదవి పోతుందని ఊహాగానాలు వినిపించాయి.  ఆ దశలో గొలగాని హరి వెంకట కుమారి పదవికి రాజీనామా చేసి ఉంటే గౌరవంగా ఉండేది.  కానీ వైసీపీ  నాయకులు కులం కార్డు కూడా వినియోగించారు.  బీసీ మహిళ అంటూ నినదించారు.  అయితే ఇప్పుడు వైసీపీ నాయకులు ప్రధానంగా మాజీ మంత్రులు బొత్స సత్యనారా యణ, గుడివాడ అమర్నాథ్ కారణంగానే గోల గాని హరి వెంకట కుమారి ప్రతిష్టకు భంగం కలిగిందని ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్లే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ముందుగా ఆమె రాజీనామా చేసినట్లయితే ఆమెతో పాటు పార్టీకి గౌరవం దక్కి ఉండేదని విశ్లేషకులు చెప్తున్నారు.  ఏదైనా రాజకీయ లబ్ధి కోసం వైసీపీ నాయకులు విశాఖ మేయర్ పదవిని బలి ఇచ్చారని విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. . విశాఖ మేయర్ పదవిని చెప్పినట్లే తప్పించిన కూటమి నాయకులు ఇప్పుడు  డిప్యూటీ మేయర్ లపై దృష్టి పెట్టారు.  అయితే ఇద్దరు డిప్యూటీ మేయర్లలో ముందుగా   శ్రీధర్ పదవీ బాధ్యతలు చేపట్టడంతో.. మరికొన్ని రోజుల్లోనే  ఆయన నాలుగేళ్ల పదవి కాలం ముగుస్తోంది. దీంతో  ఇప్పటికే  ఆ అవిశ్వాస తీర్మానానికి కలెక్టర్ కు కూటమి నాయకులు నోటీసు ఇచ్చారు.  ఈ దశలో డిప్యూటీ మేయర్ శ్రీధర్,  ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీను  చక్రం తిప్పారని చాలా విమర్శలు ఉన్నాయి.  మేయర్ ను ఒక బొమ్మగా చూపించి దోచుకున్నారని.  అందుకే ఆ నాయకులను టార్గెట్ చేయాలని కూటమి నిర్ణయించింది. ఇప్పటికే జియాని శ్రీధర్ ఆస్తుల వివరాలపై ఒక వీడియోను కూడా కూటమి నాయకులు విడుదల చేశారు.  వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వై వి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి లను అడ్డం పెట్టుకుని భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడిన బాణాల శ్రీను, జియ్యాని శ్రీధర్, మోల్లి లక్ష్మి అప్పారావు, పారిశ్రామిక వాడకు చెందిన సురేష్ తదితరుల పై ఇప్పుడు కూటమి టార్గెట్ పెట్టింది.  త్వరలోనే డిప్యూటీ మేయర్ అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే అవకాశం ఉంది.  అదలా ఉంటే.. పెందుర్తి ప్రాంత కార్పొరేటర్ టిడిపి సీనియర్ నాయకుడు పీలా శ్రీనివాస్ ఇక విశాఖ నగర మేయర్ అయినట్టే.  కూటమి కార్పొరేటర్ల శిబిరాల ఏర్పాటు.. ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్ల  ఫిరాయింపు వ్యవహారంలో అన్ని రకాల వ్యవహారాలను పీలా శ్రీనివాస్ తన భుజంపై వేసుకున్నారు.  కేవలం 10 నెలల కాలపరిమితి ఉన్న ఈ మేయర్ పీఠం కోసం ఎందుకని చాలామంది కూటమి నాయకులు వెనుకడుగు వేసినా..  పీలా కుటుంబం వైసీపీ హయాంలో తమకు జరిగిన నష్టాన్ని ఈ రకంగా తీర్చుకో వాలని నిర్ణయించారు.  పీల శ్రీనివాస్ సోదరుడు, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే ఆస్తులను  వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో   ధ్వంసం చేసిన ఘటనలను కూటమి నాయకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.  సీతంపేటలో అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణ భవనాన్ని కూల్చివేయడం ఆనందపురం మండలం రామవరం వద్ద వారి కుటుంబానికి చెందిన భూములను తీసుకోవడానికి వైసిపి హయాంలో జరిగిన వ్యవహారాలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. ఈ దశలో త్వరలో జరిగే సమావేశం ద్వారా కూటమి నాయకులు పీలా శ్రీనివాస్ ను మేయర్ గా ఎన్నుకునే అవకాశాలు దాదాపు ఖరారు అయినట్టే.  అయితే విశాఖలో వైసీపీ పరువు పోవడానికి బోత్స, గుడివాడల అనవసర రాజకీయాలే కారణమని వైసీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ప్రాంతాల్లో జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు తమతమ పదవులకు రాజీనామా చేశారు.  ఇక్కడ కూడా అదే రకంగా గొలగాని హరి వెంకట కుమారి రాజీనామా చేసినట్లయితే పార్టీ పరువు నిలిచి ఉండేది.  కానీ బొత్స గుడివాడ అనాలోచిత నిర్ణయాల వలన పార్టీ పరువు బజారు పాలు అయిందని వైపీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు.  

Hydra

హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఆఫీసును కూల్చేశారు : ఎమ్మెల్యే వసంత

  హైదరాబాద్ హఫీజ్ పేటలో మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు చెందిన ఆఫీసును పోలీసులు భారీ బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేసింది.  హఫీజ్‌పేట్​లోని సర్వే నెంబర్ 79లోని 39 ఎకరాల భూమిలో ఓ ప్రైవేట్ సంస్థ భారీ షెడ్ ఏర్పాటు చేసి నూతన కార్యాలయం చేపట్టడంతో స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు శనివారం రోజున కూల్చివేతలు చేపట్టారు. దీనిపై ఎమ్మెల్యే వసంత కృష్ణ మాట్లాడుతు మాకు ఎలాంటి నోటీసులు, సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలు జరిపారని అన్నారు. 2005లో ఈ భూమిని కొనుగోలు చేశామని ఆయన పేర్కొన్నారు.  ఈ ల్యాండ్ పై ఎలాంటి అభ్యంతరాలు లేవని రంగారెడ్డి కలెక్టర్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు వెల్లడించారు. స్వయంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కలిసి భూమికి సంబంధించిన పత్రాలు సమర్పించామని తెలిపారు. కానీ హైడ్రా అధికారులు తమ ఆఫీసు కార్యాలయం కూల్చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్సమంత్రి రేవంత్ రెడ్డి  విదేశాల నుంచి రాగానే ఆయనను కలుస్తానని సంత కృష్ణ అన్నారు.. ముఖ్యమంత్రి  తప్పకుండా నాకు న్యాయం చేస్తారన్న నమ్మకం నాకు ఉందని చెప్పారు. హైడ్రా కరెక్ట్ అయితే కోర్టుకు సెలవు ఉన్న రోజే వచ్చి ఎందుకు కూల్చివేతలు జరుపుతోంది ? అంటూ ఆగ్రహించారు. నా వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే విధంగా హైడ్రా ప్రవర్తించిందని ఎమ్మెల్యే తెలిపారు. 

will gandhis go to jail innational herald case

గాంధీలు జైలుకు వెడతారా?

