sand mafia is also the reason for tdp defeat

ఒక పరాజయం 100 తప్పులు.. ఇసుక తుఫాను ధాటికి కొట్టుకుపోయిన టీడీపీ

  సామాన్య ప్రజలకు భారం కాకుండా చేయాలన్న ఉద్దేశంతో ఏపీలో ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చిన టీడీపీ.. కథ అడ్డం తిరిగి, చివరకు ఇసుక తుఫాను ధాటికి కొట్టుకుపోయిందా అంటే అవుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీలో ఇసుక మాఫియా ఎప్పటినుంచో ఉంది. ఈ మాఫియా ఇసుకను బంగారంలాగా సామాన్యులకు అందుబాటులో లేని ధరలతో చుక్కలు చూపిస్తోంది. దీంతో కొందరు సీనియర్ అధికారులు ఇసుకను ప్రభుత్వ ఆదాయ వనరుగా భావించకుండా ఫ్రీ చేస్తే.. అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇసుక మాఫియా ఆటలు కూడా సాగవని అప్పుడు ఏపీ సీఎంగా ఉన్న బాబుకి సలహా ఇచ్చారు. దీంతో బాబు ఇసుకని ఫ్రీ చేసారు. ఇది మంచి ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయమే అయినప్పటికీ.. కొందరి తీరు కారణంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు, పార్టీ నష్టపోయింది. ఫ్రీ ఇసుక మాకే అన్నట్టుగా కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలు రెచ్చిపోయారు. ఇసుక మాఫియాతో చేతులు కలిపి.. ఇసుకను స్థానిక ప్రజలకు అందని ద్రాక్షలా చేసారు. తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాలకు తరలించి కోట్లకు కోట్లు సంపాదించారు. గత ఐదేళ్ళలో ఈ ఇసుక మాఫియా వల్ల ఎన్నో దాడులు కూడా జరిగాయి. ప్రజలు, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా బాబు ఈ విషయాన్ని ఎందుకనో అంత సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించలేదు. ఇసుక మాఫియాను అరికట్టే ప్రయత్నం చేయలేదు. ఇదే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకొని బాబు కొంపముంచింది. మొత్తానికి ఇసుక తుఫాను ధాటికి టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది.

YCP to get Room no 5 in Parliament

పార్లమెంట్.. రూమ్ నెo.5 లో ఏం జరుగుతోంది?

  ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవడం అంటే ఏమిటో టీడీపీకి తెలిసి వస్తోంది. ఎన్ని ఏళ్ళ రాజకీయ జీవితంలో చూడని వన్నీ జగన్ బాబుకు చూపిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టలని చూస్తున్న జగన్ పార్టీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కేటాయించిన పార్లమెంటులోని ఐదో నంబర్ గదిని ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రస్తుతం టీడీపీ కార్యాలయం పార్లమెంట్ లోని ఐదో నంబర్ గదిలోనే ఉంది. అయితే అంత పెద్ద గది వాళ్లకి అక్కర్లేదని 22 మంది లోక్‌సభ, ఇద్దరు రాజ్యసభ సభ్యులున్న ఆ గదిని తమ పార్టీకి కేటాయించాలని వైసీపీ పార్లమెంటరీ పార్టీ చేసిన విజ్ఞప్తిని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదించినట్లు తెలిసింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసిన తరువాత ఐదో నంబర్ గదిని ఖాళీ చేసి మూడో అంతస్తులో ఉన్న చిన్న గదిలోకి టీడీపీ తమ కార్యాలయంగా మార్చుకోవలసి ఉంటుందని అంటున్నారు. పార్లమెంటు ఆవరణలోని ఐదో నంబర్ గది దాదాపు 35 సంవత్సరాల నుండి తెలుగుదేశం అధీనంలో ఉన్నది.  1984లో ఎన్‌టీ రామారావు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ 30 లోక్‌సభ సీట్లు గెలుచుకోవటంతో ఐదో నంబర్ గదిని ఆ పార్టీకి కేటాయించారు. తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మంది సభ్యులుండటం వల్ల గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న ఆ గదిని పార్టీ కార్యాలయం కోసం కేటాయించారు. అప్పటినుంచీ ఆ గది టీడీపీ కార్యాలయంగా కొనసాగుతూనే ఉంది. 1989లో తెలుగుదేశం లోక్‌సభ సభ్యుల సంఖ్య రెండుకు పడిపోయినా ఆ ఐదో నంబర్ గదిని మాత్రం ఎలానో కాపాడుకున్నారు.  2004లో టీడీపీ సభ్యుల సంఖ్య ఐదుకు పడిపోయినప్పడు కూడా అప్పటి టీడీఎల్‌పీ నాయకుడు ఎర్రంనాయుడు, 2009 ఎన్నికల్లో టీడీపీ ఆరు సీట్లు మాత్రమే గెలిచినా అప్పటి టీడీఎల్‌పీ నాయకుడు నామా నాగేశ్వరరావు ఐదో నంబర్ గది తమ చేయి జారకుండా కాపాడుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం లోక్‌సభ సభ్యుల సంఖ్య మూడుకు పడిపోవటం సుజనా చౌదరి, రమేష్, గరికపాటి రామ్మోహన్‌రావు, వెంకటేష్ బీజేపీలో చేరిపోవటంతో రాజ్యసభలో టీడీపీకి ఇద్దరు సభ్యులే మిగిలారు.  దీనికితోడు ఆ సీట్లను వైసీపీ గెలుచుకోవడంతో ముప్పై ఐదేళ్ళు పైగా ఉంటున్న ఆ గది నుండి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఖాళీ చేయవలసి వస్తోంది. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయిరెడ్డి ఈ ఐదో నంబర్ గదికోసం గట్టిగా కృషి చేశారని అంటున్నారు. ఆయన బీజేపీ నాయకులను కలిసి ఐదోనంబర్ గదిని తమకు కేటాయించవలసిన అవసరం గురించి పలుమార్లు వివరించటంతో వైసీపీకి కేటాయించేందుకు అంగీకరించినట్లు తెలిసింది.  అయితే ఈ గది వైసీపీకి దక్కకుండా చూసేందుకు తెలుగుదేశం నాయకులు గట్టిగా ప్రయత్నించినా ఫలితం కనిపించటం లేదని అంటున్నారు. నిజానికి వారం క్రితమే ఐదో నంబర్‌ గదిలో ఉన్న టీడీపీ కార్యాలయాన్ని పార్లమెంటరీ మంత్రిత్వశాఖకు కేటాయించారని సమాచారం. ఈ గదిని పార్లమెంటరీ మంత్రిత్వశాఖ కార్యదర్శి పేరిట కేటాయించారని, దానిని తర్వాత మరెవరికైనా కేటాయించవచ్చునని అనుకున్నారు. అది వైసీపీకే అని తాజాగా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.  

