జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్!

   జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక  కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్‌ పేరును అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర సీనియర్ నాయకత్వం నవీన్ యాదవ్‌‌కు మద్దతుగా ఉన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. సర్వేలలో ఆయన ముందంజలో ఉండడం బీసీ సామాజికవర్గం మద్దతు ఉండటంతో ఆమోదించినట్లు తెలుస్తోంది.  ఈ నేపథ్యంలో నిన్న జూబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి రేసులో నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు బొంతు రామ్మోహన్. జూబ్లీహిల్స్ అభ్యర్థిని కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయిస్తుందని రామ్మోహన్ తెలిపారు.  మరోవైపు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌లు ఇన్‌చార్జి మంత్రులు సూచించిన పేర్లపై సమీక్షించారు. నవీన్‌ యాదవ్‌, సీఎన్‌ రెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌ పేర్లను అధిష్ఠానానికి పంపారు.లోకల్ నాయకుడు కావడం గతంలో  జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేయటంతో నవీన్ యాదవ్‌ వైపు మొగ్గుచుపినట్లు తెలుస్తోంది.  2014లో మజ్లిస్ తరపున పోటీ చేసి .. 9వేల ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు. 2019లో బీఆర్ఎస్ తో అవగాహన కారణంగా మజ్లిస్ టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. సొంత బలంతోనే మూడో స్థానంలో నిలిచారు. 2023లోనూ అదే అవగాహన కొనసాగడంతో  మజ్లిస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.  

బీహార్ ఎన్నికలు.. ట్రంప్ కార్డుగా పీకే పార్టీ?

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు  దగ్గరపడుతున్న కొద్దీ ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య  తేడా కేవలం ఒక శాతం కంటే తక్కువేనని సర్వేలు ఉద్ఘాటిస్తున్నాయి. బీహార్ లో ఎన్డీయే, ఇండియా కూటములు మధ్య పోరు హోరాహోరీ అని పరిశీలకులు సైతం ఉదాహరణలతో విశ్లేషణలు చేస్తున్నారు.  ఈ సారి బీహార్ లో హంగ్ ఖాయమని చెబుతున్నారు. అంతేనా బీహార్ లో ఎన్డీయ, ఇండీ కూటములు సొంతంగా అవసరమైన స్థానాలను గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. హంగ్ ఖాయమనీ, దాంతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పార్టీ జన సురాజ్  కీలకంగా మారుతుందనీ అంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే బీహార్ లో ఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా ప్రశాంత్ కిశోర్ మద్దతు అనివార్యమౌతుందని చెబుతున్నారు. అంటే ప్రశాంత్ కిశోర్ కింగ్ మేకర్ గా, ట్రంప్ కార్డుగా మారతారన్న మాట.  అయితే ఇటు ఇండియా కూటమి, అటు ఎన్డీయే కూటమి కూడా తమ విజయం ఖాయమన్న ధీమా వ్యక్తం చేస్తున్నాయి.  ప్రధానంగా ఎన్డీఏ కూటమి,ఇండియా కూటమి మధ్య ప్రధాన పోటీ జరిగే అవకాశం ఉంది. అలాగే చిరాగ్ పాశ్వాన్ పార్టీ,  ప్రశాంత్ కిషోర్ జన సురాజ్ పార్టీలు కూడా కీలక పాత్ర పోషించనున్నాయి. సాధారణంగా ఓట్లు చీలితే ప్రత్యర్ధి పార్టీకి దెబ్బ అని ఎన్నికల విశ్లేషకులు చెబుతారు. కాని పీకే పార్టీ అధికార పార్టీ ఓట్లనే చీల్చి దాన్నే డ్యామేజ్ చేస్తుందని అంటున్నారు. ముఖ్యంగా పీకే పార్టీ పట్ల యువత ఆకర్షితులౌతున్నారన్నది రాజకీయవర్గాల్లో వినిపిస్తున్న మాట.  అలాగే చిరాగ్ పాశ్వాన్ గతంలో పోటీ చేసిన స్థానాల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించింది. ఈ సారీ కూడా అదే ఫలితం రావచ్చని అంటున్నారు.   గత రెండు నెలలుగా ప్రచారంలో ఎన్డీఏ, ఇండీ కూటములు హోరాహోరీగా తలపడుతున్నాయి. ముఖ్యంగా . రాహుల్ గాంధీ 64 లక్షల ఓట్లు చోరీ పేరుతో ఎన్నికల కమిషన్ పై ఆరోపణల అస్త్రాలు సంధించడంతో అందరి చూపు బీహార్ ఎన్నికల పై మళ్లింది. ఎన్నికల కమిషన్ మళ్లీ ఓటర్ల జాబితాను పున:పరిశీలించి కొత్తగా 14 లక్షల ఓట్లు చేరాయని ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 7.4 కోట్ల ఓటర్లు ఉన్నట్లు ప్రకటించింది. అది పక్కన పెడితే రాహుల్ ఓట్ చోరీ యాత్రకు బీహార్ వ్యాప్తంగా విశేష స్పందన వచ్చింది.   దీంతో ఇండియా కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి. నిన్న మొన్నటి వరకూ ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, ఆర్జేడీ కీలక నేత అయిన తేజస్వీయాదవ్ అన్న విషయంలో రెండో అభిప్రాయానికి తావు లేదన్నట్లుగా ఉన్న పరిస్థితి మారింది. ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవర్నది ఇంకా నిర్ణయించలేదంటూ కాంగ్రెస్ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ఓట్ చోరి యాత్ర ద్వారా వచ్చిన మైలేజీయే ఇందుకు కారణమన్న అభిప్రాయం పరిశీలకులలో వ్యక్తం అవుతోంది.  ఇది ఆ కూటమిలో ఒకింత అసంతృప్తికి కారణమైంది. అవసరమైతే ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఒక సందర్భంలో హెచ్చరించారు కూడా. అది పక్కన పెడితే లోక్ జనశక్తి నాయకుడు చిరాగ్ పాశ్వాన్ బీజేపీతో పొత్తు విషయంలో నితీష్ వారసుడిగా కావాలని ఆశిస్తున్నారు. అయితే  ఇందుకు బీజేపీ అవకాశాలు లేవు. దీంతో చిరాగ్ పశ్వాన్ పీకే పార్టీ జన  సురాజ్ తో పొత్తుపెట్టుకునే అవకాశం లేకపోలేదని అంటున్నారు. జన సురాజ్ తో పొత్తుపై చిరాగ్ పశ్వాన్ సూచన ప్రాయంగా సానుకూల సంకేతాలు కూడా ఇచ్చారు. అయితే అది బీజేపీపై ఒత్తిడి పెంచి ఎక్కువ స్థానాలను సాధించాలన్న ఎత్తుగడగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బీహార్ ఎన్నికల బరిలోకి దిగడంతో పరిస్థితి మరింత రసకందాయంలో పడిందని చెప్పారు. ఆప్ కూడా రాష్ట్రంలో పొత్తులకు ప్రయత్నాలు చేస్తున్నది. ఇక జేడీయూ విషయానికి వస్తే దాదాపు రెండు దశాబ్దాలుగా నితీష్ కుమార్ సీఎంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన పట్ల, ఆయన పాలన పట్ల తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని అంటున్నారు. అది ఎన్డీయే కూటమి విజయావకాశాలపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన ఎన్డీయే కూటమిలో వ్యక్తం అవుతోంది.  సరే అది పక్కన పెడితే బీహార్ అసెంబ్లీలో 243 సీట్లకు గానూ పొత్తులో చిన్నా చితకా పార్టీలకు కేటాయించిన స్థానాలను మినహాయించి 205 స్థానాలలో చెరిసగంగా బీజేపీ, జేడీయూలు పోటీలోకి దిగాలని  యోచిస్తున్నాయి. అయితే చిరాగ్ పశ్వాన్ మాత్రం తమ పార్టీకి కూటమి పొత్తులో భాగంగా ఇవ్వజూపిన పాతిక స్థానాలతో సంతృప్తి చెందడం లేదు. మరో వైపు ఇండియా కూటమిలోనూ సీట్ల పంచాయతీ ఓ కొలిక్కి రావడం లేదు. .వామపక్ష ఎంఎల్ పార్టీ 30 సీట్లు డిమాండ్ చేస్తున్నది. అలాగే ఆర్జేడీ, కాంగ్రెస్ ల మధ్య కూడా సీట్ల పంపిణీలో పీటముడులు పడే అవకాశం ఉందంటున్నారు.  ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి అంచనా వేస్తే పీకే కింగ్ మేకర్ గా మారతారన్న అభిప్రాయమే పరిశీలకుల్లో వ్యక్తం అవుతోంది. 