అవును. ఇప్పుడు ఈ ప్రశ్న రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాన్య ప్రజల్లోనూ ప్రముఖంగా వినిపిస్తోంది. నేషనల్‌ హెరాల్డ్‌  మనీలాండరింగ్‌ కేసులో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన చార్జి షీట్ లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ,లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీలను ఎ1,ఎ2గా పేర్కొన్న నేపధ్యంలో  గాంధీలు జైలుకు  వెళతారా? అనే ప్రశ్న దేశంలో ప్రముఖగా వినిపిస్తోంది. మరో వంక ఈ కేసును తెర పైకి తెచ్చిన రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రమణ్య స్వామి  ఆ ఇద్దరి అరెస్ట్ తప్పదని  పూటకో టీవీ చానల్ లో ప్రవచనం చెప్పినట్లు చెపుతున్నారు. సో..సహజంగానే సోనియా, రాహుల్ గాంధీలను ఈడీ అరెస్ట్  చేస్తుందా? అనే ప్రశ్న కాంగ్రెస్  వర్గాల్లోనే కాదు, సామాన్యులలోనూ  వినిపిస్తోందని అంటున్నారు. అయితే కావచ్చును కాంగ్రెస్  నాయకులు ఆరోపిస్తున్నట్లుగా, కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా ఇటు బీజేపీకి అటు మోదీ నాయకత్వానికి సవాలుగా దూసుకొస్తున్న రాహుల్ గాంధీ దూకుడును అడ్డుకునేందుకే మోదీ ఈడీని ఉసిగొల్పుతున్నది నిజం కావచ్చును. కానీ  కేసు చరిత్రను  చూస్తే అసలు ఏమీ లేకుండానే  పదేళ్లకు పైగా విచారణలో ఉన్న కేసులో ఈడీ ఏ ఆధారాలు లేకుండానే ఛార్జిషీట్‌ దాఖలు చేస్తుందా? అందులోనూ  సోనియా, రాహుల్ గాంధీ పై ఛార్జిషీట్‌ దాఖలు చేసే సాహసం చేస్తుందా? అనే  సందేహాలు కూడా గట్టిగానే వ్యక్తం అవుతున్నాయి. అదలా ఉంటే.. పరిపాలనా దక్షత, అభివృద్ధి లెక్కల విషయంలో ఎలా ఉన్నా..  రాజకీయ లెక్కలు వేయడంలో తప్పుచేయని మోదీ షా జోడీ  కాంగ్రెస్ అగ్ర నేతలు ఇద్దరినీ ఒకే సారి టార్గెట్  చేస్తారా?  ఆ తప్పు మోదీ షా జోడీ చేస్తుందా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.  నిజానికి  రాజకీయ నాయకుల అవినీతి బాగోతాలకు సంబందించిన కేసుల్లో చాలా చిక్కు ముళ్ళు ఉంటాయి. ముఖ్యంగా ఈ  ‘స్థాయి’ కేసుల్లో  చాలా పకడ్బందీగా, ఎక్కడా ఏ దర్యాప్తు సంస్థకూ దొరక్కుండా, పక్కా పథకం ప్రకారం పని కానిచ్చేస్తారని  అంటారు. కానీ  నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి చిక్కు ముళ్ళు పెద్దగా లేవు. అంతా  ఓపెన్ సీక్రెట్ , ఖుల్లం ఖుల్లా ..అందరికీ అర్థమయ్యేలా ఉందని  అంటున్నారు.  క్లుప్తంగా కేసు వివరాలోకి వెళితే,మూడు నాలుగు తరాల రాజకీయాలతో ముడిపడిన ఈకేసులో  గొప్పగా చిక్కు ముళ్ళు ఏమీలేవు. నెహ్రూ గాంధీల తొలి తరం నేత, స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ  1935 లో  మరో 5000 మంది వాటాదారులతో కలసి స్వాతంత్ర పోరాటంలో అక్షర ఆయుధంగా పనిచేస్తుందని అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)సంస్థను స్థాపించి, ‘నేషనల్ హెరాల్డ్’ అంగ్ల పత్రికను ప్రారంభించారు. ఆ తర్వాత దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి పండిత జవహరలాల్ నెహ్రూ ప్రభుత్వం నేషనల్ హెరాల్డ్  పత్రిక కోసం ఢిల్లీ, లక్నో సహా మరికొన్ని మహానగరాలలో విలువైన స్థలాలను చౌకగా ఇచ్చారు. ఇవి కాక ఏజేఎల్ కంపెనీకి 90 లక్షల దాకా 10 రూ.విలువ గల షేర్స్ ఉన్నాయి. అంటే 9 కోట్ల మూలధనం ఉంది. అంతే కాకుండా నెహ్రూజీ మానస పుత్రికగా ముద్ర వేసుకున్న పత్రికకు  కాంగ్రెస్ ప్రభుత్వాలు విరాళాల రూపంలో,  ప్రకటనల రూపంలో ఆర్థిక సహకారం అందిస్తూ వచ్చాయి. (పత్రిక మూత పడిన తర్వాత కూడా హిమాచల ప్రదేశ్  ప్రభుత్వం, ఈ మధ్యనే రూ. 2.50 కోట్ల  ప్రకటనలు ఇచ్చినట్లు  ఈడీ చార్జి సీట్లో ఉందిట.) అయినా, కంపెనీ 2008 నాటికి, రూ.90 కోట్ల మేర అప్పుల ఊబిలో కూరుకు పోయింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక మూత పడింది. ఈ అప్పులు తీర్చడం కోసం  కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ కి రూ.90 కోట్లు అప్పు ఇచ్చింది.  నేషనల్ హెరాల్డ్  స్టొరీలో ఇదే టర్నింగ్ పాయింట్.  ఎందుకంటే.. ఒక రాజకీయ పార్టీ అప్పులు, ఇచ్చి పుచ్చుకోవదాలను చట్టం అనుమతించదు. అదొకటి అయితే.. పత్రిక మూత పడినా, దేశంలో అనేక నగరాల్లో ఉన్న ఏజేఎల్’ ఆస్తుల విలువ పడిపోలేదు.పెరింగింది.ఇప్పడు ఆస్తుల విలువ రూ. 2000 వేల కోట్ల పైమాటే అంటున్నారు.ఇంకొదరైతే రూ.5000కోట్లు అంటున్నారు. వాస్తవానికి ఈ  ఆస్తులు 2010 వరకు నెహ్రూ కుటుంబ ఆస్తులు కాదు. స్వచ్చంద సంస్థకు చెందిన ఆస్తులు.  కానీ 2010లో  సోనియా గాంధీ, రాహుల్ గాంధీచెరో 38 శాతం వాటాతో, (మిగతా 22 శాతంకు  ఆ స్కార్ ఫెర్నాండేజ్, మోతీలాల్ వోరా  వాటాదారులు) యంగ్ ఇండియా కంపెనీ తెర మీదకు వచ్చింది. అక్కడితో, సీన్ మారిపోయింది. కొత్త కంపెనీ మూలధనం కేవలం రూ.5 లక్షలు మాత్రమే అయినా.. రూ.2000 వేల కోట్ల పైబడిన  ఏజేఎల్ ఆస్తులతో పాటుగా, కంపెనీకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్లు చెపుతున్న రూ.90 కోట్ల అప్పు ఆ నలుగురి మధ్య కుదిరిన ఒప్పందంతో, యంగ్ ఇండియాకు బదిలీ అయిపోయింది.  అక్కడితోనూ  కథ ముగియ లేదు. ఏజేఎల్  ఆస్తులు యంగ్ ఇండియాకు బదిలీ అయిపోయిన వెంటనే  కాంగ్రెస్ ఇచ్చిన రూ.90 కోట్ల అప్పు ను  కాంగ్రెస్ పార్టీ ఉదారంగా..  యంగ్ ఇండియా నుంచి జస్ట్ ఓ రూ.50 లక్షలు తీసుకుని మాఫీ చేసేసింది. మళ్ళీ  యంగ్ ఇండియా కు ఆ రూ. 50 లక్షలు ఎక్కడివంటే..  అది మళ్ళీ మరో భేతాళ కథ.  సో .. మొత్తంగా చూస్తే సామాన్యులకు కూడా అర్థమయ్యే విషయం ఏమంటే..  సోనియా,రాహుల్ గాంధీలలు ప్రధాన షేర్ హోల్డర్లుగా ఉన్న యంగ్ ఇండియా  జస్ట్ ఓ రూ.5 లక్షల పెట్టుబడితో  రూ.2000 కోట్ల పైబడిన ఏజేఎల్ ఆస్తులకు హక్కు దారు అయింది.  సో.. ఇప్పుడు ఇలా నాలుగు గోడల మధ్యా జరిగినట్లు చెపుతున్న  ఒప్పందాలలకు సంభందించి సాగుతున్న విచారణలో భాగంగానే ఈడీ, సోనియా, రాహుల్ గాంధీలను ఎ 1,  ఎ 2 గా పేర్కొంటూ  చార్జిషీట్ దాఖలు చేసింది.   నిజానికి,   2012- 2013లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈ కేసు వెలుగు చూసింది. సీబీఐ విచారణ చేపట్టింది. ఆ సమయంలోనే  సోనియా, రాహుల్ గాంధీలకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఇప్పటివకు వరకూ కూడా గాంధీలు ఇద్దరూ బెయిల్ పైనే ఉన్నారు. అలాగే ఈడీ కూడా గతంలో ఆ ఇద్దరినీ విచారించింది. ఇప్పడు చార్జి షీట్ దాఖలు చేసింది. అయితే, ఈడీ చార్జి షీట్ దాఖలు చేసినంత మాత్రాన వెంటనే అరెస్ట్ చేస్తుందని కాదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్,  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  వెంటనే అరెస్ట్ కాలేదు. అసలు అరెస్ట్ అవసరమా..  కాదా అనేది ఈడీ కాదు.. కోర్టులు నిర్ణయిస్తాయి. సో.. ఇప్పటికి ప్పుడైతే  గాంధీలు అరెస్ట్ అయ్యే అవకాశాలు అంతగా లేవనే అంటున్నారు.  బట్.. చట్టం తన పనితాను చేసుకు పోతుంది .. చట్టానికి సహకరించడం పౌరుల ధర్మం. గాంధీలు అందుకు అతీతులు కాదు. వారికి మినహాయింపూ ఉండదు. 

