Cool drink

కూల్ డ్రింక్‌లో బల్లి..అస్వస్థతకు గురైన యువకుడు

  సమ్మర్ వచ్చిందంటే ఎండతాపం నుంచి ఉపసమనం పొందేందుకు కూల్ డ్రింక్స్‌, ప్రూట్‌ జ్యూస్ వంటికి తాగుతుంటారు. ఇలానే కూల్‌డ్రింక్ తాగేందుకు వెళ్లిన ఇద్దరి యువకులకు భారీ షాక్ తగిలింది. వాళ్లలొ ఒకరు తాగిన కూల్‌డ్రింక్‌లో బల్లి అవశేషాలు ప్రత్యక్షమైంది. అది చూసిన యువకుడు కంగుతిన్నాడు.ఈ విషయాన్ని హోటల్ నిర్వాహకుడి దృష్టికి తీసుకెళ్లినా.. వారు పెద్దగా స్పందించలేదు. ఆ యువకులకు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. వారి తీరుపై ఆ యువకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. సదాశివపేట పరిధిలోని పెద్దపూర్ వద్ద ఎన్‌హెచ్ 65 పక్కన ఉన్న హోటల్‌లో ఇద్దరు యువకులు తాగిన కూల్ డ్రింక్‌లో చనిపోయిన బల్లి కనిపించాయి.  అనంతరం సగం కూల్ డ్రింక్ తాగడంతో యువకుడు స్వల్ప అస్వస్థతకు గురైనట్టు తెలిసింది. ఈ క్రమంలోనే యువకుడిని ఆసుపత్రికి స్నేహితులు తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో ఆహార భద్రత అధికారులు చర్యలు తీసుకోవాలని కస్టమర్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ హైదరబాద్ నగరంలో నిత్యం పలు రెస్టారెంట్‌లలో ఇలాంటి నిర్లక్ష్యం కనుబడుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయటి ఫుడ్ తినాలంటే ప్రజలు భయపడుతున్నారు కనీస శుభ్రత పాటించని హోటళ్లు కొన్నయితే పాడైన ఆహార పదార్థాలు విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న రెస్టారెంట్లు మరికొన్ని. ఇవన్నీ చూసి ప్రజలు బయటి ఆహారం తినాలంటే భయపడుతున్నారు.  ఇంటి ఫుడ్‌నే సో బేటర్ అంటున్నారు.  

APGoverment

మ‌హిళా ఉద్యోగుల‌కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

ఏపీలో కూటమి ప్రభుత్వం మహిళ ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగంలో నూతంగా నియమితులైన ప్ర‌భుత్వ ఉద్యోగినులు ప్ర‌సూతి సెల‌వులు తీసుకున్నా ప్రొబేష‌న్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండ‌దని తెలిపింది. ఈ మేర‌కు ప్రసూతి సెల‌వుల‌ను డ్యూటీగా ప‌రిగ‌ణిస్తూ ప్ర‌భుత్వం గెజిట్ విడుద‌ల చేసింది. ఇదివ‌ర‌కు రెగ్యుల‌ర్ మ‌హిళా ఉద్యోగుల‌కు మాత్ర‌మే మాతృత్వ సెల‌వులు ఉండేవి. తాజాగా స‌ర్కార్ తీసుకున్న‌ ఈ నిర్ణ‌యం ప‌ట్ల ప్ర‌భుత్వ ఉద్యోగినులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. మరోవైపు గుడ్ ఫ్రైడే సందర్భంగా పాస్టర్లకు ఏపీ ప్రభుత్వం తీపి క‌బురు చెప్పింది. నెలకు రూ.5 వేలు చొప్పున పాస్టర్లకు గౌరవ వేతనం ఇచ్చే అందుకు నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఈ నిర్ణయం తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని 8,427 మంది క్రైస్తవ పాస్టర్లకు లబ్ది చేకూరనుంది. 2024 మే నుంచి నవంబర్ వరకు (7 నెలలు) విడుదల కానున్నాయి. నారా లోకేశ్ యువగళం హామీని అమలు చేసిన కూటమి ప్రభుత్వం.. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ఇక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పాస్టర్ల, క్రైస్తవ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 

telugu states cms meet soon

త్వరలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. ఎందుకంటే?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారా? అన్న ప్రశ్నకు రాజకీయవర్గాలలో ఔననే సమాధానమే వస్తోంది. అయితే వీరి భేటీ ఎప్పుడు? ఎక్కడ జరుగుతుందన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు. మొత్తం మీద ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్యా ఎడతెగకుండా కొనసాగుతున్న విభజన సమస్యల పంచాయతీతో పాటు, జల వివాదాలకు కూడా శాశ్వత పరిష్కారం కనుగొనాలన్న లక్ష్యంతో ఇరు రాష్ట్రాల సీఎంలూ భేటీ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని రెండు రాష్ట్రాల అధికార వర్గాలలో జోరుగా చర్చ సాగుతోంది.   ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయి దశాబ్దా కాలం దాటుతోంది. అయితే ఇప్పటికీ విభజన సమస్యలు ఇరు రాష్ట్రాల మధ్యా అలాగే కొనసాగుతున్నాయి. జలవివాదాలు కూడా రెండు రాష్ట్రాలనూ ఇబ్బందులు పెడుతూనే ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించుకుంటేనే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంగా అభివృద్ధి, సంక్షేమాలపై సంపూర్ణంగా దృష్టి సారించడానికి వీలౌతుందన్న ఉద్దేశంతో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని చెబుతున్నారు.  ఇదే లక్ష్యంతో గత ఏడాది జులైలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఒక సారి భేటీ అయిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని ప్రజాభవన్ లో జరిగిన ఈ భేటీ సుహృద్భావ వాతావరణంలో జరిగింది.  ఇప్పుడు మరోసారి భేటీ కావాలని ఇరువురూ భావిస్తున్నారు.  విభజన సమస్యలలో చాలా వరకూ కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారమైపోయేవే ఉన్నాయని రాజకీయవర్గాలు అంటున్నాయి. ఇక చట్ట ప్రకారం పరిష్కారం కావాల్సిన వాటి విషయంలో కూడా మాట్లాడుకుని ఆ ప్రక్రియను వేగవంతం చేయడానికి కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ అవసరమని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సాధ్యమైనంత త్వరలో మరోసారి భేటీ కావాలని చంద్రబాబు, రేవంత్ లు భావిస్తున్నారని, ఇందుకు సంబంధించి సూత్రప్రాయ నిర్ణయం కూడా అయిపోయిందనీ అభిజ్ణవర్గాల భోగట్టా. ఏపీలో  ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీ , తెలంగాణలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లు విభజన సమస్యల పరిష్కారం విషయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించాయని చంద్రబాబు, రేవంత్ లు భావిస్తున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సాధ్యమైనంత త్వరగా విభజన సమస్యలకు పరిష్కారం కనుగొనాలని వారిరువురూ భావిస్తున్నారు.  త్వరలో వీరి మధ్య జరిగే భేటీలో జల వివాదాల అంశం కూడా ప్రస్తావనకు వస్తుందని అంటున్నారు.  ఉద్యోగుల పంపకం,  విద్యుత్ బకాయిలు, ఆస్తుల విభజన వంటి సమస్యలపైనా చర్చించి పరిష్కరించుకోవాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ భావిస్తున్నారని చెబుతున్నారు. 

