social media make celebreties ond day

ఏక్ దిన్ కా సెలబ్రిటీ.. దో దిన్ మే దివాళా

కుమారి ఆంటీ నుంచి అఘోరీ మాత వ‌ర‌కూ రాత్రికి రాత్రి ఫేమ‌స్.. త‌ర్వాత అంతా తుస్ గ‌తంలో ప్ర‌ముఖులు అంటే వారికంటూ ఒక సుదీర్ఘ కాల అనుభ‌వం ఫ‌లానా రంగంలో ఉండేది. వారు వ్యాపారంలోగానీ, క్రీడ‌లు, క‌ళ‌ల్లో విశేషంగా రాణించ‌డం వ‌ల్ల వారికా పేరు ప్ర‌ఖ్యాతులు వ‌చ్చేవి. ప‌ది మందికీ ఆద‌ర్శ‌వంత‌గా మారేవారు. ప‌దికాలాల పాటు వారి వ్యాపార వ్య‌వ‌హారాలు మ‌రింత సుర‌క్షితంగా సుభిక్షంగా న‌డిచేవి.  అదే ఇప్పుడు ఆ స్టాండర్డ్స్ అంటూ ఏవీ లేవు. ఎవ‌రైతే వాళ్లు.. ఎలా ప‌డితే అలా.. ఫేమ‌స్ అయిపోతున్నారు. ఎందుకు ఫేమ‌స్ అవుతారో.. ఎందుకు వైర‌ల్ అవుతారో.. ఒక లెక్కా ప‌త్రం ఉండ‌టం లేదు. మ‌రీ ముఖ్యంగా సోష‌ల్ మీడియా జ‌మానా వ‌చ్చేస‌రికి.. స‌డెన్ స్టార్ లా రాత్రికి రాత్రి వైర‌ల్ అవుతారు. అదంతా నిజ‌మ‌ని న‌మ్మే లోపు.. అథఃపాతాళానికి ప‌డిపోతుంటారు.  దీన్ని ఏమ‌నాలి? ఇలా ఎందుకు జ‌రుగుతోంది? కారణాలు ఏమై ఉంటాయ‌ని చూస్తే.. మీకు మాస్ మీడియంలో ఫ‌స్ట్ ప్లేస్ లో నిలిచేది పేప‌ర్. వార్తా ప‌త్రిక‌. వార్తా  ప‌త్రిక‌లో అన్ని వార్త‌ల‌కూ ఒక చోటు ఉంటుంది. కాకుంటే వెన‌కా ముందు. అదే ఎలెక్ట్రానిక్ మీడియా వ‌చ్చాక.. వార్త వాల్యూ అన్న‌ది తారు మారు అవుతూ వ‌చ్చింది.  విజువ‌ల్ బాగుంటే అది అంత ప్రాధాన్య‌త లేనిదైనా కూడా దానికంటూ టీవీ న్యూస్ లో ఒక చోటు ప్ర‌ధానంగా ల‌భించేది. ఎంద‌రికో సంబంధించిన విషయాల్లో ఎన్నో వార్త‌లు వ‌స్తుంటాయి. కానీ చూడ్డానికి ఇంపుగా ఉండేవారి వార్త‌లు మాత్రం ప‌దే ప‌దే ప్లే చేస్తుంటారు. దీంతో వారికి అంత విలువ లేక పోయినా.. వారికున్న విజువ‌ల్ బ్యూటీ అన్న ఒక కార‌ణం చేత వారిని ఫేమ‌స్ చేసేది ఎలెక్ట్రానిక్ మీడియా. ఇక సోష‌ల్ మీడియా జ‌మానా వ‌చ్చేస‌రికి.. దీని డెప్త్ డెన్సిటీ మ‌రింత పెరిగింది. కుమారీ ఆంటీనే తీసుకోండి. రాత్రికి రాత్రి ఆమె ఒక సెల‌బ్రిటీ అయిపోయింది. ఒక స‌మ‌యంలో రోడ్డు మీద ఫుడ్డు బిజినెస్ చేసే ఆమె గురించి సీఎంలు ఆరా తీసేవారంటే ప‌రిస్థితి ఏమిటో ఊహించుకోండి. అంత‌గా ఆమె మోస్ట్ పాపులర్ అయిపోయారు.  ఆమె అమ్మే ఆహారంలో నాణ్య‌త నుంచి, ఆమె వ‌సూలు చేసే ధ‌ర వ‌ర‌కూ అంతా డిస్క‌ష‌నే. అంత‌గా ఆమె పాపుల‌ర్ అయిపోయారు. త‌ర్వాత చూస్తే ఆమె ఏం చేస్తున్నారో తెలీదు. ఇప్పుడు కుమారీ ఆంటీ షాపే క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు.  బ‌ర్రెల‌క్క సంగ‌తే తీసుకోండి. కొంప‌దీసి.. ఆమెగానీ ఎమ్మెల్యేగా గెలిచిపోతుందా అనుకున్నారు. క‌ట్ చేస్తే బ‌ర్రెల‌క్క‌కు ల‌క్ష‌ల్లో వ‌స్తాయ‌నుకున్న ఓట్లు కాస్తా వేల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యాయి. ఆ నియోజ‌వ‌ర్గంలో ఆమె గురించి ఎవరికీ తెలీద‌ట‌. క‌నీసం ప‌క్కింటి వాళ్లు కూడా గుర్తు ప‌ట్ట‌లేరని అంటారు. కానీ.. కొన్నాళ్ల గ్యాప్ లో ప్ర‌పంచ‌మంతా తెలిసిపోయారామె. అప్ప‌ట్లో ఆమెకు చందాలే కొన్ని ల‌క్ష‌ల్లో వ‌చ్చాయ‌ని అంటారు.  ఇపుడామె ఊసేదో.. గోసేదో.. ఎవ‌రికీ తెలీడం లేదు.  ఇక పూస‌ల‌మ్మే మోనాలిసా. క‌ళ్ల‌లో ఒక ర‌క‌మైన కైపును క‌లిగి ఉన్న ఈమె మొహం కుంభ‌మేళా టైంలో ఒక సంచ‌ల‌నం. ఆమెను   వైర‌ల్ చేయ‌డంతో.. ఆమె మోస్ట్ పాపుల‌ర్ సెల‌బ్రిటీ ఆఫ్ కుంభ‌మేళాగా అవ‌త‌రించారు. జాతీయ స్థాయిలోనే కాదు అంత‌ర్జాతీయ స్థాయిలోనూ పేరొచ్చేసింది. ఈమెతో ఒక సినిమా చేస్తాన‌ని ఒక ద‌ర్శ‌కుడు ముందుకొస్తే అత‌డు కాస్తా ఇప్పుడు జైల్లో ఉన్నాడు. క‌ట్ చేస్తే ఏ సినిమా లేదు. మిగిలిన‌దంతా ఒక సోష‌ల్ మీడియా డ్రామా త‌ప్ప‌!!! తాగి వాగిన రాకేష్ మాస్ట‌ర్ ని కూడా ఇలాగే ఫేమ‌స్  చేసిందీ సోష‌ల్ మీడియా స‌మాజం. నిజంగానే తాను తాగి వాగితే అంత గొప్ప‌గా ఉంటుందా? అన్న మాయ‌లో ప‌డ్డ రాకేష్ మాస్ట‌ర్ త‌న తాగుడ్ని విప‌రీతంగా పెంచేశాడు.  అప్పుడో ఇప్పుడో తాగాల్సిన వాడు కాస్తా.. తాగ‌డం అన్న‌దొక దిన‌చ‌ర్య‌గా మార్చుకున్నాడు.. ఆయ‌న తాగి వాగే వ్య‌వ‌హారాలు మాంచి కిక్ ఇస్తాయ‌ని తెలిసిన కొంద‌రు.. వెబ్ సీరీస్ ప్లాన్ చేశారు. అక్క‌డ మందు మ‌రింత ఫ్రీగా దొరికే స‌రికి.. పూటుగా తాగి బీర్ బాటిల్ త‌న్నేశాడు. అదేమంటే అత‌డు తాగిన బీరులోనే తేడా ఉంద‌న్న టాకొచ్చింది. ఏమైతేనేం.. అతడొక బీరు బ‌లిగా పేరు సాధించాడు. ఏకంగా ఈ లోకంలోనే లేకుండా పోయాడు. కిరాక్ ఆర్పీ చెప్పిన‌ట్టు ప‌బ్బుల్లో ఏ చీక‌ట్లో ఏ సెల‌బ్రిటీల ర‌హ‌స్యాలు వింటాడో ఏమో వేణుస్వామి.. అత‌డేదైనా అంటే అది కొన్నాళ్ల‌లో జ‌రిగి కూర్చునేది. ఇత‌డి మాట‌ల మ‌హ‌త్యం ఎక్క‌డి వ‌ర‌కూ వెళ్లిందంటే, ఊళ్ల‌ల్లో అమ్మ‌ల‌క్క‌లు కూడా వేణు స్వామి ఈ సారి మ‌ళ్లీ  ఈ ప్ర‌భుత్వమే వ‌స్తుంద‌ని అన్నాడే.. మ‌రి వ‌చ్చేస్తుందేమో అంటూ వాళ్లు నోళ్లు నొక్కుకుని మాట్లాడుకునే వ‌ర‌కూ వెళ్లింది వ్య‌వ‌హారం. ఎప్పుడైతే ఆయ‌న చెప్పిన జోస్యం ఏపీ ఎన్నిక‌ల  ఫ‌లితాల్లో తేడా కొట్టి బోల్తా ప‌డిందో.. త‌ర్వాత ఈ ఫ్లూటు స్వామి కాస్తా ఫాల్తు స్వామి కింద త‌యార‌య్యాడు. ఇప్పుడాయ‌న చెప్పేవి ఎంత జ‌రిగినా స‌రే అత‌నొక వేస్ట్ ఫెలో కింద ముద్ర ప‌డిపోయారు.  అలేఖ్య చిట్టీ ప‌చ్చ‌ళ్ల వ్య‌వ‌హార‌మే తీసుకోండి.. ఇదే సోష‌ల్ మీడియా స‌మాజం వారిని అంద‌నంత ఎత్తుల‌కు తీసుకు వెళ్లింది. అక్క‌డ ఒక చిన్న క‌స్ట‌మ‌ర్ తో వారు అసభ్యంగా మాట్లాడిన చిన్న ఆడియో క్లిప్ ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఒక వైర‌ల్. క‌ట్ చేస్తే వారికి సంబంధించిన ఎన్నో బాగోతాలు బ‌ట్ట‌బ‌య‌లు కావ‌డంతో.. ఇప్పుడా ప‌చ్చ‌ళ్ల దందానే లేకుండా పోయింది. ఈ ముగ్గురాడ పిల్ల‌లు రోడ్డున ప‌డ్డ సిట్యువేష‌న్. దానికి తోడు ప్ర‌పంచ మాన‌వ చ‌రిత్ర‌లోనే ఒక మ‌గాడి ఉసురు త‌గిలి ఆడ‌వారు దివాళా తీసార‌న్న టాకు.. బీభ‌త్సంగా సౌండ్ చేస్తోంది.  అటు ఇటు కాని అఘోరీ వ్య‌వ‌హారం. అనూహ్యంగా సెల‌బ్రిటీ అయ్యాడు శ్రీనివాస్ అనే ఈ తేడా మాయగాడు. అత‌డు దిస మొల‌తో దిగిన వీడియోలు సైతం వైర‌లే. ఆమెగా మారిన అత‌డికి పీరియ‌డ్స్ వ‌స్తాయా రావా? అన్న‌ది కూడా ఒక డిబేట‌బుల్ పాయింటే. ఈ తేడాను న‌మ్మి వ‌ర్షిణీ అనే మంగ‌ళ‌గిరి అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకోవ‌డం. ఇప్పుడ‌దో సెన్సేష‌న్. మెయిన్ స్ట్రీమ్ మీడియాకెక్కి లైవుల్లో ఆమె ప్రేక్ష‌కుల మ‌నోభావాల‌తో చెడుగుడు ఆడేసుకునేంత ప్ర‌యారిటీ సొంతం చేసుకుంది. తీరా ఈ అఘోరీ వ్య‌వ‌హారం కేసులు, అరెస్టులు, ఆంక్ష‌లు.  ఇలా ర‌క‌ర‌కాల బాగోతాలు. ఈ అఘోరీ  మాత ప్ర‌స్తుతం పెళ్లి చేసుకుంది స‌రే, ఆ అమ్మాయితో కాపురం ఎలా సాగుతుంద‌నే కొత్త‌ చ‌ర్చ‌. త‌ర్వాత ఏ పోలీసులొచ్చి.. అరెస్టు చేసి.. ఈ తేడా అఘోరీని ఏ జైల్లో పెడ‌తారో తెలియ‌దు.      సోష‌ల్ మీడియా జ‌మానాలో పేరు సాధించ‌డం సో ఈజీ. కానీ త‌ర్వాత సిట్యువేష‌నే టూ బ్యాడ్ టూ వ‌రెస్టుగా త‌యార‌వుతోంది. కుమారి ఆంటీ  నుంచి అలేఖ్చ చిట్టీ వ‌ర‌కూ అంద‌రిదీ ఇదే బాప‌తు. ఇలా ఫేమ‌స్ అవుతున్నారు.. అలా వారి వ్యాపారం, వ్య‌వ‌హార‌మంతా తుస్సు మంటోంది. ఆ టైంలో వారిని ట్రోల్ చేసి ఎంజాయ్ చేస్తున్న నెటిజ‌న్లు కూడా త‌ర్వాత వారి ఊసే ప‌ట్టించుకోవ‌డం మానేస్తున్నారు.

six platforms in secundrabad railway station closed

సికిందరాబాద్ స్టేషన్ మూసివేత?.. కారణమేంటో తెలుసా?