CM Chandrababu

సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం : మంత్రి ఆనం

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు 75 పుట్టినరోజు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.  నాయకులంతా వారి ప్రాంతాల్లోని ఆలయాల్లో పూజలు నిర్వహించాలని కోరారు. చంద్రబాబు నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని కోరుకోవాలన్నారు. అన్ని మతాల వారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలుగా ఉన్నారన్న ఆయన.. మసీదులు, చర్చిల్లోనూ ప్రార్థనలు చేయాలని పిలుపునిచ్చారు.  దేశ ఔన్నత్యాన్ని చాటుతూ చంద్రబాబు కోసం పూజలు, ప్రార్థనలు చేయాలన్నారు. చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఆదివారం ఆత్మకూరులో పెద్ద ఎత్తున హోమం చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు బర్త్‌డే వేడుకలను ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు సామాజిక మాధ్యమాలలో శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. #HBDBabu హ్యాష్ ట్యాగ్ దేశ వ్యాప్తంగా ఎక్స్​లో ఒకటవ స్థానంలో ట్రెండ్ అవుతోంది.  

miss world competitions hyderabad

మిస్ వ‌ర‌ల్డ్ పోటీల్లో చేనేత అందాల ఆర‌బోత‌

ఇంత‌కీ ఏంటీ పోచంప‌ల్లి ఇక్క‌త్ చీర ప్ర‌త్యేక‌త‌? అన‌సూయ‌ది కూడా పోచంప‌ల్లి అంద‌మేనా!  మే 7 నుంచి మే 31 వ‌ర‌కూ హైద‌రాబాద్ లో జ‌రిగే మిస్ వ‌ర‌ల్డ్ పోటీల్లో చేనేత అందాల‌ను ప్ర‌ద‌ర్శించేలా ఒక ఏర్పాటు చేయ‌నుంది రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ. ఈ పోటీల సంద‌ర్భంగా ఇక్క‌డికి 140 దేశాల‌కు సంబంధించిన వారు రానున్నారు.  వీరిని మే 15న పోచంప‌ల్లికి తీసుకెళ్లాల‌ని భావిస్తున్నారు.  అంతే కాదు వీరి చేత పోచంప‌ల్లి వ‌స్త్రాల‌ను ధ‌రింప చేసి.. ప్ర‌మోట్ చేయాల‌నుకుంటున్నారు. ఇందు కోసం పోచంప‌ల్లి చేనేత క‌ళాకారుల చేత ప్ర‌త్యేక ప్ర‌ద‌ర్శ‌న‌లు చేయించ‌నుంది రాష్ట్ర ప్ర‌భుత్వం. స్థానిక చేనేత క‌ళ‌ల‌పై అతిథుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డం మాత్ర‌మే కాక‌.. ఆయా వ‌స్త్రాల  ప్ర‌త్యేక‌త‌ల‌ను తెలియ చేయ‌నున్నారు.  క‌ళాకారుల‌తో అతిథులు మాట్లాడ్డానికి గానూ.. ట్రాన్స్ లేట‌ర్ల‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారంటే చేనేత కళ ప్రమోషన్ విషయంలో ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో, పట్టుదలతో ఉందో  ఊహించుకోవ‌చ్చు. అలాగే, గద్వాల్‌ సిల్క్‌, సిద్దిపేట దగ్గరలోని గొల్లభామ కాటన్‌, నారాయణపేట వస్త్రాలకు సంబంధించిన స్టాల్స్‌ను కూడా పోచంపల్లిలో ఏర్పాటు చేయ‌నున్నారు.  పోచంపల్లి పర్యటనకు వచ్చిన వారంతా ఈ స్టాల్స్‌ను కూడా సందర్శిస్తారు. ఆయా స్టాల్స్‌లో ప్రదర్శించే వస్త్రాల విశేషాలు కూడా విదేశీయులకు అర్థమయ్యేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఈ ప ర్యటన మొత్తం రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరగనుండగా..  విదేశీ అతిథుల కోసం పోచంపల్లిలో తెలంగాణ జానపద కళా ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.దీంతో ఎక్క‌డిదీ పోచంప‌ల్లి అన్న చ‌ర్చ మొద‌లైంది. ఇది  తెలంగాణ లోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ప్రాంతం. పోచంప‌ల్లి చేనేత క‌ళాకారులు నిలువు పేక‌ల మ‌గ్గంపై నేసిన చేనేత క‌ళాఖండాల‌కు ప్ర‌పంచ వ్యాప్త గుర్తింపు ఉంది. హైద‌రాబాద్ కి 35కిలోమీట‌ర్ల దూరంలో ఉండే పోచంప‌ల్లి.. ఇటు చేనేత‌, అటు భూదానోద్య‌మానికి ప్ర‌సిద్ధి చెందిన‌ది. ఇక్క‌డ చేనేత చీర‌లు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉండే  స్త్రీ మూర్తులంద‌రినీ విశేషంగా ఆక‌ట్టుకుంటాయి. ఈ చీర‌లు ప్ర‌పంచ వ్యాప్తంగా  ఉన్న  ఆయా ప్రాంతాల మేని ఛాయ‌ల‌న్నిటికీ న‌ప్పి.. ఆయా స్త్రీమూర్తుల‌లోని మ‌హిళా శ‌క్తిని  మ‌రింత ప్ర‌జ్వ‌రిల్లేలా చేస్తాయి. అందుకే పోచంప‌ల్లి చీర కేవ‌లం మ‌హిళ ఒంటిని మాత్ర‌మే కాదు ఈ భూగోళం మొత్తం  చుట్టేసిన ఖ్యాతి సంపాదించిందని అంటారు.  అలాంటి పోచంప‌ల్లిలో తొలుత నూలు చీర‌లు మాత్ర‌మే నేసేవారు. డెబ్భైల నుంచీ ప‌ట్టు చీర‌ల త‌యారీ మొద‌లైంది. ఇద్ద‌రు యువ‌కుల‌ను బెంగ‌ళూరుకు పంపి ప‌ట్టు నేతలో మెల‌కువ‌లు తెలుసుకోమ‌న్నారు. ఇది పోచంప‌ల్లి చేతి మ‌గ్గాల ద‌శ- దిశ మార్చేలా చేసింది. ఈ చీర‌లు ఎంతో మోడ్ర‌న్ గా ఉంటాయి. ఈ చీర‌ల త‌యారీ ఇక్క‌త్ మీద ఆధార‌ప‌డుతుంది. ఈ ప‌నిత‌నం చీరాల నుంచి ఈ ప్రాంతానికి వ‌చ్చిందని అంటారు. నూలుతో చేసిన ప్ర‌యోగం విజ‌య‌వంతం కావ‌డంతో అది ప‌ట్టు మీద కూడా చేయ‌డం మొద‌లెట్టారు. గుజ‌రాత్, ఒడిశాలాగా ఇక్క‌త్ నేత‌కు తెలంగాణ‌లోని పోచంప‌ల్లి ఎంతో ఫేమ‌స్ అయ్యింది. 