చంద్రబాబుకు సీఐ శంకరయ్య లీగల్ నోటీసులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి ఒక సీఐ  లీగల్ నోటీసులు పంపించారు.  2019 ఎన్నికలకు ముందు జరిగిన వివేకా హత్య కేసులో తన పరువుకు భంగం కలిగించారంటూ సీఐ శంకరయ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి లీగల్ నోటీసులు పంపారు.  వివేకా హత్య కేసులో తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా చంద్రబాబు పలుమార్లు తప్పుడు ప్రకటనలు చేశారని ఆ నోటీసులలో పేర్కొన్నారు. ఈ నోటీసులు చంద్రబాబుకు ఈ నెల 18న అందాయి.  వివేకా హత్య కేసులో తనపై చేసిన నిరాధార ఆరోపణలకు గాను అసెంబ్లీలో సీఎం చంద్రబాబు తనకు తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించినందకు గాను రూ.1.45 కోట్ల పరిహారం చెల్లించాలని శంకరయ్య లీగల్‌లో నోటీసులో పేర్కొన్నారు.  వైఎస్ వివేకానంద రెడ్డి   హత్య జరిగిన సమయంలో పులివెందుల సీఐ‌గా  ఉన్న జే.శంకరయ్య అండతో నిందితులు ఆధారాలను తారుమారు చేశారంటూ  చంద్రబాబు అప్పట్లో పలు బహిరంగ వేదికలపై పేర్కొన్న సంగతి తెలిసిందే.  విధులలో  అలసత్వం వహించారని శంకరయ్యను అప్పటి   ప్రభుత్వం సస్పెండ్ చేసింది.   ఆ తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్  శంకరయ్యపై   సస్పెన్షన్ ఎత్తేసింది.   ఇప్పుడు తాజాగా  శంకరయ్య సీఎం చంద్రాబాబుకు లీగల్ నోటీసులు పంపడం సంచల నంగా మారింది. 

డీసీసీ అధ్యక్షుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్

  తెలంగాణతో పాటు రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో డీసీసీ అధ్యక్షుల నియామకానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం పరిశీలకులను నియమించింది. తెలంగాణ కోసం 22 మంది పరిశీలకులను ప్రకటించింది. ఈ బాధ్యతలను సీనియర్‌ నేతలకు అప్పగించినట్టు ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. డీసీసీల నియామకాన్ని పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తున్నట్టు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఎలాంటి ఒత్తిళ్లకు తావులేకుండా నిష్పాక్షికంగా నిర్ణయాలు తీసుకునేలా సీనియర్ నాయకులను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించారు. భవిష్యత్‌లో అధిక ప్రాధాన్యం కలిగే అవకాశం ఉన్నందున డీసీసీ పదవులపై డిమాండ్ పెరిగినట్లు సమాచారం.  

శాసన మండలిలో కొణిదెల మొదటి ప్రశ్న

  గత ప్రభుత్వం అమలు చేసిన తప్పుడు, అక్రమ కేసులపై శాసన మండలిలో చర్చ జరిగింది. ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ కాలంలో అమరావతి రైతులు రాజధాని కోసం పోరాడితే వందలాది మందిపై కేసులు పెట్టారని, తన పైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడంతో కడప కోర్టుకు నేను హాజరయ్యానని అన్నారు.  గత ప్రభుత్వ చీకటి జీవోలు తెచ్చే సంస్కృతిని ప్రస్తుత కూటమి ప్రభుత్వం కొనసాగించదని స్పష్టం చేశారు. అన్ని కేసులను లా ప్రకారం పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సీపీఎస్ రద్దు కోరుతూ ఉద్యమించిన టీచర్లపై నమోదైన కేసుల్లో 80 శాతం ఎత్తివేశామని, మిగిలిన కేసుల పరిష్కారానికి కూడా చర్యలు కొనసాగుతున్నాయని ఆమె వెల్లడించారు.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2019 నుండి 2024 మధ్యకాలంలో మొత్తం 3,116 తప్పుడు కేసులు పెట్టిందని హోంమంత్రి  అనిత శాసనమండలిలో వెల్లడించారు. ఈ కేసుల్లో రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులు, సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వంపై అభిప్రాయాలు వ్యక్తం చేసిన సాధారణ ప్రజలపై కూడా కేసులు పెట్టారని ఆమె చెప్పారు.కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే, సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకే లేదా ఫార్వార్డ్ చేసినందుకే ప్రజలపై కేసులు పెట్టారు అని ఆమె విమర్శించారు.  అమరావతి రైతులు రాజధాని కోసం చేసిన ఉద్యమంలో వందలాది కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. ఈ కేసుల్లో కొన్ని విచారణ దశలో ఉండగా, మరికొన్ని ట్రయల్ పెండింగ్ లో ఉన్నాయి. కొన్ని కేసులు కోర్టుల పరిధిలో విచారణలో ఉన్నాయి అని వివరించారు. ఈ వ్యవహారంపై త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తారని హోంమంత్రి తెలిపారు.  పోలీస్ శాఖ, న్యాయ శాఖలతో సమన్వయంగా సమావేశమై కేసుల పరిష్కారంపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం అని అన్నారు. అంతేకాకుండా ఇటీవల జగన్ పత్రికలో ఎన్డీయే కూటమి సభ్యుల్లో 94 శాతం మందిపై కేసులున్నాయన్న వార్తలపై స్పందిస్తూ, వారు గుర్తించాల్సింది ఒక్కటే – మా నాయకులపై కోడి కత్తి కేసులు, గొడ్డలి వేటు కేసులు, లేదా తల్లి, చెల్లెలు పేరుతో పెట్టిన పర్సనల్ కేసులు లేవు. ఇవన్నీ రాజకీయ కేసులే. గత ప్రభుత్వ తప్పుడు విధానాలను ఎత్తిచూపినందుకు మాత్రమే ఈ కేసులు నమోదయ్యాయి అని హోంమంత్రి స్పష్టం చేశారు.  

దిక్కులేని వైసీపీకి శాసనమండలే దిక్కు!