minister kondasurekha in dispute again

బంధువు ఉద్యోగం కోసం కొండా సురేఖ రాయబారం

వైరల్ అవుతున్న మంత్రి ఆడియో కొండా సురేఖ ఎపిసోడ్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ డిబేట్‌కు దారితీస్తోంది .. తాజాగా సెక్రటేరియట్‌లో దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ పేషీలో సరస్వతి నది పుష్కరాలకు సంబంధించిన యాప్, వెబ్‌సైట్‌ని లాంచ్ చేశారు. దానికి సంబంధించిన ప్రెస్‌మీట్ ముగిశాక.. ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో ఆవిడ జరిపిన సంభాషణ.. హాట్ టాపిక్‌గా మారింది. మంత్రి మాట్లాడిన అంశంపైనే ఇప్పుడు వివాదమంతా. తన బంధువు బిడ్డ కోసం.. ఓ ఉద్యోగం ఉంటే చూడాలంటూ.. కొండా సురేఖ మాట్లాడిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయ్. ఈ పైరవీ సీన్ అంతా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సహచర మంత్రి.. ఉద్యోగం చూడాలని కోరడం, సరే చేద్దాం.. ఇప్పిస్తానంటూ ఆ మంత్రి కూడా బదులివ్వడంపై.. సోషల్ మీడియాలో డిబేట్‌ మొదలైంది.  తన అన్నయ్య మనవడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడని.. ఏదైనా ఉద్యోగం కోసం సిఫారసు చేయాలని కొండా సురేఖ.. తన సహచర మంత్రి శ్రీధర్ బాబుని కోరారు. ఆయన కూడా సరే అంటూ హామీ ఇవ్వడం క్షణాల్లో జరిగిపోయాయ్. ఇదంతా క్యాజువల్‌గా జరిగి ఉంటే ఎలాంటి వివాదం లేదు. ఇష్యూ ఇద్దరు మంత్రుల మధ్యలోనే ఉండిపోయేది. బయటకు తెలియకపోయేది. కానీ.. ఈ సీన్ అంతా అక్కడే ఉన్న కెమెరాల్లో రికార్డ్ అవడం, ఆ క్లిప్ బయటకు రావడం, సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. వివాదంగా మారింది. ప్రెస్‌మీట్ అవగానే.. మంత్రులు మాట్లాడుకున్నారు. అక్కడ కెమెరాలున్నాయనే కనీస అవగాహన కూడా లేకుండా.. మంత్రి తన బంధువులకు ఉద్యోగం కావాలి.. అందుకు మీ రికమండేషన్ కావాలని అడగడంపై.. సోషల్ మీడియా యూజర్లంతా విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి నెలకొంది. తమకు కూడా ఉద్యోగాలు కావాలని, మంత్రులు సిఫారసు చేయాలని కామెంట్స్ చేస్తున్నారట. ఈ వ్యవహారం కాస్తా.. కాంగ్రెస్ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తీవ్ర చర్చకు దారితీసిందట. ఆ మధ్య.. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలతో పాటు తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే తీవ్ర దుమారం రేపాయి. ఆవిడ చేసిన వ్యాఖ్యల్ని.. రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖులంతా ముక్తకంఠంతో ఖండించిన పరిస్థితి. ఈ క్రమంలో.. కొండా సురేఖ వ్యాఖ్యలపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేయడం, వివరణ అడగడం కూడా జరిగింది. అప్పుడే.. ఆవిడను మంత్రి పదవి నుంచి తప్పిస్తారనే ఊహాగానాలు వినిపించాయి. చివరకు.. కొండా సురేఖ తన వ్యాఖ్యల్లో తప్పుంటే వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటన చేశారు. ఇంకా.. ఈ వ్యవహారం కోర్టులో నలుగుతూనే ఉంది. ఈ ఇష్యూ.. కొండా సురేఖకు తలనొప్పిగా మారిందనేది విశ్లేషకుల మాట. అయితే.. ఇదే సమయంలో మంత్రిగారి వ్యవహారం వివాదాస్పదంగా మారడం ఇప్పుడు కొత్తేమీ కాదనే చర్చ కూడా పార్టీలో సాగుతోంది.  గతంలో ఆవిడ మాట్లాడిన ఆడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయ్. మనవడి పుట్టినరోజు సందర్భంగా.. ఎవరెక్కువ డ్యాన్స్ చేస్తే వాళ్లకు తాగినంత మద్యం అంటూ చెప్పిన సెల్ఫీ వీడియో కాల్ కూడా వైరల్ అయింది. మొత్తంగా.. మంత్రి కొండా సురేఖ ఏం మాట్లాడినా.. అది వైరల్ అవడం పరిపాటిగా మారుతోందనే చర్చ పార్టీలో నడుస్తోంది. అంతేకాదు.. ఆమె వ్యవహారశైలి పదే పదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుండటంతో.. కొండా సురేఖ గ్రాఫ్ కూడా పడిపోతోందనే చర్చ సాగుతోంది. ఆవిడ పనితీరు కూడా బాగాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయట. ఇప్పటికే.. పలుమార్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురైన మంత్రి కొండా సురేఖ.. ఇకపై కొంత సంయమనంతో వ్యవహరిస్తే బాగుటుందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది.

differences in karnataka congress

కర్నాటకంలో కులకలం

మీరు కొట్టుకుంటే.. మోదీ కూల్చేస్తారు   ముఖ్య నేతలకు ఖర్గే హెచ్చరిక   కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ  కుల గణనకు ఇచ్చే ప్రాధాన్యత గురించ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కులగణనతో దేశాన్ని ఎక్స్- రే తీసి.. అసమానతలను తొలగిస్తామనీ, దేశ సంపదను అన్ని వర్గాలకూ సమానంగా పంచుతామనీ, రాహుల్ గాంధీ  2024 ఎన్నికల్లోనే దేశ ప్రజలకు హామీ ఇచ్చారు.  ఇక అక్కడి నుంచీ రాహుల్ గాంధీ కులగణన గురించి ఎక్కడంటే అక్కడ మాట్లాడుతూనే ఉన్నారు. పార్లమెంట్  ప్రసంగమే అయినా.. పార్టీ లేదా పబ్లిక్ మీటింగే అయినా..  కులగణన ప్రస్తావన లేని రాహుల్ గాందీ ప్రసంగం ఇటీవల కాలంలో ఒక్కటీ  లేదంటే అతిశయోక్తి కాదు.ఇది ఆయనకు ఈ అంశం పట్ల ఉన్న నిబద్దతకు నిదర్శనంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.  దేశంలో అసమానతలు తొలిగి పోయేందుకు కులగణనను మించిన దివ్య ఔషథం మరొకటి లేదనే విశ్వాసం ఆయన ప్రతి మాటలో వ్యక్తమవుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే కులగణనకు రాహుల్ గాంధీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారని  అంటున్నారు. కులగణనలో ఆయన భవిష్యత్ భారతాన్ని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ను చూస్తున్నారు. అందుకే ఆయన  దేశం అంతటా కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే  కాంగ్రెస్ ప్రభుత్వాలు తక్షణం కులగణన చేపట్టి ఆదర్శంగా నిలవాలని కాంగ్రస్ పాలిత మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులను రాహుల్ గాంధీ ఆదేశించారు.     రాహుల్ గాంధీ ఆదేశాల మేరకే తెలంగాణ ప్రభుత్వం ఆగమేఘాలపై కులగణనను చేపట్టింది.   దిగ్విజయంగా పూర్తిచేసింది. అంతే కాదు  తదను గుణంగా రిజర్వేషన్లను పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ.. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. కేంద్రానికి పంపింది. కేంద్రం పై వత్తిడి తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ పార్టీ పెద్దలు, మంత్రులు ఢిల్లీ వరకూ వెళ్లి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. రాహుల్ గాంధీ మెప్పు పొందారు. ఇటీవల జరిగిన అహ్మదాబాద్ ఏఐసీసీ వేదిక నుంచి  రాహుల్ గాంధీ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసల్లో ముంచెత్తారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపిన కులగణనను ఆదర్శంగా తీసుకుని దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని ఆయన కేంద్ర ప్రభుతాన్నిడిమాండ్ చేశారు.  అయితే ఇప్పడు అదే కులగణన కర్ణాటక మంత్రి వర్గంలో కుంపట్లు రాజేసింది. అసలే ఉప్పు నిప్పులా ఉండే ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్  మధ్యన మరో కుంపటి వెలిగించింది.  నిజానికి  రాహుల్ గాంధీ మదిలో కులగణన మెరుపు మెరవక ముందు ఎప్పుడో దశాబ్దం క్రితం 2015లోనే.. ఇదే ముఖ్యమంత్రి సిద్ద రామయ్య సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం  సామాజిక ,ఆర్థిక, విద్యా సర్వే పేరిట  కులగణన చేపట్టింది.  ప్రాథమిక   నివేదిక 2018 నాటికే సిద్దమైంది. అయితే అప్పటి బీజేపీ ప్రభుత్వం ఆ నివేదికను ముట్టుకోలేదు. పక్కన పెట్టింది.  అయితే.. 2023లో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి.. మళ్ళీ సిద్దరామయ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత కులగణన మరోమారు తెర పైకి వచ్చింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ కులగణన జెండా పట్టిన తర్వాత  పాత సర్వే అంశం  పై కొచ్చింది. అయితే  ఓ వంక రాహుల్ గాంధీ,దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నా.. సిద్ధంగా ఉన్న కులగణన నివేదికను బయట పెట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం నిన్న మొన్నటి వరకూ మీన మేషాలు లెక్కిస్తూ వచ్చింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్  మధ్య ఏకాభిప్రాయం కుదరక పోవడంతో  కాంగ్రెస్ అధిష్టానం కూడా వేలు పెట్టే ప్రయత్నం చేయలేదు. అయితే.. తాజాగా గత శుక్రవారం (ఏప్రిల్ 11) నివేదిక రాష్ట్ర మంత్రి వర్గం ముందు కొచ్చింది. నివేదిక కాపీలు మంత్రుల చేతుల్లోకి వచ్చాయి. అందులోని అంశాలు లీక్ అయ్యాయి.  సహజంగానే దుమారం చెలరేగింది. నివేదిక ప్రకారం కర్ణాటకలో వెనుకబడిన కులాల జనాభా 69.60 శాతానికి చేరింది. ముస్లిములు సహా, మిగిలిన సామాజిక వర్గాల శాతం ఇంచు మించుగా రెట్టింపు అయింది. మరోవంక రాష్ట్రంలో రాజకీయంగా బలమైన సామాజికవర్గం వీరశైవలింగాయతలలోని, లింగాయతులు, వక్క లింగాయతుల శాతం మాత్రం తగ్గింది.  దీంతో, నివేదిక విశ్వసనీయతను ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సహా పలువురు తప్పు పడుతున్నారు. కులగణన నివేదికను వీరశైవలింగాయతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ నివేదికను చెత్తబుట్టలో పడేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం (ఏప్రిల్ 17) న కులగణన నివేదికపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ  ప్రత్యేక సమావేశం  తీవ్ర వాదోపవాదాల నడుమ రసాభాసగా ముగిసినట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్న లింగాయత్, వక్క లింగాయత్ కులాల మంత్రులు నివేదికను పూర్తిగా వ్యతిరేకిచినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హెచ్.కే పాటిల్ మీడియాతో మాట్లాడుతూ.. చర్చలు అసంపూర్తిగా ముగిసాయి, తిరిగి మే 2న జరిగే మంత్రివర్గ ప్రత్యేక సమవేశంలోమరో సారి  మరింత లోతుగా చర్చిస్తామని చెప్పారు. అయితే.. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సింగల్ పాయింట్ ఎజెండాగా ముదుకు తీసుకుపోతున్న కులగణనకు కాంగ్రెస్ పాలిత కర్ణాటకలోనే ఎదురుదెబ్బ తగలడం  కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందని పరిశీలకులు అంటున్నారు.  మరోవంక  కులగణన వివాదం నేపథ్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్యమంత్రి పదవి కోసం కొట్టుకోకండని, కర్ణాటక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి సూచించారు. మీ మధ్య విభేదాలు మోడీకి అవకాశమవుతున్నాయని ఖర్గే హెచ్చరిం చారు. ప్రధాని ప్రభుత్వాన్ని కూల్చేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొంటూ కాంగ్రెస్ నేతలు అప్ర మత్తంగా ఉండాలన్నారు. కాగా  ఖర్గే చేసిన బహిరంగ హెచ్చరిక ప్రమాద స్థాయిని సూచిస్తోందని పరిశీలకులు అంటున్నారు.