జ‌గ‌న్ హెలికాప్ట‌ర్ వివాదం

జ‌గ‌న్ విశాఖ జిల్లా ప‌ర్య‌ట‌న వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. జ‌గ‌న్ స‌హా ప‌ది వాహ‌నాలు వెళ్లేందుకు రూట్ మ్యాప్ రెడీ చేశారు పోలీసులు. ఎయిర్ పోర్టు నుంచి పెందుర్తి మీదుగా నేష‌న‌ల్ హైవే మీద వెళ్లేందుకు ప‌ర్మిష‌న్ ఇచ్చారు. రోడ్ షోలు, జ‌న‌స‌మీక‌ర‌ణ చేస్తే ఆయ‌న ప‌ర్య‌ట‌న అర్ధాంత‌రంగా ఆపేస్తామ‌ని ష‌ర‌తులు విధించారు. అయితే రోడ్డు మార్గంలో జ‌గ‌న్ న‌ర్సీప‌ట్నం వెళ్లేందుకు మాత్రం అనుమ‌తి లేద‌న్నారు అన‌కాప‌ల్లి ఎస్పీ. అయితే అనుమ‌తులు లేకున్నా స‌రే జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న జ‌రిగి తీరుతుందంటున్నారు వైసీపీ నేత‌లు.  జగన్‌ పర్యటన రోజు అక్టోబ‌ర్ 9న‌, విశాఖలో మహిళల ప్రపంచకప్‌   మ్యాచ్‌ ఉందని, ఆ మ్యాచ్‌కు ఫాన్స్ భారీగా హాజరయ్యే అవకాశమున్నందున పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు విశాఖ సీపీ. వైసీపీ శ్రేణులు ర్యాలీగా వెళ్తే నేష‌న‌ల్ హైవే బ్లాక్‌ అవుతుందని.. అలా జ‌రిగితే  తమిళనాడులోని క‌రూరులో  విజయ్‌ ర్యాలీలో జరిగినట్టు తొక్కిసలాట జరగవచ్చన్నారు. ఆ రోజు గానీ చిన్న పొరపాటు జరిగితే నగరానికి చెడ్డ పేరు వస్తుందని, దీంతో తాము జగన్‌ పర్యటనకు అనుమతి ఇచ్చేది లేద‌ని సీపీ తెగేసి చెప్పారు. కాబ‌ట్టి జ‌గ‌న్ కి హెలికాప్ట‌ర్ లో వెళ్ల‌ాలని సూచించారు.  అయితే  హెలికాప్ట‌ర్ ప‌ర్య‌ట‌న‌కైతే ఓకే అంటున్న పోలీసుల తీరును  వైసీపీ నేత‌లు త‌ప్పు ప‌డుతున్నారు. అదే ప‌నిగా హెలికాప్ట‌ర్ ప్ర‌స్తావ‌న చేస్తున్నారంటే ఇందులో మ‌రేదో కుట్ర కోణం ఉందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్. అయితే గ‌త రాఫ్తాడు ప‌ర్య‌ట‌న‌లోనూ జ‌గ‌న్ చాప‌ర్ వివాదం సంగ‌తి తెలిసిందే.  జ‌గ‌న్ చాప‌ర్ ఎప్పుడైతే ల్యాండ్ అయిందో దానిపైకి కూడా జ‌నం దూసుకొచ్చేశారు. దీంతో ఆ చాప‌ర్ పైల‌ట్ జ‌గ‌న్ లేకుండానే తిరిగి వెళ్లిపోయాడు. ఏది ఏమైనా జగన్ పర్యటన వివాదాస్పదంగా మారిందనే చెప్పాలి. అసలు అధికారం కోల్పోయిన తరువాత జగన్ చేపట్టిన ప్రతి పర్యటనా శాంతిభద్రతలకు భంగం వాటిల్లే విధంగానే ప్లాన్ చేసుకుంటున్నారని తెలుగుదేశం వర్గీయులు ఆరోపిస్తున్నారు 

జగన్ రోడ్ షోకు నో పర్మిషన్

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌ రోడ్ షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆయనకు రోడ్డు మార్గంలో అనుమతి లేదని అనకాపల్లి పోలీసులు తేల్చి చెప్పారు. జగన్ దాదాపు 63 కిలోమీటర్లు రోడ్ షో చేయాలని భావించారు. అయితే ఇటీవల  తమిళనాడు కరూర్ లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించాన సంఘటనను పేర్కొంటూ.. జగన్ రోడ్ షోకు అనకాపల్లి పోలీసులు అనుమతి నిరారించారు. అయన వైజాగ్ నుంచి  నేరుగా హెలికాప్ట‌ర్‌లో వెళ్లేందుకు మాత్ర‌మే అనుమ‌తి ఇస్తున్న‌ట్టు చెప్పారు. అసలింతకీ విషయమేంటంటే.. జగన్ గురువారం (అక్టోబర్ 9) విశాఖకు 63 కిలోమీటర్ల దూరంలో ఉనన వాకవరపాలెంలో మెడికల్ కాలేజీ వద్ద నిరసన చేపట్టనున్నారు. ఇందు కోసం ఆయన వైజాగ్ నుంచి రోడ్ మార్గం ద్వారా 53 కిలోమీటర్లు ప్రయాణించాలని నిర్ణయించారు. ఇందుకోసం స్థానిక వైసీపీ నాయకులు పోలీసుల అనుమతి కోరారు.  త‌న హ‌యాంలో తీసుకు వ‌చ్చిన 17 మెడిక‌ల్ కాలేజీల్లో 12 కాలేజీల‌ను ప్ర‌వేటు భాగ‌స్వామ్యానికి ఇవ్వ‌డాన్ని తప్పుపడుతున్న జగన్ నిరసనలకు పిలుపునిచ్చారు. దీనిపై స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు.. త‌న నియోజ‌ క‌వ‌ర్గం లోనూ.. కొత్త‌గా మెడిక‌ల్ కాలేజీ ప్రారంభించి వ‌దిలేశార‌ని   ఇటీవ‌ల వ్యాఖ్యానించారు.  దానికి జీవో కూడా లేద‌ని.. అది ఎప్ప‌టికి పూర్త‌వుతుందో కూడా చెప్ప‌లేమ‌నీ అన్నారు. అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై స్పందించిన జగన్.. స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడి నియోజ‌క‌వ‌ర్గంలో మెడికల్ కాలేజీ నిర్మాణం దాదాపు పూర్తయ్యిందనీ,  ఆ విషయాన్ని తానే స్వయంగా నిరూపిస్తాననీ సవాల్ విసిరి మకవర పాలెం పర్యటకు రెడీ అయ్యారు. విశాఖ నుంచి 63 కిలోమీటర్లు రోడ్ షో ద్వారా మాకవర పాలెంలో నిర్మాణంలో ఉన్న కాలేజీని సందర్శించేందుకు సమాయత్తమయ్యారు. అయితే జగన్ రోడ్ షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. కావాలంటే. విశాఖ నుంచి హెలికాప్టర్ లో మాకవర పాలెం వెళ్లాలని సూచించారు.  అయితే వైసీపీ నేతలు మాత్రం అందుకు ససేమిరా అంటున్నారు. అనుమతి ఉన్నా లేకున్నా రోడ్ షో జరుగుతుందంటూ సవాళ్లు విసురుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటన ఎలా సాగుతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. రోడ్డు మార్గంలోనే వెడతానంటూ పట్టుబట్టడం వెనుక శాంతి భద్రతల సమస్య సృష్టించాలన్న కుట్ర కోణం ఉందని తెలుగుదేశం శ్రేణులు అంటున్నాయి.  

బీహార్ ఫ‌లితాల‌తో ఓట్ చోరీ.. ఆరోపణల నిగ్గు తేలనుందా?