There Is No Corruption In Polavaram Works Says Centrral govt

బాబు మీద మరక వేయడానికి జగన్ కి రెండో అవకాశం కూడా పోయిందా ?

  ఎంతో కష్టపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జగన్, అభివృద్ధి మీద కాక అవినీతి మీద ద్రుష్టి పెట్టడం చర్చనీయాంశంగా మారింది. తనని పదే పదే అక్రమాస్తుల కేసును ఉద్దేశిస్తూ చంద్రబాబు, ఆయన పార్టీ చేసిన అవినీతి ఆరోపణల మీద రివెంజ్ తీర్చుకోవాలని చూస్తున్నాడో ఏమో కానీ ఎలా అయినా చంద్రబాబు అవినీతి పరుడు అనే ముద్ర వేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు.  అందుకు అనుగుణంగానే బాబు నిర్ణయాలు, ఆయన ప్రభుత్వ ఉత్తరవుల మీద కేబినేట్ సబ్ కమిటీల మీద కమిటీలు వేసుకుంటూ వెళ్తున్నాడు. అలాగే అమరావతి, పోలవరం, విధ్యుత్ కొనుగోళ్ళ విషయాల్లో తెలుగుదేశంని టార్గెట్ చేయడానికి చూస్తోంటే ఎప్పటికప్పుడు అది ఎదురు తిరుగుతూనే ఉంది. చంద్రబాబు హయాంలో చేసుకున్న సౌర, పవన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ)ల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని జగన్ సర్కారు భావిస్తోంది.  అందుకే వాటిని ఎలా అయిన బయట పెట్టాలని చూస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇందులో అవకతవకలేమీ చోటు చేసుకోలేదని, పీపీఏలను రద్దు చేస్తే.. దాని ప్రభావం పెట్టుబడులపై పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ ఇటీవలే జగన్‌కు లేఖ రాసిన రాశారు. అలా ఒక విషయంలో గేట్లు క్లోజ్ అవ్వగా నిన్న మరో విషయంలో కూడా గేట్లు క్లోజ్ అయ్యాయి. అదే పోలవరం, పోలవరం నిర్మాణంలో అవకతవలకు సంబంధించి నిన్న రాజ్యసభలో వైసీపీ, బీజేపీ సభ్యులు కొన్ని ప్రశ్నలు సంధించారు.  అంతేకాక పోలవరంపై వస్తున్న అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలని ఈ సందర్భంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. పోలవరం నిర్వాసితులకు పునరావాసం, పునర్నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో ప్రస్తావించారు. అయితే విజయసాయి ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగినట్టు తమకు ఎలాంటి నివేదికలు రాలేదని తేల్చి చెప్పారు.  అందుకే ఈ విషయం మీద విచారణకు ఆదేశించే అవకాశం కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాక పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించిందని, విభజన చట్టంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని షెకావత్ తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి వంద శాతం నిధులను కేంద్రమే భరిస్తుందని చెప్ప్పిన ఆయన నిర్మాణ పనులు ఇప్పటి వరకు 60 శాతం వరకు పూర్తి అయ్యాయని తెలిపారు. 

some tv channels are the reason for tdp defeat

ఒక పరాజయం 100 తప్పులు.. టీడీపీని ముంచేసిన 'ఆ' మీడియా!!