సికింద్రాబాద్ రైల్వే‌స్టేషన్  ఆధునీకరణ పనుల కారణంగా వంద రోజుల పాటు స్టేషన్ లోని ఆరు ప్లాట్ ఫారమ్ లను క్లోజ్ చేస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగా సికిందరాబాద్ నుంచి దాదాపు 120 రేళ్లు సికిందరాబాద్ కు రావు. వీటిని చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లకు మళ్లిస్తారు.  సికిందరాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణంలో భాగంగా స్కై కాంకోర్స్, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జ్‌లను నిర్మించనున్నారు. తొలుత 3 నుంచి 5 నంబర్ ప్లాట్ ఫారమ్ ల పనులను చేపడతారు. ఈ పనులు దాదాపు 50 రోజుల పాటు సాగుతాయని అంచనా, ఈ పనులు పూర్తి అయిన తరువాత  పదో నంబర్ ప్లాట్ ఫామ్ వైపు పనులను చేపడతారు. ఆధునీకరణ పూర్తియన తరువాత సికిందరాబాద్ రైల్వే స్టేషన్ రూపురేకలు మారిపోతాయనీ, అంతర్జాతీయ విమానాశ్రయానికి దీటుగా ఈ రైల్వే స్టేషన్ ఉంటుందనీ అధికారులు చెబుతున్నారు. ఆధునీకరణ పనుల నేపథ్యంలో ప్రయాణీకులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొన్న అధికారులు వంద రోజుల పాటు ప్రయాణీకులు రైళ్ల కోసం చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లకు వెళ్లాలని కోరారు.  

andhra pradesh cabinet meet

ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం మంగళవారం (ఏప్రిల్ 15) సమావేశమైంది. వెలగపూడి సచివాలయంలో  జరుగుతున్నఈ కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ముఖ్యంగా సీఆర్డీయే అథారిటీ ఆమోదించిన అంశాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం అవసరమైన నిధుల సమీకరణకు సీఆర్డీయే కమిషనర్ కు అనుమతి ఇవ్వడం సహా, అసెంబ్లీ , హైకోర్టు శాశ్వత భవనాల నిర్మాణానికి టెండర్లకు పచ్చ జెండా ఊపనుంది.   అలాగే ఎన్ఐపిబీ సమావేశంలో ఆమోదించిన పెట్టుబడులపై కేబినెట్ ఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదే విధంగా రూ.30,667 కోట్ల పెట్టుబడుల  ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్, విశాఖపట్నంలో టీసీఎస్ కంపెనీ ఏర్పాటుతో పాటు పలు కంపెనీల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. అదే విధంగా ఐటీ కంపెనీలకు భూ కేటాయింపులు, కుప్పంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు, నెల్లూరులో ఏపీఐఐసీ, విజయనగరంలో గ్రేహౌండ్స, ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటుకు భూముల కేటాయింపు విషయంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.  అలాగే ఈ కేబినెట్ భేటీ ఉండవల్లి, పెనుమాక రైతులకు జరీబు భూములకు రిటర్నబుల్ ప్లాట్ల అంశంపై కూడా చర్చించే అవకాశం ఉ:దంటున్నారు.  అమరావతి రాజధాని పనుల పునః ప్రారంభ  కా ర్యక్రమానికి  ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్న నేపథ్యంలో సభ ఏర్పాట్లు, ఇతర అంశాలపై కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశాలు ఉన్నాయి.  

sit raids in jagan relative house and offices in hyderabad

జగన్ బంధువు నివాసాలు, కార్యాలయాల్లో సిట్ సోదాలు!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ బంధువు నివాసాలు కార్యాలయాలలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ సోదాలు నిర్వహించింది. జగన్ హయాంలో రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణంపై సిట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డికి సిట్ ఇప్పటికే మూడు సార్లు నోటీసులు ఇచ్చింది. అయితే ఆయన పోలీసు విచారణకు హాజరు కాలేదు. సిట్ గత నెల 28, 29 తేదీలలో ఇచ్చిన నోటీసులు ఇవ్వగా విచారణకు గైర్హాజరైన రాజ్ కసిరెడ్డి   తనకు సిట్ నోటీసులు పంపడాన్ని సవాల్ చేస్తూ హైకో ర్టును ఆశ్రయించారు. అయితే కసిరెడ్డి రాజ్ కు హైకోర్టులో చుక్కెదురైంది. సిట్ నోటీసుల విషయంలో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో సిట్ ఆయనకు ఈ నెల 5న మరోసారి నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 9న విచారణకు హాజరు కావాల్సిందిగా పేర్కొంది. అయితే కసిరెడ్డి రాజ్ ఈ సారీ విచారణకు డుమ్మా కొట్టారు. ఆయన ఫోన్ కూడా స్విచ్ఛాప్ ఉంది. దీంతో కసిరెడ్డి పరారీలో ఉన్నట్లు నిర్ధారించుకున్న సిట్  అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టింది. ఏపీ మద్యం కుంభోకోణం దర్యాప్తునకు కసిరెడ్డి రాజ్ ను విచారించి సమాచారం రాబట్టడం అత్యంత కీలకంగా సిట్ భావిస్తోంది. అతడి వద్ద నుంచి విలువైన సమాచారం రాబట్టి కుంభకోణం కేసుకు లాజికల్ ముంగింపు ఇవ్వాలని సిట్ భావిస్తోంది. ఇప్పటికే సిట్ మద్యం కుంభకోణానికి సంబంధించి ఎక్సైజ్ అధికారులను విచారించి విలువైన సమాచారాన్ని సేకరించింది.   

kamalhasan as rajyasabha member

లోకనాయకుడు.. రాజ్యసభ సభ్యుడు..డీఎంకే పొత్తు ఫలితం!

ప్రముఖ సినీ నటుడు, మక్కళ్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం)అధినేత కమల్ హాసన్ త్వరలో  చట్టసభలో అడుగుపెట్టనున్నారు. ఆయన రాజ్యసభ సభ్యుడు కానున్నారని  ఎంఎన్‌ఎం  ఉపాధ్యక్షుడు తంగవేల్  చెప్పారు.  కోయంబత్తూర్‌లో సోమవారం (ఏప్రిల్ 14)  తంగవేల్ కమల్ హసన్ కు రాజ్యసభ సభ్యత్వం దక్కనున్న విషయాన్ని వెల్లడించారు.  అంబేడ్కర్ జయంతి సందర్భంగా కోయంబత్తూర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న తంగవేల్, ఆ తరువాత మీడియాతో మాట్లాడారు.  కమల్ హాసన్‌ను రాజ్యసభకు పంపాలని పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించిందని చెప్పారు.  ఆయన డీఎంకే మద్దతులో రాజ్యసభ కు ఎన్నికౌతారని చెప్పారు. ప్రస్తుతం సినీమా షూటింగ్ కోసం అమెరికాలో ఉన్న కమల్ హసన్.. జూలైలో రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు చేపడతారని పేర్కొన్నారు.    2021లో జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ఎంఎన్‌ఎం పార్టీ, అధికారంలో ఉన్న ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)తో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా జరిగిన ఒప్పందం మేరకు డీఎంకే కమల్ హసన్  పార్టీ మక్కళ్ నీది మయ్యంకు ఒక రాజ్యసభ స్థానం కేటాయించడానికి అంగీకారం తెలిపింది. ఇప్పుడు ఇద్దరు డీఎంకే రాజ్యసభ సభ్యుల  పదవీ కాలం జులైలో ముగియనుంది. దీంతో ఖాళీ అయ్యే ఆ రెండు స్థానాలలో ఒక స్థానం నుంచి కమల్ హసన్ ను రాజ్యసభకు పంపుతారని తంగవేల్ చెప్పారు.   తన నటన ద్వారా లోకనాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కమల్ హసన్ ఎంఎన్ఎం పార్టీని స్థాపించి రాజకీయాలలో క్రీయాశీలం అయిన సంగతి తెలిసిందే.   ఇప్పుడు ఆయన రాజ్యసభ సభ్యుడిగా చట్టసభలలో అడుగుపెట్టనున్నారు.  

prime minister modi put shoes to his fan

సామాన్యుడికి పాదరక్షలు తొడిగిన ప్రధాని మోడీ

పధ్నాలుగేళ్ల కిందట ఓ వ్యక్తి ఓ ప్రతిజ్ణ చేశారు. అప్పటికి గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్రమోడీ దేశానికి ప్రధాని అవ్వాలనీ, ఆయనను తాను స్వయంగా కలవాలనీ, అంత వరకూ పాదరక్షలు ధరించబోననీ ప్రతిన పూనారు. అప్పటి నుంచీ ఆ వ్యక్తి పాదరక్షలు ధరించడం మానేశారు. 2014 ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ప్రధానిగా నరేంద్రమోడీ పదవీ పగ్గాలు చేపట్లారు. అయినా ఆ వ్యక్తి ప్రధానిని కలవడం కుదరలేదు. దీంతో పాదరక్షలు ధరించబోనన్న తన ప్రతిజ్ణను కొనసాగించారు. 2019లో మరో సారి ఎన్డీయే కూటమి విజయం సాధించింది. నరేంద్రమోడీ దేశ ప్రధానిగా రెండో సారి పదవీ బాధ్యతలు చేపట్టారు. అయినా ఆ వ్యక్తి తన దీక్షను కొనసాగించారు. 2024 ఎన్నికలలో కూడా ఎన్డీయే కూటమి విజయం సాధించింది. ముచ్చటగా మూడో సారి మోడీ ప్రధాని అయ్యారు. మూడో సారి ప్రధానిగా పగ్గాలు చేపట్టిన పది నెలల తరువాత మోడీ ఆ వ్యక్తిని కలిశారు. దీక్షను విరమింప చేశారు.  అసలు విషయం ఏమిటంటే.. 14 ఏళ్ల కిందట హర్యానాకు చెందిన రాంపాల్ కస్యప్ అనే వ్యక్తి ప్రధాని మోడీపై అభిమానంతో ఆయన ప్రధాని అయ్యే వరకూ, ఆయనను తాను కలిసే వరకూ  పాదరక్షలు ధరించేది లేదని శపథం చేశారు. పాదరక్షలు ధరించబోనన్న దీక్షను గత 14 ఏళ్లుగా కొనసాగిస్తూనే వచ్చారు. చివరకు ఎట్టకేలకు ప్రధాని నరేంద్రమోడీ రాం కాశ్యప్ ను యమునాగర్ లో స్వయంగా కలిశారు. ఇటువంటి ప్రతిజ్ణలు చేయవద్దనీ, ప్రజా సేవపై దృష్టి పెట్టమనీ హితవు చెప్పారు. అంతే కాకుండా స్వయంగా రాం కాశ్యప్ కు పాదరక్షలు తొడిగి దీక్ష విరమింప చేశారు.  ఆ సందర్భంగా రాంపాల్ కశ్యప్ తో మోడీ కొద్ది సేపు మాట్లాడారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ స్వయంగా ఎక్స్ వేదకగా ప్రజలతో పంచుకున్నారు.  హర్యానాలోని కైథాల్ నివాసి అయిన రాంపాల్ కశ్యప్‌తో ప్రధాని మోదీ కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, "నేను ఇప్పుడు మీకు పాదరక్షలు తొడుగుతున్నాను, కానీ భవిష్యత్తులో ఇలాంటి పనులు ఎప్పుడూ చేయవద్దు. మీరు పని చేసుకోవాలి, ఇలా మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం ఎందుకు?" అని సూచించారు. ప్రధానిని కలవడం పట్ల రాంపాల్ కశ్యప్ ఆనందం వ్యక్తం చేశారు.  ఈరోజు యమునానగర్ బహిరంగ సభలో కైథాల్‌కు చెందిన శ్రీ రాంపాల్ కశ్యప్‌ను కలిశాను. నేను ప్రధాని అయ్యాక, నన్ను కలిసిన తర్వాతే పాదరక్షలు ధరిస్తానని ఆయన 14 ఏళ్ల క్రితం ప్రతిజ్ఞ చేశారు. రాంపాల్ వంటి వారి పట్ల నేను వినమ్రుడను, వారి అభిమానాన్ని స్వీకరిస్తాను. కానీ ఇలాంటి ప్రతిజ్ఞలు చేసే వారందరినీ కోరుతున్నాను - మీ ప్రేమను  గౌరవిస్తాను... దయచేసి సామాజిక సేవ, దేశ నిర్మాణానికి సంబంధించిన పనులపై దృష్టి పెట్టండి!" అని మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.  రాంపాల్ కశ్యప్ కు తాను పదరక్షలు తొడుగుతున్న వీడియోను ఆ పోస్టకు జత చేశారు.  