1953 లో తొలిసారిగా పోచంపల్లిలో ఇక్కత్ కళ మొదలైంది. కర్నాటి అనంతరాములు అనే పెద్దాయన గుజరాత్ లోని బెనారస్ వెళ్లి.. అక్క‌డ‌ శిక్షణ తీసుకుని సిల్క్ తో ఇక్కత్ కళను వెలుగులోకి తెచ్చారు. ఇక్కత్ కళకు 2003 లో భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ హక్కులు లభించాయి.  ఇక్కడ ఉత్పత్తయ్యే చేనేత చీరలు 2 వేల రూపాయల నుంచి యాభై, అరవై వేల రూపాయల వరకు ధర పలుకుతాయంటే అతిశ‌యోక్తి కాదు. తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలకు చెందిన‌ ప్రముఖ సినీతారలు, అనేక మంది రాజకీయ నాయకులు, ఇతర దేశాల నుంచి వ‌చ్చిన‌ మహిళలు.. పోచంపల్లి చేనేత కార్మికులు తయారుచేసిన చీరలపై ఎక్కువ‌గా మక్కువ చూపుతుంటారు.   తెలంగాణ గాంధీగా పిలుచుకునే కొండా లక్ష్మణ్ బాపూజీ చొరవతో చేనేత సహకార సంఘాలు ఏర్పాటు చేశారు. దీంతో పోచంపల్లి చేనేత పరిశ్రమ కేవలం పోచంపల్లికి మాత్ర‌మే పరిమితం కాకుండా జిల్లాలోని చౌటుప్పల్, కొయ్యలగూడెం, పుట్టపాక, గట్టుప్పల్, సిరిపురం, ఎల్లంకి, రామన్నపేట, నాగారం, బోగారం గ్రామాలకు విస్తరించింది. దీంతో పాటు వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలో కూడా ఎంద‌రో కార్మికులకు పోచంపల్లి డిజైన్ చీరలు ఉపాధి కల్పిస్తున్నాయి.  ఇక్కడి చేనేత టైఅండ్ డై అసోసియేషన్, చేనేత సహకార సంఘం ఎంతో కృషి చేసి 30 రకాల డిజైన్లకు పేటెంట్ హక్కు కల్పించాలని జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ కి పలుమార్లు విన్నవించింది. కానీ, కేవలం 11 రకాల డిజైన్లనే పేటెంట్ హక్కును కల్పించేందుకుగాను 1999లో గుర్తించింది. 2000లో పేటెంట్ హక్కును కల్పించారు. దేశచరిత్రలో కార్మికుడు సాధించిన ఘన విజయంగా దీనిని అభివ‌ర్ణిస్తారు. పోచంపల్లి చీరకు 2005లో భౌగోళిక గుర్తింపు, జాగ్రఫికల్ ఇండికేషన్ లేదా ఇంటలెక్చుయల్ రైట్స్ కి ర‌క్ష‌ణ‌ లభించింది. పోచంపల్లి లో తయారైన ఇక్కాత్ శైలి పోచంపల్లి చేనేత సహకార సంస్థ లిమిటెడ్, పోచంపల్లి హాండ్లూం టై అండ్ డై సిల్క్ సారీస్ తయారీ అసోసియేషన్ రిజిస్టర్డ్ ప్రోపర్టీగా గుర్తింప బడింది. అయితే పోచంప‌ల్లి ఇక్క‌త్ కి న‌కిలీలు రావ‌డం మొద‌లైంది. దీనిపై కాంగ్రెస్ ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి పోరాడుతూ.. పార్ల‌మెంటులో గ‌ళ‌మెత్తారు. అంతే కాదు, వాణిజ్య మంత్రికి ఈ దిశ‌గా ఒక లేఖ సైతం రాశారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పోచంపల్లి ఇక్కత్‌ చీరల నకిలీలను అరికట్టి.. చేనేత రక్షణ కోసం రూ.100 కోట్లతో నిధి ఏర్పాటు చేయాలని భువనగిరి ఎంపీ చామల త‌న లేఖ‌లో కోరారు. ఇక పోచంప‌ల్లి మ‌రో అందాల ఆర‌బోత‌ విష‌యానికి వ‌స్తే జబ‌ర్ద‌స్త్ యాంక‌ర్ అన‌సూయ కూడా పోచంప‌ల్లికి చెందిన అంద‌మే. అయితే పోచంప‌ల్లి చీర నూలుతో చేసిన అంద‌మైతే.. అదే అన‌సూయ న‌వ్వుల‌తో త‌యారైన అందం. ఆమె యాంక‌రింగ్ చేసిన‌ జ‌బ‌ర్ద‌స్త్ లో వ‌చ్చే స్కిట్ల‌లో అక్క‌డ కామెడీ ఉన్నా లేక పోయినా త‌ను ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుతూ ఆ ముత్యాల‌ను ప్రేక్ష‌కుల చేత‌ ఏరుకునేలా చేసిన న‌వ్వుల అందం అన‌సూయ‌. ఈమెది కూడా ఈ పోచంప‌ల్లే. వీరికి ఈ ఊరిలో వంద గ‌డ‌ప‌ల ఇల్లు ఒక‌టి ఉంద‌ని స‌మాచారం. ఇది అతి పురాత‌న‌మైన ఇల్లుగా చెబుతారు. ఇదండీ పోచంప‌ల్లి వెన‌క దాగిన అనేక విశేషాల స‌మాచార స‌మాహారం.. చూశారుగా మ‌న చెంత‌నే ఉన్న పోచంప‌ల్లికి ఎక్క‌డో విదేశీయులు వ‌స్తున్నార‌ని తెలిసి.. ఆరా తీస్తే ఇన్నేసి విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి గ‌మ‌నించారా!!!

ap 10th results 23april

ఏపీ టెన్త్ రిజల్ట్స్ 23న

ఈ నెల 23న ఆంధ్రప్రదేశ్ టెన్త్ ఫలితాల విడుదల కానున్నాయి. ఇందుకు సంబంధించి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది.  ఈ ఏడాది టెన్త్ పరీక్షలకు 6,19,275 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంగ్లీషు మాధ్యమంలో  5,64,064 మంది, తెలుగు మాధ్యమంలో 51,069 మంది పరీక్షలు రాశారు. ఈ ఏడాది నుంచి  విద్యార్థులు తమ ఫలితాలను మనమిత్ర వాట్సప్‌ నంబర్‌ 9552300009 ద్వారా తెలుసుకునే వీలు కల్పించారు. అలాగే అధికారిక వెబ్‌సైట్‌ https://www.bse.ap.gov.in/ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. వాట్సాప్ ద్వా రా ఫలితాలు తెలుసుకోవాలంటే ముందుగా 9552300009 ఈ నెంబర్ మీ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి.  వాట్సాప్ ఓపెన్ చేసి ఈ నెంబర్‌కు హాయ్ అని మెసేజ్‌ పంపించాలి.  వెంటనే మీకు సర్వీసెస్ ఎంపిక చేసుకోమని వస్తుంది. అందులో ఎడ్యుకేషన్ సర్వీసెస్ క్లిక్ చేస్తే టెన్త్ ఫలితాల లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసి   పుట్టిన తేదీ, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే పీడీఎఫ్ రూపంలో  మార్కుల మెమో వస్తుంది.  