అటు బీహార్  ఎన్నిక‌తో పాటు ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక  షెడ్యూల్ కూడా విడుద‌లైంది. న‌వంబ‌ర్ 6, 11వ తేదీల్లో బీహార్ లో రెండు విడ‌త‌ల పోలింగ్ జ‌ర‌గ‌నుండ‌గా.. అదే నెల 14న ఫ‌లితాలు విడుద‌ల కానున్నాయి. బీహార్ సీట్ల సంఖ్య 243 కాగా, ఓట‌ర్ల సంఖ్య 7. 43 కోట్లుగా ఉంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంగ‌తేంట‌ని చూస్తే.. న‌వంబ‌ర్ 11న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ నెల 13 నుంచి నామినేష‌న్ల‌ను స్వీక‌రించ‌నుండ‌గా.. 21 తుదిగ‌డువు. 22వ తేదీ ప‌రిశీల‌న‌, 24వ తేదీ ఉప‌సంహ‌ర‌ణ‌. కాగా న‌వంబ‌ర్ 14న ఈ ఉప‌ ఎన్నిక ఫ‌లితం కూడా తేల‌నుంది.  ఈ రెండు ఎన్నిక‌లు కాంగ్రెస్ కి ఎంత కీల‌క‌మంటే.. ఒక ప‌క్క దేశ వ్యాప్తంగా రాహుల్ ఓట్ల చోరీ ప్ర‌చారం చేయ‌డంతో పాటు బీహార్ లో ప్ర‌త్యేకించి ఆయ‌న యాత్ర నిర్వ‌హించారు. ఎందుకంటే బీహార్ లో సుమారు 45 ల‌క్ష‌ల ఓట్లు తొల‌గించ‌డంతో.. రాహుల్ పెద్ద ఎత్తున ఓట్ల చోరీ పై ప్రెజంటేష‌న్లిచ్చి.. ఈసీ ని ఇరుకున పెట్టే య‌త్నం చేశారు. ఈసీ బీజేపీ చేతిలో కీలుబొమ్మ‌లా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ంటూ ఆరోపణలు గుప్పించారు. దీనిపై  రియాక్ట‌యిన సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఆధారాల‌తో స‌హా కంప్ల‌యింట్  చేయాల‌ని రాహుల్ కి సూచించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు తగవని  వారించారు. తాను ప్ర‌త్యేకించీ ఆధారాలు చూపించ‌న‌క్క‌ర్లేద‌నీ.. త‌న ప్రెజంటేష‌న్లు తీసుకుని వాటిపై మీరు స్పందించాలంటూ కౌంటర్ ఇచ్చారు రాహుల్.  ఏది ఏమైనా రాహుల్ ఓట్ల చోరీ ప్ర‌చార‌మంతా కూడా బీహార్ ఎన్నిక‌ల‌ను  దృష్టిలో పెట్టుకుని చేసిందే. దానికి తోడు ఆయ‌న ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేసిన యాత్ర కూడా ఇదే చెబుతోంది. ఇప్పుడు రాహుల్ ఓట్ చోరీ ప్ర‌చారం జ‌నం న‌మ్మారా లేదా? అన్న‌ది ఈ ఎన్నిక‌ల ఫ‌లితం తేల్చేస్తుందంటున్నారు పరిశీలకులు.  కాబ‌ట్టి ఈ రాష్ట్ర ఎన్నిక‌ల ఫ‌లితాలను బ‌టి కాంగ్రెస్  ఎలిగేష‌న్లు జ‌నం సీరియ‌స్ గా తీస్కుంటున్నారా లేదా? అన్నదానిపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.  ఇక చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌. ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ త‌మ అభ్య‌ర్ధిగా మాగంటి స‌తీమ‌ణి సునీత‌ను ప్రకటించింది. అధికార కాంగ్రెస్ మాత్రం ఇంకా మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఈ బై పోల్ కూడా  కాంగ్రెస్ కి అగ్ని ప‌రీక్షేనని చెప్పాలి. రేవంత్ స‌ర్కార్ హైద‌రాబాద్ లో హైడ్రా ప్ర‌యోగం ద్వారా చేసిన మేలు ఎలాంటిదో చెప్పలేం కానీ..  జ‌నం మాత్రం బ్యాడ్ గా ఫీల‌వుతున్నారని ప్రచారం జరుగుతోంది. దానికి  తోడు హ‌రీష్ రావ్ ఇక్క‌డ ఎక్కువ‌గా ఉన్న మైనార్టీ  ఓటు బ్యాంకును టార్గెట్ చేస్కుని..  ఈ క‌మ్యూనిటీకి ఒక్క మంత్రి ప‌ద‌వి కూడా ఇవ్వ‌లేద‌ని ప్ర‌చారం చేస్తున్నారు.  ఆపై ఇక్క‌డ అధికంగా ఉండే  సినీ జ‌నం, అందునా  ఎక్కువ‌గా ఉండే క‌మ్మ సామాజిక వ‌ర్గం. వీట‌న్నిటినీ  క‌వ‌ర్ చేయ‌డానికి మాగంటి సామాజిక వ‌ర్గం స‌రిపోతుంద‌ని భావిస్తోంది కారు పార్టీ. దీంతో ఈ గెలుపు త‌మ‌కు న‌ల్లేరు  న‌డకే అన్న ఊహ‌ల్లో ఉంది గులాబీ దండు.  అయితే కాంగ్రెస్ మాత్రం ఎట్ట‌కేల‌కు జూబ్లీహిల్స్  ద్వారా మ‌రో కంటోన్మెంట్ రిజ‌ల్ట్ రిపీట్ చేయాల‌న్న కృత నిశ్చ‌యంతో ఉంది. ఇక ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షీ న‌ట‌రాజ‌న్ అయితే ఈ సీటు ఎలాగైనా స‌రే కైవ‌సం చేసుకోడానికి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇలా ఎటు నుంచి ఎటు చూసినా బీహార్ పోల్, జూబ్లీ బై పోల్ కాంగ్రెస్ కి రెఫ‌రండంగా మార‌నున్నాయ‌నే అంటున్నారంతా. మ‌రి చూడాలి.. ఈ ఫ‌లితాలు కాంగ్రెస్ కి ఎంత అనుకూలంగా వ‌స్తాయో తెలియాలంటే మ‌నం న‌వంబ‌ర్ 14 వ‌ర‌కూ ఎదురు చూడాల్సిందే.

దేశం అభ్యంతరాలు బేఖాతర్.. మిథున్ రెడ్డికే కేంద్రం ఇంపార్టెన్స్!

తెలుగుదేశం, బీజేపీల మధ్య సఖ్యత సరే.. అసలు వైసీపీ విషయంలో కేంద్రం పెద్దలకు ఇంకా సాఫ్ట్ కార్నర్ ఉందా? ఆ పార్టీ నేతలకు కేంద్రం పెద్దల వద్ద ప్రాముఖ్యత ఇసుమంతైనా తగ్గలేదా? అంటే జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఔనని అనక తప్పదని అంటున్నారు పరిశీలకులు. తాజాగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కేంద్రం ఇచ్చిన ప్రాధాన్యత ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. మద్యం కుంభకోణం కేసులో అరెస్టై.. ఇటీవలే బెయిలుపై విడుదలైన మిథున్ రెడ్డికి ఐరాస (ఐక్యరాజ్యసమితి) జనరల్ అసెంబ్లీకి వెళ్లే భారత ప్రతినిథుల బృందంలో చోటు కల్పించింది. తనకీ అరుదైన గౌరవం ఇచ్చినందుకు మిథున్ రెడ్డి ప్రధాని నరేంద్రమోడీకి కృతజ్ణతలు తెలిపారు. అంతే కాదు.. ఆ బృందంలో ఇటా చోటు దక్కగానే, అలా  పాస్ పోర్టు కోసం కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసేశారు. ఈ నెల 27 నుంచి న్యూయార్క్ లో జరిగే ఐరాస జనరల్ అసెంబ్లీ 80వ సమావేశానికి హాజరయ్యే భారత ఎంపీల బృందాన్ని కేంద్రం ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రి, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి నాయకత్వం వహించే ఈ బృందంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి చోటు దక్కింది. అదే సమయంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్క ఎంపీకి కూడా చోటు దక్కలేదు.   ప్రపంచ దేశాలు శాంతి, భద్రత, మానవ హక్కులు, అభివృద్ధి, అంతర్జాతీయ సహకారం వంటి అత్యంత కీలకమైనఅంశాలపై చర్చించే వేదిక అయిన ఐరాస జనరల్ అసెంబ్లీకి హాజరయ్యే భారత ఎంపీల బృందంలో మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉండి, ఇటివలే బెయిలుపై బయటకు వచ్చిన మిథున్ రెడ్డికి  చోటు కల్పించడంపై తెలుగుదేశం వర్గాలలో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం అవుతోంది. మిథున్ రెడ్డి బెయిలు రద్దు చేయాలని కోరుతూ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది కూడా.  అదలా ఉంటే ఐరాసా జనరల్ అసెంబ్లీకి హాజరయ్యే భారత ఎంపీల బృందంలో తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, బీజేడీ, ఆమ్ ఆద్మీ పార్టీల ఎంపీలు కూడా ఉన్నారు. అయితే కేంద్రంలో మోడీ సర్కార్ మనుగడకు కీలక మద్దతు దారుగా ఉన్న తెలుగుదేశం నుంచి మాత్రం ఒక్కరంటే ఒక్క ఎంపీకి కూడా చోటు దక్కలేదు.  చోటు దక్కకపోవడం అటుంచి.. మిథున్ రెడ్డి ఎంపికను తెలుగుదేశం తీవ్రంగా వ్యతిరేకించింది. అయినా కూడా కేంద్రం పెద్దలు లెక్క చేయలేదు. నిందితుడు మాత్రమే కదా.. నేరం రుజువు కాలేదుగా అంటూ తేలిగ్గా తీసుకున్నారు.  గతంలో అంటే 2014లో కూడా తెలుగుదేశం రాష్ట్రంలో అధికారంలో ఉంది. కేంద్రంలో ఎన్డీయే సర్కార్ లో భాగస్వామ్య పార్టీగా ఉంది. అప్పట్లో కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కంటే.. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకే కేంద్రం ప్రయారిటీ ఇచ్చింది. ఇప్పుడు కూడా అదే తీరులో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. 