ap liquor scam sit speed up investigation

మద్యం కుంభకోణం దర్యాప్తులో సిట్ దూకుడు.. కసిరెడ్డి నివాసంలో సోదాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సిట్ దర్యాప్తు వేగం పుంజుకుంది. జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీలో దాదాపు 2 వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై దర్యాప్తునకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన సంగతి విదితమే.  విజయవాడ సీపీ నేతృత్వంలోని సిట్ దర్యాప్తులో దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ కేసులో కర్త, క్రియ, కర్మ కసిరెడ్డి రాజశేఖరరెడ్డేనని వైసీపీ మాజీ నాయకుడు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇప్సుడు ఆ కసిరెడ్డి రాజశేఖరరెడ్డి కోసం సిట్ గాలింపు ప్రారంభించింది. ఈ కేసులో ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖరరెడ్డికి మూడు సార్లు విచారణకు పిలిచారు. అయితే మూడు సార్లూ ఆయన విచారణకు డుమ్మా కొట్టారు.  ఈ నేపథ్యంలోనే సిట్ ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టింది. హైదరాబాద్ లోని కసిరెడ్డి నివాసం, కార్యాలయాలలో సోదాలు నిర్వహించింది. సోమవారం (ఏప్రిల్ 14) కసిరెడ్డి నివాసానికి చేరుకున్న  సిట్ అధికారులు ఆయన నివాసంలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కంప్యూటర్, హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు.  స్థానిక పోలీసుల సహకారంలో ఈ సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు నిర్వహిస్తున్న సమయంలో కసిరెడ్డి ఇంట్లో లేరని అంటున్నారు.  అలాగే కసిరెడ్డి కార్యాలయంలోనూ పోలీసులు సోదాలు నిర్వహించారు.  

janareddy letter raises political heat in congress

జానా చాణక్యం.. ఒక్క లేఖతో రాజగోపాల్‌కు చెక్ పెట్టే ప్రయత్నం!

అన్నయ్య ఆల్రెడీ మినిస్టర్. ఆయన ఎమ్మెల్యే. అయినా సరే అన్న లెక్క అన్నదే. నా లెక్క నాదే. ఇదే మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయం. అందుకే మినిస్టర్ పోస్టు కోసం గట్టిగా అడిగేస్తున్నారు. కానీ ఒకే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులెట్లా? అనేది కాంగ్రెస్‌లో జరుగుతున్న చర్చ. దానికి కూడా దిమ్మతిరిగిపోయే ఎగ్జాంపుల్ ఒకటి చెప్పారు రాజగోపాల్ రెడ్డి. ఇండియన్ క్రికెట్‌ టీమ్‌లో ఒకప్పుడు యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ ఇద్దరూ ప్రాతినిధ్యం వహించలేదా? వాళ్లకు లేనిది ఒకే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులిస్తే తప్పా? అని కాస్త లాజికల్‌గానే అడుగుతున్నారు.  భువనగిరి ఎంపీ సీటు గెలిపిస్తే  మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ పార్టీ తనకు హమీ ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు.  ఉమ్మడి నల్గొండ జిల్లాలో.. రాజకీయంగా కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఎంత పట్టు ఉందో వేరే చెప్పక్కర్లేదు. వాళ్లు ఫోకస్ పెడితే ఉమ్మడి జిల్లాలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు గెలిపించగలిగే సత్తా, స్థోమత ఉన్నోళ్లనే అభిప్రాయం ఉంది. వాళ్ల స్టామినా ఏమిటో తెలుసు కాబట్టే కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ముందే మంత్రి పదవి కట్టబెట్టేసింది. ఇప్పుడు ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కూడా మినిస్టర్ రేసులో ఉన్నారు. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మంత్రులుగా ఉన్నారు. ఇదే వర్గానికి చెందినరాజగోపాల్ రెడ్డి కూడా మినిస్టర్ పోస్టు ఆశిస్తున్నారు. ఇది.. ఎప్పట్నుంచో నడుస్తున్న వ్యవహారమే.  కానీ ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి రాసిన ఓ లేఖ.. నల్గొండ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నల్గొండ జిల్లా నేత అయి ఉండి, రంగారెడ్డి జిల్లా నేతకు మంత్రి పదవి ఇవ్వాలని జానారెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాశారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పొలిటికల్‌గా జానారెడ్డి ఇప్పుడు యాక్టివ్‌గా లేరు. ఆయన ఇద్దరు కుమారులు.. యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వచ్చేశారు. ఒక కుమారుడు ఎమ్మెల్యేగా, ఇంకో కొడుకు  ఎంపీగా గెలిచారు. జానారెడ్డి తన కుమారుల రాజకీయ భవిష్యత్‌ని దృష్టిలో ఉంచుకొనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తెలివిగా చెక్ పెట్టాలని చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కోమటిరెడ్డి బ్రదర్స్‌లో ఒకరికి మంత్రి పదవి ఉంది. మళ్లీ రాజగోపాల్ రెడ్డికి కూడా మినిస్టర్ పదవి దక్కితే, ఇక జిల్లాలో తన ఫ్యామిలీ రాజకీయంగా ఎదగడం కష్టమవుతుందనే ఆలోచనతోనే,  జానారెడ్డి ఇలా చేశారనే చర్చ జరుగుతోంది. దానికి తగ్గట్లే 30 ఏళ్లు మంత్రి పదవి అనుభవించిన జానారెడ్డికి, ఇప్పుడు రంగారెడ్డి జిల్లా నేతలకు మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచన ఎందుకొచ్చిందని, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే అడిగేస్తున్నారు. తన మంత్రి పదవి విషయంలో జానారెడ్డి లాంటివాళ్లు ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని వ్యాఖ్యానించడంతో, పెద్దాయన ఆ లేఖ ఎందుకు రాశారో ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతోంది.  మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో ఉమ్మడి నల్గొండ జిల్లా నేతల నుంచి మంచి మద్దతే ఉంది. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సపోర్ట్‌ రాజగోపాల్ రెడ్డికే ఉంది. వాళ్లంతా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కోసం ఎక్కడ సంతకం చేయమన్నా చేస్తామంటున్నారు. ఆయనకు మంత్రి పదవి ఇస్తే పార్టీ, ప్రభుత్వం మరింత బలపడుతుందని భావిస్తున్నట్లు బహిరంగంగానే చెబుతున్నారు. కానీ ఇప్పటికే ఈ విషయంలో జానారెడ్డి తన రాజకీయ చాణక్యం ప్రదర్శించేశారు. నల్గొండ జిల్లా నేతగా ఉండి కూడా రంగారెడ్డి జిల్లా నాయకుడికి ఓ మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ అధిష్టానానికి లేఖ రాసి పొలిటికల్ హీట్ పెంచేశారు. ఇది జరిగిన తర్వాత,  పార్టీలో సీనియర్ నాయకుడిగా జానారెడ్డి అన్ని జిల్లాల నేతలకు న్యాయం జరగాలనే లేఖ రాశారని అంతా అనుకున్నారు. కానీ ఆయన లెటర్ ఎందుకు రాశారో అర్థమవుతుండటంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్యాబినెట్ బెర్త్‌కు జానారెడ్డి ఒక్క లేఖతో ఎర్త్ పెట్టాలని చూస్తున్నారన్న చర్చ సాగుతోంది.

balakrishna moovie news in arabic news paper

అరబిక్ డాకూ.. హోరెత్తుతున్న జై బాలయ్య స్లోగన్‌

అటు పాలిటిక్స్‌లో ఇటు సినీ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలయ్య మరో అరుదైన ఘనత సాధించారు. ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకువచ్చి సూపర్‌హిట్‌ను సొంతం చేసుకుంది డాకు మహారాజ్‌. కలెక్షన్లతో పాటు రికార్డులను తన ఖాతాలో వేసుకున్న ఈ చిత్రం మరోసారి నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇరాక్‌లోని ఓ న్యూస్‌ పేపర్‌లో ఈ సినిమాకు సంబంధించిన ఆర్టికల్‌ వచ్చింది. దీంతో మరోసారి డాకు మహారాజ్ గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. దీనికి సబంధించిన ఫొటోను ఎక్స్‌లో బాలకృష్ణ అభిమానులు షేర్‌ చేస్తున్నారు. డాకు మహారాజ్‌ లో అద్భుతమైన సాంకేతికతను ఉపయోగించారని యాక్షన్‌ సన్నివేశాలు బాగున్నా యని ఆ ఆర్టికల్‌లో రాసుకొచ్చారు. హీరో పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని రాబిన్‌హుడ్‌ తరహాలో దీన్ని తీర్చిదిద్దారని పేర్కొన్నారు. దీని కథ గురించి, కలెక్షన్ల వివరాలను ప్రస్తావించారు. తెలుగు సినిమాకు సంబంధించిన వివరాలు అరబిక్‌ న్యూస్‌ పేపర్‌లో రావడం అరుదంటూ బాలయ్య అభిమానులు సంబరపడుతున్నారు. బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాలో ప్రజ్ఞా జైస్వాల్‌, శ్రద్ధా శ్రీనాథ్‌, ఊర్వశీ రౌతేలా, బాబీదేవోల్‌ కీలకపాత్రలు పోషించారు. థియేటర్‌లలో సందడి చేసిన ఈ చిత్రం ఓటీటీలోనూ తన హవా చూపిస్తోంది. విడుదలయ్యాక ఎన్నో రోజులు టాప్‌లో కొనసాగింది. ప్రస్తుతం ‘నెట్‌ఫ్లిక్స్‌’ వేదికగా అందుబాటులో ఉంది. మొత్తానికి అరబిక్ పేపర్లో డాకూ మహరాజ్ అంతలా ఫోకస్ అవ్వడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో జై బాలయ్య అంటూ హోరెత్తిస్తోంది.