ఏ మొగుడు లేని వారికి అక్క మొగుడే దిక్కు అని ఉత్తరాంధ్రలో  ఓ పాతకాలపు సామెత ఉంది.  ఇప్పుడు వైసీపీని చూసి అదే మాట అనుకుంటున్నారు ఉత్తరాంధ్ర ప్రజలు. అధికారంలో ఉన్నప్పుడు రద్దు చేస్తామన్న శాసనమండలే ఇప్పుడు ఫ్యాన్ పార్టీకి దిక్కుగా మారిందంటున్నారు.  ఈ పరిస్థితి జగన్ ముందు చూపులేని నిర్ణయాలకు నిలువెత్తు నిదర్శనంగా వైసీపీ నేతలే అంటున్నారు.    ఫ్యాన్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ రాజధాని అమరావతి విషయంలో జగన్ ఏకపక్ష ధోరణితో వ్యవహరించారు. అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులను ఉద్యమకారులను అన్ని రకాలుగా అణచివేశారు.  వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల నినాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు. కానీ 2024 లో జరిగిన ఎన్నికల్లో  మూడు ప్రాంతాల ప్రజలు కూడా ఫ్యాన్ పార్టీకి మొట్టికాయ వేశారు. రాష్ట్రం అంతా కలిసి కేవలం 11 సీట్లకు పరిమితం చేశారు.  అయితే అధికారంలో ఉన్నప్పుడు తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టే బిల్లుల ఆమోదానికి మండలిలో తెలుగుదేశం పార్టీకి ఉన్న మెజారిటీ అవరోధంగా మారడంతో అప్పట్లో  శాసనమండలని  రద్దు చేయాలని జగన్ భావించారు. ఆ మేరకు తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి కూడా తీసుకువచ్చారు.  కానీ శాసనమండలి రద్దు ప్రతిపాదన అమలుకు నోచుకోలేదు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో జగన్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఈ దశలో 11 మంది సభ్యులతో అసెంబ్లీకి వెళ్లడం అవమానంగా భావించి జగన్మోహన్ రెడ్డి  అసెంబ్లీకి గైరాజరవుతున్నారు. దీనిపై స్పీకర్ అయిన పాత్రుడు ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు పలుమార్లు విమర్శలు చేసినప్పటికీ ఫ్యాన్ పార్టీ  తన వైఖరిని మార్చుకోలేదు. అయితే ఒకవైపు అసెంబ్లీకి వెళ్ళక అధికారంలో లేక తమ వాదన వినిపించే పరిస్థితి ఉండక ఫ్యాన్ పార్టీ ఇబ్బంది పడుతున్నది. ఈ దశలో ప్రతిపక్ష నాయకుని హోదా తో శాసనమండలిలో ఫ్యాన్ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ మాత్రం తన గళాన్ని వినిపిస్తున్నారు . దీన్ని కూటమి నాయకులు బలంగా తిప్పి కొట్టినప్పటికీ ఎంతో కొంత బొత్స తన గొంతును వైసీపీ పక్షాన వినిపిస్తున్నారు.  దీన్ని చూసిన ఉత్తరాంధ్రవాసులు జగన్మోహన్ రెడ్డి అనాలోచితంగా శాసనమండలిని రద్దు చేయాలని భావించినా ఇప్పుడు అదే ఆ పార్టీకి దిక్కుగా మారిందంటూ ఎద్దేవా చేస్తున్నారు.    ఫ్యాన్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక తరహాలో  వ్యవహరిస్తే బొత్స సత్యనారాయణ మరోలా ప్రవర్తిస్తున్నారు . కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి బాయ్ కాట్ చేస్తే..  బొత్స సత్యనారాయణ మాత్రం విధిగా శాసనమండలికి హాజరవుతున్నారు. ఇది ఒకరకంగా ఆ పార్టీలో భిన్న ఆలోచనలకు తెర తీస్తోంది. అధినాయకుని తీరును లెక్కచేయకుండా బొత్స హాజరవుతున్నారా లేక ప్రజాపక్షంలో నాయకునిగా తన గొంతు వినిపించే ప్రయత్నం చేస్తున్నారా అన్న అన్న అను మానాలు వ్యక్తం అవుతున్నాయి. తొలి దశ నుంచి ఏకపక్ష నిర్ణయాలతో..  రాచరికం మాదిరిగా తన నిర్ణయమే అమలు కావాలనే మనస్తత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి తాజాగా బొత్స ప్రవర్తన పై గుర్రు గా ఉన్నట్టు కూడా ఫ్యాన్ పార్టీ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి వై ఎస్ తో సన్నిహిత సంబంధాలు ఉన్న బొత్స తొలి  నుంచి  వైసీపీలో  ఉన్నా ఆయన అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. అందులో జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా బొత్స వైఖరి అదే తరహాలో ఉంటుంది. అయితే దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నట్టు ఇప్పుడు బొత్సకు జగన్... జగన్ కు బొత్స  గత్యంతరం లేని దిక్కులుగా మారారు. ఇంకా రంగులు మారుతున్న రాజకీయ పరిణామాలతో ఈ నాయకుల తీరు ఎలా ఉంటుందో కాలమే నిర్ణయించాల్సి ఉంది.

పీవోకే దానంతట అదే భారత్ లో భాగం అవుతుంది.. రాజ్ నాథ్ సింగ్

పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎప్పటికీ భారత్ దేనని  కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. పాకిస్థాన్ లోని ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనంన చేసుకోవడానికి యుద్ధాలు చేయవలసిన అవసరం లేదన్న ఆయన ఆ ప్రాంత ప్రజలే పాకిస్థాన్ పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారన్నారు. వారే స్వచ్ఛందంగా ఆ ప్రాంతాన్ని భారత్ లో విలీనం చేస్తారని పేర్కొన్నారు. మొరాకోలో పర్యటిస్తున్న రాజ్ నాథ్ సింగ్ అక్కడి భారత సంతతి ప్రజలతో భేటీ అయ్యారు. పాక్ఆక్రమిత కాశ్మీర్ భారత్ దేనని తాను ఐదేళ్ల కిందటే చెప్పిన విషయాన్ని ఆయనీ సందర్బంగా గుర్తు చేశారు. దాడి చేసో, యుద్ధం చేసో పీవోకేను స్వీధీనం చేసుకోవలసిన అవసరం లేదన్న ఆయన దానంతట అదే భారత్ తో భాగమౌతుందనీ, ఆ రోజు దగ్గర్లోనే ఉందని చెప్పారు.  

బొత్స తెలిసే మాట్లాడుతున్నారా?