బిహార్‌ ఎన్నికల సర్వే... గెలుపు ఎవరిదంటే?

  బిహార్‌లో ఎన్డీయే కుటమి ఘన విజయం సాధిస్తుందని మ్యాటిజ్-ఐఎఎఎన్ఎస్ పబ్లిక్ ఒపినియన్ పోల్‌లో వెల్లడైంది. ఎన్డీయే కూటమి బీజేపీ, జేడీయూకి 150-160 సీట్లు గెలిచి అధికారన్ని నిలబెట్టుకునే అవకాశం ఉందని సర్వేపోల్‌ వెల్లడించింది. మహాఘట్‌బంధన్ ఆర్జేడీ, కాంగ్రెస్‌, లెప్ట్ పార్టీలు 70-85 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొంది. ఎన్డీయేకి 49%, మహాఘట్‌బంధన్ 36% ఓట్లు పోలవుతాయని తెలిపింది. ప్రశాంత్ కిశోర్, జన్ సూరజ్ పార్టీకి 2-5 సీట్లు వస్తాయని వివరించింది. బీజేపీ 80-85, జేడీయూ 60-65 సీట్లు గెలుచుకోవచ్చు అని అంచన వేస్తున్నారు. ఆర్జేడీకి 60-65, కాంగ్రెస్‌కి 15-20 అసెంబ్లీ సీట్లు గెలిచే ఛాన్స్ ఉందని ఒపినియన్ పోల్‌ తెలిపింది.  బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువు వచ్చే నెల చివరి వారంతో ముగియనుంది. ప్రస్తుతం బిహార్‌లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉంది. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం లభించలేదు. దీంతో జేడీయూ, బీజేపీ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నీతీశ్ కుమార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ, రెండేళ్లకే నీతీశ్ ఎన్డీయేను వీడి.. ఆర్జేడీ, కాంగ్రెస్‌తో మహాగఠ్‌బంధన్‌లో చేరి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, ఈ బంధమూ ఎంతోకాలం నిలవలేదు. 2024 జనవరిలో మహా కూటమిని వీడిన జేడీయూ మళ్లీ ఎన్డీయేతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో మరోసారి నీతీశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 

నవంబర్ 11న జూబ్లీ బైపోల్

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు నగారా మోగింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం (అక్టోబర్ 6) విడుదల చేసింది. జూబ్లీ హిల్స్ బైపోల్ వచ్చే నెల 11న జరగనుంది.  కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. షెడ్యూల్‌ ప్రకారం జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు ఈ నెల 13న ఎ  నోటిఫికేషన్‌ విడుదల అవుతుంది. ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 21 తుదిగడువు.  22న నామినేషన్ల పరిశీలను ఉంటుంది. వచ్చే నెల 11న పోలింగ్ జరుగుతుంది. నవంబర్  14న ఫలితం వెలువడుతుంది.  జూబ్లీ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలన్నీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. జూబ్లీ  ఉప ఎన్నికకు బీఆర్ఎస్ తన అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించింది. మాగంటి గోపీనాథ్ మరణించడం వల్ల అనివార్యమైన ఈ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ఆయన సతీమణి మాగంట సునీతను బీఆర్ఎస్ బరిలోకి దింపింది. ఎలాగైనా సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో బీఆర్ఎస్ ఉంది. ఇక కాంగ్రెస్ కూడా జూబ్లీ ఉపఎన్నికలో విజయంతో ప్రభుత్వంపై ప్రజలలో సానుకూలత ఉందని నిరూపించాలని భావిస్తోంది. ఇక బీజేపీ విషయానికి వస్తే.. ఈ స్థానం నుంచి పోటీకి ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అభ్యర్థి ఎంపికకు త్రిసభ్య కమిటీని నియమించింది. జూబ్లీ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు బీజేపీ నుంచి హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు లంకాల దీపక్ రెడ్డి,  ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, ఎన్వీ సుభాష్, మాధవీ లత  రేసులో ఉన్నారు.  ఇక కాంగ్రెస్ పార్టీలో అయితే జూబ్లీ ఉప ఎన్నికలో టికెట్ కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య చాలా పెద్దగా ఉంది.  ఎవరికి వారే తామే అభ్యర్థి అంటూ ఇప్పటికే ప్రచారం సైతం మొదలెట్టేశారు.  ఈ తరుఏణంలో  తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నలుగురి పేర్లతో ఓ జాబితాను ఏఐసీసీకి సమర్పించింది. ఈ జాబితాలో   నవీన్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ సి.ఎన్‌. రెడ్డి పేర్లు ఉన్నాయి. కాగా పీసీసీ ప్రతిపాదించిన ఈ పేర్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ సోమవారం చర్చించారు.  మూమూలుగా అయితే ఆశావహులు అధికంగా ఉంటే అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీలు చివరి నిముషం వరకూ ఎటూ తేల్చకుండా నాన్చడం కద్దు. అయితే అలా నాన్చడం అసెంబ్లీ, జనరల్ ఎలక్షన్లలో అయితే ఓకే కానీ, ఒకే ఒక్క నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు అలా నాన్చడం వల్ల  మొదటికే మోసం వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నిక జరిగేది ఒకే నియోజకవర్గానికి కావడంతో  ప్రచారం చాలా ముఖ్యపాత్ర వహిస్తుంది. అభ్యర్థిని ఎంత త్వరగా ప్రకటిస్తే అంత త్వరగా ప్రచారం ప్రారంభించడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనూ కాంగ్రెస్ అధిష్ఠానంపై అభ్యర్థి ప్రకటన చేయాలన్న ఒత్తిడి పెరుగుతోంది. అటు బీజేపీ శ్రేణులు సైతం అభ్యర్థి ఎవరో తేల్చండి అంటూ పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేడో, రేపో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరో తేలిపోయే అవకాశం ఉందని పరిశీలకులు సైతం అంటున్నారు. 

బిహార్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల...జూబ్లీ ఉప ఎన్నిక ఎప్పుడంటే?

  బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. రెండు దశల్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగనుంది. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ నిర్వహించనున్నాట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 14న కౌంటింగ్ ఉంటాయని ఈసీఐ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు.  ఈ నెల 13న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నామినేషన్ దాఖలుకు ఈ నెల 21 వరకు గడువు ఉంది. నామినేషన్ల పరిశీలన ఈ నెల 22న చేపట్టనుండగా, నామినేషన్ల ఉపసంహరణ గడువు అక్టోబర్ 24. నవంబర్ 11న పోలింగ్, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఏడు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 11న ఉప ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్‌లోని అంతా, ఝార్ఖండ్‌లోని ఘట్‌శిలా, తెలంగాణలోని జూబ్లీహిల్స్‌, పంజాబ్‌లోని తర్న్‌తారన్‌, మిజోరంలోని దంపా, ఒడిశాలోని నౌపాఢాతోపాటు జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని బడ్గామ్‌, నగ్రోటా స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమీషన్ పేర్కొన్నాది  

రిజర్వేషన్ల పెంపుపై పిటిషన్.. డిస్మిస్ చేసిన సుప్రీం

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను దేశ సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది.  ఇందుకు సంబంధించిన కేసు హైకోర్టు విచారణలో ఉండగా సుప్రీను ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చిందని ప్రశ్నించిన సర్వోన్నత న్యాయస్థానం పిటిషన్ ను డిస్మిస్ చేసింది. అయితే హైకోర్టులో స్టే లభించలేదు కనుక సుప్రీంను ఆశ్రయించామని పిటిషనర్లు ఇచ్చిన సమాధానంతో సుప్రీం కోర్టు సంతృప్తి చెందలేదు. స్టే ఇవ్వకుంటే పిటిషన్ వేస్తారా అని ప్రశ్నించిన సుప్రీం కోర్టు.. హైకోర్టులో విచారణలో ఉన్న అంశంపై తాము విచారణ జరపజాలమని స్పష్టం చేసింది.  గతంలో ఇదే పిటిషన్ ను విచారించిన తెలంగాణ హైకోర్టు విచారణను ఈ నెల 8కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అప్పటికి తెలంగాణ స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కాలేదు. హైకోర్టు స్టే ఇవ్వకపోవడంతో పిటిషనర్లు సుప్రీంను ఆశ్రయించారు. రిజన్వేషన్ల పెంపు వల్ల సుప్రీం కోర్టు నిర్దేశించిన 50 శాతం పరిమితి దాటినట్లౌతుందన్నది పిటిషనర్ల వాదన. ఇప్పుడు ఈ పిటిషన్ ను సుప్రీం కోర్టు డిస్మిస్ చేయడంతో ఈ నెల 8న తెలంగాణ హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఉత్కంఠగా మారింది. ఒక వేళ తెలంగాణ హై కోర్టు స్టే ఇస్తే.. 9వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ఆగిపోతుంది. ఒక వేళ స్టే ఇవ్వకుంటే స్థానిక ఎన్నికల ప్రక్రియ యథావిధిగా సాగుతుంది.  

తమిళనాడు.. బీహార్.. కాంగ్రెస్ పొత్తులు పెటాకులేనా?

సంకీర్ణ ప్రభుత్వాలను నడిపిన అనుభవం ఉన్నా.. కాంగ్రెస్ పార్టీకి పొత్తు ధర్మం పాటించడం, మిత్రులను కాపాడుకోవడం అన్నది  ఇప్పటికీ వంటపట్టలేదు. భాగస్వామ్య పార్టీలకు ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తూ పొత్తులు విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు చేజేతులా సృష్టించుకుంటోంది. బీహార్ లో ఆర్జేడీతోనూ, తమిళనాడులో అధికార డీఎంకేతోనూ ఇప్పుడు కాంగ్రెస్ బంధం పుటుక్కున తెగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితికి కాంగ్రెస్సే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముందుగా తమిళనాడు విషయం తీసుకుంటే..  ఆ రాష్ట్రంలో రాజకీయ నాయకుడి అవతారం ఎత్తిన సినీ నటుడు విజయ్ ను దగ్గర చేసుకునేందుకు కాంగ్రెస్ చేస్తున్నవిన్యాసాలు, ప్రయత్నాలు అధికార డీఎంకేకు రుచించడం లేదు. విషయమేంటంటే. కరూర్ తొక్కిసలాట ఘటన తరువాత టీవీకే అధ్యక్షుడు విజయ్ కు రాజకీయంగా ఒకింత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఆయన స్టార్ డమ్ ను ఆ ఘటన మసకబార్చిందనడంలో సందేహం లేదు. అయితే ఆ సంఘటన తరువాత విజయ్ కు సానుభూతి పెరుగుతుందన్న అంచనాతో కాంగ్రెస్ పార్టీ విజయ్ కుమద్దతుగా ప్రకటనలు గుప్పించడం ఆరంభించింది. కరూర్ తొక్కిసలాట ఘటన తరువాత కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ విజయ్ కు ఫోన్ చేసి మద్దతు పలికారన్న ప్రచారం ఉధృతంగా సాగుతోంది. దీనిపై డీఎంకేలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది.   వాస్తవానికి విజయ్ తమిళనాడులో కాంగ్రెస్, డీఎంకే పార్టీలు తమకు రాజకీయ శత్రువులు అని విజయ్ గతంలోనే ప్రకటించారు. బీజేపీ పట్ల ఒకింత సాఫ్ట్ కార్నర్ చూపుతూ కాంగ్రెస్, డీఎంకేలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.  అయితే  కరూర్ తొక్కిసలాట ఘటనలో  టీవీకే అధినేత విజయ్ తప్పిదాన్ని ప్రజలకు వివరిస్తూ ఆయనను ఇరుకున పెట్టే వ్యూహాన్ని డీఎంకే అమలు చేస్తున్నది. అదే సమయంలో కాంగ్రెస్ విజయ్ పట్ల సానుభూతి వ్యక్తం చేయడం సహజంగానే డీఎంకేకు ఇబ్బందికరంగా మారింది. తమిళనాట డీఎంకేను పక్కన పెట్టి విజయ్ తో పొత్తు కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యేలా కాంగ్రెస్ తీరు ఉంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్న నేపథ్యంలో ఈ అనుమానాలు, విజయ్ పట్ల కాంగ్రెస్ సానుభూతి వ్యక్తం చేస్తూ అనుకూల ప్రకటేనలు చేయడం డీఎంకే, కాంగ్రెస్ కూటమి కొనసాగింపునకు ప్రతిబంధకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు.    ఇక వచ్చే నెలలో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలలోనూ కాంగ్రెస్ తీరు వల్ల అక్కడ మహాఘట్ బంధన్ చీలికలు పేలికలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. కూటమి మధ్య సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్న తరుణంలో  కాంగ్రెస్ తీరు వల్ల పొత్తు పెటాకులయ్యే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. ఇప్పటికే ఆర్జేడీ కీలక నేత, ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్.. బీహార్ లో పొత్తుపొసగకుంటే.. ఆర్జేడీ అన్ని స్థానాలలోనూ అభ్యర్థులను నిలబెడుతుందన్న హెచ్చరిక చేశారు. ఈ పరిస్థితి రావడానికి కారణమేంటన్న ప్రశ్నకు పరిశీలకులు ఓట్ అధికార్ యాత్ర తరువాత కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరే ఇందుకు కారణమంటున్నారు.  ఓటర్ అధికార్  యాత్ర రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ ను పెంచేసిందన్న అంచనాతో  కాంగ్రెస్ సీట్ల సంఖ్య విషయంలోనూ,  ఎంపికలోనూ చేస్తున్న ఓవర్ యాక్షనే తేజస్వి ప్రసాద్ హెచ్చరికకు కారణంటున్నారు.  కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీ సిట్టింగ్ స్థానాలను కోరడంతో ఆర్జేడీలో అసంతృప్తి భగ్గుమని అవసరమైతే పొత్తే లేకుండా రంగంలోకి దిగాలన్న ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.    

తెలుగు తమ్ముళ్ల సంబరాలు.. ఎందుకో తెలుసా?

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం తెలుగు తమ్ముళ్ల సంబరాలు జరుపుకుంన్నారు. ఇంతకీ సంబరాలు ఎందుకు జరుపుకుంటున్నారో తెలిస్తే   ఆశ్చర్యపోతారు. నకిలీ మద్యం వ్యవహారంలో తంబళ్లపల్లి తెలుగుదేశం ఇన్చార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డిని పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేయడమే ఈ సంబరాలకు కారణం.  జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేసినందుకు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ   బి.కొత్తకోట జ్యోతి చౌక్ లో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి మరీ సంబరాలు జరుపుకున్నారు.  చట్టం ముందు అందరూ సమానమే అని చాటిన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాన్ని వారు స్వాగతిస్తున్నారు.  తంబళ్లపల్లి  నియోజకవర్గ వ్యాప్తంగా కూటమి కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. గతంలో వైసీపీ నుండి తెలుగుదేశంలోకి వచ్చిన జయచంద్రారెడ్డి పార్టీ ప్రతిష్ఠను దిగజార్చారని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.   క్రమశిక్షణకు మారుపేరైన తెలుగుదేశం పార్టీలో ఉంటూ..  క్రమశిక్షణను ఉల్లంఘించి, జయచంద్రారెడ్డి నకిలీ మద్యం వ్యవహారంలో మునిగి తేలుతున్నారని కార్యకర్తలు చాలా కాలంగా ఆరోపణలు చేస్తున్నారు. జయచంద్ర రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉంటూనే వైసీపీ కోవర్టుగా మారారని తెలుగుదేశం శ్రేణులు గత కొంత కాలంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా పలు ఆందోళనా కార్యక్రమాలు కూడా నిర్వహించారు.  పార్టీ అధినేత చంద్రబాబుకు , మంత్రి లోకేష్ కు కూడా ఫిర్యాదు చేశారు.  ఇప్పుడు తాజాగా ఆయనపై నకిలీ మద్యం కేసు నమోదు కావడంతో పార్టీ హైకమాండ్ జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేసింది. దీంతో  తెలుగుదేశం కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు.  