anna leginova wins the hearts of hindus

అన్నా లెజినోవా త‌ల నీలాల స‌మ‌ర్ప‌ణ‌

క్రిష్టియ‌న్ అయినా డిక్లరేషన్ తో పాటు తలనీలాల సమర్పణ హిందువుల గుండెల్ని దొచుకున్న పవన్ సతీమణి ఆంధ్రులు ఫిదా.. ఫిదా.. శ్రీవారి ల‌డ్డూను తిన్నా కూడా వారు ఆయ‌న భ‌క్తులు అయిపోతార‌న్న నానుడి ఉంది. అలాంటిది ఆయ‌న‌కు మొక్కు కోవ‌డం మాత్ర‌మే కాదు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించ‌డం అంటే వారు స్వామివారి ప‌ట్ల భ‌క్తి చూప‌డంలోనే అది ప‌రాకాష్ట. అలాంటి భ‌క్తి చూప‌డంలో ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌తీమ‌ణి అన్నా లెజినోవా ప్ర‌స్తుతం వార్త‌ల‌కెక్కారు. అన్నాది ఈ మ‌తం కాదు, ఈ నేల కాదు. కానీ ఇక్క‌డి భ‌క్తి విశ్వాసాల ప‌ట్ల ఆమె అపార‌మైన న‌మ్మ‌కం పెంచుకున్న‌ట్టుగానే చెప్పాలి.  లేకుంటే త‌న కొడుక్కి సింగ‌పూర్లో అగ్ని ప్ర‌మాదం జ‌ర‌గ‌ట‌మేంటి? ఆమె ఈ ప్ర‌మాదంలోంచి త‌న కుమారుడు మార్క్ శంక‌ర్ ప‌వ‌నోవిచ్ త్వ‌ర‌లోనే కోలుకోవాల‌ని.. భావించ‌డ‌మేంటి? ఇప్పుడా మొక్కు తాను క్రిష్టియ‌న్ అయి ఉండి  కూడా డిక్లెరేష్ ఇచ్చి మ‌రీ తీర్చుకోవ‌డ‌మేంటి? అన్న‌దిక్క‌డ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నిజానికి మార్క్ శంక‌ర్ ప‌వ‌నోవిచ్ కి అంత పెద్ద ప్ర‌మాదం ఏం జ‌ర‌గ‌లేదు కానీ, బాలుడితో పాటు ప్ర‌మాదంలో చిక్కిన ఒక బాలిక మాత్రం ప్రాణాలు కోల్పోయింది. దీంతో భ‌య‌ప‌డ్డ అన్నా  లెజినోవా త‌న బంగారు  కొండ‌కు ఏమీ కాకూడ‌దంటూ అచ్చం తెలుగువారిలా.. తెలుగువారి ఆధ్యాత్మిక అదృష్టం- వెంక‌టేశ్వ‌ర స్వామికి ముడుపు క‌ట్టి, స్వామీ నా కొడుకు ఈ ప్ర‌మాదం  నుంచి బ‌య‌ట ప‌డితే, నీకు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించుకుంటాన‌ని మొక్కుకోవ‌డం మాత్ర‌మే కాక‌.. డిక్ల‌రేష‌న్ సైతం ఇవ్వ‌డం అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. నువ్వు నీ త‌ల‌నీలాల‌ను ఇవ్వ‌డం కాద‌మ్మా.. మా మ‌న‌సుల‌ను కూడా దోచుకున్నావంటూ ఆమెపై ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురిపిస్తున్నారు. ఆమె పుట్టుక‌తో క్రిష్టియ‌న్ అయినా, ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌తీమ‌ణిగా ఇక్క‌డి స‌నాత‌న ధ‌ర్మంపై విప‌రీత‌మైన ప్రేమాభిమానాలను పెంచుకున్నారు. ఇక్క‌డి భ‌క్తి విశ్వాసాల‌ను అవ‌గ‌తం చేసుకున్నారు. వాటిని అర్ధం చేసుకోవ‌డం మాత్ర‌మే కాకుండా.. ఇదిగో ఇలా ఫాలో అవుతున్నారు కూడా. దీంతో ఇటు అభిమానులే కాదు అటు సామాన్య భ‌క్త జ‌నులు సైతం.. అన్నా లెజినోవాను తెగ  మెచ్చుకుంటున్నారు. కార‌ణం.. మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కూడా జ‌న్మ‌తః క్రిష్టియ‌నే. కానీ, శ్రీవారి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన‌పుడు కావాల‌నే డిక్ల‌రేస‌న్ పై సంత‌కం చేయ‌కుండా తెలుగువారిని తీవ్రంగా వేధిస్తుంటారు. పెద్ద పెద్ద ప్ర‌ముఖులే శ్రీవారి చెంత‌కు వ‌చ్చిన‌పుడు తాము హిందూయేత‌రులైన‌పుడు.. విధిగా డిక్ల‌రేష‌న్ ఇస్తారు. అలాంటిది ఒక ముఖ్య‌మంత్రి కొడుకుగా ఉండి, తాను కూడా ఒక ముఖ్య‌మంత్రిగా  ప‌ని చేసిన జ‌గ‌న్ మాత్రం .. అన్నా లెజినోవా అనే విదేశీయురాలికున్న క‌నీస  విచ‌క్ష‌ణా జ్ఞానం కూడా లేద‌న్న మాట వినిపిస్తోంది.  ఇటీవ‌ల ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి  అన్న‌ట్టు ఇటు శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాలపుడు కానీ, అటు ఒంటిమిట్ట కోదండ రామ స్వామి క‌ళ్యాణోత్స‌వం లో కానీ, దుర్గ‌మ్మ స‌న్నిధికి వ‌చ్చిన‌పుడు కానీ.. త‌న స‌తీమ‌ణితో స‌హా హాజ‌రు కాని జ‌గ‌న్ రెడ్డి,, చేసిన సంప్ర‌దాయ విరుద్ధ‌మైన చ‌ర్య‌లు లెక్క‌లేన‌న్ని.  ఈ మాట వ‌చ్చింద‌ని చెప్పి.. 2024 ఎన్నిక‌ల‌కు ముందు సంక్రాంతి సంద‌ర్భంగా.. ఇంటి ముందు శ్రీవారి సెట్టు వేయించుకుని.. ఆయ‌న్ను అవ‌మానించ‌డం మాత్ర‌మే కాకుండా.. తాము త‌యారు చేయించిన ప్ర‌సాదాన్ని కూడా తీసుకోకుండా దాన్ని నాప్ కిన్ కి తుడిచేసుకుని  జగన్ చేసిన దైవాప‌రాధం అంద‌రికి తెలిసిందే. అలాంటిది అన్నా లెజినోవా.. మ‌న సంస్కృతీ సంప్ర‌దాయాల‌ను ఇంత చ‌క్క‌గా పాటిస్తుంటే అంద‌రికీ ముచ్చటేస్తోంది. జ‌గ‌న్ లా ఆమె సైతం ఒక క్రిష్టియ‌నే అయినా.. భార‌తీయ‌త‌ను మ‌రీ ముఖ్యంగా మ‌న తెలుగు వారి సంప్ర‌దాయాల‌ను.. ప‌ద‌హారాణాల తెలుగింటి ఆడ‌ప‌డుచులాగా పాటించ‌డంతో.. ఆమెపై అంద‌రూ ప్ర‌శంస‌ల వ‌ర్షం  కురిపిస్తున్నారు. అలాగ‌ని అన్నా లెజినోవా కేవ‌లం పైపై సంప్ర‌దాయాల పాటింపు మాత్ర‌మే కాదు.. జాత‌కాల‌ను చూపించుకోవ‌డం వంటి ఎన్నో సంప్ర‌దాయ‌బ‌ద్ధ‌మైన‌ ప‌నులు చేయిస్తార‌నీ అంటారు. మార్క్ శంక‌ర్ ప‌వ‌నోవిచ్ అంటూ త‌న కొడుక్కి హిందూ శ‌బ్ధంతో కూడిన‌ నామ‌క‌ర‌ణం చేయించ‌డం మాత్ర‌మే కాదు.. అత‌డు తండ్రికి మించిన త‌న‌యుడు అవుతాడ‌ని కూడా జాత‌కం కూడా చెప్పించుకున్న‌ట్టు చెబుతున్నారు. ఈ దిశ‌గా ప‌వ‌నోవిచ్ కి సంబంధించిన జాత‌క ఫ‌లితం ఒకటి  నెట్టింట‌ చ‌క్క‌ర్లు కొడుతోంది. ఏది ఏమైనా అన్నా లెజినోవా కొట్టించుకున్న ఈ గుండు ద్వారా ఇటు తెలుగు వారి గుండెల్ని దోచుకోవ‌డం మాత్ర‌మే కాకుండా.. అటు మాజీ సీఎం జ‌గ‌న్ కి చెంప‌పెట్టులా ఆమె డిక్లెరేష‌న్ మీద సంత‌కం పెట్టి మ‌రీ త‌ల‌నీనాలు స‌మ‌ర్పించుకోవ‌డంతో శ్రీవారి భ‌క్తులు త‌బ్బి ఉబ్బిబ్బి అయిపోతున్నారట‌.  ఎందుకంటే శ్రీవారికి త‌ల‌నీలాల స‌మ‌ర్ప‌ణ అంటే ఎంతో ఇష్టం. అలాంటి ఇష్టమైన కార్య‌క్ర‌మాన్ని తాను క్రిష్టియ‌న్ అయినా కూడా.. తెలుగు వారి న‌మ్మ‌కాల‌ను విశ్వాసాల‌ను పాటించ‌డంతో ఇక్క‌డి వారిని మ‌రింత‌గా ఆక‌ట్టుకున్నారామె.