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ పార్టీ అధినేత.. బెంగళూరు ప్యాలస్ కే ఎక్కువగా పరిమితమై.. అడపాతడపా తాడేపల్లి ప్యాలెస్ లో ప్రెస్ మీట్లు పెట్టి రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించి చేతులు దులిపేసుకుంటున్నారు. జిల్లాల పర్యటనలు, కార్యకర్తలకు సమయం కేటాయింపు, ఆందోళనలు, ఉద్యామాలు అంటూ అప్పడప్పుడు ప్రసంగాలు చేసినా ఆయన ప్యాలెస్ ల గడపదాటి ప్రజలలోకి మాత్రం రావడం లేదు. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి దిశ, దశ లేకుండా పోయిందని పరిశీలకులు సోదాహరణంగా విశ్లేషణలు చేస్తున్నారు.  తాజాగా మండలిలో బొత్స సత్యనారాయణ ప్రసంగం వింటే.. ఆ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధమౌతుందది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీలో అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. మండలిలో వైసీపీ పక్ష నాయకుడు కూడా. అసెంబ్లీలో లేకపోయినా, మండలిలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఉంది. అంటే బొత్స సత్యనారాయణ మండలిలో ప్రతిపక్ష నేత కూడా.  అలాంటి బొత్స సత్యనారాయణ తన తీరుతో స్వయంగా నవ్వుల పాలు కావడమే కాకుండా వైసీపీని కూడా నవ్వుల పాలు చేస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వంపై, ప్రభుత్వ విధానాలపై, వైఫల్యాలపై విమర్శలు చేయాల్సిందే. అయితే బొత్స సత్యనారాయణ విమర్శలు మాత్రం ప్రభుత్వాన్ని కాకుండా సొంత పార్టీనే చిక్కుల్లో పడేసేవిగా ఉంటున్నాయి. అవగాహనా రాహిత్యమో, మరోటో కానీ ఆయన కార్మిక చట్టాల మార్పు కోసం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లుపై మండలిలో చేసిన విమర్శలు సొంత పార్టీ వారే తలలు బాదుకోవలసిన పరిస్థితి తీసుకువచ్చింది.   ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాసిందంటూ ఆయన ఫైరయ్యారు. కార్మికులు రోజుకు పన్నెండు గంటలు పని చేయాలనడమేంటి? అంటూ విమర్శలు గుప్పించారు. దీంతో వైసీపీ సభ్యులకే దిమ్మతిరిగింది. అధికార పక్ష సభ్యులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఇంతకీ విషయమేమిటంటే.. తెలుగుదేశం కూటమి సర్కార్ తీసుకు వచ్చిన బిల్లు కార్మికులు, ఉద్యోగులకు వెసులుబాటు కల్పించడంతో పాటు..పరిశ్రమలు నిరంతరం పని చేయడానికి దోహదం చేస్తుంది. ఎక్కడా కార్మికుల పని గంటలను పెంచలేదు. గతంలో కార్మికులు వారానికి 48 గంటలు పని చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ బిల్లుతో కూడా కార్మికుల పనిగంటలు పెరగడం లేదు. కావాలనుకుంటే.. కార్మికులు రోజుకు పది గంటలు పని చేసుకోవచ్చు.. కానీ వారం మొత్తానికి కలిపి వారి పనిగంటలు 48కి మించకూడదు. అలా మించినట్లైతే కంపెనీలు ఓవర్ టైమ్ చెల్లించాలి. ఇదీ తెలుగుదేశం కూటమి సర్కార్ కార్మిక చట్టాలలో చేసిన మార్పు.   ఈ మార్పు  కార్మికులకు అనుకూలంగా ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. అయితే బొత్స మాత్రం ప్రభుత్వంపై విమర్శ చేస్తే చాలు.. ఆ విమర్శకు హేతువు ఉండాల్సిన అవసరం లేదన్నట్లు.. కార్మికులు రోజుకు పన్నెండు గంటలు పని చేయాలా? ఇది కార్మిక వ్యతిరేక ప్రభుత్వం అంటూ ఓ ప్రసంగొం చేసేసి నవ్వులపాలయ్యారు. 

కేటీఆర్ నోట స్థానిక ఎన్నికల బహిష్కరణ మాట.. సంకేతమేంటి?

స్థానిక ఎన్నికలలోఓటమి భయం  బీఆర్ఎస్ ను  వెంటాడుతోందా? ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలలో పోటీ చేస్తే ఆబోరు దక్కదని భయపడుతోందా? ఏదో ఒక సాకు చెప్పి స్థానిక ఎన్నికలను బహిష్కరించాలన్న వ్యూహంతో ఉందా? అన్న ప్రశ్నలకు తాజాగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన ప్రకటనను బట్టి ఔననే అనాల్సి వస్తున్నది. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకుంటే స్థానిక ఎన్నికలకు బహిష్కరించాలని కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.   నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు చెందిన ఆర్ఆర్ఆర్ బాధితులు సోమవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్ఆర్ఆర్ బాధితులంతా ఐక్యంగా ఉండాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తే మీ సమస్య ఢిల్లీ వరరూ వెడుతుందన్నారు.   సమస్యలపై మాట్లాడటానికి తమకు అసెంబ్లీలో మైక్ ఇవ్వడం లేదని  ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.  కత్తి వాళ్ల చేతిలో పెట్టి యుద్ధం బీఆర్ఎస్‌ను చేయమంటే ఎలా అని కేటీఆర్ ప్రజలను నిలదీశారు. మొత్తం మీద కేటీఆర్ మాటలు ఆయనను కలిసిన బాధితులకు ఎలాంటి ఊరటను ఇవ్వలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కత్తి వాళ్ల చేతుల్లో పెట్టి అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ను గెలిపించిన మీ తరఫున బీఆర్ఎస్ ఎందుకు పోరాడుతుంది అన్నట్లుగా ఉన్నాయని అంటున్నారు. మొత్తం మీద కేటీఆర్ నోట.. బహిష్కరణ మాట రావడమే ఆయనలోని ఓటమి భయాన్ని ఎత్తి చూపుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. 

జగన్ పై తిరుగుబాటేనా?.. బొత్స ఏం చేస్తున్నారు?