పార్టీ ఆఫీసులో కూర్చొని మాట్లాడితే ఎలా...సొంత పార్టీపై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్

  తెలంగాణ బీజేపీ ఆఫీస్ బేరర్స్ సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి కూర్చోలేని సమస్య ఎందుకు వస్తోంది..? అని ప్రశ్నించారు. జిల్లా స్థాయిలో పార్టీ నేతల తీరుపై కాటిపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు ఎంపీల మధ్య సమన్వయ లోపం ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్టీ ఆఫీసులో కూర్చొని మాట్లాడితే సరిపోతుందా ? క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది అని చూసుకోవాలని ఆయన అన్నారు. గ్రౌండ్ లెవెల్‌లో పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సమావేశాలకు రావడం, వెళ్లడమే తమ పనా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు.  క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలేవీ..? అని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.పార్టీ ఆఫీసులో కూర్చొని మాట్లాడితే సరిపోతుందా ? అని కాటిపల్లి  ప్రశ్నించారు. మరోవైపు  రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో పార్టీ అధ్యక్షుల తీరుపై చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు.  నేతల మధ్య సఖ్యత ఎందుకు లేదని ఎంపీ కొండా ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులతో జిల్లా నేతలకు సమన్వయం లేదని మరో ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను అధిగమించి ముందుకెళ్దామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు చెప్పుకొచ్చారు. 

జూబ్లీ కాంగ్రెస్ బరిలో మిగిలింది ముగ్గురే?

  జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్ధి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. అభ్యర్ధుల జాబితాలో నవీన్‌యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, సీఎన్ రెడ్డి పేర్లను ఇన్‌చార్జ్ మంత్రులు షార్ట్‌లిస్ట్ చేశారు. ఇన్‌చార్జ్ మంత్రులు  షార్ట్‌లిస్ట్ ఫైనల్ చేశారు. అనంతరం స్కీనింగ్ కమిటీకి ఈ జాబితాను టీపీసీసీకి పంపనుంది. ఇదిలా ఉంటే మొదటి నుంచి జూబ్లీహిల్స్ బైపోల్ లో పోటీలో బరిలొ ఉండబోతున్నట్లు ప్రచారం చేసుకున్న మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పేరు షార్ట్ లిస్టులో లేకపోవడం ఆయనకు షాక్ ఇచ్చినట్లైంది. తాజా రాజకీయ పరిణామాలతో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌  రంగంలోకి దిగారు. అభ్యర్థి ఎంపిక వ్యవహారంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. అధికార పక్షం కావడంతో  జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో సీటు కోసం తీవ్ర పోటీ నెలకొంది.  మరోవైపు  బీఆర్‌ఎస్  పార్టీ నుంచి దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత  బరిలో నిలుస్తుందని ఇప్పటికే అధినేత కేసీఆర్ ప్రకటించారు. అభ్యర్థి ఎంపిక కోసం కమలం పార్టీ  పార్టీ కేడర్ నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు  త్రిసభ్య కమిటీని నియమించింది. ఇందులో  మాజీ ఎమ్మెల్యే ఎం.ధర్మారావు, మాజీ ఎంపీ పోతుగంటి రాములు, పార్టీ సీనియర్ నేత, అడ్వొకేట్ కోమల ఆంజనేయులు ఉన్నారు. వారు ఇచ్చే నివేదిక ఆధారంగా బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేయనున్నారు.  మరోవైపు బీజేపీ నుంచి బరిలో దిగేందుకు హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు లంకాల దీపక్ రెడ్డి ఆసక్తి చూపుతున్నారు. జూటూరి కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, కిలారీ మనోహర్ టికెట్ ఆశిస్తున్నారు. మరోసారి తెరమీదకు వచ్చిన అజారుద్దీన్.. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి న్యాయ పరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది. దీంతో జూబ్లీహిల్స్  పోటీలో ఎలగైన నిలవాలని  పోటీలో భావిస్తున్నారు. మరోవైపు మైనార్టీ నేతలతో అజార్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తనను బరిలో నుంచి తప్పించేందుకు ఓ మంత్రి ప్రయత్నించాడు అని అనుచరులతో ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మంత్రి పదవి పేరుతో పక్కకి తప్పించే కుట్ర జరుగుతుందని ఆయన వాపోయారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో మజ్లిస్‌ పార్టీ కలిసి వస్తుండటంతో కాంగ్రెస్‌కు విజయావకాశాలపై ధీమా మరింత పెరిగింది. ఇప్పటికే  ముగ్గురు రాష్ట్ర మంత్రులు, 18 మంది కార్పొరేషన్‌ చైర్మన్లు రంగంలో దిగారు.  

జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక...బీజేపీ త్రిసభ్య కమిటీ

  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీజేపీ అధిష్టానం అభ్యర్థి ఎంపిక కోసం నాయకులు, పార్టీ కేడర్ నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు  త్రిసభ్య కమిటీని నియమించింది. ఇందులో  మాజీ ఎమ్మెల్యే ఎం.ధర్మారావు, మాజీ ఎంపీ పోతుగంటి రాములు, పార్టీ సీనియర్ నేత, అడ్వొకేట్ కోమల ఆంజనేయులు ఉన్నారు. వారు ఇచ్చే నివేదిక ఆధారంగా బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేయనున్నారు.  మరోవైపు కాషాయ పార్టీ నుంచి బరిలో దిగేందుకు హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు లంకాల దీపక్ రెడ్డి ఆసక్తి చూపుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలైన విషయం తెలిసిందే. అదేవిధంగా ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, ఎన్వీ సుభాష్, మాధవీ లత టిక్కెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.  మరోవైపు  బీఆర్‌ఎస్  పార్టీ నుంచి దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత  బరిలో నిలుస్తుందని ఇప్పటికే అధినేత కేసీఆర్ ప్రకటించారు. హస్తం పార్టీ నుంచి  నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, బొంతు రామ్మోహన్, దానం నాగేందర్, వి.హనుమంత రావు పోటీకి ఆసక్తి చూపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ అక్టోబర్ 6న స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించి అభ్యర్థుల జాబితాను ఖరారు చేయనున్నారు.   

ముగిసిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ

  తెలంగాణలో సంచలనంగా మారిన పార్టీ ఫిరాయింపు కేసులో ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిల క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. ఈరోజు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎదుట ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వీరి తరఫు న్యాయవాదులు విచారణలో భాగంగా క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, ప్రకాశ్ గౌడ్‌ల విచారణ ముగిసిన విషయం తెలిసిందే. ఈ నెల 1న జరగాల్సిన విచారణ వాయిదా పడటంతో, మహిపాల్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి ఇవాళ స్పీకర్ ఎదుట వాదనలు వినిపించారు. కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ అసెంబ్లీ స్పీకర్‌కి ఫిర్యాదు చేసింది. కానీ, రోజులు గడుస్తున్నా నిర్ణయం రాకపోవడంతో బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన కోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడంతో, స్పీకర్ సంబంధిత ఎమ్మెల్యేలకి నోటీసులు పంపారు. దానం నాగేందర్‌, కడియం శ్రీహరి తప్ప మిగిలిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదని అఫిడవిట్‌ల ద్వారా స్పష్టీకరించారు. ఫిర్యాదుదారులు తమ ఆధారాలను సమర్పించగా, విచారణ కొనసాగుతోంది. ఇప్పుడు స్పీకర్ తుది నిర్ణయం తీసుకుంటారా? లేక మరికొంత సమయం కోరుతారా? అనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.  