abuses occupy prime place in social media

నబూతో.. నభవిష్యతి

నాడు శ్రీరెడ్డి, బోరుగ‌డ్డ అనిల్ నుంచి నేడు ద‌గాప‌డ్డ కిర‌ణ్ చేబ్రోలు వ‌ర‌కూ మ‌ధ్య అలేఖ్య చిట్టీ వంటి ఆడ‌పిల్ల‌లు సైతం బూతు భాషనే ఆశ్రయిస్తున్నారెందుకు?  బూతు ఇంత‌టి ప్ర‌ధాన పాత్ర పోషిచడానికి కార‌ణం ఏంటి? సోష‌ల్ మీడియా జ‌మానా వ‌చ్చాక‌.. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాయ‌లేని, ప‌ల‌క‌లేని ఎన్నో ప‌దాలు.. ఇక్క‌డ య‌ధేచ్ఛ గా స్వైర విహారం చేస్తున్నాయ్. ఇవాళ అంద‌రూ ఐటీడీపీ కార్య‌క‌ర్త చేబ్రోలు కిర‌ణ్ విష‌యంలో ఇంత పెద్ద ఎత్తున త‌ప్పు ప‌డుతున్నారు. కానీ, గ‌తంలో వ‌ల్ల‌భ‌నేని వంశీ, కొడాలి నాని వంటి వారు చంద్ర‌బాబు విష‌యంలో తీవ్ర స్థాయిలో వ్య‌క్తిత్వ హ‌న‌నం చేసిన వారే.  ఆనాడు బాబు ఇది గౌర‌వ స‌భ కాదు- కౌర‌వ స‌భగా మారింద‌నీ. తాను తిరిగి ముఖ్య‌మంత్రిగా వ‌చ్చి ఈ స‌భ ద్వారా తిరిగి సంస్క‌ర‌ణ‌కు పాల్ప‌డ‌తాన‌ని అన్నారు. అన‌డం మాత్ర‌మే కాకుండా.. ఇదిగో ఇవాళ భార‌తీరెడ్డిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన త‌మ సొంత కార్య‌క‌ర్త కిర‌ణ్ చేబ్రోలు విష‌యంలో క‌ఠిన చ‌ర్యలు తీసుకోవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు.  ఇప్ప‌టి వ‌ర‌కూ కిర‌ణ్ చేబ్రోలుపై మొత్తం ఐదు కేసులుండ‌గా, వాటిలో మాజీ మంత్రి విడుద‌ల ర‌జ‌నిపై చేసిన అనుచిత వ్యాఖ్య‌లు కూడా ఉన్నాయి. దీంతో వీట‌న్నిటినీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న గుంటూరు పోలీసులు, అత‌డి సెల్ ఫోన్ సిగ్న‌ళ్ల ద్వారా ఇబ్ర‌హీం ప‌ట్నం ద‌గ్గ‌ర అదుపులోకి తీసుకుని.. మంగ‌ళ‌గిరి పీఎస్ కి త‌ర‌లించారు. ఇక్క‌డ గుర్తించాల్సిన విష‌య‌మేంటంటే.. సీఎం ఆదేశాల‌తో పోలీసులే మొద‌ట సుమోటోగా   స్వీక‌రించ‌డం. ఆ త‌ర్వాత అత‌డిపై వ‌చ్చిన ఫిర్యాదు మేర‌కు కేసులు పెట్ట‌డం, రిమాండ్ కి త‌ర‌లించేలా ఏర్పాట్లు చేయ‌డం. ఇదే గ‌తంలో బోరుగ‌డ్డ అనిల్.. బాబు, లోకేష్, ప‌వ‌న్ వంటి వారిపైనే కాకుండా.. పిల్ల‌ల‌ని కూడా చూడ‌కుండా అనుచిత వ్యాఖ్య‌లు చేశారు.. నాటి సీఎం జ‌గ‌న‌న్ మోహ‌న రెడ్డిగానీ, ఆయ‌న‌ ప్ర‌భుత్వం నుంచి కానీ.. క‌నీస స్పంద‌న లేదు. పైపెచ్చు ఇలాంటి వ్యాఖ్యానాలు చేయ‌డ‌మే త‌మ‌కు కావ‌ల్సింద‌న్న చందంగా వ్య‌వ‌హ‌రించారు. లోలోన ఎంత‌గానో సంతోషించార‌ని అంటారు. ఆ మాట‌కొస్తే పోసాని కృష్ణ‌ముర‌ళి.. త‌న విచార‌ణలో చెప్పిన‌దాన్నిబ‌ట్టీ చూస్తే.. సజ్జ‌ల టీమ్ ద్వారా ఆయనకు స్క్రిప్ట్ వ‌చ్చేది. వీరి అనుచిత వ్యాఖ్య‌ల వెన‌క ఎంత‌టి ఫ్యాన్ మార్క్ మాస్ట‌ర్ ప్లాన్ దాగి ఉంద‌ని తేట‌తెల్ల‌మైందని అన‌డానికి ఇంత‌క‌న్నా మించిన సాక్ష్యాలు ఎక్క‌డ దొరుకుతాయ్?  కానీ కూట‌మి ప్ర‌భుత్వం తొలి  నాటి నుంచే మ‌హిళ‌లు, పిల్ల‌లు, వృద్ధుల విష‌యంలో అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం అనే అంశంలో నిషేధాజ్ఞ‌లు జారీ చేయ‌డం మాత్ర‌మే కాదు.. ఆ దిశ‌గా ఇప్పటికే ఎంద‌ర్నో ఊచ‌లు లెక్కించేలా చేస్తోంది. ఇది సోష‌ల్ మీడియా ప‌రంగా ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించే వారిప‌ట్ల త‌మ పంథా అని స్ప‌ష్టంగా తెలియ చేసింది. త‌రత‌మ బేధాలు చూసేది లేదు. వారు ఎవ‌రైనా, ఏ పార్టీ వారైనా స‌రే విడిచి పెట్టే ప్ర‌స‌క్తే లేద‌న్న సంకేతాల‌ను పంపుతోంది. అయితే ఇక్క‌డే ఒక కొత్త వాద‌న‌. వివేకం సినిమాలోనూ కిర‌ణ్ ఆరోపించిన‌ట్టుగా.. చూపించార‌నీ. భార‌తీరెడ్డికి, అవినాష్ రెడ్డికి వివాహేత‌ర సంబంధం ఉన్న‌ట్టు ఎస్టాబ్లిష్ చేశార‌నీ.. ఈ చిత్రాన్ని  చూడ‌మంటూ.. బాబు కూడా బ‌హిరంగ ప్ర‌ట‌కన చేశార‌నీ అంటారు కొంద‌రు వైసీపీ వాదులు. అయితే ఇదే వైసీపీ వారు.. హ‌త్య అనే ఒక సినిమా తీసి.. అందులో కొంద‌రి పాత్ర‌లు కావాల‌నే లేకుండా చేసి.. తద్వారా త‌మ‌దైన అనుకూల విధానంలో వివేకా హ‌త్య‌కు సంబంధించి కొత్త అనుమానాలు రేకెత్తించేలా చేశారు. ఈ చిత్రంలో చూపిన తీరుపై.. సునీల్ యాద‌వ్ తీవ్ర స్థాయిలో వ్య‌తిరేకించారు. ఇందులో త‌మ పాత్ర‌ల‌ను కావాల‌నే వ‌క్రీక‌రించార‌నీ.. చాలా మంది పాత్ర‌లు కావాల‌నే లేకుండా చేశార‌నీ.. సినిమా ద్వారా కూడా రాజ‌కీయాల‌కు తెర‌లేపార‌నీ వైసీపీ వారిపై ఆరోప‌ణ‌లు చేస్తారు సునిల్ యాద‌వ్. ఈ దిశ‌గా ఆయ‌న ఫిర్యాదు చేశారు కూడా. ఒక ద‌శ‌లో హ‌త్య సినిమా వ్య‌వ‌హారం ఎక్క‌డి వ‌ర‌కూ వెళ్లిందంటే, ఈ సినిమా క్లిప్పింగులు షేర్ చేసినా.. కేసులు పెట్టే వ‌ర‌కూ. ఇదే వివేకా హ‌త్య విష‌యంలో.. అవినాష్ కి అన్ని విష‌యాలు తెలుసంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ రెడ్డి సైతం సంచ‌ల‌న కామెంట్లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఓవ‌రాల్ గా చూస్తే వివేకం సినిమా విష‌యాన్ని ఎత్తి చూపుతున్న వైసీపీ వాళ్లు.. మ‌రి హ‌త్య సినిమా తీయ‌డం వెన‌క  దాగిన ర‌హ‌స్య‌మేంటో చెప్పాలంటారు టీడీపీ వారు. ఏది ఏమైనా ఇన్నాళ్ల పాటు వీడియోలు చేస్తూ వ‌చ్చిన కిర‌ణ్ చేబ్రోలు ఒక్క‌సారిగా అరెస్టులు, కేసులు అంటూ లైమ్ లైట్లోకి వ‌చ్చేశారు. అంటే ఇందుకు కార‌ణం బూతు. ఈ బూతు వెన‌క దాగిన అస‌లు సృష్టిక‌ర్త వైయ‌స్ జ‌గ‌న్. ఆయ‌న‌.. ఒక మాజీ ముఖ్య‌మంత్రిగా, ఒక పార్టీ అధినేత‌గా.. పోలీసుల ప‌ట్ల గౌర‌వంగా మాట్లాడి ఉంటే ఎవ‌రికీ ఏ అభ్యంత‌రం అనిపించేది  కాదు.  ఒక రాష్ట్రాన్ని పాలించిన వ్య‌క్తి అయి ఉండి కూడా.. పోలీసుల బ‌ట్ట‌లు ఊడ‌దీస్తాన‌నే కామెంట్లు చేయ‌డంతోనే ఒక్క‌సారిగా కాక చెల‌రేగింది. దీనిపై త‌న‌దైన స‌హజ ధోర‌ణిలో బూతు ద‌ట్టించి వ‌దిలారు కిర‌ణ్ చేబ్రోలు. అప్ప‌టికీ కిర‌ణ్ త‌న త‌ప్పు తెలుసుకుని.. క్ష‌మాప‌ణ‌లు కోరుతూ ఒక వీడియో విడుద‌ల చేశారు కూడా. అయిన‌ప్ప‌టికీ వ‌ద‌ల‌ని పోలీసులు అత‌డ్ని అరెస్టు చేశారు. ఇలాంటి బూతు భువ‌నేశ్వ‌రిపై చేసినా, భార‌తీరెడ్డిపై చేసినా  స‌హించేది లేద‌న్న క్లియ‌ర్ క‌ట్ మెసేజ్ పాస్ చేశారు. ఇటీవ‌ల అలేఖ్య చిట్టీ అనే ప‌చ్చ‌ళ్లు అమ్మే అమ్మాయిల ఉదంతంలోనూ బూతు పాత్ర అత్యంత కీల‌కంగా  క‌నిపించింది. మీ ప‌చ్చ‌ళ్లు మ‌రీ ఇంత రేటా? అని ఒక క‌స్ట‌మ‌ర్ అడిగిన‌పుడు.. తాము వాడే వ‌స్తువులు అంత నాణ్య‌మైన‌వ‌ని చెప్ప‌కుండా అలేఖ్య చిట్టీ విపరీత‌మైన బూతును మిళితం చేసిన భాష వాడింది. ఇది ప్ర‌స్తుతం ఆమెను, ఆమె ఇద్ద‌రు సోద‌రీమ‌ణుల‌ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టివేసింది. ఒక ర‌కంగా చెబితే...  ఈ బూతుల‌కు బాగా అల‌వాటు ప‌డ్డారు సామాన్యులు. ఇప్ప‌టి వ‌ర‌కూ తెర‌కు దూరంగా ఉంటూ వ‌చ్చిన బూతు.. సోష‌ల్ మీడియా జ‌మానాలో అనూహ్యంగా తెర‌పైకి వ‌చ్చింది. త‌ద్వారా అదొక మాస్ లాంగ్వేజీగా అవ‌త‌రించింది. ఎవ‌రు బూతులు మాట్లాడుతారో వారిని విప‌రీతంగా ఫాలో కావ‌డం యూత్ ఒక ప‌నిగా పెట్టుకుంది.  శ్రీరెడ్డి విష‌యానికి వ‌స్తే.. శ్రీరెడ్డి బేసిగ్గా ఒక‌ వైసీపీ స‌పోర్ట‌ర్. ఆమె భాష ఎంతో విధ్వంస‌క‌రంగా ఉంటుంది. లైవ్ లో అయితే త‌న రేటుతో స‌హా చెప్పేస్తూ.. త‌న ఫాలోయ‌ర్స్ ని ఊరించి వ‌దిలిపెడుతుంది. ఆమె వంట వీడియోలు చేసినా.. అందులోనూ బూతు ప్ర‌ద‌ర్శ‌న‌ చేస్తూ.. హ‌ల్ చ‌ల్ చేస్తుంది.  ఆ మాట‌కొస్తే ఇటీవ‌ల‌ ఎమ్మెల్సీ అయిన తీన్మార్ మ‌ల్ల‌న్న కూడా బూతుల‌తో త‌న రాజ‌కీయ, సోష‌ల్ మీడియా కోట‌గోడ‌లు నిర్మించుకున్న‌వాడే. బాతాల పోశెట్టి వంటి ఎన్నో బూతు మాట‌ల‌తో సీఎం స్థాయి వ్య‌క్తిపై తీవ్ర ప‌రుష ప‌ద‌జాలం వాడి జ‌నాల్లోకి వెళ్లాడు. వారిని విశేషంగా ఆక‌ట్టుకున్నాడు. ఇవాళ ఇదిగో ఎమ్మెల్సీ గా ఎదిగాడు. అలాగ‌ని త‌న భాష‌ను కంట్రోల్ చేశాడా అంటే అదీ లేదు. తాజాగా రెడ్లు, వెల‌మ‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసి.. కాంగ్రెస్ పార్టీ నుంచి గెంటి వేయ‌బ‌డ్డాడు.  ఒక‌రు సాధార‌ణ పార్ల‌మెంటు భాష‌లో ప్లెయిన్ లాంగ్వీజీలో మాట్లాడితే.. వారి భాష‌నెవ‌రూ స్వీక‌రించ‌డం లేదు. ఆద‌రించ‌డం లేదు. ఎవ‌రైతే రిస్క్ తీస్కుని బూతుల‌తో కూడిన‌ అవాకులు చెవాకులు పేలుతుంటారో వారినే హైలెట్ చేస్తూ వ‌స్తున్నారు ప్రేక్ష‌కులు. వారినే ఫాలో అవుతూ వ‌స్తున్నారు కొంద‌రు. ఇందువ‌ల్లే ఇదంతా జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. అంతెందుకు ఈనాడును, ఈటీవీని ఎంతో సంస్కార‌వంతంగా న‌డిపిన రామోజిని సైతం ఈ బూతు జ‌బ‌ర్ద‌స్త్ రూపంలో చొర‌బ‌డి బోల్తా కొట్టించింద‌ని అంటారు.  జ‌బ‌ర్ద‌స్త్ లో స్కిట్ల‌లో వాడే భాష మొత్తం దాదాపు బూతు ప‌ద‌జాలంతో కూడుకుని ఉంటుంది. అది హిట్ కావ‌డం, ఏళ్ల‌ త‌ర‌బ‌డి కొన‌సాగుతుండ‌టంతో.. బూతు ఒక మార్కెట్ వ‌స్తువుగా త‌యారైంది. సాధార‌ణ లాంగ్వేజీతో మాట్లాడే ఏ ఇన్ ఫ్లుయెన్ష‌ర్ కి కూడా పెద్ద‌గా ఫాలోయ‌ర్లుండ‌రు. అదే బూతు ప‌ద‌జాలం విస్తృతంగా ఎవ‌రు వాడుతారో.. వారి చుట్టూ ఫాలోయ‌ర్లు మూగిపోతున్నారు. దీంతో బూతు మార్కెట్ స్ట్రాట‌జీలోనే టాప్ ప్లేస్ లోకి చేరిపోయింది. కిర‌ణ్ చేబ్రోలు మొన్న‌టి వ‌ర‌కూ చేసిన కామెంట్లు ఎవ‌రికీ పెద్ద‌గా తెలీవు. ఏదో పార్టీ వాయిస్ వినిపిస్తున్నాడ్లే అనుకున్నారు. ఎప్పుడైతే జ‌గ‌న్ త‌న‌దైన శైలిలో పోలీసుల బ‌ట్ట‌లు విప్పారో. దాని ప్రేర‌ణ‌తో కిర‌ణ్ చేబ్రోలు ఆయ‌న స‌తీమ‌ణి భార‌తి వ్య‌క్తిత్వ హ‌న‌నానికి పాల్ప‌డ్డారో.. ఆ వెంట‌నే రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా తెలిసిపోయారు. ఇవాళ కిర‌ణ్ చేబ్రోలో ఒక పాపుల‌ర్ సెల‌బ్రిటీ హోదా సాధించారు. అది మంచా చెడ్డా చూడ్డం లేదు జ‌నం. పాపుల‌ర్ అయ్యాడా లేదా చూస్తున్నారు.  గ‌తంలో ఇదే వైసీపీకి సంబంధించిన వ‌ల్ల‌భ‌నేని వంశీ, నారా భువ‌నేశ్వ‌రిని అన‌రాని మాట‌లు అన‌డం వ‌ల్లే క‌దా?  చంద్ర‌బాబు ఆనాడు స‌భ‌ను వీడింది. క‌న్నీళ్లు పెట్టుకుంది. ఒక్క వంశీయే కాదు.. కొడాలి నాని కూడా చంద్ర‌బాబును, ఆయ‌న కుటుంబాన్ని తీవ్ర ప‌రుష ప‌ద‌జాలంతో దూషించేవారు. వీరికి రోజా, అంబ‌టి, అనిల్ వంటి వారు తాన‌తందాన అనేవారు. వీరు చేసే అనుచిత వ్యాఖ్య‌ల‌ను నాటి వైసీపీ ప్ర‌భుత్వం ఎంత మాత్రం క‌ట్ట‌డి చేసేది కాదు. పైపెచ్చు వారిని మ‌రింత‌గా రెచ్చ‌గొట్టేది. ఇలాంటి  వాటికంటూ స‌జ్జ‌ల పుత్ర‌ర‌త్నం భార్గ‌వ్ చేత ఒక యూనిట్ ఏర్పాటు చేసి.. దాని ద్వారా.. వీటిని విప‌రీతంగా ప్ర‌చారం చేయించేవారు. ఇదొక ఆర్గ‌నైజ్డ్ క్రైమ్ గా తీర్చిదిద్దిందే వైసీపీ. దాని సోష‌ల్ మీడియా విభాగం. పైకి టీడీపీ దాని అనుకూల మీడియా ఎంత బ‌లంగా క‌నిపించినా.. వైసీపీ సోష‌ల్ మీడియా, మెయిన్ మీడియా కూడా చూప‌లేని, చెప్ప‌లేని ఎన్నో విష‌యాల‌ను జ‌నాల్లోకి తీస్కెళ్లి అల‌జ‌డి చెల‌రేగేలా చేసేది. ఈ విప‌రీత ధోర‌ణే ప్ర‌స్తుం వైసీపీకి చేటు తెచ్చింది. 11 సీట్ల‌కు ప‌రిమితం చేసింది. ఇంకా ఇదే పంథాలో వెళ్తే.. ఈ మాత్రం సీట్లు కూడా రావ‌న్న సంకేతాలు అందుతున్నాయ్. మ‌రి చూడాలి వైసీపీ ఈ బూతు ప్రేరేపిత విధానం ఎప్పుడు ఎలా ఆపుతుందో లేదో తేలాల్సి ఉంది.