kutami no confidence motion ysp  lost

వైసీపీ మేయర్ పీఠం తెలుగుదేశం కూటమి కైవసం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అతిపెద్దదైన విశాఖ‌ప‌ట్నం న‌గ‌ర‌పాల‌క సంస్థ తెలుగుదేశం కూటమి వశం అయ్యింది.   వైసీపీ చేతిలో ఉన్న ఈ మేయ‌ర్ పీఠన్ని దక్కించుకోవడానికి తెలుగుదేశం కూటమి వ్యూహాత్మకంగా పావులు కదిపింది. విశాఖ మేయర్ పీఠం లక్ష్యంగా కూటమి వ్యూహాలు, వైసీపీ ప్రతి వ్యూహాలతో  గత కొన్ని రోజులుగా విశాఖలో రాజకీయ వేడి పెరిగిన సంగతి తెలిసిందే.  నాలుగేళ్ల కిందట జరిగిన ఎన్నికలలో విశాఖ మేయర్ పీఠాన్ని అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ దక్కించుకుంది. విశాఖ కార్పొరేషన్ లో మొత్తం 98 కార్పొరేటర్ల స్థానాలు ఉండగా, వాటిలో 59 స్థానాలలో వైపీపీ విజయం సాధించింది. విశాఖ మేయర్ గా గొలగాని హరి వెంకట కుమారిని మేయర్ గా గెలిపించుకుంది.  అయితే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టకుని అధికారాన్ని కోల్పోవడంతో పరిస్థితి మారింది. విశాఖ కార్పొరేషన్ లో   వైసీపీ బలం క్షీణించింది. పలువురు కార్పొరేటర్లు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. విశాఖ మేయర్ గా గొలగాని హరివెంకటకుమారి పదవీ కాలం నాలుగేళ్లు పూర్తి కావడంతో  కూటమి పార్టీలు మేయర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి.  వైసీపీ ప్రభుత్వం పతనమైన తరువాత ఆ పార్టీ కార్పొరేటర్లు పలువురు కూటమి పార్టీల్లోకి దూకేయడంతో విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ లో  కూట‌మి బ‌లం 53కు పెరిగింది. వైసీపీ బలం  38కి ప‌డిపోయింది.   దీంతో తెలుగుదేశం కూటమి మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టగానే వైసీపీ అప్రమత్తమైంది.  తమతో ఉన్న 38 కార్పొరేటర్లూ జారిపోకుండా వారిని క్యాంపుకు తరలించింది. మేయర్ పిఠం చేజారకుండా ఉండేందుకు సీనియర్ నేత, మండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగారు.  దేశం నుంచి వైసీపీ కార్పొరేటర్ల క్యాంపును శ్రీలంకకు తరలించేశారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం లేకపోయింది. చివరకు అవిశ్వాస తీర్మానానికి ఒక రోజు ముందు మాజీ మంత్రి, వైసీపీ నేత ముత్తంశెట్టి కుమార్తె, 6వ వార్డు కార్పొరేటర్ అయిన ప్రియాంక రాజీనామా చేశారు. క్యాంపు నుంచి తిరిగి వచ్చిన వెంటనే జరిగిన ఈ పరిణామంతోనే వైసీపీ నుంచి మేయర్ పీఠం చేజారిపోవడం ఖాయమైపోయింది. ఈ దశలో బొత్స పార్టీ కార్పొరేటర్లకు విప్ జారీ చేసినా ఫలితం లేకపోయింది. చివరకు శనివారం అంటే అవిశ్వాస తీర్మానం రోజున వైసీపీ కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. అయితే అప్పటికే కూటమికకి అవసరమైన  కార్పొరేటర్ల  బలం చేకూరింది. వారంతా సమావేశానికి హాజరు కావడంతో అవిశ్వాస తీర్మానం గెలిచింది. వైపీపీ మేయర్ పీఠాన్ని కోల్పోయింది. 

Inter results

తెలంగాణలో ఇంటర్ రిజల్ట్స్ ఎప్పుడంటే?

  తెలంగాణ ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 22న విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. ఏపీ ఇంటర్ ఫలితాలు ఇప్పటికే ఏప్రిల్ 12న విడుదలైన సంగతి తెలిసిందే. 22వ తేదీ ఉదయం నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో డిప్యూటీ సీఎం ఫలితాలను విడుదల చేస్తారని ఇంటర్ బోర్డు ప్రకటించింది.  ఇంటర్ ఫలితాలు బోర్డు అధికారిక వెబ్ సైట్ tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in లో అందుబాటులో ఉంటాయి. ఇంటర్ పరీక్షల్లో 9,96,971 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను విడుదల చేసిన తర్వాత నెల రోజుల్లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయనున్నారు. 

Minister Ponguleti Srinivas Reddy

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం

    తెలంగాణ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. నాగర్‌ కర్నూల్‌లో భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొనేందుకు హెలికాప్టర్‌లో మంత్రి పొంగులేటి, ఎంపీ మల్లు రవి, సంపత్‌కుమార్ హెలికాప్టర్‌లో వెళ్లారు.కలెక్టరేట్ ప్రాంగణం‌లో ల్యాండింగ్ చేస్తున్న క్రమంలో సిగ్నల్ కోసం బుల్లెట్ ఫైర్ చేయడంతో కింద ఉన్న గడ్డిపై పడి అగ్నిప్రమాదం సంభవించింది. పోలీసులు, ఫైర్ సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పివేశారు. హెలికాప్టర్ ల్యాండ్ అయిన సమయంలో చిన్న నిప్పు రాజుకుని, హెలికాప్టర్ గాలికి చెలరేగిన మంటలు. దీంతో మంత్రి పొంగులేటికి, కాంగ్రెస్ నేతలకు పెను ప్రమాదం తప్పింది. లేకపోతే పెనుప్రమాదం సంభవించి ఉండేది. ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.  