వైసీపీలో పై నుంచి కింది దాకా గందరగోళం నెలకొంది. అధినేత జగన్ ఒకటి చెబితే.. ఆ పార్టీలోని కీలక నేతలు మరొకటి చేస్తున్నారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తం అవుతున్నాయి. మొత్త పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. నేడు బొత్స సత్యనారాయణ ఇరువురూ కూడా జగన్ ఆదేశాలను భిన్నంగానే వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీకి ఎమ్మెల్యేల హాజరు విషయంలో జగన్ చెప్పిన మాట ఆయనకు అత్యంత సన్నిహితుడు, మాజీ మంత్రి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఖాతరు చేయలేదు.. సరికదా, జగన్ రాకుండా తాను అసెంబ్లీకి వెళ్లడమేంటి? అంటూ పార్టీ నేతల వద్ద ఒకింత అసహనంతో వ్యాఖ్యలు చేశారు.  అదలా ఉంచితే.. తాజాగా వైసీపీ సీనియర్ మోస్ట్ నాయకుడు, మాజీ మంత్రి, మండలిలో వైసీపీ పక్ష నేత అయిన బొత్స సత్యనారాయణ జీఎస్టీ రిఫార్మ్స్ విషయంలో జగన్ కు పూర్తి విరుద్ధమైన స్టాండ్ తీసుకున్నారు. దీంతో బొత్స తీరుపై జగన్ లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోందని పార్టీ నేతలే అంటున్నారు. అసలు జగన్ పై బొత్స తిరుగుబాటు చేస్తున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇందుకు బొత్స మండలిలో వ్యవహరిస్తున్న తీరే కారణమని అంటున్నారు.  కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న జీఎస్టీ విషయంలో వైసీపీ స్టాండ్ కు పూర్తి భిన్నంగా మండలిలో బొత్స మాట్లాడడమే ఇందుకు కారణం. జీఎస్టీ సంస్కరణలను ప్రశంసిస్తూ జగన్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే బొత్స మాత్రం మండలిలో కేంద్రాన్ని ప్రశంసిస్తూ ప్రభుత్వ తీర్మానాన్ని వైసీపీ వ్యతిరేకిస్తుందని  చెప్పారు. బీఏసీ సమావేశంలో మండలిలో ప్రభుత్వం చేసేజీఎస్టీ అనుకూల తీర్మానాన్ని వైసీపీ వ్యతిరేకిస్తుందని చెప్పడంతో వైసీపీ నేతలు, శ్రేణులు కంగుతిన్నారు. అయితే మండలిలో వైసీపీ ఆ తీర్మానాన్ని వ్యతిరేకించలేదనుకోండి అది వేరే సంగతి. కానీ బొత్స ఏకపక్షంగా పార్టీ లైన్ కు వ్యతిరేకంగా బీఏసీలో చేసిన వ్యాఖ్యలు మాత్రం జగన్  తీవ్ర అసంతృప్తి వ్యక్తి చే సినట్లు తెలిసింది.   జగన్ బీజేపీకి వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఆయన ఎదుర్కొంటున్న కేసులలో అరెస్టు నుంచి రక్షణ కావాలంటే బీజేపీ సహకారం, అండ చాలా అవసరం. ఆ విషయం తెలిసి కూడా బొత్స సత్యనారాయణ జీఎస్టీ సంస్కరణలను వైసీపీ వ్యతిరేకిస్తుంది అని అన్నారంటే.. దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అన్న అనుమానాలు పార్టీలో వ్యక్తం అవుతున్నాయి.  మొత్తం మీద బొత్స తీరు వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఒక కార్యక్రమంలో ఆయన ఏపీసీసీ అధినేత వైఎస్ షర్మిలతో ఆత్మీయంగా ముచ్చటించడం, అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామరాజుతో సన్నిహితంగా వ్యవహరించడం జగన్ ను కంగారు పెడుతున్నాయి. మొత్తం మీద వైసీపీలో పరిస్థితి జగన్ వర్సెస్ బొత్స అన్నట్లుగా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కడప టీడీపీలో అసమ్మతి సెగలు

  కడప అసెంబ్లీ తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగలు బహిరంగమయ్యాయి. ఎమ్మెల్యే మాధవి రెడ్డి పట్ల ఆమె భర్త,  టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి పట్ల దేశం నాయకులు పలువురు నిరసనకు దిగారు. తెలుగుదేశం పార్టీ జెండాలు మోసిన వారిని,ఎమ్మెల్యే గెలుపు కోసం కష్టపడ్డ వారిని పక్కన పెట్టి వైసిపి నుంచి వచ్చిన వారికి  ప్రాధాన్యమిస్తున్నారు అంటూ వారు అసంతృప్తి వ్యక్తం చేస్తూ దేవుని కడపలోంచి ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారికి మంచి బుద్ది ప్రసాదించాలని అక్కడి దేవుని కడప ఆలయంలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి వినతి పత్రం సమర్పించారు.  ఈ కార్యక్రమం కడప తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగలను బట్టబయలు చేసింది. స్థానిక ఎన్నికలు జరుగనున్న  నేపథ్యంలో ఎమ్మెల్యే పట్ల, శ్రీనివాస్ రెడ్డి పట్ల వ్యతిరేకత తెలియజేస్తూ అసమ్మతి నాయకులు గుంపు కట్టడం నియోజకవర్గ తెలుగుదేశం రాజకీయాల్లో  రచ్చగా మారింది. టీడీపీ సీనియర్ నేత కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భారీగా సీనియర్ కార్యకర్తలు,నాయకుల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అది నుండి టీడీపీ జెండా మోసిన కార్యకర్తలకు ఎమ్మెల్యే తీవ్ర అన్యాయం చేస్తుందంటూ మండిపడ్డారు. ఇటీవల పార్టీల చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తూ సీనియర్లను తొక్కేస్తుందంటూ ఆవేదన వ్యక్తంచేశారు.  కార్యక్రమం అనంతరం కమలాపురం సీనియర్ నాయకుడు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డిని కలిశారు. కడప నియోజవర్గ టిడిపి సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, మురళి, కొండాసుబ్బయ్య, మహిళా నేతలు, యువ కార్యకర్తలు, నాయకులు పుత్తా నరసింహ రెడ్డి వద్ద వారి ఆవేదన వ్యక్తం చేస్తూ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పార్టీ కోసం కష్టపడిన మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ వాపోయారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి పోలీసులతో బెదిరింపులకు గురి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆగడాలకు తట్టుకోలేకపోతున్నామని,అంబేద్కర్ రాజ్యాంగం కడపలో నడవడం లేది శ్రీనివాసరెడ్డి రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు.  ఎమ్మెల్యే గెలుపు కోసం పోరాటం చేస్తే గెలిచాక మమ్మల్నివెలివేసిందని, వైసీపీ కార్పోరేటర్లను పార్టీలో చేర్చుకొని వారికి పెద్దపీట వేస్తున్నారని,వారి కాళ్ల దగ్గర ఉన్న వారికే పార్టీ పదవులు, ఇన్‌ఛార్జులు, పనులు కట్టబెడుతున్నారని అన్నారు.ఇంత సీనియార్టీ ఉన్న మమ్మల్ని పట్టించుకోకపోవడం దుర్మార్గమని, మా సమస్యలను  అధిష్టానం దృష్టికి తీసుకెళ్లండి అంటూ ఆయన్ను కోరారు. ఈ మేరకు పుత్తాకు వినతి పత్రం సమర్పించారు. సీఎం చంద్రబాబు నాయుడును ,లోకేష్ బాబును కలిసే విధంగా ఏర్పాట్లు చేయాని కోరారు.

కేసీఆర్ లో జూబ్లీ గాభరా?