bja national president suspense continues

అయితే అన్నామలై.. కాదంటే నిర్మలమ్మ!

భారతీయ జనతా పార్టీ  జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ఒక ప్రహసనంగా మారింది. బీజేపీ నూతన అధ్యక్షుడు ఎవరు? అన్న ప్రశ్నకు  సమాధానం ఇటు పార్టీ నేతలకు,  అటు రాజకీయ పండితులకు కూడా చిక్కడం లేదు. చిక్కు ముడి వీడడం లేదు. ఎందుకనో ఏమో కానీ  పార్టీ జాతీయఅధ్యక్షు  ఎన్నిక చాలా జటిలంగా మారిందనే అభిప్రాయం అయితే అంతటా వినిపిస్తోంది. అవును  పార్టీ అగ్ర ద్వయం, ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా కూడా ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేక పోతున్నారు. అందుకే  ఇటీవల లోక్ సభలో సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్  ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని చెప్పుకునే బీజేపీ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోలేక పోతోందని వ్యంగంగా అన్నప్పుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సరదా సమాధానంతో, అసలు విషయాన్ని దాట వేశారు. అయితే అక్కడికది సరిపోయినా.. ఈ ప్రశ్న బీజేపీని వెంటాడుతోందని అంటున్నారు. అయితే  ఇక అట్టే కాలం ఈ సస్పెన్స్  కొనసాగదని.. కొనసాగించడం కుదరదనీ కూడా  అంటున్నారు.  బీజేపీ ప్రస్తుతఅధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ఇటు పార్టీ అధ్యక్షుడు, అటు కేంద్ర మంత్రిగా జోడు పదవుల్లో కొనసాగడం విమర్శలకు తావిస్తోంది.  సో.. జేపీ నడ్డా స్థానంలో నూతన అధ్యక్షుడి  ఎన్నిక ఇక వాయిదా వేసే అవకాశం  లేదని అంటున్నారు. అలాగే రేపో మాపో బీజేపీ జాతీయ అధ్యక్షుని ప్రకటన వెలువడుతుందన్న విశ్వాసంతో  పార్టీ వర్గాలు  ఉన్నాయి.  ఏప్రిల్  18,19, 20 తేదీల్లో బెంగుళూరులో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి.ఈలోగా నూతన  అధ్యక్షుడి ప్రకటన ఖాయంగా ఉంటుందని పార్టీ  వర్గాలు అంటున్నాయి.  అదొకటి అలా ఉంటే, నూతన అధ్యక్షుడి ఎంపిక విషయంలో బీజేపీ అనేక కోణాల్లో ఆలోచిస్తోందని అంటున్నారు. ముఖ్యంగా ఈ సారి అధ్యక్ష పదవిని దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వాలనే కోణంలో బీజేపీ అగ్ర ద్వయం ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా తో పాటుగా ఆర్ఎస్ఎస్  పెద్దలు కూడా సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే  తొలి సారిగా పార్టీ పగ్గాలు మహిళా నేతకు అప్పగించే ఆలోచన కూడా చేస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు కేంద్రంగా దక్షిణాది రాష్ట్రాల రాజకీయ రచన చేస్తున్న బీజేపీ జాతీయ నాయకత్వం తమిళనాడు నుంచే జాతీయ అధ్యక్షుడిని ఎంచుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు చెపుతున్నారు.    అదే నిజంమైతే, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పేరు పరిశీలనలో ఉన్నట్లు ప్రముఖంగా వినిపిస్తోంది. తమిళనాడులో పార్టీని బలోపేతం చేయడంతో పాటుగా, చదవు, సంస్కారం, పార్టీ విధేయత, సిద్దాంత నిబద్దత ఉన్నఅన్నామలై’కి పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి అవసరమైన అర్హతలు అన్నీ ఉన్నాయని అంటున్నారు. అలాగే, అన్నాడీఎంకేతో పొత్తు నేపథ్యంలో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న అన్నామలైకి జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని అమిత్ షా చెప్పారు.  సో..  దక్షణాదికి అధ్యక్ష పదవి పదవి ఖాయం అయితే అన్నామలైకి అధ్యక్ష పదవి ఖాయం అంటున్నారు. ఇంకా కొన్ని పేర్లు వినిపిస్తున్నా.. మోదీ, షా ఇద్దరూ  అన్నామలై వైపే మొగ్గుచూపుతున్నారని అంటున్నారు. అందుకే, దక్షణాదికి దక్కితే, అన్నామలై అధ్యక్ష పదవిని చేపట్టడం ఖాయమని అంటున్నారు.    అలాగే  పార్టీ జాతీయ అధ్యక్ష పదవి మహిళా నేతకు  ఇవ్వాలనే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు  బీజేపీలో ముఖ్య మంత్రులు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, అయిన మహిళలు ఉన్నారు, అలాగే, లోక్ సభలో ప్రతిపక్ష నేత, లోక్  సభ స్పీకర్, రాష్ట్రాల గవర్నర్లు వంటి రాజ్యాంగ పదవులను అందుకున్న మహిళలు ఉన్నారు. కానీ, పార్టీ జాతీయ అధ్యక్ష పీఠం మాత్రం మహిళా నేతకు ఇంతవరకు దక్కలేదు. అందుకే ఈ సారి తొలిసారిగా, మహిళా నేతకు పార్టీ పగ్గాలు అప్పగించే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నారని అంటున్నారు.  అదే జరిగితే, ఇప్పటికే,  ఫస్ట్ విమెన్ డిఫెన్స్ మినిస్టర్, ( ప్రప్రథమ మహిళా రక్షణ మంత్రి )  ఫస్ట్  ఫుల్ టైమ్   ఫైనాన్సు మినిస్టర్ తో  పాటుగా వరసగా ఎనిమిది సార్లు వార్షిక బడ్జెట్  ప్రవేశ పెట్టిన తొలి అర్హిక మంత్రిగా రికార్డులు సొంతం చేసుకున్న నిర్మలా సీరామన్  ఖాతాలో బీజేపీ తొలి మహిళా ప్రెసిడెంట్ మకుటం కూడా చేరుతుందని అంటున్నారు.  అయితే ఆమె ప్రధానంగా రాజకీయ నాయకురాలు కాదు. ఎకడమిక్ పర్సన్ . ఎకనమిక్ లేడీ.  (ఒక విధంగా ఆమె లేడీ మనోహన్  సింగ్ అనుకోవచ్చును. ఇద్దరి మధ్య ఒకటే తేడా, ఇద్దరి దారులు వేరు, పార్టీలు వేరు) అదీ గాక ఆమె ప్రత్యక్ష ఎన్నికలలో ఇంతవరకు పోటీ చేసి గెలవలేదు. అంతే కాదు, 2024ఎన్నికలకు ముందు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసే స్థోమత, సామర్ధ్యం తనకు లేదని, పోటీ చేసేందుకు విముఖత చూపారు. అదొకటి అయితే  ఆర్ఎస్ఎస్ గ్రీన్ సిగ్నల్ విషయంలోనూ అనుమానాలు ఉన్నాయి.. అయితే  దక్షణాది  కోణంలో చూసినప్పుడు ఆమెకు డబుల్ అర్హతలున్నాయని అంటున్నారు. ఆమె తమిళనాడు ఆడ బిడ్డ, ఆంధ్రా/తెలంగాణ కోడలు, ఏపీ, కర్నాటక రాష్ట్రాల నుంచి రాజ్య సభకు ఎన్నికయ్యారు. సో.. ఒక్క కేరళ మినహా  మిగిలిన అన్ని దక్షణాది రాష్ట్రాలతో ఆమెకు వ్యక్తిగత, రాజకీయ సంబంధాలున్నాయి. హిందీ అంతగా రాక పోయినా, తమిళ్, తెలుగు భాషలతోపాటు ఇంగ్లీష్ లో నూ మాట్లాడ గలరు.  సో .. బీజేపీ నాయకత్వం నిజంగా దక్షిణాదికి పార్టీ పగ్గాలు అప్పగించాలని, మహిళా నేతకు అధ్యక్ష పదవి ఇవ్వాలనే జంట ఆలోచనలు చేస్తున్నదే  నిజం అయితే, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు రెండు అర్హతలూన్న  నిర్మలమ్మకు అధ్యక్ష పదవి ఖాయం అంటున్నారు.అయితే..  ఫైనల్ గా పేరు బయటకు వచ్చే వరకు సస్పెన్స్  తప్పదు.

revanth sarkar facing bumarang

అనుకున్నదొకటి.. అయినది మరొకటి!