పొన్నంపై అంజన్ కుమార్ యాదవ్ ఫైర్.. కారణమేంటంటే?

జూబ్లీహిల్స్ బైపోల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపుతోంది. జూబ్లీ బైపోల్ లో కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న నేతల సంఖ్య భారీగా ఉండటంతో అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలన్నది తేల్చుకోలేక పార్టీ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది. మీనాక్షి నటరాజన్ ను రంగంలోకి దింపి ఏకాభిప్రాయ సాధన కోసం ప్రయత్నాలు చేస్తున్నది. అయితే రాష్ట్ర కాంగ్రెస్ లో మాత్రం అధిష్ఠానం ప్రయత్నాలు అధిష్ఠానానివే..  అన్నట్లుగా ఉంది. ఆశావహులు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. ఇక పార్టీ టికెట్ ఆశిస్తున్న నేతలు టీకెట్ పై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక పార్టీలో విభేదాలు కూడా జూబ్లీ బైపోల్ ముంగిట రచ్చకెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ సీనియర్ నాయకుడు  అంజ‌న్ కుమార్ యాద‌వ్ మంత్రి పొన్నం మీద ఫైర్ అయ్యారు. తన కుమారుడు ఎంపీగా ఉండటంపై కామెంట్ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు అంజన్ కుమార్ యాదవ్ వార్నింగ్ ఇచ్చారు. జూబ్లీ టికెట్ ఎవరికి ఇవ్వాలన్నది హైకమాండ్ నిర్ణయిస్తుంది, దీనిపై మాట్లాడడానికి మధ్యలో పొన్నం ప్రభాకర్ ఎవరంటూ ఫైర్ అయ్యారు. పొన్నం ప్రభాకర్ కంటే తాను చాలా సీనియర్ ని అని అంటూ.. కాంగ్రెస్ లో ఒకే కుబుంబం నుంచి ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా చాలా మంది ఉన్నారంటూ ఓ పెద్ద లిస్టు చెప్పారు. ఉపముఖ్యమంత్రిగా మల్లు భట్టివిక్రమార్క ఉండగా, ఆయన అన్న మల్లు రవి ఎంపీగా ఉన్నారని గుర్తు చేశారు. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతి, మంత్రి కొమటిరెడ్డి, ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ల పేర్లు ప్రస్తావించారు. ఇలా ఒకే కుటుంబం నుంచి రెండు పదవులు ఉన్నవారు చాలా మంది ఉన్నారన్నారు. అటువంటప్పుడు తన కుమారుడు ఎంపీ అయితే జూబ్లీ బైపోల్ లో తనకు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు.  ఇక జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడానికి తనకు అన్ని అర్హతలూ ఉన్నాయన్న అంజన్ కుమార్ యాదవ్ పార్టీ అధిష్ఠానం తనకే టికెట్ ఇస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. ఆ ధీమాతోనే ఆయన ఇప్పటికే తన ప్రచారాన్ని ప్రారంభించేశారు.  జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గం వ్యాప్తంగా ఇప్పటికే పెద్ద ఎత్తున కటౌట్ లు ఏర్పాటు చేశారు. ఇంటింటి ప్రచారాన్ని కూడా షురూ చేసేశారు.  

డిజిట‌ల్ బుక్ ఫార్ములా... జగన్‌కే రివ‌ర్స్

  జ‌గ‌న్‌కి ఎంత టైం బ్యాడో చెప్ప‌డానికిదో మ‌చ్చు తున‌క కాబోలు. అదేంటంటే ఆయ‌న డిజిట‌ల్ బుక్ ఓపెన్ చేసి.. మిమ్మ‌ల్ని ఎవ‌రైనా వేధిస్తే.. మ‌రీ ముఖ్యంగా మీరు కూట‌మి ప్ర‌భుత్వం నుంచి అన‌వ‌స‌ర కేసులు ఇత‌ర‌త్రా వేధింపుల‌కు లోనైతే.. మిమ్మ‌ల్ని ఎవ‌రు వేధిస్తున్నారు.. అన్న పూర్తి వివ‌రాల‌ను మీరు మ‌న డిజిట‌ల్ బుక్ లోకి ఎక్కించాలి.. ఆపై మ‌నం అధికారంలోకి వ‌చ్చాక‌.. వారు స‌ప్త స‌ముద్రాల ఆవ‌ల దాగి ఉన్నా వ‌ద‌ల‌కుండా వెంటాడి మ‌రీ రివేంజ్ తీర్చుకుందాం. ఇదీ జ‌గ‌న్ తీస్కొచ్చిన డిజిట‌ల్ బుక్ ప్ర‌ధానోద్దేశం. ఇది చూస్తుంటే రివ‌ర్స్ అయ్యేలా క‌నిపిస్తోంది.. మాములుగా అయితే ఈ డిజిట‌ల్ బుక్ కి ప్ర‌త్య‌ర్ధి  పార్టీలు, మ‌రీ ముఖ్యంగా టీడీపీ, జేఎస్పీ, బీజేపీ వారిపై కంప్ల‌యింట్లు రావాలి. కానీ ఎంత చిత్ర‌మంటే చిల‌క‌లూరి పేట నియోజ‌క‌వ‌ర్గంలో అత్య‌ధిక సంఖ్య‌లో వైసీపీ  కార్య‌క‌ర్త‌ల నుంచి మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కంప్ల‌యింట్లు రావ‌డంతో ఒక్క‌సారిగా  పార్టీ షాక‌య్యింది. అస‌లు పార్టీ ఇంత ఘోరంగా ఎందుకు ఓడిందో అప్ప‌డు అర్ధ‌మైంద‌ట‌.. జ‌గ‌న్ కి. ఇక్క‌డ మ‌నం ఒక్క‌రే ఎవ‌రూ గుర్తు ప‌ట్ట‌కుండా మ‌ద్యం కుంభ‌కోణం వంటి వాటి ద్వారా దోచుకుంటున్నాం. మిగిలిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంతో మంచి వారు, స‌చ్చీలురు అనుకుంటూ వ‌చ్చార‌ట జ‌గ‌న్. కానీ వారు కూడా సేమ్ టూ సేమ్.. అదే ఫ్లో మెయిన్ టైన్ చేస్తున్న‌ట్టు ఆయ‌న‌కు అంత వ‌ర‌కూ అర్ధ‌మ‌య్యింది కాదు. ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌గ‌న్ ఓట‌మికి ప్ర‌ధాన  కార‌ణం వాలంటీర్లుగానే భావిస్తూ వ‌చ్చారు. అందుకే ఇటీవ‌ల ఒక స్ట్రాంగ్ డెసిష‌న్ తీస్కున్నారాయ‌న‌. ఒక వేళ మ‌నం అధికారంలోకి వ‌స్తే.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేసి.. ఆపై కార్య‌క‌ర్త‌ల‌పైనే ఆధార ప‌డాల‌ని భావించిన జ‌గన్ కి డిజిట‌ల్ బుక్ ద్వారా ఈ విష‌యం తెలియ‌డంతో ఏం చేయాలో పాలు పోలేద‌ట‌. మ‌హిళా మంత్రుల‌ని మ‌నం త‌క్కువ అంచ‌నా వేయ‌డానికి వీల్లేదని అంటారు ఫ్యాను పార్టీ వ‌ర్గాలు వారు.. రోజా ఆడుదాం ఆంధ్ర ద్వారా,  ర‌జ‌నీ స్టోన్ క్ర‌ష‌ర్ య‌జ‌మానులు, ఇత‌ర‌త్రా వ్య‌వ‌హారాల ద్వారా భారీగానే దోచుకున్న‌ట్టు స‌మాచారం. ఉండ‌వ‌ల్లి శ్రీదేవిని అడిగితే విడుద‌ల ర‌జ‌నీ గురించి, ఆమె ఇప్ప‌టి వ‌ర‌కూ ఎంత వెన‌కేసుకొచ్చారో ఏకంగా ఒక చిట్టా త‌యారు చేశారంటే ప‌రిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవ‌చ్చు.  అంత భారీగా ఉంటాయి ర‌జ‌నమ్మ లీల‌లు అంటారు ఉండ‌వ‌ల్లి శ్రీదేవిలాంటి కొంద‌రు. స‌రే శ్రీదేవికంటే తాను డాక్ట‌ర్ అయితే ఆరోగ్య శాఖ త‌న‌కివ్వాల్సింది ర‌జ‌నీకిచ్చార‌నే అసూయ ఉండొచ్చ‌ని లైట్ తీస్కుంది పార్టీ అధిష్టానం. ఇప్పుడుగానీ అస‌లు విష‌యం అఫిషియ‌ల్ గా తెలిసి రాలేద‌ట జ‌గ‌న్ కి. అంత‌గా ఆమెపై ఫిర్యాదులు వెల్లువ‌ల అందుతున్నాయ‌ట‌. ఇక రోజా అయితే టీటీడీ చ‌రిత్ర‌లోనే క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో.. టోకెన్లు అమ్మి సొమ్ము చేసుకున్న‌ట్టు ఆరోప‌ణ‌లున్నాయ్. ఈ విష‌యంపై మా ద‌గ్గ‌ర బోలెడు ఆధారాలున్నాయంటారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు. ఇవి మ‌చ్చుకు కొన్ని మాత్ర‌మే.. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో.. ఆయా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల ద్వారా సాగిన అవినీతి కాండకు జ‌గ‌న్ భారీ మూల్యం చెల్లించుకోవ‌ల్సి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అప్ప‌టికీ లీలా మాత్రంగా వీట‌న్నిటి గురించి విన్న జ‌గ‌న్ వారి వారి ప్రాంతాల నుంచి ఆయా లీడ‌ర్ల‌ను త‌ర‌లించి ఇత‌ర ప్రాంతాల్లో పోటీ చేయించినా ఫ‌లితం లేకుండా  పోయింది. ఇప్పుడు జ‌గ‌న్ కి మ‌రింత స్ప‌ష్టంగా అర్ధ‌మ‌వుతున్న విష‌యం ఏంటంటే.. తాను వీరి మాయ‌లో ప‌డిపోయి.. వారు తెర వెన‌క ఏం  చేస్తున్నారో అస్స‌లు ప‌ట్టించుకోలేక పోయాన‌ని తీవ్రంగా బాద ప‌డుతున్నార‌ట‌. ఆ మాట‌కొస్తే వాళ్ల‌ను నిల‌దీసే  ప‌రిస్థితి  కూడా లేదు. అందుకు రీజ‌న్.. తాను కూడా త‌లాపాపం తిలాపిడికెడు అన్న‌ట్టు.. త‌మ హ‌యాంలో చేసిన అవినీతి య‌జ్ఞంలో పీక‌లోతు మునిగి పోయి ఉండ‌ట‌మే.. అన్న‌ది అస‌లు విష‌యంగా తెలుస్తోంది. మ‌రి చూడాలి ర‌జ‌నీతో పాటు మ‌రి ఎంద‌రిపై డిజిటల్ బుక్ లో కంప్ల‌యింట్లు వ‌స్తాయో.