  మీడియా అనేది.. ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తే ప్రశంసించాలి. తప్పు చేస్తే ప్రశ్నించాలి. అధికార, ప్రతిపక్ష పార్టీలు అనే తేడా లేకుండా ప్రజలకు ఉన్నది ఉన్నట్టుగా చూపించాలి. అయితే ఇప్పుడు మీడియా సంస్థలు కొన్ని పార్టీల సొంత సంస్థలుగా మారిపోయి నిజాలను దాస్తున్నాయి. కొందరు నాయకులను ముంచుతున్నాయి. సరిగ్గా చంద్రబాబు విషయంలో కూడా ఇదే జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొన్ని తెలుగు మీడియా సంస్థలు గత ఐదేళ్ళలో బాబు ఏమి చేసినా పొగడటమే పనిగా పెట్టుకున్నాయి. బాబు ఏమి చేసినా ఆహా ఓహో అనడం, బాబు ఏది చేస్తే అదే కరెక్ట్ అన్నట్టు చెప్పడం చేసాయి. అసలు బాబు పాలన మీద, పార్టీ మీద ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం ఉందనే విషయాన్ని నిజాయితీగా తెలియజేసే ప్రయత్నమే చేయలేదు. అదేమంటే బాబు పొగడ్తను తీసుకున్నట్టు విమర్శను తీసుకోరు. ఆయన్ని పొగిడితే పక్కన పెట్టుకుంటారు, ఆయన నిర్ణయాన్ని తప్పుబట్టినా, విమర్శించినా శత్రువుగా చూస్తారు అందుకే మేము భజన చేశామని కొందరు మీడియా అధినేతలు చెబుతున్నారు. మొత్తానికి ఆ మీడియా భజన వల్ల ప్రజల్లో ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత.. బాబుకి తెలియకుండా పోయింది. పార్టీ ఘోరంగా ఓడిపోయింది. మరి బాబు ఇకనైనా పొగడ్తతో పాటు విమర్శ కూడా తీసుకొని మళ్ళీ గాడిలో పెడతారేమో చూడాలి.

Is bigg boss controversy worth lessIs bigg boss controversy worth less

బిగ్ బాస్ కాంట్రవర్సీ....అనవసరమైనదేనా ?