new trouble in Tamil alliance

పీటల వరకే పెళ్లి.. తమిళ పొత్తులో కొత్త తిరకాసు!

తమిళనాడులో భారతీయ జనతా పార్టీ, అన్నాడీఎంకే పార్టీల మధ్య ఎన్నికల పొత్తు కుదిరింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రెండు రోజులు చెన్నైలో కూర్చుని మరీ పొత్తును పీటలెక్కించారు. స్వయంగా ఆయనే చెన్నైలో పొత్తు ప్రకటన చేశారు. వచ్చే సంవత్సరంలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఎంకే’ పార్టీలు కలిసి  పోటీ చేస్తాయని ప్రకటించారు.  అన్నాడీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పడి కే. పళని స్వామి, బీజేపీ నేత అన్నామలైలతో కలిసి  మీడియా సమావేశంలో పాల్గొన్న అమిత్ షా స్వయంగా  పొత్తు ప్రకటన చేశారు. అంతే కాదు.. పొత్తుకు అన్నాడీఎంకే ఎలాంటి షరతులు పెట్టలేదని, అలాగే బీజేపీ నుంచి కూడా షరతులు ఏవీ లేవని స్పష్టం చేశారు. డీఎంకే దుష్ట దుర్మార్గ  పాలనను అంతమొందించడమే లక్ష్యంగా  బీజేపీ, అన్నాడీఎంకే కూటమి ఇతర పార్టీలను కలుపుకుని ఎన్డీఎ బ్యానర్ పై ఎన్నికల్లో పోటీ చేస్తుందని అమిత్ షా చెప్పారు. అంత వరకు అంతా బాగుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు నడ్డా సహా బీజేపీ జాతీయ నేతలు, రాష్ట్ర నాయకులు పొత్తు కుదరడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ అయితే..  స్ట్రాంగర్ టుగెదర్   (‘కలిసి ఉంటే కలదు బలం’) అని ట్వీట్ చేశారు. అన్నాడీఎంకే ఎన్డీఎ కూటమిలో చేరినందుకు సంతోషం వ్యక్తం చేశారు. స్వాగతించారు. నిజానికి ఎన్నికల పొత్తుకు సంబంధించి ఇరు పార్టీల మధ్య గత కొంత కాలంగా చర్చలు, సంప్రదింపులు జరుగతున్న నేపధ్యంలో, పొత్తు ప్రకటన పెద్దగా సంచలనం కాలేదు. అయితే  పొత్తు పారాణి ఆరక ముందే.. అన్నాడీఎంకే అధినేత పళని స్వామి  పొత్తుకు కొత్త అర్థం చెపుతూ చేసిన  ప్రకటన నిజంగానే రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ సంచలనం సృష్టించింది. చర్చకు దారి తీసింది.    అవును. ఎన్నికల వరకే పొత్తంటూ పళని స్వామి పొత్తుకు కొత్త అర్థం చెప్పారు.ఎ న్నికలలో ఎన్డీఎ కూటమి గెలిచినా, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు అన్నాడీఎంకే ఒప్పుకోదని స్పష్టం చేశారు. అంటే  పీటల వరకే పెళ్లి, సంసారం అంటే కుదరదు  అని పళని స్వామి మెలిక పెట్టారు. అంతే కాదు.. అమిత్ షా చెప్పింది కూడా అదే  అని వివరణ  కూడా ఇచ్చారు. అయితే  వాస్తవంలో అమిత్ షా చెప్పిన దానికి, పళని స్వామి చెప్పిన భాష్యానికి పొంతన లేదని పరిశీలకులు అంటున్నారు. అమిత్ షా చాలా  స్పష్టంగా  పొత్తుకు తమిళ పార్టీ ఎలాంటి షరతులు పెట్టలేదని చెప్పారు. కానీ  పళని స్వామి ఇప్పడు పొత్తుకు షరతులు వర్తిస్తాయి అంటున్నారు. అంతే కాదు.. పొత్తు ఎన్నికల వరకే, ఎన్డీఎ అధికారంలోకి వచ్చినా, బీజేపీ, ఇతర మిత్ర పక్షాలకు మంత్రివర్గంలో స్థానం ఉండదని  పళని స్వామి తేల్చేశారు.  మరో వంక రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా అంతేగా ..అంతేగా అంటున్నారు. అయితే.. బీజేపీ జాతీయ నాయకత్వం కూడా అదే అభిప్రాయంతో వుందా అనేది ఇంకా స్పష్టం కాలేదని  పార్టీ వర్గాల సమాచారం. అయితే..  దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బీజీపీ నాయకత్వం,అన్నాడీఎంకే షరతులకు తాత్కాలికంగానే అయినా  ఓకే అంటుందని  అంటున్నారు.  నిజానికి  అన్నాడీఎంకే డిమాండ్ మేరకే బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి నుంచి అన్నామలైని తప్పించిందనీ, అలాగే  పళని స్వామి తాజా డిమాండ్ ను అంగీకరించినా అంగీకరిస్తుందని అంటున్నారు.    అయితే.. పళని స్వామి రోజుల వ్యవధిలోనే యు టర్న్ ఎందుకు తీసుకున్నారు?  ఇంతలో ఏమి జరిగింది.. అంటే, బీజేపీతో పొత్తును అన్నాడీఎంకే లో ఒక వర్గం వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వరం నేతల విముఖతే పళని సామి యు టర్న్ కు ప్రధాన కారణం అంటున్నారు. బీజేపీతో పొత్తు ముస్లిం ఓటును పూర్తిగా దూరం చేస్తుందని అన్నాడీఎంకే నాయకులు  పొత్తును వ్యతిరేకిస్తునట్లు తెలుస్తోంది. అలాగే.. బీజేపీతో పొత్తు కారణంగా  2021 అసెంబ్లీ 2019, 2024 లోక్ సభ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలు కూడా పొత్తు వద్దనడానికి కారణంగాచెపుతున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తున్నా  ఫలితం లేక పోయింది. అన్నాడీఎంకే సీట్ల సంఖ్య 136 నుంచి 75కి పడి పోయింది.  అధికారం అన్నాడీఎంకే చేజారింది. అలాగే, 2019 లోక్ సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే పొత్తులో భాగంగా 20 సీట్లలో పోటీ చేసి కేవలం ఒకే ఒక్క సీటు గెలుచుకుంది.  అయితే  బీజేపీతో తెగతెంపులు చేసుకున్న తర్వాత జరిగిన 2024 లోక్ సభ ఎన్నికల్లో 33 సీట్లలో పోటీ చేసినా అన్నాడీఎంకేకి  ఆ ఒక్క సీటే దక్కింది. అందుకే  ఆ చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకునే బీజేపీతో పొత్తుపట్ల అన్నాడీఎంకేలో విముఖత వ్యక్తం అవుతోందనీ, అందుకే, పళని స్వామి యు టర్న్ తీసుకున్నారని అంటున్నారు.  అయితే.. రాష్ట్రంలో మరీ ముఖ్యంగా అన్నామలై నాయకత్వంలో బీజేపీ బలం మెల్ల మెల్లగా పెరుగుతోందని అంటున్నారు.  2021 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు ఉన్నా బీజేపీకి  3-4 శాతం మధ్యనే ఓట్లు పోలయ్యాయి. కానీ,  2024 లోకసభ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు లేకున్నా బీజేపీ ఓటు 7.58 శాతం పెరిగింది.  11 శాతానికి పైగా ఓట్లు బీజేపే  సొంత చేసుకుంది. ఈ నేపథ్యంలోనే అన్నాడీఎంకే బీజేపీతో మళ్ళీ పొత్తుకు సిద్దమైంది. అయితే పార్టీలో వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో  పళని స్వామి అటూ ఇటూ అవుతున్నారని అంటున్నారు. అయితే ప్రస్తుతానికి పళని  స్వామి  వ్యూహాత్మకంగా వెనకడుగు వేసినా.. డీఎంకేను ఎదుర్కోవాలంటే  బీజేపీ ఓటుతో పాటుగా కేంద్ర ప్రభుత్వ సపోర్ట్ కూడా అన్నాడీఎంకేకు అవసరం అవుతుందనీ,  అలాగే  బీజేపీకి కూడా దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా ఏపీలో టీడీపీ, జనసేనతో ఎలాగైతే పొత్తు  అవసరమో.. అదే విధంగా  తమిళనాడులో అన్నాడీఎంకే పొత్తు అనివార్యమని అంటున్నారు.  సో .. బీజేపీ, అన్నాడీఎంకే  పొత్తు ప్రయాణంలో ఒడిదుడుకులు ఉన్నా చివరాఖరుకు పొత్తు  పట్టాలు ఎక్కుతుందని అంటున్నారు.  