అదేమిటో కానీ  తెలంగాణ ప్రభుత్వం  ఏం చేసినా,  ఏ నిర్ణయం తీసుకున్నా బూమరాంగ్ అవుతోంది. గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చి  ముఖానికి తాకుతోంది. ఏ నిర్ణయం తీసుకున్నా..ఏ ప్రాజెక్ట్, ఏ పథకం ప్రారంభించినా వివాదాలు, విమర్శలు వెంట వస్తున్నాయి. ఇది ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి అనుభవరాహిత్యానికి, ప్రభుత్వ అసమర్ధ పనితీరుకు అద్దం పడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మరో వంక  హైడ్రా మొదలు రేవంత్  రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రతి ప్రాజెక్టూ విమర్శల సుడిగుండంలో చిక్కి అప్రతిష్ట పాలవుతోందనీ, ప్రజల్లోకి వెళ్ళ లేక పోతున్నామనీ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. వీటన్నిటికీ మించి  సర్వోన్నత న్యాయస్థానం, సూమోటోగా  విచారణ చేపట్టిన  హెచ్‌సీయూ భూముల వివాదం  రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్నే కాకుండా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని  అప్రతిష్ట పాలుచేసిందని అంటున్నారు. ప్రాజెక్టుల పరిస్థితే కాదు, పథకాల పరిస్థితి కూడా   అలానే ఉందని అంటున్నారు. అందుకే, ఇంటా బయట విమర్శలు ఎదుర్కోవలసి వస్తోందని, కాంగ్రెస్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  అవును, అమలు చేయని గ్యారెంటీల విషయంలోనే కాదు.. అమలు చేసిన హామీల విషయంలోనూ విమర్శలు తప్పడం లేదు. అందుకే  రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏది తలపెట్టినా అనుకున్నదొకటి అయినది మరొకటి అన్నట్లుగానే  కథ అడ్డం తిరుగుతోందని అంటున్నారు.  ఆఫ్కోర్స్  గత 15-16 మాసాలలో కాంగ్రెస్  ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు, 420 హామీలలో, అమలుచేసిన వాటికంటే అమలు చేయని గ్యారెంటీలు, హమీలే ఎక్కువ.  చెప్పింది కొండంత చేసింది గోరంత అని జనం పెదవి విరుస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి 15 మాసాలకు పైగానే అయినా  ఉచిత బస్సు, గ్యాస్ సబ్సిడీ వంటి ఏవో కొన్ని హామీలు మినహా  నిరుద్యోగ భృతి వంటి కీలక హామీల ఊసే లేదు. అలాగే మహిళలకు ఇచ్చిన హమీలదీ అదే కథ.  ప్రతి మహిళకు నెలకు రూ.2500 ఇస్తామన్న హామీ, ఆడ పిల్లలకు స్కూటీలు,  గత ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పేరిట ఇచ్చిన లక్ష రూపాయల పెళ్లి కానుకకు అదనంగా  తులం బంగారం ఇస్తామని ఇచ్చిన మహాలక్ష్మి హామీ, ఇందిరమ్మ ఇళ్లు వంటి  హామీల విషయంలో ప్రభుత్వం నూటికి నూరు శాతం చేతులు ఎత్తేసిందని అంటున్నారు. అలాగే రైతులకు ఇచ్చిన రుణ మాఫీ, రైతు బంధు హామీల అమలు అరకొరగానే వుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.  నిజానికి ప్రజల్లో కాదు అధికార  పార్టీ  నాయకులు, కార్యకర్తలల్లోనూ అసంతృప్తి  దాగడం లేదు. బయట పడుతూనే వుంది. ఎవరి దాకానో ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అంతగా సంతృప్తిగా లేరనే విషయం ఆయన మాటల్లో తొంగి చూస్తూనే వుంది. ఒకరిద్దరు మంత్రులు అయితే  రేవంత్ రెడ్డి ప్రభుత్వం కంటే, కేసీఆర్  ప్రభుత్వమే బాగుందని, ప్రజలు అంటున్నారని  తమ మాటను జనం నోటితో వినిపిస్తున్నారు. ఇక కాంగ్రెస్ అధిష్టానం సంగతి అయితే  చెప్పనే అక్కర లేదు. మింగలేక కక్క లేక అన్నట్లుగా ఉందని అంటున్నారు.  అయితే  ఈ అసంతృప్తికి  కాంగ్రెస్ నాయకులకు  చేసింది చెప్పుకోవడం చేత కాకాకపోవడమే కారణమని కొందరు కాంగ్రెస్ నాయకులు  పరువు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.  కానీ  అది నిజం కాదు.  నిజానికి  ప్రచారం మోతాదు మించిందనీ, అందుకే ప్రభుత్వం,పార్టీ అప్రతిషతపాలు అవుతోందనే  అభిప్రాయం కూడా  పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోందని  అంటున్నారు.     అదలా ఉంటే, తాజా  సెన్సేషన్  సన్న బియ్యం విషయమే తీసుకుంటే.. ఇతర విషయాలు ఎలా ఉన్నా సన్న బియ్యం చక్కని సూపర్ ఫైన్ సంక్షేమ పథకం. రాజకీయంగా  వెల్  పాలిషిడ్ ఆలోచన. రాజకీయంగా  ప్రయోజనం చేకూర్చే చక్కని పథకం. అయితే, అతి సర్వత్ర వజ్రయేత్  అనే మాట మరిచి  పథకం అమలు కంటే ప్రచారానికి ఎక్కువ ప్రాధన్యత ఇవ్వడం వలన  కథ అడ్డం తిరిగిందని అంటున్నారు. అందుకే  అనుకున్నదొకటి.. అయినదిమరొకటీ అన్నటుగా ప్రభుత్వం విమర్శలను ఎదుర్కోవలసి వస్తోందని అంటున్నారు.  పథకం ప్రారంభంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు లబ్దిదారుల ఇళ్ళకు వెళ్లి సన్న బియ్యం భోజనం చేయడం వరకు ఓకే.  కానీ, అలికి అన్నం పెట్టడం  ఊరికి ఉపకారం అన్నట్లు సాగుతున్న ప్రచారం ప్రమాదకరంగా మారుతోందని పార్టీ నాయకులే అంటున్నారు. ఆఫ్కోర్స్  ఒక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే కాదు.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అయినా.. మరో ప్రభుత్వం అయినా,  ప్రతి ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా రాజకీయ లబ్దిని ఆశిస్తాయి. అలా ఆశించడం తప్పు కూడా కాదు. కానీ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో  ఉంచుకుని సన్న బియ్యమే సర్వస్వం అన్న రీతిలో పార్టీ నాయకులకు ఫత్వాలు జారీ చేసి మరీ  ప్రచారం సాగించడం వలన ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందని, అంటున్నారు. మరో వంక రాష్ట్ర ప్రభుత్వం.. ముఖ్యంగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ కుమార్  రెడ్డి, సన్న బియ్యం క్రెడిట్ మొత్తం తమ సొంత ఖాతాలో వేసుకునేందుకు అసత్యాలు, ప్రచారం చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. నిజానికి  కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న ఉచిత బియ్యం పథకంలో భాగంగానే  రాష్ట్రంలో రేవంత్  ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని తీసుకొచ్చిందనీ, పేద ప్రజలకు పంపిణీ చేసే ప్రతి కిలో బియ్యాయినికి కేంద్ర ప్రభుత్వం రూ.37 ఇస్తున్నదని, మొత్తంగా చూస్తే సంవత్సరానికి రూ. 10 నుంచి రూ. 12 వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తోందనీ కేంద్ర మంత్రి  బండి సంజయ్  మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. అంతే కాదు, కేంద్ర నిధులు వద్దను కుంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని సవాలు విసిరారు.  మరో వంక  బీజీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామాల్లో లబ్దిదారుల ఇంటింటికీ వెళ్లి మరీ వాస్తవాలను వివరించి  సన్న బియ్యం ప్రచారానికి కౌంటర్ గా  ‘మోడీ బియ్యం’  ప్రచారాన్ని ప్రారంబించారు. దీంతో ఇప్పడు గ్రామాల్లో సన్న బియ్యం వర్సస్ మోదీ బియ్యం ప్రచారం జోరందుకుంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ లబ్ధిని ఆశించి  ప్రారంభించిన సన్న బియ్యం పథకం కూడా బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు.

youth killed parents

ట్రంప్‌ హత్యకు డబ్బులివ్వలేదని.. తల్లిదండ్రులను చంపేశాడు..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ని హత్య చేసి ఉక్రేయిన్ పారిపోవడానికి ప్లాన్ చేసిన యూస్ యువకుడి ఉదంతం కలకలం రేపుతోంది. ట్రంప్‌ని హత్య చేయడానికి తల్లదండ్రులు డబ్బులు ఇవ్వలేదని ఆ 17 ఏళ్ల యువకుడు వారినే హత్య చేయడంతో అసలు కుట్ర వెలుగు చూసింది.  తల్లిదండ్రులను అతి దారుణంగా కాల్చి చంపిన కేసులో ఓ 17 ఏళ్ల యువకుడిని అమెరికా పోలీసులు గత నెల అరెస్టు చేశారు. ఆ కేసు దర్యాప్తులో తెలిసిన వాస్తవాలు చూసి అధికారులు ఉలిక్కిపడ్డారు. అధ్యక్షుడు ట్రంప్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నిన ఆ యువకుడు.. అందుకు డబ్బులు ఇవ్వట్లేదనే ఈ దారుణానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఈ మేరకు ఫెడరల్‌ వారెంట్‌లో పేర్కొన్నారు.  విస్కాన్సిన్‌లోని మిల్వాకీ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల నికిటా క్యాసప్‌.. ఈ ఏడాది ఫిబ్రవరి 11న తన తల్లి టటియానా, సవతి తండ్రి డొనాల్డ్‌ మేయర్‌ను తమ నివాసంలోనే అతి దారుణంగా తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం కొన్ని వారాల పాటు మృతదేహాల పక్కనే నివసించాడు. ఆ తర్వాత 14వేల డాలర్ల నగదు, పాస్‌పోర్ట్‌ ఇతర వస్తువులు తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతడి ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు సమాచారం ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు రావడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో గత నెల కాన్సస్‌లో నిందితుడు నికిటాను పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తులో అతడి గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్థిక అవసరాలు, స్వేచ్ఛ కోసమే అతడు తల్లిదండ్రులను చంపినట్లు తెలిసింది. అంతేకాదు.. అధ్యక్షుడు ట్రంప్‌ను చంపేందుకు అతడు కుట్ర పన్నినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఈ కుట్ర గురించి తల్లిదండ్రులకు తెలియడంతోనే వారిని నిందితుడు హత్య చేసినట్లు తెలిసింది. వారిని చంపేసిన తర్వాత ఆ యువకుడు ఓ డ్రోన్‌, ఇతర పేలుడు పదార్థాలను కొనుగోలు చేశాడట. ఓ రష్యా వ్యక్తితో కలిసి ఈ ప్లాన్‌ వేసినట్లు సమాచారం. టిక్‌టాక్‌, టెలిగ్రామ్‌ వంటి సోషల్‌మీడియా యాప్‌లలో ఇతడు సంభాషణలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ట్రంప్‌ను చంపి ఉక్రెయిన్‌ పారిపోవాలని అతడు ప్రణాళిక వేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.

మంగళగిరి ఆదర్శ నియోజకవర్గం.. లక్ష్య సాధన దిశగా లోకేష్ అడుగుల వేగం!