  బిగ్ బాస్ తొలి రెండు సీజ‌న్స్ ప‌ద్ద‌తిగా సాగిపోయాయి. చిన్న కాంట్రవ‌ర్సీ కూడా లేకుండా అయిపోయాయి. కానీ మూడో సీజ‌న్ మాత్రం ప్రారంభానికి ముందే  ఎన్నో వివాదాల‌కు తావిస్తుంది.  బిగ్ బాస్ తొలి సీజన్‌తోనే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తొలి సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించడంతో ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది. ఆయన కూడా అద్భుతంగా హోస్ట్ చేయడంతో తెలుగు టీవీ చరిత్రలోనే అత్యధిక టీఆర్‌పీ రేటింగ్‌తో ఈ షో దూసుకుపోయింది.  ఇక రెండో సీజన్‌కు నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ సీజన్ 100 రోజులపాటు సుధీర్ఘంగా సాగింది. హౌజ్‌లో మసాలా, గొడవలతో మొదటి సీజన్‌ను మించి హైలైట్ అయ్యింది.  మూడో సీజన్  జులై 21 నుంచి ‘బిగ్ బాస్’ షో ప్రసారం కానున్నట్టు ఇప్పటికే ప్రోమో వీడియో ఒకటి స్టార్ మా ఛానల్‌లో ప్రసారమవుతోంది. ఇప్పుడు ఆ షో నిడివి, సెలబ్రిటీల సంఖ్యను ఖరారుచేస్తూ స్టార్ మా ఛానల్ ట్వీట్ చేసింది.  100 రోజులపాటు ఈ షో కొనసాగనుంది. మొత్తం 15 మంది సెలబ్రిటీలు బిగ్ హౌజ్‌లోకి అడుగుపెట్టనున్నారు. గతంలో మాదిరిగానే శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు, సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటలకు ఈ షో ప్రసారం కానుంది. అయితే గత రెండు సీజనల సమయంలో బ‌య‌టికి రాలేదో లేక ఏమో కానీ ఇప్పుడు ఈ షో మీద సెక్స్ ఆరోపణలు వస్తున్నాయి.  సినీ పరిశ్రమ వరకే పరిమితమైన లైంగిక వేధింపులు ఇప్పుడు ‘బిగ్ బాస్’లోకి కూడా వచ్చాయని శ్వేతా రెడ్డి ఆరోపిస్తోంది. తాను బిగ్ బాస్ హౌజ్‌లోని అడుపెట్టాలంటే తమ బాస్‌ను ఇంప్రస్ చేయాలని ఒక కో ఆర్డినేటర్ తనను అడిగాడని ఆరోపిస్తూ ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు లైంగిక వేధింపుల కింద ‘బిగ్ బాస్’ నిర్వాహకులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.  తాజాగా రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో కూడా కేసు నమోదైంది.. బిగ్‌ బాస్‌ 3 నిర్వాహకులు తనకు అవకాశం ఇస్తానని చెప్పి మోసం చేశారంటూ సినీ నటి గాయత్రి గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్వేతారెడ్డితో కలిసి రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన గాయత్రి గుప్తా పోలీసులకు కంప్లయింట్ చేశారు. బిగ్‌బాస్‌ 3 నుంచి నిర్వాహకులు ఫోన్‌ చేసి నటించేందుకు సిద్ధమా అని అడిగారని.. ఆ తర్వాత ఆ టీమ్‌కు సంబంధించిన మరి కొంత మంది వ్యక్తులు తమ ఇంటికి వచ్చి అగ్రిమెంట్‌ కూడా చేసుకున్నారని గాయత్రి చెప్పారు.  ఈ మేరకు తాను సినిమాలు కూడా వదులుకున్నానని తెలిపారు. అయితే తనను అసభ్యకరమైన రీతిలో కమిట్‌మెంట్‌ అడగడంతో ఆగ్రహం వ్యక్తం చేశానన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఫోన్‌ చేసి తనకు ఛాన్స్‌ రాలేదని చెప్పారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బిగ్‌ బాస్‌ షోలో సెలక్ట్‌ అయ్యానని చెప్పడంతో ఆరు సినిమాల్లో ఛాన్స్‌లు వదులుకున్నానని తనకు జరిగిన ఆర్థిక నష్టాన్ని భర్తీ కూడా చేయలేదని గాయత్రి గుప్తా ఫిర్యాదులో పేర్కొన్నారు.  షోను రక్తి కట్టించేందుకు పాపులర్ పర్సనాలిటీలతో పాటు సోషల్ మీడియాలో పాపులర్ అయినవారికి బిగ్ బాస్ హౌజ్ లోకి అవకాశం కల్పిస్తారు. బిగ్ బాస్ కు ఉన్న క్రేజ్ తో కంటెస్టెంట్లకు మరింత పాపులారిటీ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ క్రేజ్ నే బిగ్ బాస్ కో-ఆర్డినేటర్లు, ప్రొడ్యూసర్లు క్యాష్ చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత సీజన్‌కి కంటెస్టెంట్ వీక్‌గా ఉండటంతో ఆ ప్రభావం రేటింగ్స్‌పై పడింది.  ఈసారి అలాంటి తప్పులు జరగకుండా.. ఆటను రక్తికట్టించగలిగే సెలబ్రిటీలను బిగ్ బాస్ హౌస్‌కి తీసుకువస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఎవరైతే కాంట్రివర్శిలు చేసి ఫేమస్ అయ్యారో వాళ్ళనే సంప్రదించించారు బిగ్ బాస్ నిర్వాహకులు. అయితే ఇదంతా న‌మ్మ‌డానికి లేద‌ని కావాల‌నే కాంట్ర‌వ‌ర్సీ చేసి చీప్ ట్రిక్స్ ప్లే చేసి పాపుల‌ర్ కావాల‌ని చేస్తున్నారంటూ వాళ్ల‌పైన ఎదురు దాడి కూడా జరుగుతోంది.  తాజాగా స్వయం ప్రకటిత మేధావిగా ప్రకటించుకున్న కత్తి మహేష్ ఈ విషయం మీద కామెంట్స్ చేశారు.  బిగ్ బాస్ హౌస్‌కి వస్తే 100 రోజుల పాటు సెక్స్ లేకుండా ఉండగలరా? అని నిర్వాహకులు అడగడంలో తప్పేం లేదని కత్తి మహేష్ అంటున్నాడు. అంతేకాదు గాయిత్రి గుప్తను ‘యాక్టివ్ సెక్స్ లైఫ్ ఉన్న బోల్డ్ అమ్మాయి’ అని కూడా ఆయన సంచలన ఆరోపణ చేశారు. ఆయన ఏమని పోస్ట్ చేశారంటే  ‘2017 లో..  బిగ్ బాస్ టీం: 70 రోజుకు సెక్స్ లేకుండా ఉండగలరా?  నేను: బాత్రూమ్ లో కెమెరాలు ఉండవుగా! పర్లేదు మ్యానేజ్ చేసుకుంటాను.  ఇదే ప్రశ్న , ఇదే టీం యాక్టివ్ సెక్స్ లైఫ్ ఉన్న బోల్డ్ అమ్మాయిని ఇప్పడు 2019లో అడిగితే తప్పైపోతుందా? జస్ట్ ఆస్కింగ్! అని పోస్ట్ చేశారు ఆయన.  అయితే ఈ విషయాన్ని ఒక ఫీమెల్ కంటెస్టెంట్ని అడగకూడని గాయత్రి అంటుంటే లేదు అడిగితే తప్పేంటని కత్తి మహేష్ అడుగుతున్నారు. అయితే ఈ విషయం మీద మాత్రం బయటకి వచ్చి కంప్లైంట్ చేసిన వారిదే తప్పన్నట్టు కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు కూడా.  ఒక ఆడపిల్లను అలా అడగొచ్చా ? అంటే ఏమని చెప్పగలం గేమ్ ఆడించే వారి రూల్స్ వారికి ఉంటాయేమో ?. ఈ వివాదాలు రాకుండా ఆ అగ్రిమెంట్ చేసే టీమ్ లో ఒక మహిళని పెట్టుకుని వారి చేత లేడీస్ ని ఈ ప్రశ్న వేయించి ఉంటే సరిపోయేది. అయితే రెండు సీజన్లు ఎటువంటి ఆరోపణలు లేకుండా సాగిన ఈ షో మీద వీరు కామెంట్ చేయడం వలన నష్టం వీరికా ? బిగ్ బాస్ కా ? పాపులర్ అయ్యేది బిగ్ బాసా ? ఈ ఇద్దరా ?

kesineni nani strategy to leave tdp

బాబు గారి పెంపుడు కుక్కను కంట్రోల్ చేయాలి....కేశినేని తెగించారా ?