No-confidence motion against mayor is a test for Botsa

బొత్స బెదిరింపులకు కార్పొరేటర్లు భయపడేనా ?

విశాఖలో మేయర్ పై అవిశ్వాస తీర్మానం పై చర్చ రేపే ఓడలు బళ్ళు బళ్ళు ఓడలవుతాయి అంటారు ఇప్పుడు వైసీపీ పరిస్థితి అలాగే  తయారైంది.  నిన్న మొన్నటి వరకూ  నిశ్శబ్దంగా ఉన్న వైసీపీ నాయకులు తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు.  రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి.  రాజ్యసభ సభ్యత్వం నుంచి సర్పంచి వరకు వైసీపీ నాయకులు  రాజీనామాలు చేసి కూటమి పార్టీల బాట పడుతున్నారు.  ఈ తరుణంలో వైసీపీకి విశాఖ మేయర్ పీఠం అగ్నిపరీక్షగా మారింది. ఆ పార్టీకి కంటే..   ఆ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణకి విశాఖ మేయర్ పీఠాన్ని కాపాడుకోవడం కీలకంగా మారింది. . .విశాఖ కార్పొరేషన్ లో 98 వార్డులకు గాను 58 వార్డులో వైసీపీ కార్పొరేటర్లు గెలుపొందారు.  కానీ అప్పుడు ప్రభుత్వం అధికారంలోకి ఉండడంతో ఇతర పార్టీలు ఇండిపెండెంట్ లను కూడా వైసీపీ బెదరించి తమలో కలుపుకుంది.  అయతే రాష్ట్రంలో  వైసీపీ అధికారం కోల్పోవడంతో విశాఖ మేయర్ పీఠం పై కూటమి నాయకులు కన్ను వేశారు.  దీనికి వైసీపీలోని అసంతృప్తి వర్గం పూర్తిస్థాయిలో సహకరించింది.  దీంతో నిన్న మొన్నటి వరకు వైసీపీలో ఉన్న కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు తెలుగుదేశం, జనసేన గూటికి చేరిపోయారు. మేయర్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే కావల్సిన మ్యాజిక్ ఫిగర్ 74. అయితే ఇప్పడు కరుడుగట్టిన వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లు కూడా ఫ్యాన్ పార్టీని వీడారు. తిప్పల వంశీ,  బెహరా భాస్కరరావు... ముత్తం శెట్టి ప్రియాంక లాంటి నాయకులు కూడా ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పారు ఈ దశలో తమ పార్టీ సింబల్ పై గెలుపొందిన 58 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం చర్చకు హాజరు కాకూడదని ఆ పార్టీ నాయకులు  బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ హుకుం జారీ చేశారు. అలాగే పార్టీ విప్ ను కూడా జారీ చేస్తున్నట్టు ప్రకటించారు.  పార్టీ ఆదేశాన్ని పాటించని వారిపై అనర్హత వేటు వేస్తామని కూడా బొత్స సత్యనారాయణ తాజాగా హెచ్చరించారు.  నిజానికి విశాఖ తాజా కార్పొరేషన్ కాలపరిమితి కేవలం పది నెలలు మాత్రమే ఉంది. ఈ దశలో న్యాయం పరమైన చిక్కులు పూర్తి కావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది.  దీంతో పార్టీ మారిన ఫ్యాన్ పార్టీ నాయకులు ఎవరూ కూడా బొత్స మాటలను లెక్కచేసే అవకాశం లేదు.  అన్నిటికంటే మించి కార్పొరేటర్లగా గెలిచినప్పటికీ అధికారంలో ఉన్నప్పుడు తమను పట్టించుకోలేదన్న ఆగ్రహం చాలామంది వైసీపీ కార్పొరేటర్ లలో ఉంది.  ముఖ్యంగా ఒక కోటరీ చుట్టూ కార్పొరేషన్ వ్యవహారం సాగిందని ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్లు విమర్శిస్తున్నారు. ఇక బొత్స సత్యనారాయణ విశాఖ మేయర్ విషయంలో బీసీ కార్డును ఉపయోగించుకోవాలని భావించారు. అవిశ్వాసం ద్వారా బీసీ మహిళను అగౌరవ పరుస్తున్నారని బొత్స సత్యనారాయణ తాజాగా ఆరోపించారు. దీనికి కూటమి కార్పొరేటర్ మూర్తి యాదవ్ తీవ్రంగా కౌంటర్ ఇచ్చారు. అసలు పేరుకు మేయర్ అయినప్పటికీ ఆమెను ఆ పార్టీ ఎప్పుడూ కూడా గౌరవించలేదని ఆరోపించారు. ఎంపీ విజయసాయిరెడ్డి,  వై వి సుబ్బారెడ్డి లాంటి నాయకుల పెద్దరికం మాత్రమే కనిపించిందని గుర్తు చేశారు. ఈ దశలో విశాఖ మేయర్ భవిష్యత్తుతో పాటు బొత్స సత్యనారాయణ పెద్దరికానికి ఈ అవిశ్వాస తీర్మానం అగ్నిపరీక్ష కానుంది.