HCU

నన్ను ఒక్కదాన్నే టార్గెట్ చేస్తున్నారా.. స్మితా సబర్వాల్ రియాక్షన్

  హెచ్సీయూ కంచ గచ్చిబౌలి 400 ఎకరాల భూమిపై రీట్వీట్ చేసిన కేసులో విచారణకు  సీనియర్ ఐఏఎస్ పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ హాజరయ్యారు. ఈ పోస్ట్‌ను 2000 మంది కూడా  రీట్వీట్ చేశారని మరి వారి మీద కూడా చర్యలు ఉంటాయా లేదా నన్ను ఒక్కదాన్నే టార్గెట్ చేస్తున్నారా అని అడిగారు. చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా లేక ఈ విషయంలో కొందరిని మాత్రమే ఎంపిక చేసి వారినే టార్గెట్ చేస్తున్నారా అని పోలీసులను నిలదీశారు. తనకు పంపినట్లే మిగతా 2 వేలమందికి కూడా నోటీసులు పంపించారా..? అని నిలదీశారు. వారందరిపైనా ఇలాంటి చర్యలే తీసుకున్నారా అని అడిగారు. కాగా, కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి ఫేక్ ప్రచారంపై రేవంత్ సర్కార్ సీరియస్ గా చర్యలు చేపట్టింది. మార్ఫ్ డ్ ఏఐ ఫొటోలను పోస్టు చేసిన వారిపై కేసులు నమోదు చేస్తోంది. ఈ నోటీసులపై ఆమె తాజాగా ఎక్స్‌ వేదికగా స్పందించారు. పోలీసులకు పూర్తిగా సహకరించినట్లు చెబుతూ.. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చినట్లు వెల్లడించారు.  తాను రీపోస్టు చేసినట్లే రెండు వేల మంది చేశారని.. వాళ్లందరిపైనా ఇలాంటి చర్య తీసుకుంటున్నారా..? అని ప్రశ్నించినట్లు తెలిపారు. చట్టం అందరికీ సమానమా.. ? ఎంపిక చేసిన వారినే టార్గెట్‌ చేస్తున్నారా..? అని స్మితా సభర్వాల్‌ నిలదీశారు. హాయ్ హైదారాబాద్’ అనే ట్విట్టర్ యూజర్ ఓ ఏఐ ఫొటోను ట్వీట్ చేయగా.. ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు. ఈ వ్యవహారంపై గచ్చిబౌలి పోలీసులు ఆమెకు నోటీసులు పంపించి విచారణకు పిలిచారు. తొలుత ఈ నోటీసులకు స్పందించని స్మితా సబర్వాల్.. ఆ తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరిన్ని ట్వీట్లు చేశారు. తాజాగా శనివారం ఈ వివాదంపై స్మితా సబర్వాల్ స్పందించారు. గచ్చిబౌలి పోలీసులు పంపిన నోటీసులకు తాను జవాబిచ్చినట్లు తెలిపారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు తమ ట్వీట్లను తొలగించారు. అయితే, స్మితా సబర్వాల్ మాత్రం వెనక్కి తగ్గకపోగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరిన్ని పోస్టులు చేస్తున్నారు. పోలీసుల నోటీసులు అందుకున్నా ఆమె దూకుడు తగ్గించుకోలేదు. సుప్రీంకోర్టు తీర్పులకు సంబంధించిన వార్తా కథనాలను వరుసగా ట్వీట్ చేశారు. 

case on vipro md in vizag

విశాఖలో విప్రో ఎండీపై కేసు

క్వాష్ చేయాలంటూ హైకోర్టుకు ఈనెల 21వ తేదీన విచారణ  ఐటీ  దిగ్గజ కంపెనీ విప్రో  ఎండీ సహా ఆ సంస్థకు చెందిన కొందరు ప్రతినిధులపై విశాఖలో కేసు నమోదైంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి లీజ్ అనుమతులు లేకుండా మరో ఐటీ కంపెనీకి భవనాన్ని లీజుకు ఇచ్చారంటూ వచ్చిన ఫిర్యాదు పై విశాఖలోని ద్వారక నగర్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది.  విశాఖ  నడిబొడ్డున రేసపువాని పాలెం వద్ద విప్రో కంపెనీ 6 అంతస్తుల భవనంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నది.  ఈ దశలో ప్రభుత్వ  సూచన మేరకు ఉద్యోగ కల్పన చేయకపోవడంతో ఆ భూమిని ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయలేదు.  కానీ కంపెనీ కార్యకలాపాలు కొనసాగిస్తుంది.  ఈ దశలో విప్రో సంస్థ ఒమిక్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కొనసాగుతున్న పల్సస్ సంస్థకు భవనంలోని మూడు అంతస్తులు లీజుకు ఇచ్చారు.  విప్రో సంస్థకు సంబంధించిన భవనంలోని సెకండ్ ఫ్లోర్ లో ఎస్ ఎఫ్ టి 37 రూపాయలు చొప్పున 37 75 చదరపు అడుగుల స్థలాన్ని 2019లో, అలాగే 2022 లో  ఐదు, ఆరు అంతస్తులో చదరపు అడుగు 58 రూపాయలకు చొప్పున 35872 అడుగుల స్థలాన్ని,   చదరపు గజం 38.85 రూపాయలకు 4877 చదరపు అడుగుల స్థలాన్ని లీజుకి ఇచ్చారు ఈ మేరకు చెల్లింపులు కూడా జరుగుతున్నాయి. దీనిపై రిలీజ్ అగ్రిమెంట్ కోసం ఇటీవల విశాఖపట్నం సబ్ రిజిస్టర్ ను పల్సస్  సంస్థ ఆశ్రయించగా,  అసలే ప్రభుత్వ నుంచి లీజు అగ్రిమెంట్ లేని సంస్థ మరో సంస్థకు లీజుకు ఇచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు. దీనిపై పల్సస్ సంస్థ తమను  విప్రో సంస్థ మోసగించిందంటూ విప్రో ఎండి తో పాటు మరికొందరు ప్రతినిధులపై ఫిర్యాదు చేశారు.  ఈ మేరకు ద్వారక నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. కాగా ఈ విషయంపై విప్రో సంస్థ ఎండితో పాటు, ఇతరులు ఆ ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విప్రో ప్రతినిథుల పిటిషన్ ను హైకోర్టు ఈ నెల 21న విచారించనుంది.  

bjp and congress eye on former crickters to send for rajyasabha

రాజ్యసభకు మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే!?

సెలబ్రిటీలను పార్టీలో చేర్చుకుని లబ్ధి పొందే విషయంలో కాంగ్రెస్, బీజేపీలు పోటీలు పడుతున్నట్లు కనిపిస్తోంది. రాజ్యసభకు సెలబ్రిటీలను పంపించడం ద్వారా వారి గ్లామర్ ను, కరిష్మాను పార్టీ బలోపేతనికి వినియోగించుకునే విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నాయి. ఈ కసరత్తులో భాగంగానే.. కర్నాటక నుంచి ఖాళీకానున్న నాలుగు రాజ్యసభ స్థానాలకూ జరిగే ఎన్నికలలో పార్టీ తరఫున రంగంలోకి దించేందుకు సెలబ్రిటీల వేటలో పడ్డాయి.  క్రమంలో కాంగ్రెస్ తరఫున టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లేను రంగంలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంటే.. బీజేపీ టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ ను రంగంలోకి దింపనుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అనిల్ కుంబ్లేతోనూ, బీజేపీ రాహుల్ ద్రావిడ్ తోనూ చర్చలు జరిపినట్లు సమాచారం.  టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే అయితే ఇప్పటికే కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని డీకే శివకుమార్ స్వయంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదిక ద్వారా సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. క్రికెటర్ గా దేశానికి, కర్నాటకకూ కుంబ్లే చేసిన సేవలను ప్రస్తుతించారు. అలాగే డీకేను తాను కలిసిన విషయాన్ని కుంబ్లే కూడా ధృవీకరించారు.  ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ తరఫున కుంబ్లే రాజ్యసభకు పోటీ చేయడం ఖాయమన్న చర్చ జోరుగా సాగుతోంది.  ఇక బీజేపీ విషయానికి వస్తే.. ఆ పార్టీ కూడా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ ను రాజ్యసభకు పంపేందుకు దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు చెబుతున్నారు. ఇందుకు రాహుల్ ద్రావిడ్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. 

ఒకే ఒక్కడు.. రాజాసింగ్!

గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ  పరిధిలో మొత్తం 20 పైగా అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అయితే,అందులో బీజేపీ జెండా ఎగిరిన ఒకే ఒక్క నియోజక వర్గం గోషామహల్. ఈ నియోజక వర్గం నుంచి   ఎమ్మెల్యే రాజా సింగ్ ఒకసారి కాదు.. వరసగా మూడు సార్లు గెలిచారు. కేంద్ర హోం శాఖ సహయమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నట్లుగా  రాజా సింగ్ కరుడు కట్టిన హిందుత్వవాది. అందులో సందేహం లేదు. అయితే, అది రాజా సింగ్’అనే నాణేనికి  ఒక పార్శ్వం మాత్రమే. ఆయనలో మరో పార్శ్వం కూడా వుంది.  అవును.. అనేక విషయాల్లో ఆయన పార్టీతో విభేదిస్తారు. అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేస్తారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కిషన్ రెడ్డి వ్యవహార సరళి ఆయనకు నచ్చదు. ఒక్క కిషన్ రెడ్డి అనే కాదు, పార్టీలో పాతుకు పోయిన నాయకులు ఆయనకు నచ్చరు. అయినా.. ఆయన బీజేపీని వదలరు. బీజేపీ ఆయన్ని వదలదు. అవును.. గతంలో మునావర్‌ ఫారుఖీ షో’ ను వ్యతిరేకిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన్ని అరెస్ట్ చేసింది. జైలుకు పంపింది. మరోవంక బీజేపీ జాతీయ నాయకత్వం ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.  అయినా సస్పెన్షన్  ను ఎత్తేసి గోషామహల్ నుంచి పోటీకు ఆయనకే పార్టీ టికెట్ ఇచ్చింది. గెలిచి మూడవ సారి ఎమ్మెల్యే అయ్యారు. నగరంలో బీజేపీకున్న ఏక్  అఖేలా ఎమ్మెల్యే ఆయనే. అయినా.. శుక్రవారం ( ఏప్రిల్ 18) రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై జరిగిన సమావేశానికి రాజాసింగ్ రాలేదు. నగరంలోని బీజేపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ రాకపోవడంపై పార్టీలో చర్చ జరుగుతోంది.  నిజానికి   కొద్ది రోజులుగా కిషన్‌ రెడ్డి, రాజాసింగ్ మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు నడుస్తున్న విషయం తెలిసిందే.  అయితే..  ఆయనలో ఎంత అసంతృప్తి ఉన్నా, ఆయనకు పార్టీ అంతగా సహకరించక పోయినా, 2018లో 2023లో వరసగా రెండు సార్లు నగరంలో బీజేపీ  జెండా ఎగరేసిన ఒకే ఒక్కడుగా  రాజా సింగ్.. నిలిచారు.    అదలా ఉంటే.. హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక సమావేశంలో జరిగిన సమావేశంలో, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు, ఎంఐఎంకు, ఒవైసీ సోదరులకు దాసోహం అంటున్నాయని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మద్దతుతోనే ఎంఐఎం రాష్ట్రంలో చాప కింద నీరులా విస్తరిస్తోందని, ప్రమాదకరంగా రజాకర్ల సంస్కృతిని విస్తరిస్తోందని అన్నారు.  హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదని కిషన్ రెడ్డి, కాంగ్రెస్,బీఆర్ఎస్ నేతలను నిలదీశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే.. బీజేపీ ఎదగకుండా చేయడమే ఆ మూడు పార్టీల లక్ష్యమని అన్నారు.  కాగా, ఈ నెల  23న పోలింగ్ జరిగే  హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్ధి మీర్జా రియాజ్ ఉల్ హసన్  గెలుపు లాంఛనమే అంటున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ చేయడం లేదు. బీజేపీ మాత్రం,ఎంఐఎం ఏకగ్రీవ ఎన్నికను అడ్డుకునేందుకు.. పార్టీ హైదరాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు గౌతంరావును బరిలో దించింది.  అయితే.. గెలుపు ఎవరిదో ముందే తెలిసి పోయినా..  కమల దళం మాత్రం ఇంకా ఆశలు వదులుకున్నట్లు లేదు. అందుకే,  శుక్రవారం(ఏప్రిల్ 18) రోజంతా జరిగిన  హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక సమావేశంలో, ఒకే ఒక్కడు, ఒక్క రాజా సింగ్’ తప్ప  రాష్ట్ర, నగర ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. ఎందుకో?

దక్షిణాదిన బలోపేతానికి బీజేపీ వ్యూహం!

పవన్ కు కేబినెట్ బెర్త్? తెలుగుదేశంకు గవర్నర్ తాయిలం? దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై బీజేపీ దృష్టి సారించింది. ఉత్తరాదిన పాగా వేసిన బీజేపీకి దక్షిణాది కొరుకుడు పడటం లేదు. ఒక్క కర్నాటక వినా మరే దక్షిణాది రాష్ట్రంలోనూ ఆ పార్టీ ప్రజాదరణ పొందలేదు. దీంతో దక్షిణాదిలో పార్టీ పటిష్ఠతే లక్ష్యంగా కొత్త కొత్త వ్యూహాలు, ప్రణాళికలూ రచిస్తోంది. ఒక వైపు దక్షిణాది రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలతో పొత్తులో కొనసాగుతూనే సొంతంగా బలోపేతం కావడానికి ప్రయత్నాలు సాగిస్తున్నది. దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ బలోపేతానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చరిష్మాపై ఆధారపడటం అవసరమన్న నిర్ణయానికి వచ్చిన బీజేపీ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నది. వ్యూహరచన చేస్తున్నది.  ఇందు కోసం ఆంధ్రప్రదేశ్ ను సెంట్రిక్ గా చేసుకుని తమిళనాడులో పాగా వేయాలన్నది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ఏపీలో తెలుగుదేశం కూటమిలో భాగస్వామ్య పార్టీగా కొనసాగుతూనే పవన్ కల్యాణ్ తోడ్పాటుతో సొంత బలం పెంచుకోవాలని భావిస్తున్నది.  భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను దగ్గర చేసుకోవడానికి ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే ఏపీలో హిందుత్వకు బ్రాండ్ అంబాసిడర్ గా పవన్ కల్యాణ్ తనను తాను ఫోకస్ చేసుకుంటున్నారు. అదే సమయంలో బీజేపీ కూడా పవన్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.  అంతే కాకుండా కేంద్ర కేబినెట్ విస్తరణకు కసరత్తు చేస్తున్న మోడీ, తన కేబినెట్ లో జనసేన అధినేత పవన్ కు బెర్త్ ఆఫర్ చేసినట్లు బీజేపీ సన్నిహిత వర్గాల సమాచారం. పవన్ అందుకు అంగీకరించి.. కేంద్ర కేబినెట్ లోకి వెడితే.. ఏపీలో ఆయన సోదరుడు నాగబాబుకు కీలక కేబినెట్ బెర్త్ దక్కేలా తన ఇన్ ఫ్లుయెన్స్ ను ఉపయోగించాలన్నది బీజేపీ ఎత్తుగడగా కనిపిస్తోంది.  అలా కాకుండా పవన్ ఏపీ కేబినెట్ లో నంబర్ 2గా, అంటే ఉప ముఖ్యమంత్రిగా కొనసాగడానికే మొగ్గు చూపితే.. ఆయన సేవలను తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి విస్తృతంగా వినియోగించుకోవాలని యోచిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కంటే తమిళనాట.. సినీ గ్లామర్ ప్రభావం రాజకీయాలపై అధికంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే.  అందుకే ఇప్పటికే పవన్  బీజేపీ కోరిక మేరకు తమిళనాడుకు సంబంధించినంత వరకూ వ్యూహాత్మకంగా అక్కడ అధికారంలో ఉన్న డీఎంకేకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారని చెబుతున్నారు.    ఇక తెలుగుదేశం పార్టీకి కూడా బీజేపీ తాయిలాలు ఇచ్చి.. కేంద్రంలో మోడీ సర్కార్ కు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. సాధ్యమైనంత త్వరలో పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం చేయాలన్న ఉద్దేశంతో ఉన్న బీజేపీ.. తెలుగుదేశం పార్టీ నుంచి ఒకరిద్దరికి  గవర్నర్ పదవి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే చంద్రబాబుకు సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు.  పార్టీ నుంచి ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంలో చంద్రబాబు ఇప్పటికే కసరత్తు మొదలెట్టారని కూడా తెలుస్తోంది. మొత్తం మీద దక్షిణాదిలో బలపడటం కోసం బీజేపీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ పైనే ఆధారపడి ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. జనసేన, తెలుగుదేశం పార్టీలతో సఖ్యత కొనసాగిస్తూనే ఆ రెండు పార్టీల తోడ్పాటుతో తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలో పాగా వేయాలన్నది బీజేపీ వ్యూహంగా చెబుతున్నారు. 