  ఏపీలో మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన టీడీపీకి రోజూ ఏదో ఒక టెన్షన్ మామూలు అయిపొయింది. ఓపక్క పలువురు నేతలు పార్టీని వీడుతుండగా మరోవైపు పార్టీలోని నాయకుల మధ్య అంతర్గత పోరు రచ్చకెక్కడం టీడీపీ అధిష్టానానికి మింగుడు పడటం లేదు. గత కొంతకాలంగా టీడీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న ఎంపీ కేశినేని నాని ఆదివారం ట్విటర్‌ వేదికగా బుద్ధా వెంకన్నపై పరోక్షంగా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.  అయితే దీనికి బుద్దా కూడా కౌంటర్‌ ఇచ్చారు. అయితే ఈరోజు పోద్దుపోద్దున్నే కేశినేని ట్విటర్‌ వేదికగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘చంద్రబాబు గారు.. నన్ను వద్దనుకుంటే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎంపీ పదవికి, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసేందుకు సిద్ధం. నాలాంటి వాళ్లు పార్టీలో ఉండాలంటే.. మీ పెంపుడు కుక్కను కంట్రోల్‌ చేయండి’  కేశినేని ట్విటర్‌లో పేర్కొన్నారు.  అయితే కేశినేని ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనే దాని మీద క్లారిటీ లేకున్నా, ఆ వ్యాఖ్యలు బుద్ధా వెంకన్నను ఉద్దేశించినవేనని అంటున్నారు విశ్లేషకులు. నిన్న కూడా పేరు ప్రస్తావించకుండా ‘‘రాజకీయ జన్మలు, రాజకీయ పునర్జన్మలు, రాజకీయ భవిష్యత్తులు, గుళ్లో కొబ్బరి చిప్ప దొంగలకి, సైకిల్ బెల్లుల దొంగలకి, కాల్ మనీ గాళ్లకి, సెక్స్ రాకెట్ గాళ్లకి, బ్రోకర్లకి, పైరవిదారులకి అవసరం. నాకు అవసరం లేదు’’ అంటూ నాని ట్వీట్ చేశారు.  మొన్నటి ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ నుండి రెండో సారి ఎంపీగా గెలిచిన ఆయన ఆనాటి నుండే ట్వీట్ల ద్వారా పార్టీలో సంచ‌ల‌నంగా మారారు. పేర్లు ఆయన ఎక్కడా ప్రస్తావించకున్నా ఆయ‌న కృష్ణా జిల్లాకు చెందిన పార్టీలో అధికారం చెలాయిస్తున్న ఇద్ద‌రు నేత‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకొని ఈ రచ్చ చేస్తున్నారని అర్ధమయ్యింది. అయితే ఆ మధ్య పార్లమెంటరీ నేత ఎన్నిక సమయంలో కూడా ఆయన రచ్చ రేపుతుండడంతో చంద్ర‌బాబు పిలిపించుకుని మాట్లాడారు.  అయితే తాత్కాలికంగా అప్పటికీ సైలెంట్ అయినా మళ్ళీ ట్వీట్ల రచ్చ మొదలుపెట్టారు. ముందుముందుగా పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు మినహా' అంటూ ఓ ట్విట్‌, మొదలుపెట్ట్రిన ఆయన ఆ తర్వాత నేను పార్టీలో ఎప్పుడూ ధిక్కార స్వరం వినిపి స్తూనే ఉంటా.. అది నా నైజం.. నేను నిజం మాత్రమే మాట్లాడతా.' అంటూ మరో ట్విట్‌ చేశారు. అయితే నిజానికి ఈయన టార్గెట్ చేస్తున్నది ఆ జిల్లా మాజీ మంత్రి, జిల్లా మొత్తానికి టీడీపీ ఫైనలైజర్ లీడర్ అయిన ఉమాని, అలాగే ఆయన అనుచరుడుగా పేరొందిన బుద్ధా వెంకన్నని.  ఉమాకి.. ఎంపీ కేశినేని నానికి మధ్య దూరం ఉందన్న విషయం ఇటీవల నాని పోస్టులతో స్పష్టమవుతోంది. రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలన్న పార్టీ అధినేత నిర్ణయం ఈ ఇద్దరు నేతల నడుమ దూరానికి కారణమైందని అంటున్నారు. వీరి నడుమ అంతరాన్ని తగ్గించేందుకు అధినేత చోరావ్ అ చూపినా ఫలితం లేకుండా పోయింది. నిజానికి కొద్ది రోజుల క్రితం వీఎంసీ తాజా మాజీ కార్పొరేటర్లతో నాని ఏర్పాటు చేసిన సమావేశం మరోసారి వివాదానికి ఆజ్యం పోసింది.  ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో నాగుల్‌ మీరా పశ్చిమ నుంచి పోటా చేస్తారన్న సంకేతాలను నాని పంపారు. ఈ క్రమంలో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నేత బుద్ధా వెంకన్న కొందరు పార్టీ నేతల వద్ద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ అధినేత అనుమతి లేకుండా నాని ఎలా ప్రకటిస్తారని వెం కన్న కొందరు నేతల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఆ వ్యాఖ్యలను కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు నానికి చేరవేశారు.  దీంతో వీరిద్దరి నడుమ దూరం పెరిగింది. అప్ప‌టి నుండి ఈయన కూడా కేశినేనికి టార్గెట్ గా మారారు. ఈ రచ్చ చంద్ర‌బాబునే ఇబ్బంది పెట్టె స్థాయికి చేరింది. తాజాగా నాలుగు ఓట్లు సంపా దించలేనివాడు నాలుగు పదవులు సంపా దిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేని వాడు.. నాలుగు వాక్యాలు రాయలేనివాడు.. ట్వీట్లు చేస్తున్నాడు.. దౌర్భాగ్యం' అంటూ నాని ట్వీట్‌ చేశారు. నిజానికి ఇప్పుడు బుద్ధా వెంకన్న నామినేటెడ్ ఎమ్మెల్సీగా ఉన్నారు, దీంతో ఈ వ్యాఖ్యలు ఆయనను ఉద్దేశించినవే అని అంటున్నారు.  దీనికి వెంకన్న కూడా వెంటనే స్పందించారు. ‘సంక్షోభ సమయం లో పార్టీ కోసం నాయకుడు కోసం పోరా డేవాడు కావాలి. ఇతర పార్టీ నాయకులతో కలిసి కూల్చేవాడు ప్రమాదకరం. నీలాగా అవకాశ వాదులు కాదు. చనిపోయే వరకు చంద్ర బాబు కోసం సైనికుడిలా పోరాడే వాడు కావాలి' అంటూ ట్వీట్‌ చేశారు. ఇదే స‌మ‌యంలో కేశినేని నానికి మ‌ద్ద‌తుగా పార్టీ నేత నాగుల్ మీరా ట్వీట్ చేసారు.   ‘పార్టీ కష్టకాలంలో చంద్రన్న ఆదేశంతో బాధ్యత తలకెత్తుకుని కోట్లాది రూపా యలు ఖర్చు పెట్టి వస్తున్నా మీకోసం పాదయాత్రను దిగ్విజయంగా నిర్వహించి, విజయవాడ పార్లమెంటు నియోజక వర్గాన్ని విజయపథంలో నడిపించిన కేశినేని నాని కష్టంతోనే నీకు, నాకు పదవులు దక్కాయి. గుర్తుపెట్టుకో’ అంటూ నాగుల్‌ మీరా, బుద్దా వెంకన్నను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు.  ఎంపీ కేశినేని నాని తాజా ట్వీట్ చూస్తుంటే ఆయ‌న తాడో పేడో తేల్చుకోవడానికి సిద్దమయ్యారనే విష‌యం అర్దం అవుతోంది. తాజాగా ఆయ‌న చేసిన ట్వీట్‌లో పార్టీలో తాను అస‌వ‌రం లేద‌ని భావిస్తే ఆ విష‌యం త‌న‌కు స్ప‌ష్టం చేయా ల‌ని తాను ఎంపీ ప‌దవితో పాటుగా పార్టీకి కూడా రాజీనామా చేస్తాన‌ని ట్వీట్ ద్వారానే చంద్ర‌బాబుకు అల్టిమేటం జారీ చేసా రు. అదే స‌మ‌యంలో పెంపుడు కుక్క‌ను కంట్రోల్ చేయండి అంటూ ప‌రోక్షంగా తాను ట్వీట్ల ద్వారా యుద్దం చేస్తున్న నేత గురించి ప్ర‌స్తావించిన‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అయితే ఈ విషయంలో చంద్రబాబు ఏమి చేస్తారో అనే విషయం ఆసక్తికరంగా మారింది.  