బీఆర్ఎస్ ను జూబ్లీ ఉప ఎన్నికలు గాభరా పెడుతున్నాయా? ఆ పార్టీ అధినేత కేసీఆర్ కవిత విషయంలో పునరాలోచిస్తున్నారా? అంటే పరిశీలకుల నుంచి ఔనన్నసమాధానమే వస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే నెల మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఈసీ రెడీ అయ్యింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు కూడా నోటిఫికేషన్ వెలువడుతుందని అంటున్నారు. దీంతో తమ సిట్టింగ్ సీటును ఎలాగైనా కైవశం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న బీఆర్ఎస్ కు కవిత వ్యవహారం ఇబ్బంది పెడుతున్నది. జూబ్లీ ఉప ఎన్నికలో కవిత తెలంగాణ  జాగృతి తరఫున అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలు ఉండటంతో బీఆర్ఎస్ లో ఓటమి భయం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.  అధికారంలో ఉన్నంత కాలం విపక్షాలను నానా ఇబ్బందులకూ గురి చేసి ఆ పార్టీల్లో చీలికలకు ప్రోత్సహించిన బీఆర్ఎస్.. ఇప్పుడు సొంత పార్టీలోనే అసమ్మతి, అసంతృప్తులు పెచ్చరిల్లడంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మరీ ముఖ్యంగా కవిత తిరుగుబావుటా ఆ పార్టీని ఊపిరితీసుకోలేనంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తెలంగాణ రాజకీయాలలో గత కొంత కాలంగా కల్వకుంట్ల కవిత హాట్ టాపిక్ అయిన సంగతి విదితమే. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, అక్రమాలకు హరీష్ బాధ్యుడంటూ ఆమె చేసిన ఆరోపణలు, విమర్శలతో పార్టీ నుంచి సస్పెండయ్యారు. ఇప్పుడు ఆమెను సస్పెండ్ చేసి తప్పుచేశామా అన్న భావనలో కేసీఆర్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సస్పెన్షన్ కు గురైన కవిత ఎక్కడా వెనక్కు తగ్గకుండా ముందుకు సాగడమే కాకుండా జూబ్లీ ఉప ఎన్నికలో తెలంగాణ జాగృతి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నేత  అలీఖాన్ ను రంగంలోకి దించే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే.. తమ ఓటమి ఖాయమన్న భయం బీఆర్ఎస్ లో వ్యక్తం అవుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అదే భావనకు వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే నేడో, రేపో కేసీఆర్ కవితను తన ఫామ్ హౌస్ కు పిలిపించి మాట్లాడే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి.   ఆమెతో చర్చించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో జాగృతి అభ్యర్థిని నిలబెట్టకుండా బుజ్జగించే యోచనలో కేసీఆర్ ఉన్నారని ఆ వర్గాలు అంటున్నాయి.  ఒక వేళ జూబ్లీ ఉప ఎన్నికలో కవిత కనుక జాగృతి అభ్యర్థిని నిలబెట్టడమంటూ జరిగితే బీఆర్ఎస్ ఓట్లు చీలి ఓటమి పాలవుతామన్న భయంతో పాటు   అది అధికార పార్టీకి లాభం చేసే అవకాశం ఉంటుందన్న భావనతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కవితతో చర్చించడమే మేలన్న అభిప్రాయానికి వచ్చినట్లు చెబుతున్నారు.  

పుస్తక పఠనం ద్వారా క్రియేటివ్ థింకింగ్.. నారా లోకేష్

ఇటీవలి కాలంలో పుస్తక పఠనం అన్నది యువత, చిన్నారులలో బాగా తగ్గిపోయిందని ఆంద్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అన్నారు. సోమవారం (సెప్టెంబర్ 22) అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖ పశ్చిమ నియోజవర్గ ఎమ్మెల్యే గణబాబు గ్రంథాలయాలపై అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన తన కుమారుడు నారా దేవాంశ్ ను ప్రస్తావించారు. ఇటీవల తాను లండన్ పర్యటనకు వెళ్లిన సమయంలో తాను ఐదు పుస్తకాలను కొని తిరిగి వచ్చాకా దేవాంశ్ కు ఇచ్చాననీ, వాటిని అతడు ఐదు రజులలో చదివేశాడనీ చెప్పారు. తన కుమారుడికి పఠనాశక్తి ఎక్కువ అన్న లోకేష్.. పుస్తకాలు చదవడం అన్నది చాలా మంచి అలవాటని అన్నారు. రాష్ట్రంలో గ్రంథాలయాలకు పెద్ద పీట వేయడం ద్వారా యువత, పిల్లలలో పఠనాశక్తి పెంపొందేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రపంచ స్థాయి గ్రంథాలయాల అభివృద్ధి కోసం షోబాబెవలపర్స్ సంస్థ వంద కోట్ల రూపాయలతో ముందుకు వచ్చిందన్నారు. రెండేళ్లలో రాష్ట్రంలో ప్రపంచ స్థాయి గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తామన్న ఆయన.. ప్రస్తుతం రాష్ట్రంలో 13 జిల్లా గ్రంథాలయాలు ఉన్నాయనీ, వాటిని 26కు పెంచుతామనీ చెప్పారు. ఇక పోతే గ్రంధాలయాల్లో పుస్తకాల కొనుగోలు కూడా సరిగా జరగడంలేదన్న ఆయన.. అవసరమైన పుస్తకాల జాబితాను ఇస్తే ఆ మేరకు పుస్తకాలను కొనుగోలు చేసి వాటిని గ్రంధాలయాల్లో ఏర్పాటు చేస్తామన్నారు.  మొబైల్స్‌కి పిల్లలను దూరంగా ఉంచుతూ.. లైబ్రరీలకు దగ్గర చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని లోకేష్ చెప్పారు.  

దేశమంతటా ఎస్ఐఆర్.. కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తం!