case on ttd former chairman

అసత్య ఆరోపణలు.. భూమనపై కేసు

తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని ఎస్వీ గోశాలలో గోవుల మృతి పై గత కొన్ని రోజులుగా వివాదం జరుగుతూనే ఉంది. తొలుత తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశంలో టీటీడీ తిరుపతి గోశాల గోవధ శాల గా మారిందంటూ ఆరోపణలు గుప్పించారు. మూడు నెలల కాలంలో 100 గోవులు మృతి చెందాయని పేర్కొన్నారు. అదే రోజు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి, భూమన ఆరోపణలు అవాస్తవమని ఖండిచారు. గోశాల పై అసత్య ప్రచారం మైనుకోవాలని,  నేరుగా వస్తే సాక్షాలతో నిరూపిస్తామన్నారు.  ఇక ఆ తరువాత రోజుకొక్క అంశంతో ప్రచారం, వాదోపవాదాలు, సవాళ్లు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఇటీవల జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ను కలిసి టీటీడీ ప్రతిష్టను దిగజార్చేలా గోశాల పై అసత్య ఆరోపణలు చేసిన టీటీడీ మాజీ  చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పై ఫిర్యాదు చేసి, చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే గోశాల పరిధిలోని ఎస్వీయూ పోలీస్ స్టేషన్ లోనూ ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్వీయూ పోలీసులు క్రైమ్ నెంబర్ 62/20 25 బి.ఎన్.ఎస్ యాక్ట్ 353(1), 299, 74 ఆఫ్ ఐటీ యాక్ట్ సెక్షన్ లు కింద భూమన పై కేసు నమోదు చేశారు. దీనిపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ  టీటీడీ, అనుబంధట సంస్థ ల పై ఆధారాలు లేకుండా రాజకీయ ప్రయోజనాల కోసం అసత్య ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.  భవిష్యత్తులో ఆరోపణలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. టీటీడీ బోర్డు సభ్యుడిగా ఎస్వీయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని, టీటీడీ గోశాలలో సహజంగా గోవులు మరణిస్తే దానా సరిగ్గా పెట్టలేదు..  బక్కచిక్కి పోయాయని అసత్య ప్రచారం భక్తుల్లోకి తీసుకెళ్లి టీటీడీ ప్రతిష్ట ను దిగజార్చే విధంగా చేశారని అన్నారు. గో  హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా అసత్య ఆరోపణలు చేసిన   టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ను కోరినట్లు చెప్పారు. అదే ఫిర్యాదు ఎస్వీయూ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇచ్చాననీ, దానిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. అసత్య ప్రచారం చేసే వారిని ఉపేక్షించేది లేదని భాను ప్రకాశ్ రెడ్డి అన్నారు. 

finance commission chairman visit tirumala

తిరుమల శ్రీవారి సేవలో ఫైనన్స్ కమిషన్ చైర్మన్ పనగారియా

16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగారియా శుక్రవారం (ఏప్రిల్ 18) ఉదయం అభిషేక సేవలో  తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 16వ ఫైనాన్స్ కమిషన్ బృందం ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పనగారియా నేతృత్వంలోని 16వ ఫైనాన్స్ కమిషన్ బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనకు బయలు దేరడానికి ముందు ఆయనతో భేటీ అయ్యింది. ఆ సందర్భంగా చంద్రబాబు వారికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.   ఒక ముఖ్యమంత్రి స్వయంగా ఆర్ధిక అంశాలపై ప్రజంటేషన్ ఇవ్వడం తమను అబ్బుర పరిచిందని ఆ సందర్భంగా పనగారియా ప్రశంసించారు.  అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ పై  కూడా  ప్రశంసలు గుప్పించారు.  వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని   ప్రధాని దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ విధానాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తిరుమల శ్రీవారిని శుక్రవారం (ఏప్రిల్ 18) దర్శించుకున్నవారిలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తదితర ప్రముఖులు ఉన్నారు.  

ycp dirty politics over cow deaths

గోమాతల మరణాలతో వైసీపీ నీచ రాజకీయం!