Ap Budget 2019 Analysis Ysrcp Govt To Take Debts

జగన్ కి విషమ పరీక్ష....బాబు కన్నా ఎక్కువ అప్పుల తిప్పలు ?

  గత ఎన్నికల్లో హోరాహోరీ పోరాడిన వైసీపీ ప్రభుత్వం నిన్న తొలి పద్దును ప్రవేశపెట్టింది. దాదాపు రూ.2.28 లక్షల కోట్లతో ఆర్థిక మంత్రి బుగ్గన ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌పై జగన్ మార్క్ స్పష్టంగా కనిపించింది. ఎన్నికల్లో తాము గెలవడానికి ఎంతో దోహదపడిన మేనిఫెస్టోలో పేర్కొన్న నవరత్నాల అమలు కోసం బడ్జెట్ లో భారీ ఎత్తున నిధులు కేటాయించారు.  అయితే ఈ కేటాయింపుల్లో ఎక్కువ మొత్తం సంక్షేమ పదకాలకే కేటాయించిన నేపధ్యంలో ముందుకుముందే విమర్శలు రాకుండా తమకి ఒక విజన్‌ ఉందని, రాబోయే కాలంలో తమ విజన్ తో  దేశంలోనే ఎపీను ప్రథమ స్థానంలో నిలుపుతామని బడ్జెట్ సందర్భంగా బుగ్గన వ్యాఖ్యానించారు. వాస్తవాలు మాట్లాడుకోవాలంటే సంక్షేమ పథకాల కోసం రూ.90 వేల కోట్లు కేటాయించిన తరుణంలో ప్రభుత్వానికి విజన్ ఎంతో అవసరం.  పూర్తి బడ్జెట్ రూ.2,27,974 కోట్లు కాగా ఆదాయ వనరులేమో రూ.1,78,697 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఏపీకి పన్నుల రూపేణా 75,437 కోట్లు సమకూరుతాయని సర్కారు భావిస్తుండగా కేంద్ర పన్నుల్లో వాటా రూపంలో రూ.34,833 కోట్లు, పన్నేతర ఆదాయంగా రూ.7354 కోట్లు, రుణ వసూళ్ల ద్వారా రూ.600 కోట్లు ఖజనాకు చేరతాయని భావిస్తోంది. మరోపక్క రెవెన్యూ లోటు రూ.1778.52 కోట్లు ఉండగా ద్రవ్యలోటు సుమారు రూ.35,260.58 కోట్లుగా ఉంది.  ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం చేసే సహాయం మీదనే ఏపీ సర్కారు భారీ ఆశలు పెట్టుకుంది. కేంద్ర నుంచి నిధుల రూపంలో రూ.61,071 కోట్లు వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది. గతంలో చంద్రబాబు కేంద్రం నుంచి రూ.50 వేల కోట్ల సాయాన్ని ఆశిస్తే వారిచ్చినది రూ.19 వేల కోట్లే. అంటే డిమాండ్ కి సప్ప్లై కి మధ్య ఉన్న తేడా రూ.30 వేల కోట్లు. ప్రస్తుతానికి వైసీపీ బీజేపీ మధ్య సఖ్యత ఉన్నా అడిగినంత నిధులిచ్చేంత అవసరమైతే మోడీకి లేదు.  దీంతో ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం ఇబ్బంది పడక తప్పదేమో ? గత ఏడాది బడ్జెట్ కంటే ఈ ఏడాది బడ్జెట్ అంచనా 19.32 శాతం పెరుగుతుందని వైసీపీ నిన్న ప్రకటించింది. కానీ ఆ అంచనాలు ఎంత మేర నిజమవుతాయో చెప్పలేం. వారి అంచనా మేరకు పెరగకపోతే జగన్ సర్కారుకు చిక్కులు తప్పవు. ఎందుకంటే గత 2018-19 బడ్జెట్లో బాబు సర్కారు అంచనాల కంటే తక్కువగా ఆదాయం సమకూరింది.  ఆ వ్యత్యాసం ఎంత అంటే రూ.35 వేల కోట్లకుపైగా. దీంతో అప్పుడు రూ.33,461 కోట్ల మేర అప్పులు తెస్తామని చెప్పిన చంద్రబాబు సర్కారు రూ.38 వేల కోట్ల మేర రుణాలు తెచ్చింది. ప్రస్తుత బడ్జెట్లో అదే పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్తపడాలి. ఇక రుణాల రూపంలో రూ.46,921 కోట్లు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 2018-19 నాటికి రాష్ట్రానికి రూ.2.58 లక్షల కోట్ల రుణాలు ఉన్నాయని నిన్న బుగ్గన స్పష్టం చేశారు.  అయితే గత ఆర్థిక సంవత్సరంలో టీడీపీ సర్కార్ ఎడాపెడా అప్పులు చేస్తోందని ఆరోపించిన వైసీపీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ అప్పులు తేవాల్సిన దుస్థితి. జగన్ సమర్ధతకి ఆది పెద్ద పరీస్ఖ అనే చెప్పాలి. నిజానికి పాలనలో అనుభవం ఉన్న చంద్రబాబుకే సాధ్యం కానిది, యువకుడిని అని చెబుతున్న జగన్ ఏమి చేయనున్నారో ? చూడాలి మరి.  