ఓట్ చోరీ ఆరోపణల విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. ఎన్నికల సంఘంపై ప్రజా విశ్వాసం దెబ్బతినేలా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఆందోళనకు, ఆయన చేస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టాలన్న కృత నిశ్చయానికి వచ్చింది. ఇందు కోసం ఓటర్ల జాబితాలోని అవకత వకలను సవరించాలన్న నిర్ణయం తీసుకుంది. అందు కోసం బీహార్  చేపట్టిన విధంగా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ ఓటర్ల జాబితాలను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) చేయాలని నిర్ణయించింది. బీహార్ లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ విమర్శల పాలైన సంగతి తెలిసిందే. అయితే ఎస్ఐఆర్ పై వచ్చిన అన్ని ఆరోపణలకూ వివరణ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం దేశ వ్యాప్తంగా ఎస్ఐఆర్ చేపట్టాలన్న నిర్ణయానికి వచ్చింది. ఎస్ఐఆర్ ద్వారా మాత్రమే ఓటర్ల జాబితాలోని అవక తవకలు, లోపాలను సరిద్దిద్దడం సాధ్యమౌతుందని భావిస్తోంది. గత దశాబ్దాలలో జరిగిన పట్టణీకరణ, కార్మికుల వలసలు వంటి కారణాలతో  ఓటర్ల జాబితాలో చేరిన డూప్లికేట్ ఎంట్రీలు, దొంగ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ చేపట్టింది.  అది సత్ఫలితాలను ఇచ్చింది. ఇప్పుడు అదే విధానాన్ని దేశ వ్యాప్తంగా అములు చేయాలని నిర్ణయించింది. ఎందుకంటే.. ఓటర్ల జాబితాల అంశం ప్రతి సారి వివాదాస్పదమవుతోంది. అధికారంలో ఉన్న రాజకీయపార్టీలు.. కుట్రపూరితంగా అధికారాన్ని నిలబెట్టుకునేందుకు తప్పుడు మార్గాల్లో ఓటర్లను చేర్చించడానికి చేసిన ప్రయత్నాలు నకిలీ, దొంగ ఓట్లు పెద్ద సంఖ్యలో జాబితాలో చోటు చేసుకోవడంతో సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో  వైసీపీ హయాంలో అధికా రుల్ని సైతం బెదిరించి వేల దొంగ ఓట్లు చేర్పించడం.. అసలైన ఓటర్లను తొలగించడం వంటివి జరిగాయన్న ఆరోపణలు రావడం విదితమే. ఇలాంటి వాటినన్నిటినీ ఎస్ఐఆర్ ద్వారా సరిదిద్దడానికి అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం చెబుతోంది. 

కాలినడకన ఇంద్రకీలాద్రిపైకి.. ఆపై క్యూలో వెళ్లి అమ్మవారి దర్శనం!

ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ  అమ్మవారికి తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దర్శించుకున్నారు. శరన్నవరాత్రులు తొలి రోజైన సోమవారం (సెప్టెంబర్ 22) ఆయన కాలినడకన ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకుని సాధారణ బక్తుడిలా క్యూలో నిలుచుని అమ్మవారిని దర్శించుకున్నారు.   గత రెండు దశాబ్దాలుగా దేవినేని ఉమ శరన్నవరాత్రులు ప్రారంభమైన తొలి రోజున కాలినడకన ఇంద్రకీలాద్రి కొండకు చేరుకుని దుర్గమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా పాటిస్తూ వస్తున్నారు. విజయవాడ వన్ టౌన్ లోని వినాయకుడి ఆలయం వద్ద నుంచి కాలినడకను ఇంద్రకీలాద్రి చేరుకుని క్యూలైన్ లో నిలుచుని సాధారణ భక్తుడిగా అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ ఏడాదీ అదే చేశారు. అంతకు ముందు వినాయకుడి గుడిలో దేవినేని ఉమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

బాబు బిజీబిజీ.. ఆ ఐదు రోజులూ నో అప్పాయింట్ మెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. నిత్యం ప్రజలతో మమేకమౌతూ, ప్రజా సమస్యలన తెలుసుకుంటూనే.. అధికారిక కార్యక్రమాలలో కూడా షెడ్యూల్ ప్రకారం పంక్చువల్ గా హాజరౌతై ఉంటారు. అలాగే పార్టీ వ్యవహారాలకూ సమయం కేటాయిస్తారు. వీటన్నిటినీ ఉటంకిస్తూ.. టైమ్ మేనేజ్ మెంట్ లో ఆయనను కొట్టే వారే లేరని అధికారులే కాదు.. పార్టీ శ్రేణులు కూడా చెబుతుంటాయి. అలాంటిది ఈ వారంలో ఓ ఐదు రోజుల పాటు చంద్రబాబు యమా బిజీగా గడపబోతున్నారు. ఎటువంటి అప్పాయింట్ మెంట్లూ ఇవ్వరు. వ్యక్తిగత సమావేశాలకు అసలే అవకాశం లేదు. విశాఖ, అమరావతి, తిరుమల, బాపట్ల, బెజవాడలలో వరుస కార్యక్రమాలలో పాల్గొనేలా ఆయన షెడ్యూల్ ఉంది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు ఐదు రోజుల పాటు ఆయన అప్పాయింట్ మెంట్ ఎవరికీ దొరకదు. ఇంతకీ విషయమేంటంటే.. మంగళవారం (సెప్టెంబర్ 22) నుంచీ రెండు రోజుల పాటు ఆయన విశాఖలో ఉంటారు. విశాఖలో జరిగే గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొని దేశ, విదేశవీ పెట్టుబడి దారులతో చర్చిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను వారికి వివరిస్తారు. ఇక సెప్టెంబర్ 24న అమరావతి వచ్చి అదే రోజు సాయంత్రం అదే రోజు సాయంత్రం ఆయన తిరుమలలో ఉంటారు. తరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా వేంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఇక ఈ నెల 26న ఆయన సూర్యలంకలో బీచ్ ఫఎస్టివల్ ను ప్రారంభిస్తారు. ఆ తరువాత 29వ తేదీన బెజవాడ కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు.   

పరకామణి అవకతవకల కేసు.. సీఐడీకి అప్పగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు

తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి సొమ్ము అవకతవకల కేసును సీఐడీకి అప్పగిస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడు రవికుమార్ పై అభియోగాలను కొట్టివేస్తూ లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పును నిలిపివేసిన హైకోర్టు  ఈ కేసును విచారించి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాల్సిందిగా సీఐడీని ఆదేశించింది.జగన్ హయాంలో  తిరుమల పరకామణిలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.  పరకామణిలో చోరీచేస్తూ పట్టుబడిన నిందితుడి నుంచి కొన్ని ఆస్తులను టీటీడీకి విరాళంగా అందజేయించి మిగిలిన ఆస్తులను అప్పట్లో టీటీడీలో పనిచేసిన కొందరు ఉన్నతాధికారులు, పోలీసులు, రాజకీయ ప్రముఖులు వాటాలుగా పంచుకున్నారన్న ఆరోపణల నిగ్గు తేల్చడానికి రంగం సిద్ధమైంది.    కేసు వివరాల్లోకి వెడితే.. తిరుమల పరకామణిలో రవికుమార్‌ ఓ మఠం తరఫున పనిచేసేవారు. ఏళ్ల తరబడిగా గుమస్తాగా ఉంటూ విదేశీ కరెన్సీ లెక్కించేవారు. చాలా కాలంగా విదేశీ కరెన్సీని పక్కదోవ పట్టించారనే ఆరోపణలు ఆయనపై  ఉన్నాయి.   2023 ఏప్రిల్‌ 29న విదేశీ కరెన్సీని లెక్కిస్తూ అందులో కొన్ని నోట్లను పంచెలో ప్రత్యేకంగా కుట్టించుకున్న జేబులలో దాచుకోగా, అనుమానంతో సిబ్బంది తనిఖీలు చేయగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.  ఆయనపై అప్పటి ఏవీఎస్వో సతీష్‌కుమార్‌ ఫిర్యాదుతో రవికుమార్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఆరోజు రవికుమార్ వద్ద లభ్యమైనవి 900 డాలర్లు వాటి విలువ అప్పట్లో అప్పట్లో  72 వేల రూపాయలుగా తేల్చారు. అంతకు ముందు చాలా కాలం నుంచీ కూడా రవికుమార్ పరకామణిలో  కోట్ల రూపాయలు కాజేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సరే రెడ్ హ్యాండెడ్ గా రవికుమార్ దొరికిపోయిన తరువాత  కొందరు వైసీపీయులు, అప్పటి టీటీడీలో పని చేస్తున్న కొందరు అధికారులు, పోలీసు అధికారులు రంగ ప్రవేశం చేసి తమ్మిని బమ్మిని చేసి కేసు నీరుగారిపోయేలా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. పరకామణిలో కాజేసి రవికుమార్ సంపాదించిన ఆస్తులలో కొన్నిటిని టీటీడీకి గిఫ్ట్ డీడ్ గా రాయించి, మిగిలిన వాటిని బినామీల పేరిట స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.  ఆ కారణంగానే నిందితుడు రవికుమార్ ను అరెస్టు చేయకుండా ఆ కేసును లోక్ అదాలత్ లో పెట్టి రాజీ చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నాడు లోక్ అదాలత్ రవికుమార్ పై కేసు కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పును నిలిపివేసి.. సీఐడీ విచారణకు ఆదేశించింది.  

వల్లభనేని వంశీ వైసీపీలో ఉన్నారా?

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంకా వైసీపీలో ఉన్నారా? కాదు కాదు అసలు రాజకీయాలలో ఉన్నారా? అన్న అనుమానాలు ఆ పార్టీ శ్రేణుల నుంచే వ్యక్తమౌతున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు వల్లభనేని వంశీ గన్నవరం సమీపంలోనే నివాసం ఉంటున్నారు. అయినా వైసీపీ నేతలు కానీ, కార్యకర్తలు కానీ ఆయన ఇంటి ఛాయలకు కూడా వెళ్లడం లేదు. అలాగే వంశీ కూడా పార్టీ వారితో అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు.  వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం కబ్జాలు, దాడులు, దౌర్జన్యాలతో చెలరేగిపోయిన వంశీ.. తెలుగుదేశం అగ్రనాయకులు, వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. అయితే..  2024 లో ఓడిపోయిన తర్వాత వల్లభనేని వంశీ నోటికి తాళం వేసుకున్నారు. గన్నవరం నియోజకవర్గం నుంచి గత ఎన్నికలలో వంశీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆ ఓటమి తరువాత వంశీ నియోజకవర్గంలో పెద్దగా కనిపించింది లేదు.   ఆ తర్వాత  జైలు పాలయ్యారు. బెయిలుపై బయటకు వచ్చారు. అయినా రాజకీయాలలో కానీ, పార్టీ వ్యవహారాలలో కానీ కలుగజేసుకోవడం లేదు. పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో గన్నవరం నియోజకవర్గానికి వైసీపీ ఇన్ చార్జిగా ఆయనను తప్పించి మరొకరిని నియమించే అవకాశాలున్నాయని అంటున్నారు. తొలుత ఈ ఇన్ చార్జిగా వంశీ సతీమణి పంకజశ్రీ పేరు వినిపించినా, అందుకు పంకజశ్రీ సుముఖత వ్యక్తం చేయకపోవడంతో.. మరొకరి కోసం గాలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.   మొత్తం మీద జగన్ చెప్పిన వైసీపీ అందగాడు వల్లభనేని వంశీ పార్టీకి దూరమయ్యారనీ, త్వరలోనే రాజీనామా ప్రకటన వెలువడినా ఆశ్చర్యంలేదనీ పరిశీలకులు అంటున్నారు. 

జగన్ పై అనర్హత వేటుపై యనమల ఏమన్నారంటే?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీని బాయ్ కాట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ పరిశీలకులు, రాజ్యాంగ నిపుణులు, అసెంబ్లీ వ్యవహారాలు, నిబంధనలపై అవగాహన ఉన్నవారు అందరూ కూడా జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలపై వేటు వేయాల్సిందే అంటున్నారు. అసెంబ్లీ నింబంధనల మేరకు వరుసగా 60 రోజులు అసెంబ్లీకి గైర్హాజరైన ఎమ్మెల్యేలపై వేటు వేసే అధికారం స్పీకర్ కు ఉంటుందంటున్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ స్పీకర్ గా పని చేసిన తెలుగుదేశం సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణ అయితే.. గైర్హాజర్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడమే కాదు.. తదుపరి ఎన్నికలలో పోటీకి అనర్హులుగా కూడా ప్రకటించే అవకాశం ఉందన్నారు. ఈ విషయాన్ని న్యాయస్థానాలు ల్చాల్సి ఉందన్నారు.   వరుసగా 60 రోజులపాటు సభకు హాజరు కాని ఎమ్మెల్యేలపై  అనర్హత వేటు వేయవచ్చని రాజ్యాంగ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయన్న యనమల రామకృష్ణుడు, తదుపరి ఎన్నికలలో వారిని పోటీకి అనర్హులుగా ప్రకటించే విషయంపై న్యాయస్థానాల అభిప్రాయం తీసుకోవలసి ఉందని చెప్పారు. 