రాహుల్ త‌ర్వాత... గాంధీల శ‌కం ముగిసిన‌ట్టేనా?

  రాహుల్ త‌ర్వాత... గాంధీల శ‌కం ముగిసిన‌ట్టేనా? ఈ ప్ర‌శ్న ఎందుకు త‌లెత్తిందంటే.. తాజాగా వ‌య‌నాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ కేర‌ళ‌లోని అరికోడ్ లో జ‌రిగిన  ర్యాలీలో ప్ర‌సంగించిన త‌ర్వాత  త‌న ఇద్ద‌రు పిల్ల‌లు మిరాయా, రైహాన్ ల‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేశారు. కాబోయే గాంధీ కుటుంబ వార‌సులుగా వీరిద్ద‌రే అన్న సంకేతాలిచ్చారామె. అయితే ఇక్క‌డొచ్చే చిక్కేంటంటే.. సాంకేతికంగా వీర్ని మిరాయా వాద్రా, రైహాన్ వాద్రాగా పిల‌వాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలో చూస్తే రాహుల్ త‌ర్వాత ఈ గాంధీ అన్న శ‌బ్ధం ఈ కుటుంబం చివ‌ర వినిపించ‌డం ఇక మాయ‌మ‌య్యేలా క‌నిపిస్తోంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అన్న‌ది గాంధీ కుటుంబ వార‌స‌త్వంగా వింటూ వ‌స్తున్నాం. ఆ మాట‌కొస్తే రాజీవ్ గాంధీని పెళ్లాడిన సోనియా సైతం గాంధీగానే ఇక్క‌డ పిల‌వ‌బ‌డ్డారు. క‌ట్ చేస్తే ఇప్పుడు స‌మ‌స్య ఏంటంటే రాహుల్ త‌ర్వాత ఆ కుటుంబం నుంచి గాంధీ అన్న ఇంటి పేరు దాదాపు క‌నుమ‌ర‌గు కానుంద‌నే చెప్పాలి. కార‌ణం.. రాహుల్ గాంధీకి అధికారికంగా పెళ్లి కాలేదు. ఆపై ఆయ‌న‌కంటూ పిల్ల‌లున్నార‌న్న విష‌యం  కూడా ఎవ‌రికీ తెలీదు. దీంతో ఈ కుటుంబం నుంచైతే గాంధీ అన్న స‌ర్ నేమ్ ఇక‌పై వినిపించే ఛాన్స్ లేదు. రాహుల్ గాంధీయే ఈ ప‌రంప‌ర‌లో చివ‌రి వార‌వుతారు. అయితే ఇక్క‌డ మ‌రొక అవ‌కాశం లేక పోలేదు. అదే మేన‌కాగాంధీ, వ‌రుణ్ గాంధీ. సంజ‌య్ గాంధీ కుమారుడైన‌ వ‌రుణ్ గాంధీ కి కూడా ఇద్ద‌రు కూతుళ్లు. వీరు పేర్లు ఆద్య‌, అన‌సూయ‌. వీరి పేర్ల చివ‌ర గాంధీ అన్న శ‌బ్ధం వినిపిస్తుంది. కానీ వారు కుమార్తెలు కావ‌డంతో. వారి ఇంటి పేరు కూడా మారే అవ‌కాశ‌ముంది. అచ్చం ప్రియాంక గాంధీ వాద్రాలాగా.  మొత్తంగా ఈ త‌రం త‌ర్వాత కూడా ఒక వార‌సుడు.. అది  కూడా గాంధీ అన్న ఇంటి పేరును ప్ర‌పంచం ముందు స‌గ‌ర్వంగా నిల‌ప‌డానికి త‌గిన యోధుడు  క‌నుచూపు మేర క‌నిపించ‌డం లేదు. వ‌చ్చే రోజుల్లో రాహుల్ త‌న ఓట్ల చోరీ ప్ర‌చారం ఫ‌లించి.. పీఎం అయితే.. గాంధీ వంశం నుంచి అయ్యే చివ‌రి పీఎం ఈయ‌నే అవుతారు. ఆ త‌ర్వాత గాంధీల చ‌రిష్మా క్ర‌మేణా క‌నుమ‌రుగ‌య్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. బీజేపీ గానీ గ‌ట్టిగా ప‌ట్టుబ‌ట్టి రాహుల్ గాంధీని కూడా రాకుండా చేస్తే.. రాజీవ్ గాంధీయే చివ‌రి గాంధీస్ ఫ్యామిలీ కా పీఎం. అంతే సంగ‌తులు చిత్త‌గించ‌వ‌ల‌యును అన్న‌ట్టుగా మార‌నుంది ప‌రిస్థితి. ఆ మాట‌కొస్తే ఒరిజిన‌ల్ గాంధీకి ప్ర‌తిగా లాల్ బ‌హ‌దూర్ శాస్త్రిని తెర‌పైకి తేవాల‌ని విస్తృతంగా ప్ర‌య‌త్నిస్తోంది ఆర్ఎస్ఎస్.  ఇటీవ‌ల జ‌రిగిన శ‌తాబ్ది ఉత్స‌వాల్లో మోహ‌న్ భ‌గ‌వ‌త్ అన్న మాట ఏంటంటే ఇవాళ గాంధీ జ‌యంతే కాదు లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి జ‌యంతి కూడా అన్న కామెంట్ చేశారు. ఈ లెక్క‌న చూస్తే గాంధీ అన్న శ‌బ్ధం విన‌బ‌డ‌కుండా చేయ‌డంలో ఇటు ఒక వ‌ర్గం ప్ర‌య‌త్నిస్తుండ‌గా.. అటు ఆ కుటుంబం నుంచి కూడా సాంకేతికంగా ఇందుకు స‌హ‌కారం అందుతోన్న విధం క‌ళ్ల‌కు క‌డుతోంది. మ‌రి  మీరేమంటారు!!!