New twist from world bank for amaravathi construction

అమరావతి నిర్మాణానికి కేంద్రం మోకాలడ్డు....జగన్ ఏమి చేస్తారో ?

  ఏపీ రాజధాని అమరావతి మీద జగన్ ముఖ్యమంత్రి అయిన నాటి నుండే జానానికి అనుమానం పట్టుకుంది. దానికి కారణం మొదటి నుండి రాజధాని అక్కడ కట్టడాన్ని వైసీపీ వ్యతిరేకిస్తూ రావడమే. అదీ కాకా ఎన్నికల ముందు జాతీయ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో జగన్‌ను రాజధాని మార్పుపై అడిగితే ఏమీ స్పందించకుండా ఉండిపోయాడు. ఆ మౌనం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వ్యతిరేకత తెచ్చే ప్రమాదం ఉంటుందేమో అన్న సందేహాలున్నప్పటికీ జగన్ ఆనాడు స్పందించకపోవడం ఇప్పటికీ ఆశ్చర్యం కలిగించే విషయమే.  అయితే జగన్ వైపు నుండి పడతాయి అనుకున్న బ్రేకులు ప్రపంచ బ్యాంక్ నుండి పడేలా కనిపిస్తున్నాయి. దానికి కారణం అమరావతి నిర్మాణం కోసం నిధులు కావాలంటే వెంటనే తాము తనిఖీలు నిర్వహించాల్సిందేనని ప్రపంచబ్యాంక్ ఏపీ ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. అయితే బాబు సర్కార్ ఆ నిదులను సద్వినియోగం చేసింది కాబట్టి వాళ్ళు తనిఖీలు చేసినా వచ్చే నష్టం లేదు. కానీ ప్రపంచబ్యాంక్ ఇన్స్‌పెక్షన్ ప్యానెల్ తనిఖీలు చేయడం ఇప్పటి వరకు దేశంలో లేదని, ఇప్పుడు కూడా ఆ అవకాశం ఇవ్వమని కేంద్రం చెప్తోంది.  ఇక దీంతో ఎటూ రాజధాని మార్చాలని చూస్తున్న జగన్ కు ఈ  వ్యవహారం కలిసోచ్చేలా ఉంది. ఇప్పటి వరకూ లేని ప్రపంచబ్యాంక్ ఇన్స్‌పెక్షన్ ప్యానెల్ తనిఖీ అనేది కొత్త సంప్రదాయమని భావిస్తున్న కేంద్రం అవకాశం ఇస్తే దేశంలో ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడుతున్న అన్ని ప్రాజెక్టులకు కూడా తనిఖీలు చెయ్యాలని చూస్తారని అది మరింత ఇబ్బందిగా మారే అవకాశం ఉందని భావిస్తోంది. ఈ తరుణంలో అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధులను తీసుకెళ్లే ప్రతిపాదనను విరమించుకోవాలని కేంద్రం రాష్ట్రానికి సూత్రప్రాయంగా పేర్కొన్నట్టు సమాచారం. దాని స్థానే ఇతర మార్గాల ద్వారా రాజధాని నిర్మాణానికి నిధులను సమీకరించాలని కేంద్రం సూచించినట్టుగా చెబుతున్నారు. అయితే ఈ విషయంలో జగన్ కి కాస్త సంతోషంగానే ఉన్నా, ఆయనకి ఇది రిస్క్ లానే తోస్తోంది. ఎందుకంటే తనిఖీల విషయమై తమ అభిప్రాయాన్ని ఈ నెల 23వ తేదీలోపుగా చెప్పాలని ఏపీ ప్రభుత్వానికి ప్రపంచబ్యాంక్ స్పష్టం చేసింది. కానీ కేంద్రం తనిఖీలను వ్యతిరేకిస్తుంది. అయితే ఈ విషయమై తమకు మరింత గడువు కావాలని కేంద్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం లేఖ పంపింది. కానీ లేఖ అయితే పంపింది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయనుంది అనేదే ఆసక్తికరంగా మారింది.  ఎందుకంటే నిర్మణాలు మొదలు పెట్టి చాలా వరకూ పూర్తి చేసుకున్న అమరావతికే నిధులు సమకూర్చలేకుంటే ఇంకా కొత్తగా ఓకవేళ దొనకొండ రాజధాని అని చెప్పినా అది ప్రజామోదం పొందే అవకాశం లేదు, దీంతో జగన్ ఇప్పుడు ఏమి చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఉన్నారని అంటున్నారు. చూడాలి అమరావతి ఏమవుతుందో ?