వైసీపీలో జగన్ వర్సెస్ పెద్దిరెడ్డి?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పార్టీలో అసంతృప్తి పేరుకుపోతున్న పరిస్థితులు ఉన్నాయని పార్టీ శ్రేణులే బాహాటంగా చెబుతున్నాయి. పార్టీ సీనియర్ నాయకులు జగన్ ఆదేశాలను ఇసుమంతైనా పట్టించుకోవడం లేదంటున్నారు. దీంతో పార్టీ పరిస్థితి బద్దలవ్వడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా ఉందనీ, జగన్ పై పార్టీలో తిరుగుబాటు వచ్చినా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు.  ముఖ్యంగా జగన్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ వైఖరితో విసిగిపోయారంటున్నారు వైసీపీ నేతలు. ఇటీవల పెద్దరెడ్డి తన అసమ్మతినీ, అసంతృప్తినీ బాహాటంగానే పార్టీ నేతల వద్దా, తన అనుచరుల వద్దా వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.  వాస్తవానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో సీనియర్ నాయకుడు. అంతే కాకుండా వైఎస్ హయాం నుంచీ కూడా పెద్దిరెడ్డి ఆయన కుటుంబానికి విధేయంగా ఉంటూ వచ్చారు. వైఎస్ అనంతరం జగన్ తో కూడా అదే సాన్నిహిత్యం, విధేయతా ప్రదర్శిస్తూ వచ్చారు. అందుకే జగన్ ఆయనకు తన కేబినెట్ లో మంత్రిపదవి ఇవ్వడమే కాకుండా ఐదేళ్లూ మంత్రిగా కొనసాగనిచ్చారు.  ఇక గత ఎన్నికలలో జగన్ పార్టీ అత్యంత ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో తన పట్టు నిలుపుకున్నారు. అలాగే ఆయన కుమారుడు కూడా రాజంపేట నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఇంత వరకూ బాగానే ఉంది.. కానీ ఎప్పుడైతే మద్యం కుంభకోణంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు, రాజంపేట ఎంపీ అయిన మిథున్ రెడ్డి అరెస్టయ్యారో అప్పటి నుంచీ పెద్దిరెడ్డిలో అసహనం మొదలైందంటున్నారు. మిథున్ రెడ్డి అరెస్టైన తరువాత ఇంత వరకూ జగన్ మిథున్ రెడ్డిని ములాఖత్ ద్వారా కలిసి పరామర్శించకపోవడమే ఇందుకు కారణమంటున్నారు. కారణాలేమైనా ఒక్క మిథున్ రెడ్డి అనే కాదు.. మద్యం కుంభకోణంలో అరెస్టైన ఎవరినీ కూడా జగన్ రెడ్డి జైలుకు వెళ్లి పరామర్శించలేదు. ఆ విషయం అలా ఉండగా తాజాగా జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో  జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా జగన్  పెద్దిరెడ్డికి కీలక బాధ్యత అప్పగించారు. తాను అసెంబ్లీకి హాజరు కాకపోయినా.. పార్టీ ఎమ్మెల్యేలు సభకు హాజరై పార్టీ వాయిస్ ను గట్టిగావినిపిచాలన్న జగన్  పెద్దిరెడ్డిని  ముందుండి పార్టీ సభ్యులను గైడ్ చేయాలని ఆదేశించారు. అయితే పెద్దిరెడ్డి ఆ ఆదేశాలను పాటించలేదు.. సరికదా తన వల్ల కాదని ముఖంముందే కుండబద్దలు కొట్టేశారు. అంతటితో ఆగకుండా పార్టీ అధినేత సభను బాయ్ కాట్ చేసి తనను వెళ్లమనడమేంటని పార్టీ  నేతలతో ఒకింత అసహనంతో వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ విషయమే పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది. పెద్దిరెడ్డి వంటి నేతే జగన్ ఆదేశాలను ఖాతరు చేయలేదంటే.. పార్టీపై జగన్ పట్టు సడలినట్టేనని అంటున్నారు.  సొంత పార్టీ నేతల విశ్వాసంపొందడంలోనే విఫలమైన జగన్ ను  జనం ఎలా నమ్ముతారని పార్టీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతోంది.

ఓపిక పట్టు.. జాక్ పాట్ కొట్టు.. సేనాని సంయమనం కథ!

ఇది నిజంగా ఒక విజ‌య గాథ‌. ప్ర‌స్తుతం శ్రీకాళ‌హ‌స్తి ఆల‌య చైర్మ‌న్ గా నియ‌మితులైన కొట్టేసాయి.. అప్ప‌ట్లో నిజంగానే సీఐ అంజూ యాద‌వ్ చేతిలో చెంప‌దెబ్బ కొట్టించుకున్నారు. ఆ అవ‌మాన భారం ఆయ‌న్ను ఎంత‌కీ వ‌ద‌ల్లేదు. ఎందుకంటే అది ప‌బ్లిక్ లో జ‌రిగింది. దానికి తోడు వీడియోల్లోనూ రికార్డ‌య్యింది.  కానీ కాలం అన్నీ చూస్తూనే ఉంటుంది. ఆ శివ‌య్య కూడా స‌రిగ్గా అదే స‌మ‌యంలో ఓర్పు వ‌హించు నీకూ మంచి కాలం వ‌స్తుంద‌ని అభ‌య‌మిస్తుంటాడు. మ‌న‌మే దాన్ని గ్ర‌హించాల్సి ఉంటుంద‌ని సాయి అలా ఓపిక ప‌డుతూ వ‌చ్చారు. ఈలోగా రాష్ట్రంలో రాక్ష‌స పాల‌న అంత‌మై కూట‌మి పాల‌న మొద‌లైంది. జనసేనాని తొలిచూపు.. కొట్టే సాయి వైపు మ‌ళ్లింది. అప్పుడు పార్టీ కోసం చెంప దెబ్బ తిన్న నేత‌కు ఏదైనా సాయం చేస్తే మేల‌నిపించింది. వెంట‌నే కొట్టేసాయిని అదే ఆల‌యం చైర్మ‌న్ గా చేశారు. ఈ మ‌ధ్య కాలంలో సేనాని ప‌దే ప‌దే ఇదే మాట అంటున్నారు. ఇటీవ‌ల మ‌చిలీప‌ట్నం ఉదంతం తీస్కుంటే, సేనాని ఇదే చెప్పారు. మీరెవ‌రూ చ‌ట్టాన్ని చేతిలోకి తీస్కోవ‌ద్దు. అంతా చ‌ట్ట ప్ర‌కార‌మే వెళ్దాం. కాస్త సంయ‌మ‌నం వ‌హించ‌మ‌ని అన‌డం మాత్ర‌మే కాదు త‌న శ్రేణుల‌ను ఉద్దేశించి.. పెద్ద ఎత్తున ట్వీట్ లెట‌ర్ రాశారు కూడా.  ఇప్పుడు కొట్టే సాయి రూపంలో.. అదే నిరూపించారు. సంయ‌మ‌నం వ‌హిస్తే క‌ఠిన కాలం క‌రుగుతుంది. అదృష్ట‌కాలం వ‌రిస్తుంది. ఇదిగో ఇలాంటి ప‌ద‌వులు సైతం పొందే అవ‌కాశం ల‌భిస్తుంది. కాబ‌ట్టి ఓపిక ప‌ట్టు జాక్ పాట్ ప‌ట్టు అన్న‌ది ఇందు మూలంగా మ‌నం నేర్చుకోవ‌ల్సిన పాఠంగానూ తెలుస్తోంది.