రాజ్ కసిరెడ్డి ఇంటెలిజెంట్ క్రిమినల్.. విజయసాయి

విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకటన వెంటనే పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆయన రాజీనామా ప్రకటన ఒక విధంగా చెప్పాలంటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోనే పెను సంచలనం సృష్టించింది. అదీ జగన్ విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఆయన వైసీపీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తరువాత పెద్దగా సమయం తీసుకోకుండానే పార్టీకీ రాజీనామా చేఃసి రాజకీయ సన్యాసం ప్రకటించేశారు. రాజకీయం కాదు ఇక నుంచి వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించడమే కాదు.. రైతుగా కొత్త అవతారమెత్తానంటూ  సాగు మొదలెట్టేశారు.  తాను వ్యవసాయం చేస్తున్న ఫొటోలు సమాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పంచుకున్నారు.  వ్యవసాయ వ్యాపకంతో ఎంతో సంతోషంగా ఉన్నానంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. అయితే నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబంతో అనుబంధం ఉన్న విజయసాయిరెడ్డి ఉన్న ఫలంగా జగన్ కు జెల్ల కొట్టి రాజకీయాలకు దూరం కావడమేంటి? అన్న అనుమానాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి కేవీపీ రామచంద్రరావు ఎలాగో.. జగన్ కు విజయసాయి అలాగ అనడానికి ఆయన రాజీనామా ప్రకటనకు ముందు వరకూ ఎవరిలోనూ సందేహం లేదు. అందుకే ఆయన రాజీనామా వెనుక కూడా ఏదైనా డ్రామా ఉందా? అన్న అనుమానాలు అప్పట్లో గట్టిగా వ్యక్తమయ్యాయి. అప్పట్లో అంటే విజయసాయి రాజీనామా ప్రకటన చేసిన సమయంలో అదంతా జగన్ వ్యూహంలో భాగమేనంటూ పరిశీలకులు విశ్లేషణలు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే విజయసాయి రాజీనామా జగన్ మోడీ, బీజేపీకి పంపిన ప్రేమ సందేశంగా కూడా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అందుకు తగ్గట్టే విజయసాయి తన రాజీనామా ప్రకటన సమయంలో జగన్ పట్ల విశ్వానాన్నే వ్యక్తం చేశారు. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలనీ, ఆయన రాజకీయంగా పుంజుకోవాలనీ తాను ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో విజయసాయి రాజీనామా జగన్ ఆదేశం మేరకే జరిగిందని అప్పట్లో అంతా భావించారు.  కానీ ఆ తరువాత వరుసగా జరిగిన జరుగుతున్న పరిణామాలను గమనిస్తే జగన్, విజయసాయి మధ్య పూడ్చలేని, పూడ్చడానికి వీలుకాని అగాధమేదో ఏర్పడిందని అంతా భావిస్తున్నారు. తన రాజీనామా ప్రకటన తరువాత ఆయన జగన్ సోదరి షర్మిలతో హైదరాబాద్ లోని ఆమె నివాసంలో భేటీ అయ్యారు. గంటల పాటు జరిగిన ఆ భేటీలో షర్మిల విషయంలో తాను చేసిన వ్యాఖ్యలు, విమర్శలూ అన్నీ జగన్ రాసిచ్చిన స్క్రిప్టేనని వివరణ ఇచ్చుకున్నారు. ఆ తరువాత కాకినాడ పోర్టు భూముల వ్యవహారంలో గత నెలలో సీఐడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి ఆ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. ఆయన ఆ సందర్భంగా మాట్లాడిన మాటలన్నీ పరోక్షంగా జగన్ నే టార్గెట్ చేశాయి. ఆ సందర్భంగానే అసందర్భంగా విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం గురించి ప్రస్తావించారు. అప్పటి వరకూ ఏపీలో లిక్కర్ కుంభకోణమే జరగలేదని చెబుతూ వచ్చిన వైసీపీకి విజయసాయి రివీల్ చేసిన విషయం మింగుడుపడలేదు. అప్పుడే విజయఃసాయి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన లిక్కర్ కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అన్ని రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖరరెడ్డే అని చెప్పారు. అందుకు సంబంధించిన విషయాలు, వివరాలు సమయం వచ్చినప్పుడు బయటపెడతానన్నారు. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి మద్యం కుంభకోణం కేసులో శుక్రవారం (ఏప్రిల్ 18) ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా రాజ్ కసిరెడ్డి గురించి సంచలన విషయాలు చెప్పారు.  రాజ్ కసిరెడ్డి ఇంటెలిజెంట్ క్రిమినల్ అన్న విజయసాయిరెడ్డి అటువంటి నేరపూరిత మనస్తత్వం ఉన్న వ్యక్తిని తాను ఎన్నడూ చూడలేదన్నారు. వైసీపీలోని కొందరు నేతల ద్వారా రాజ్ కసిరెడ్డితో పరిచయం అయ్యిందనీ. అతడి గురించి తెలియని తాను పార్టీలో అతడి ఎదుగుదలకు దోహదపడ్డాననీ చెప్పుకొచ్చారు. భారీ మద్యం కుంభకోణానికి పాల్పడిన రాజ్ కసిరెడ్డి తనను మోసం చేశాడనీ, అయితే ఆ మోసం వల్ల తనకు వచ్చిన నష్టం ఏమీ లేదనీ అన్న విజయసాయిరెడ్డి, వైసీపీ హయాంలో 2019 చివరిలో నూతన మద్యం విధాన రూపకల్పనకు తన హైదరాబాద్, విజయవాడ నివాసాలలో రెండు సమావేశాలు జరిగాయని చెప్పారు.  ఈ సమావేశాల్లో రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి, సత్య ప్రసాద్, తాను ఉన్నామన్నారు ఈ సమావేశాల తరువాతే తాను రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డిలు అడగడంతో  అరబిందో శరత్ చంద్రారెడ్డి చేత వంద కోట్ల రూపాయలు రుణం ఇప్పించానని తెలిపారు.  అది వినా ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం గురించి తనకేమీ తెలియదని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. సిట్ విచారణలో కూడా ఇదే చెప్పానని, మద్యం విధానం రూపొందిన తొలి నాళ్లలోనే తాను పార్టీలో క్రియాశీలంగా ఉన్నాననీ, ఆ తరువాత ఆ కుంభకోణం గురించి తనకేమీ తెలియదనీ చెప్పుకున్నారు.  మద్యం కుంభకోణంలో   ముడుపులు చేతులు మారాయా? ఎంతమేర అక్రమాలు జరిగాయి?  అయితే విజయసాయి మీడియాతో మాట్లాడిన మాటలన్నీ మద్యం కుంభకోణంలో కసిరెడ్డి, మిధున్ రెడ్డిల పాత్రే కీలకమన్న విషయాన్ని పరోక్షంగా నిర్ధారించినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక విజయసాయి రెడ్డి ఈ సందర్భంగా జగన్ సొంత మీడియాపై కూడా విమర్శలు గుప్పించారు. ఇది కూడా ఆయన జగన్ తో ఢీ అనడానికి రెఢీగా ఉన్నారన్న విషయాన్ని ఎత్తి చూపుతోందని అంటున్నారు.