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నెన్ని అవకతవకలు జరిగాయో, ఎన్నెన్ని అపచారాలు జరిగాయో, ఏడు కొండల పవిత్రతను ఎంతగా దిగాజార్చారో ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే, ఇంటి మనిషి  సొంత బాబాయ్ ఎస్వీ సుబ్బారెడ్డిని ఒకటికి రెండు సార్లు టీటీడీ చైర్మన్ గా నియమించి స్వామి వారి సంపదను కొల్లగొట్టే ప్రయత్నం మొదలు.. అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించడం వరకు జగన్ రెడ్డి పాలనలో జరగని  పాపం అంటూ ఏదీ లేదు. అవును, టీటీడీ పాపాల పుట్టగా మారింది. అందుకే  వెంకన్న దేవుడు జగన్ రెడ్డిని, ఆయన గారి పార్టీని ఆ విధంగా శిక్షించాడు. అయినా, జగన్ అండ్ కో .. తీరు మారలేదు. టీటీడీ గోశాలలో గోవులు ఆకలి, అనారోగ్యంతో కన్ను మూస్తున్నాయని అసత్య ప్రచారికి తెర తీశారు. ఒక విధంగా, అధికార దాహంతో మహాపచారానికి పాల్పడుతున్నారు.    నిజానికి  బాబాయ్, అబ్బాయ్.. పాలనలో తిరుమలలో జరగని అపచారం అంటూ ఏదీ లేదు. అన్య మత ప్రచారం అయితే యథేచ్ఛగా సాగింది. ఒకసారి కాదు.. అనేక సార్లు అన్యమతస్తుల ఆగడాలు వెలుగులోకి వచ్చాయి, అయినా.. ఏ ఒక్కరిపైన చర్యలు తీసుకున్న పాపాన పోలేదు.  అంతే కాదు.. అన్యమత ప్రచారాన్ని అడ్డుకున్నా, అవరోధాలు సృష్టించినా ఉపేక్షించేది లేదన్నట్లు జగన్ రెడ్డి ప్రభుత్వం ఫర్మానాలు జారీ చేసింది. అందుకే, నిబంధనలకు విరుద్ధంగా హిందూ దేవాలయాలలో పనిచేస్తున్న అన్య మతస్తులను గుర్తించి, ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయాలని సంకల్పించిన అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను  జగన్ రెడ్డి ప్రభుత్వం రాత్రికి రాత్రికి  బదిలీ చేసింది. అన్యమతస్తులకు అండగా నిలిచింది. నిజానికి ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేస్తూ తీసుకున్న నిర్ణయం  సామాన్యమైనది కాదు . హిందూ దేవాలయాల ధ్వంస రచన లక్ష్యంగా తీసుకున్న వ్యూహాత్మక   నిర్ణయంగా అప్పట్లోనే అధికార వర్గాలు, ముఖ్యంగా మాజీ ఐఎఎస్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్వీ ఆకస్మిక బదిలీని అన్యమతస్తుల విషయంలో జోక్యం చేసుకోవద్దని అధికారులకు చేసిన హెచ్చరికగానే తీసుకోవాలి ఉంటుందని అప్పట్లోనే అధికారులు, పదవీ విరమణ చేసిన మాజీ అధికారులు  కొందరు పేర్కొన్నారు. ఒక్క తిరుమ లలోనే కాదు.. రాష్ట్రంలో ఎక్కడైనా, ఏ దేవాలయంలో అయినా అన్యమత ఉద్యోగుల జోలికి వస్తే  ఖబడ్దార్‌  అని అధికారులను పరోక్షగానే అయినా  ముఖ్యమంత్రి హోదాలో జగన్ రెడ్డి హెచ్చరించారని అంటారు.  మరో వంక అన్యమతస్తుల ఏరి వేతకు పూనుకున్నందుకే  చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారిపై బదిలీ వేటు వేసిన తర్వాత  మరో అధికారి అలాంటి సాహసం చేయలేరని  అన్యమత ప్రచారం సాగిస్తున్న దేవాలయాల ఉద్యోగులు భరోసా ఇచ్చారు. అందుకే  ఆ తర్వాత ఏ అధికారీ ఆ సాహసం చేయలేదు. మరో వంక రాష్ట్రంలోని అనేక ప్రధాన దేవాలయాల్లో అన్యమత మత ప్రచారానికి అడ్డూ అదపూ లేకుండా  పోయిందని  అప్పట్లో అధికారులే కాదు భక్తులు కూడా ఆందోళన వ్యక్త పరిచారు.   ఆ విధంగా జగన్ రెడ్డి ఇచ్చిన భరోసాతోనే  ఆ ఐదేళ్ళ కాలంలో రాష్ట్రలో ఒకటి రెండు కాదు ఏకంగా వందకు పైగా దేవాలయాలపై దాడులు జరిగాయి. దేవుని రథాలు తగల బడ్డాయి.  గుళ్ళు కూలిపోయాయి. విగ్రహాల తలలు విరిగి పడ్డాయి. మరోవంక  ప్రభుత్వం అండదండలతో క్రైస్తవులు నామమాత్రంగా అయినా లేని గ్రామాల్లో  విదేశీ సంస్థలు సమకూర్చిన నిధులతో  చర్చిల నిర్మాణం జరిగింది.  అలాగే  కొన్ని కొన్ని చర్చిల నిర్మాణం,మరమత్తులకు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ నిధులనే జగన్ రెడ్డి ప్రభుతం ఖర్చు చేసిందనే ఆరోపణలున్నాయి.  అందుకే  ఆంధ్రప్రదేశ్‌ సాధు పరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి  జగన్ రెడ్డి  ఐదేళ్ల పాలనలో హిందువులు చాలా గడ్డు కాలాన్ని ఎదుర్కొన్నారని అన్నారు. చివరకు రామతీర్థలో రాములవారి శిరస్సు ఖండన వంటి దుర్మార్గ చర్యలకు  ఒడి గట్టినా ప్రభుత్వంపట్టించు కోలేదని ఆగ్రహం వ్యక్త పరిచారు. ఒక్కరంటే ఒక్కరినీ అరెస్ట్ చేయలేదు. ‘పాపం ..పిచ్చోళ్ళు’ అంటూ ధర్మ ద్రోహులకు జగన్ రెడ్డి ప్రభుత్వం  పిచ్చి సర్టిఫికేట్ ఇచ్చి  రక్షణ కవచంగా నిలిచింది.  అందుకే హిందూ ధార్మిక సంస్థలు జగన్ రెడ్డి హిందూ వ్యతిరేక పాలన సాగించారని  ముఖ్యంగా, తిరుమలను పవిత్రతను దిగజార్చే కుట్రలు జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిందని అనేక సందర్భాలలో ఆరోపించాయి.   ముఖ్యంగా వాటికన్ సిటీని మించిన ప్రపంచ ఆద్యాత్మిక కేంద్రంగా తిరుమల ఎదుగుదలను  తట్టుకోలేకనో ఏమో  జగన్ రెడ్డి తమ ఐదేళ్ళ సుందర ముదనష్ట పాలనలో ఏడు కొండల ప్రతిష్టను దిగజార్చేందుకు శత విధాల ప్రయత్నించారని  అంటారు. అయితే.. ఆయన లక్ష్యం నెరవేరలేదు కానీ  దేవుని శిక్ష అయితే తప్పలేదు.  అవును. జగన్ రెడ్డికి అర్థమయ్యే భాషలోనే.. వెంకన్న దేవుడు సమా ధానం ఇచ్చారు. అహంకారంతో ఊగిపోయిన, ఆయన్ని పదకొండు సీట్లకు పడగొట్టి  చూపారని భక్తులు ఇప్పటికీ సంతోషం వ్యక్త పరుస్తున్నారు.  నిజానికి  వెంకన్న దేవుని ప్రతిష్టను దెబ్బ తీసే కుట్రలు జగన్ రెడ్డితో ప్రారంభం కాలేదు . గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి  ఏడు కొండలను రెండు కొండలకు కుదించి, కొండ పైనే చర్చి నిర్మాణం చేపట్టేదుకు విఫల ప్రయత్నం చేశారు. అయితే  ఆ తర్వాత ఏమి జరిగింది.   అందరికీ తెలిసిందే.  అయినా.. జగన్ రెడ్డి, చేసిందంతా చేసి ఇప్పడు టీటీడీ గోశాలో గోమాతలు చనిపోయిన సంఘటను ఆసరా చేసుకుని, రాజకీయం చేస్తున్నారు. గతంలో అయన హయాంలోనే నాసి రకం దాణా, ఎక్స్పైర్ అయిన మందులు ఇవ్వడం వలన  గోమాతాల ఆరోగ్యం దెబ్బతిన్నదని విజిలెన్స్  నివేదిక చెప్పిన నిజాన్ని మరిచి పోయి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం  చేస్తున్నారు.  జగన్ రెడ్డి, తెర చాటు దర్శకత్వంలో భూమన నాటకాన్ని రక్తికట్టించే ప్రయత్నం గట్టిగానే  చేస్తున్నారు. నిజమే, కారణాలు ఏవైనా.. ఎక్కడైనా గోమాత తనువు చాలించడం ఏ హిందువునైనా బాధిస్తుంది. అయితే  గోమాతల సహజ మరణాలను రాజకీయం చేయడం  తద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం హిందువులే కాదు.. మనిషన్నవాడు ఎవడూ సమర్ధించడు. నిజానికి  ఇలా రాజకీయ ప్రయోజనాల కోసం మత విద్వేషాలను రెచ్చగొట్టడం కూడా కొత్త కాదు. గతంలో వైఎస్  రాజశేఖర రెడ్డి  చెన్నా రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు  హైదరాబాద్ నగరంలో మత ఘర్షణలు సృష్టించి, వందల ప్రాణాలను బలితీసుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అందుకే జగన్ తో జాగ్రత్త అంటున్నారు.

IT Knowledge Hub

పుప్పాలగూడ పరిసరాల్లో 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్ : భట్టి

హైదరాబాద్  పుప్పాలగూడ పరిసరాల్లో 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్ హబ్‌ ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. పుప్పాలగూడ భూముల్లో ఐటీ హబ్‌ ఏర్పాటుపై డిప్యూటీ సీఎం భట్టి  అధ్యక్షతన సమావేశమైన మంత్రులు దుదిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, సంబంధిత అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. పుప్పాలగూడ పరిసరాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్ అధికారులు, రెవిన్యూ అధికారులు, స్పెషల్ పోలీస్ మ్యూచువల్ కో-ఆపరేటివ్ సొసైటీ తదితర సొసైటీలకు సుమారు 200 ఎకరాలకు పైచిలుకు భూమిని గతంలో ప్రభుత్వం కేటాయించింది.   ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్‌లు, రెవెన్యూ, స్పెషల్‌ పోలీస్‌ సొసైటీలకు కేటాయించిన ఈ భూమిలో ఐటీ హబ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ‘‘వివిధ సొసైటీలకు 200 ఎకరాల భూ కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. పక్కనే ఉన్న మరో 250 ఎకరాల టీజీఐఐసీ భూములు కలిపి ఐటీ హబ్‌ ఏర్పాటు చేస్తాం. ఈ ఐటీ నాలెడ్జ్‌ హబ్‌తో 5 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి’’ అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు

Hyderabad

హైద‌రాబాద్‌లో ఇద్ద‌రు పిల్ల‌ల్ని న‌రికి చంపిన త‌ల్లి

  మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని గాజుల‌రామారంలో దారుణం జ‌రిగింది. ఓ క‌సాయి త‌ల్లి త‌న ఇద్ద‌రు కొడుకుల‌ను వేట కొడ‌వ‌లితో నరికి చంపింది. అనంత‌రం ఆమె భవనం పైనుంచి దూకి ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకుంది. హ‌త్య‌కు గురైన పిల్ల‌ల వ‌య‌సు 7, 5 ఏళ్లు ఉంటాయ‌ని స్థానికులు వెల్లడించారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని ముగ్గురి మృత‌దేహాలను స్వాధీనం చేసుకున్నారు. తేజస్విని రెడ్డి అనే మహిళ గాజులరామారం ప్రాంతంలో నివాసం ఉంటోంది. కొంతకాలంగా కుటుంబ కలహాలతో మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురైన తేజస్విని తన ఇద్దరు కుమారులు హర్షిత్ రెడ్డి (7), ఆశిష్ రెడ్డి (5)లను వేట కొడవలితో నరికి చంపినట్లు పోలీసులు గుర్తించారు.  పెద్ద కుమారుడు హర్షిత్ స్పాట్ డెడ్ కాగా.. తీవ్రంగా గాయపడిన చిన్న కొడుకు ఆశిష్‌ను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరణించాడు. చనిపోయే ముందు తేజస్విని ఆరుపేజీల సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు తెలిపారు. సూసైడ్ నోట్ లో ఆమె తన మనోవేదనను, కుటుంబపరమైన ఒత్తిడులను వివరించినట్టు సమాచారం. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అనంత‌రం పోస్టుమార్టం నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కుటుంబ త‌గాదాల నేప‌థ్యంలోనే ఆమె ఈ ఘాతుకానికి పాల్ప‌డి ఉండొచ్చ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.    

TGPSC

గ్రూప్-1 నియామకాలు నిలిపివేత

  తెలంగాణలో గ్రూప్-1 నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని టీజీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ పూర్తయ్యే వరకు నియామక పత్రాలు ఇవ్వొద్దని,  సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగించవచ్చని న్యాయస్ధానం టీజీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. 2022 ఏప్రిల్ లో 503 పోస్టులకు టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ సమయంలో 3,50,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2022 అక్టోబర్‌లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా.. 2,80,000 మంది హాజరయ్యారు. అయితే, ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలైనా.. పేపర్ లీక్ కారణంగా ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. దాంతో 2023 జూన్‌లో మళ్లీ పరీక్షలు నిర్వహించారు. దీనిపై పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా.. పరీక్షల నిర్వహణలోని లోపాల నేపథ్యంలో పరీక్షలను రద్దు చేయాలని కోర్టు తీర్పునిచ్చింది. గత ప్రభుత్వ సమయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించింది. కానీ, తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది. ఇదే సమయంలో పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసి.. కొత్త నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 19న విడుదల చేసింది.

two persons murdered in seperate incidents in nellore

నెల్లూరు లో ఇద్దరు దారుణ హత్య!

నెల్లూరు లో  వేరు వేరు సంఘటనల్లో ఇద్దరుు దారుణ హత్యకు గురయ్యారు.   ఈ   నెల్లూరు అయ్యప్ప గుడి వద్ద  కారు ట్రావెల్ యాజమాని అల్లా బక్షు టిఫిన్ బండి వద్ద టిఫిన్ చేస్తుండగా.. మద్యం సేవించిన ఓ గ్యాంగ్ మోటార్ బైక్ మీద వేగంగా వచ్చి బక్షు బైకును డీ కొట్టారు. దీంతో బక్షు వాళ్ళను మందలించాడు. మద్యం  మత్తులో ఉన్న వారు భక్షుతో గొడవకు దిగారు. ఆ గొడవ పెరిగి మద్యం మత్తులో ఉన్నవారిలో ఒకడు కత్తితో  బక్షు గుండెలో పొడిచాడు. కుప్పకూలి పడిపోయిన బక్షును ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. అలాగే మరో సంఘటనలో సుల్తాన్ అనే వ్యక్తిని మద్యం మత్తులో ఉన్న ఇద్దరు బండరాయి తో కొట్టి చంపారు. ఈ సంఘటన జాకీర్ హుస్సేన్ నగర్ వద్ద జరిగింది. ఇలా నెల్లూరు నగరం లో వరుసగా హత్యలు జరుగుతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గడిచిన నెల రోజుల్లో నెల్లూరులో ఆరుగురు హత్యకు గురయ్యారు. నెల్లూరులో శాంతి భద్రతల పరిస్థితిపై  తెలుగు దేశం పార్టీ కి చెందిన నేతలు చంద్రబాబుకు కూడ ఫిర్యాదు చేశారు.

డ్రగ్స్ రైడ్.. హోటల్ నుండి దూకి పారిపోయిన నటుడు

  మలయాళం హీరో షైన్‌ టామ్‌ చాకో మరోసారి వార్తల్లో నిలిచారు. కొచ్చిలోని ఓ హోటల్‌లో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారంతో జిల్లా యాంటీ-నార్కోటిక్ స్పెషల్ యాక్షన్ ఫోర్స్  బృందం  ఉదయం 11 గంటల సమయంలో రైడ్ చేసింది. అయితే పోలీసులు హోటల్‌కు రావడానికి కొద్దిసేపటి ముందే షైన్ టామ్ చాకో మూడో అంతస్తులో ఉన్న రూం కిటికీ నుండి రెండో అంతస్తులోకి దూకి, అక్కడి నుంచి మెట్ల ద్వారా చాకో పారిపోయినట్లు తెలుస్తోంది. అంతకు ముందు సూత్రవాక్యం అనే సినిమా షూటింగ్ సమయంలో షైన్ టామ్ చాకో డ్రగ్స్ తీసుకొని తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని నటి విన్సీ సోనీ అలోషియస్ ఆరోపించింది.  ఈ నేపథ్యంలో ఆమె సదరు నటుడిపై కేరళ చిత్ర పరిశ్రమలో మరియు అమ్మ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేసింది. గతంలో ఓ డ్రగ్స్ కేసు నుంచి నిర్దోషిగా విడుదలైన కొద్ది రోజుల్లోనే డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. దసరా మూవీతో టాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకున్న మలయాళ నటుడు షైన్ టామ్ చాకో. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విలన్‌గా ప్రేక్షకులను మెప్పించారు. గతేడాది విడుదలైన తెలుగు మూవీ దేవరలోనూ కీలక పాత్ర పోషించారు. ఇటీవల విడుదలైన అజిత్ కుమార్‌ గుడ్ బ్యాడ్‌ అగ్లీ చిత్రంలోనూ కనిపించారు.

జగన్ అక్రమాస్తుల కేసు.. దాల్మియా సిమెంట్స్ ఆస్తుల అటాచ్

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒక విధంగా జగన్ కి  ఎన్ఫోర్సమెంట్ డైరెక్టరేట్  ఝలక్ ఇచ్చింది. అక్రమాస్తుల కేసులో  793 కోట్ల రూపాయల విలువైన దాల్మిచా సిమెంట్స్ ఆస్తులను గురువారం (ఏప్రిల్ 17) అటాచ్ చేసింది. ఈ అటాచ్ చేసిన వాటిలో దాల్మిచా సిమెంట్స్ భూములు కూడా ఉన్నాయి.   కడప జిల్లాలో 417 హెక్టార్ల భూమి కేటాయింపు విషయంలో దాల్మియాపై ఆరోపణలు ఉన్నాయి. కడప జిల్లాలో దాల్మిచా సిమెంట్స్ కు సున్నపురాయి లీజు కేటాయింపుల వెనుక  జగన్ ఉన్నారని సీబీఐ గతంలో చార్జిషీట్ కూడా దాఖలు చేసిన సంగతి తెలిసిందే.  ఈ వ్యవహారంలో జగన్ 150 కోట్ల రూపాయలకు పైగా లబ్ధి పొందారని కూడా సీబీఐ ఆ చార్జి షీట్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ 150 కోట్ల రూపాయలలో 55 కోట్ల రూపాయలు హవాలా రూపంలోనూ, దాల్మియా సిమెంట్స్ లో షేర్ల రూపంలో 95 కోట్ల రూపాయలు  జగన్ కు చేరాయని సీబీఐ చార్జి షీట్ లో పేర్కొంది. ఆ చార్జి షీట్ ఆధారంగానే ఈడీ విచారణ జరిపింది. తాజాగా దాల్మియా సిమ్మెంట్స్ ఆస్తులను అటాచ్ చేసింది.   వాస్తవానికి జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ చార్జి షీట్ దాఖలు చేసి పన్నెండేళ్లు దాటింది. ఇప్పటి వరకూ విచారణ నత్తనడకనే సాగుతోంది. దర్యాప్తు దారీ అలాగే ఉంది. అటువంటిది హఠాత్తుగా ఉరుములేని పిడుగులా దాల్మియా ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ ఉత్తర్వులు జారీ చేయడం సంచలనంగా మారింది. ఈ పరిణామంతో జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తు వేగం పుంజుకున్నట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