ఐదు రోజుల పాటు మంగళగిరి నియోజకవర్గంలో సాగిన మన ఇల్లు.. మన లోకేష్ కార్యక్రమం ముగిసింది. ఈ ఐదు రోజుల్లో ఈ కార్యక్రమం ద్వారా 3000 మందికి లబ్ధి చేకూరింది. అధికారంలోకి వచ్చిన ఏడాది లోగానే లోకేష్ తన నియోజకవర్గంలో 3000 మందికి వారు నివసిస్తున్న ప్రభుత్వ స్థలంలోనే క్రయ, విక్రయాది హక్కుభుక్తాలతో కూడిన పట్టాలు ఇచ్చారు. లోకేష్ మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం ద్వారా లబ్ధి దారులను ఇచ్చిన పట్టాల విలువ మార్కెట్ రేట్ ప్రకారం వెయ్యి కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ పట్టాలు పొందిన లబ్ధిదారులు వాటిని తమ పేరు మీద రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ పట్టాలను లోకేష్ తన స్వహస్తాలతో గ్రామాల వారీగా లబ్ధిదారులకు అందజేశారు.   అదే విధంగా మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం చివరి రోజు అయిన ఆదివారం (ఏప్రిల్ 13) లోకేష్  మంగళగిరిలో వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఇది కూడా నియోజకవర్గ ప్రజల దీర్ఘకాలిక డిమాండ్ కావడం గమనార్హం. అలాగే అదే రోజుల రక్షిత మంచినీటి పథకాన్ని కూడా ప్రారంభించారు.  2019 ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన నారా లోకేష్ ఆ తరువాత ఐదేళ్లూ అదే నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని, నియోజకవర్గ సమస్యలపై అవగాహన ఏర్పరుచుకున్నారు. 2024 ఎన్నికలలో 91 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. లోకేష్ కృషి కారణంగా పీపీపీ పద్ధతిలో మంగళగిరి- తెనాలి నాలుగు వరససల రహదారి నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. అదే విధంగా 300 కోట్ల రూపాయల వ్యయంతో  మహానాడు కాలనీలో కృష్ణానది వెంబడి రిటైనింగ్ వాల్ నిర్మాణం,  జూన్ నుంచి భూగర్భ డ్రైనేజీ, గ్యాస్, విద్యుత్ ప్రాజెక్టు పనులు ప్రారంభం కానున్నాయి. దేశంలోనే మంగళగిరి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తానన్న లోకేష్ ఆ దిశగానే వడివడిగా అడుగులు వేస్తున్నారు. అధికారం చేపట్టిన పది నెలలలోపే నియోజకవర్గ రూపురేకలు మారిపోయేలా పనులకు, పథకాలకు శ్రీకారం చుట్టారు.  

మరో సారి ముద్రగడ.. జగన్ భజన

స్వయం ప్రకటిత కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అలియాస్ ముద్రగడ పద్మనాభ రెడ్డి తన స్థాయిని, తన ప్రతిష్టనూ తనే దిగజార్చుకుంటున్నారు. కాపు ఉద్యమ నేతగా ముద్రగడకు గతంలో మంచి ప్రాధాన్యతే ఉండేది. కాపులకు రిజర్వేషన్ అంటే ఆయన చేసిన ఉదమ్యాలు, ఉత్తర కంచి సంఘటనలతో కాపు సామాజిక వర్గంలో ముద్రగడ తిరుగులేని నేతగా నిలిచారు. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ల కోసం ఆయ‌న ఉద్య‌మించిన స‌మ‌యంలో ల‌క్ష‌లాదిగా యువత ఆయ‌న వెంట న‌డిచారు. అయితే అదంతా గతం. ఇప్పుడు ఆయనను కాపు సామాజికవర్గం తమ నేతగా అంగీకరించే పరిస్థితి లేదు. ఇది నిస్సందేహంగా ఆయన స్వయంకృతాపరాథమే అని చెప్పక తప్పదు. ఎందుకంటే.. 2019 ఎన్నికలకు ముందు    కాపు  రిజర్వేష‌న్లకు సుముఖంగా ఉన్న చంద్ర‌బాబును కాదని.. ఆ ప్ర‌తిపాద‌న‌కు నో చెప్పిన జ‌గ‌న్ కు ముద్ర‌గ‌డ‌ మద్దతు ఇచ్చారు. ఇక జగన్ 2019 ఎన్నికలలో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత కాపు రిజర్వేషన్లు అయ్యే పని కాదని కుండబద్దలు కొట్టేసి, అంతకు ముందు చంద్రబాబు సర్కార్ ప్రతిపాదనలను పక్కన పెట్టేశారు. దీంతో కాపు సామాజిక వర్గంలో ముద్రగడపై వ్యతిరేకత వెల్లువెత్తింది.    వాస్తవానికి ముద్రగడ పద్మనాభం 2014-19 మధ్యలో కాపు రిజర్వేషన్ల ఉద్యమం అంటూ గొంతెత్తడానికి కారణం చంద్రబాబు సర్కార్ ను ఇబ్బందుల్లోకి నెట్టడానికేనని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. కాపు సామాజిక వర్గాన్ని తెలుగుదేశం పార్టీకి దూరం చేయడమే లక్ష్యంగా ముద్రగడ  2104-19 మధ్య కాలంలో కాపు రిజర్వేషన్ నినాదాన్ని ఎత్తుకున్నారంటారు.   అయితే అప్పట్లో చంద్రబాబు ఈడబ్ల్యుఎస్ కోటాలో కాపులకు 5శాతం రిజర్వేషన్లు కల్పించినా ముద్రగడ దానిని స్వాగతించలేదు. కాపు సామాజిక వర్గానికి మేలు చేసే ఆ నిర్ణయాన్ని ముద్రగడ వ్యతిరేకించడానికి కారణం చంద్రబాబు పట్ల అయిష్టతేననీ, అహంకారం వినా ముద్రగడకు కాపు సామాజిక వర్గంపై అభిమానం లేదనీ, వారి ప్రయోజనాలు పట్టవనీ, అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. ఇక 2019 ఎన్నికలలో విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రిగా పదవీ పగ్టాలు చేపట్టిన తరువాత కాపు లకు 5శాతం కోటాను రద్దు చేశారు. అప్పుడు కూడా జగన్ ను విమర్శిస్తూ ముద్రగడ నోటి వెంట ఒక్కటంటే ఒక్క మాట రాలేదు. అంతే కాదు జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ ముద్రగడ నోటి వెంట కాపు రిజర్వేషన్ ఉద్యమం గురించి మరిచిపోయారు.  కాపు రిజర్వేషన్ అంశాన్ని పక్కన పెట్టేయడంతో సరిపెట్టుకోకుండా ముద్రగడ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై గుడ్డి వ్యతిరేకత పెంచుకున్నారు. కాపు సామాజిక వర్గం నుంచి తాను తప్ప మరో నాయకుడు ఉండకూడదన్న దుగ్థ, అసూయ కారణంగానే ముద్రగడ పవన్ ను వ్యతిరేకించారని కాపు సామాజికవర్గం నుంచే విమర్శలు వెల్లువెత్తాయి. ఆ కారణంగానే పవన్ పై ఇష్టారీతిగా విమర్శలు గుప్పించిన ముద్రగడ సరిగ్గా 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు.  అయితే ముద్రగడకు వైసీపీలో ఎలాంటి గౌరవం లభించలేదు. అసలు ఈ మధ్య కాలంలో ముద్రగడకు జగన్ దర్శన భాగ్యమే దొరకలేదని చెప్పొచ్చు. అయినా ముద్రగడ నోటి వెంట జగన్ కు వ్యతిరేకంగా ఒక్కటంటే ఒక్క మాట రాలేదు.  అటువంటి ముద్రగడ ఇప్పుడు జగన్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కారణమేంటంటే.. వైసీపీ అధినేత జగన్ తాజాగా 33 మంది సభ్యులతో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీని నియమించారు. ఆ 33 మందిలో ముద్రగడ పేరు కూడా ఉంది. ఇంతకీ ఈ వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ పనేమిటి?  అంటే.. రాష్ట్ర రాజకీయపరిస్థితులపై చర్చించి.. జగన్ కు అవసరమైన సలహాలు ఇవ్వడం. ఈ కమిటీకి సజ్జల కన్వీనర్ గా ఉన్నారు.  ఆ 33 మంది సభ్యుల కమిటీలో తనను ఒకరిగా చేర్చినందుకే ముద్రగడ తన జన్మధన్యమైపోయిందన్నంతగా ఆనందపడిపోతున్నారు.  వాస్తవానికి వైసీపీలో నిర్ణయాలన్నీ జగన్ ఆయన కోటరీ మాత్రమే తీసుకుంటారన్నది అందరికీ తెలిసిందే. అందుకే వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ నామ్ కే వాస్తే అన్న విషయం ఆ పార్టీ వర్గాలే  చెబుతున్నాయి. అటువంటి నామ్ కే వాస్తే కమిటీలో ఓ సభ్యుడిగా తనను చేర్చినందుకే  బ్రహ్మానందపడిపోతున్నారు. తనకు పార్టీ రాజకీయ వ్యవహారల కమిటీలో స్థానం కల్పించినందుకు జగన్ కు కృతజ్ణతలు చెబుతూ ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు.   జగన్ మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపడతారని, జగన్ సీఎం కావడానికి తన శక్తి మేరకు తాను పోరాడతాననీ ముద్రగడ పేర్కొన్నారు. ఇక ఇప్పుడు విషయానికి వస్తే గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇక ముద్రగడ పిఠాపురంలో పవన్ కల్యాణ్ ను ఓడించడమే తన ధ్యేయమన్నారు. కానీ జరిగిందేమిటి? 90 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి విజయం సాధించారు. అంటే జిల్లాలో ముద్రగడకు ఉన్న పలుకుబడి ఏమిటి? ఎంత అన్నది తేలిపోయిందని, కాపు సామాజిక వర్గం ముద్రగడను నమ్మడం లేదనడానికి ఇదే నిదర్శనమని అంటున్నారు.  పిఠాపురంను పక్కన పెడితే 2024 ఎన్నికల్లో ముద్రగడ సొంత నియోజకవర్గం జగ్గంపేటలో తెలుగుదేశం అభ్యర్థి 52 వేల 675 ఓట్ల ఆధిక్యతతో భారీ విజయం సాధించారు. అంత దాకా ఎందుకు 1999 నుంచి ముద్రగడ ఒక్కటంటే ఒక్క ఎన్నికలో కూడా విజయం సాధించలేదు. ముద్రగడ చివరి సారిగా  2014 ఎన్నికలలో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఘోరంగా కనీసం డిపాజిట్ కూడా రాకుండా పరాజయం పాలయ్యారు. ఇప్పుడు జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికి పోరాడుతానంటూ గంభీర ప్రకటనలు చేయడం ద్వారా తన ప్రతిష్టను తానే మరింత దిగజార్చుకోవడమే కాకుండా నవ్వుల పాలౌతున్నారు. 

అలిపిరి వద్ద బేస్ క్యాంప్!

తిరుమలేశుని దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా, వారు ప్రశాంతంగా, భక్తి శ్రద్ధలతో స్వామి వారి దర్శనం చేసుకోవడానికి అవసరమైన పలు చర్యలు తీసుకుంటున్న తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా తిరుమలేశుని దర్శనం జాప్యం లేకుండా వేగంగా జరిగేందుకు వీలుగా ఏఐ సాంకేతికతను వినియోగించుకోవడానికి రెడీ అయ్యింది.  ఇందు కోసం ప్రతి భక్తుడికీ ఒక పర్మనెంట్ ఐటీ ఇచ్చేందుకు సమాయత్తమౌతోంది. అలాగే తిరుమల విజన్ 2047 కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది.   అందులో భాగంగానే అలిపిరి వద్ద బేస్ క్యాంప్ ఏర్పాటుకు టీటీడీ నిర్ణయించింది.  15 హెక్టార్ల విస్తీర్ణంలో  ఏర్పాటు చేయనున్న ఈ బేస్ క్యాంప్ వద్ద నుంచి ప్రైవేటు వాహనాలను కొండపైకి అనుమతించకుండా నిరోధించి భక్తులకు బస్సుల్లో అవీ ఎలక్ట్రికల్ బస్సుల్లో కొండపైకి తీసుకు వెళ్లాలని నిర్ణయించింది. అలాగే అలిపిరి వద్దే వసతి, దర్శనం సహా అన్ని కౌంటర్లనూ ఏర్పాటు చేయనుంది.  ఈ బేస్ క్యాంప్ ఏర్పాటుకు ప్రణాళికలను రూపొందించింది.  తిరుమలలో పెరుగుతున్న వాహనాల రద్దీ తగ్గించడం, తద్వారా కాలుష్యాన్ని అరికట్టడం లక్ష్యంగా టీటీడీ ప్రణాళికలు రూపొందిస్తున్నది.