పోలీసులు అడ్డుకున్నారంటూ రోడ్డుపైన బైఠాయింపు.. భూమన ఇంటి వద్ద హైడ్రామా

తిరుపతిలోని ఎస్పీ  గో  శాలలో గడిచిన మూడు నెలల్లో 100  గోవులు మృతి చెందాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణల నేపథ్యంలో తిరుపతిలో గురువారం (ఏప్రిల్ 17) తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కరుణాకరరెడ్డి ఆరోపణలు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు. అలాగే టీటీడీ  ఈవో శ్యామల రావు, కూటమి నాయకులు కూడా ఖండించారు. గడిచిన కొద్ది  రోజులుగా ఈ వివాదం కొనసాగుతున్నది. అనవసర ఆరోపణలు చేయడం భావ్యం కాదని కూటమి ఎమ్మెల్యే లు, ఎంపీలు, నాయకులు చెబుతున్నారు.  సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సైతం గోశాలను సందర్శించి వివాదం కారణమైన భూమన ఆరోపణల్లో నిజం లేదని,  గోవులు సహజంగా మరణిస్తే దానికి రాజకీయం రంగు పులమడం సరైంది కాదని సూచించారు.   ఈ నేపథ్యంలోనే గోశాల ఆరోపణల పై తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు ఎక్స్ వేదికగా జగన్ కు, టీటీడీ మాజీ  చైర్మన్ భూమన కు గోశాలకు రావాలని సవాల్ విసిరారు. ఆ సవాల్ ను స్వీకరించిన   భూమన కరుణాకర్ రెడ్డి ఎ  గురువారం ఉదయం 10 గంటలకు వస్తానని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.  మరో వైపు కూటమి నాయకులు సైతం గోశాలకు రావాలంటూ ర్యాలీ చేపడుతున్నట్లు ప్రకటించారు.శాంతిభద్రతల నేపథ్యంలో పోలీసులు ర్యాలీ లు, నిరసనలు లేకుండా గోశాల పరిశీలన చేసి మీడియా తో మాట్లాడవచ్చని ఆదేశాలు జారీ చేశారు.   ఈ నేపథ్యంలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి ఇంటి వద్ద గురువారం (ఏప్రిల్ 17) ఉదయం నుంచి హై డ్రామా కొనసాగింది. పోలీసులు హౌస్ అరెస్టు లు చేశారంటూ వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పించారు. వైసీపీ వారిని బయటకు పంపకుండా పోలీసులు దురుసుగా ప్రవర్తించారని విమర్శలు గుప్పించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా కు చెందిన ఎమ్మెల్యేలు, కూటమి ఇన్ చార్జిలు ఉదయం గోశాల వద్దకు చేరుకున్నారు.     మరో వైపు భూమన, ఎంపీ, మాజీ ఎమ్మెల్యే లు అనుచరులు, కార్యకర్తలు దాదాపు రెండు వేల మందితో గోశాలకు బయలు దేరారు. దీంతో పోలీసులు అంత మందితో గోశాల వద్దకు వెళ్లడం శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందనీ, పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతిస్తామని అడ్డుకున్నారు. దీంతో వైసీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగి రోడ్డుపైనే బైఠాయించారు.  కొంత సమయానికి కారు ఎక్కి వెళ్తామని చెప్పిన తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. అప్పటి వరకు గోశాలలో ఎదురు చూసిన ఎమ్మెల్యే పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి కి ఫోన్ చేసి తాము ఎదురుచూస్తున్నానీ, ఎస్కార్ట్ ఇస్తాము గోశాలకు రావాలనీ కోరారు. వస్తానని భూమన సమాచారం ఇచ్చారు. ఇది జరిగిన కొంత సమయానికి గోశాల వద్దకు తిరుపతి ఎంపీ గురుమూర్తి, భూమన కుమారుడు అభినయ్ రెడ్డి చేరుకున్నారు. అక్కడ పోలీసులు అభినయ్ రెడ్డి ని లోనికి అనుమతించలేదు.. ఎంపీ ను పోలీసులు దగ్గర ఉండి లోపలికి తీసుకురాగా.. అక్కడ ఎదురు చూస్తున్న కూటమి ఎమ్మెల్యే లు ఎంపీని ప్రశ్నించారు. సవాల్ విసిరిన వ్యక్తి రాకుండా మీరెందుకు వచ్చారని వచ్చారని ప్రశ్నించారు. తాను గోడ దూకి వచ్చాను.. పోలీసులు లోపలికి అనుమతించలేదని ఎంపీ సమాధానం ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే లు మాట్లాడుతూ మీరు వచ్చిన విధంగానే ఆయనా వచ్చిండచ్చు కదా అంటూ ప్రశ్నించారు. దీంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఎంపీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇలా ఉండగా గోశాల బయట భూమన కుమారుడు అభినయ్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు అడ్డుకుంటున్నా గోశాలలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు భూమన అభినయ్ రెడ్డిని అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.  ఈ సందర్భంగా భూమన తెలుగుదేశంపై విమర్శలు గుప్పించారు. వారు సవాల్ చేయడంతోనే గోశాల వద్దకు వచ్చాననీ, సవాల్ చేసిన వాళ్లు గోశాలలో కూర్చుని తమను లోనికి రానీయకుండా పోలీసులతో అడ్డుకుంటున్నారనీ విమర్శలు చేశారు.  

తమిళ దళపతిపై ముస్లిం సంస్థ ఫత్వా జారీ ఎందుకంటే?

  తమిళ వెట్రి కళగం అధినేత, నటుడు ద‌ళ‌ప‌తి విజయ్‌పై యూపీలోని బరేలీకి చెందిన సున్నీ ముస్లిం సంస్థ ఫత్వా జారీ చేసింది. ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు, చష్మే దారుల్ ఇఫ్తా చీఫ్ ముఫ్తీ మౌలానా షహాబుద్దీన్ రజ్వీ బరేలీ ఈ ఫత్వాను జారీ చేశారు. విజయ్ ముస్లిం వ్యతిరేకి అని, అతని నేపథ్యం.. అత‌డి గ‌త‌ చర్యలు ఇస్లాంకు వ్యతిరేకంగా ఉన్నాయని ఫత్వాలో పేర్కొన్నారు. మద్యం తాగే వారిని, జూదగాళ్లను విజయ్ ఇఫ్తార్ విందుకు ఆహ్వానించి రంజాన్ మాసం పవిత్రతను దిగజార్చారని రజ్వీ, ద‌ళ‌ప‌తి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తులను నమ్మవద్దని, మత పరమైన కార్యకలాపాలకు అతణ్ని ఆహ్వానించవద్దని తమిళనాడు ముస్లింలకు సూచించారు.  ఇక విజయ్ నటించిన బీస్ట్ సినిమాలో ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రీకరించారని.. ఈ మూవీలో ముస్లింల వ్యతిరేకిగా ఉన్న విజయ్.. రాజకీయాల్లోకి రాగానే ముస్లిం ఓటు బ్యాంకు కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందుకే ఆయనకు దూరంగా ఉండాలని ముస్లిం సంఘ నాయకులు సూచించారు.విజయ్ రంజాన్ మాసం యొక్క పవిత్రతను దిగజార్చారని రజ్వీ పేర్కొన్నారు. ఆహ్వానించబడిన వారు ఉపవాసం పాటించలేదని, ఇస్లాం యొక్క ఆచారాలను అనుసరించలేదని ఆయన పేర్కొన్నారు. కాబట్టి, తమిళనాడులోని సున్నీ ముస్లింలు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ముస్లింలు విజయ్‌కు దూరంగా ఉండాలని, ఆయన నిర్వహించే కార్యక్రమాలకు హాజరు కావద్దని, అలాగే వారి మతపరమైన కార్యక్రమాలకు ఆయనను ఆహ్వానించవద్దని రజ్వీ విజ్ఞప్తి చేశారు.