Jagan soft corner on kcr irrigation projects in Assembly

జగన్ సార్...కేసీఆర్ గారిని మీ అంత బాగా అర్ధం చేసుకున్న వారు లేరేమో ?

  కేసీఆర్ ని, ఆయ‌న గొప్ప మ‌న‌సును జ‌గ‌న్ మాదిరి అర్థం చేసుకున్నోళ్లు ఇంకెవరూ ఉండ‌రేమో ? తాజాగా జ‌రుగుతున్న అసెంబ్లీ స‌మావేశాల్లో ఆయ‌న మాట‌లు వింటే అలానే అనిపిస్త్తోంది. ఇరుగుపొరుగు రాష్ట్రాల‌తో స‌ఖ్య‌త ఉండ‌టం చాలా అవసరం. కానీ జగన్ చూపుతున్న అతి ప్రేమ ఆయన కొంప ముంచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానికి నిన్న అసెంబ్లీ ప్రొజెక్ట్ స్క్రీన్ అయ్యింది.  ఎందుకో ఏమో కానీ గోదావ‌రి నీళ్ల‌ను శ్రీ‌శైలంలో క‌ల‌పాల‌న్న రూ.లక్ష‌న్న‌ర కోట్ల ప్రాజెక్టు విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌ద‌ర్శిస్తున్న అతి శ్రద్ద ఆయన కొంప ముంచక తప్పదని అంటున్నారు. ఆయన మాటలు ఏ రేంజ్ లో ఉన్నాయంటే కేసీఆర్ ఏపీకి గోదావరి నీళ్లు ఇచ్చేందుకే ఈ లక్షన్నర కోట్ల కొత్త ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారని, కేసీఆర్ నీళ్లిస్తూంటే ప్రతిపక్ష పార్టీ వద్దంటున్నాయని ఆయన విమర్శలు గుప్పించారు.  అయితే అసలు నిజంగా మనకు కేసీఆర్ నీళ్లిస్తున్నారా..? మన నీళ్లలో అనధికారికంగా వాటా పొందుతున్నారా..? అనేది కొంచెం లోకజ్ఞానం ఉన్నవారికి ఎవరికీ అయినా అర్ధం అవుతుంది. నిజానికి ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత.. తెలంగాణ సర్కార్‌తో.. అత్యంత సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో నీటి పారుదలకి సంబంధించి రెండు ప్రభుత్వాలు చేసిన ఆలోచన గోదావరి నీటిని శ్రీశైలంకు తరలించడం.  రెండు రాష్ట్రాలు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టి పూర్తి చేయాలని ప్రాధమిక నిర్ణయానికి వచ్చాయి. ఈ విషయం మీద ఇరు రాష్ట్రాల చీఫ్ ఇంజినీర్లలు కూడా చర్చలు జరుపుతున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే రాయలసీమకు నీటి కరువు ఉండదని ఏపీ అధికార పార్టీ చెబుతోంది. కానీ నిపుణులు, విశ్లేషకులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా విశ్లేషిస్తున్నారు. ఆంధ్ర హక్కు అయిన నీళ్లను తెలంగాణ వాడుకునేందుకే ఈ ప్రాజెక్ట్ కి కేసీఆర్ రూపకల్పన చేశారని అంటున్నారు. తాజాగా నీటిపారుదల, ప్రాజెక్టుల విషయంలో కాస్త పట్టున్న సీనియర్ నేతలు మైసూరారెడ్డి, తులసీరెడ్డి కడపలో ఓ మీటింగ్ పెట్టి నిపుణులతో చర్చించి అసలు తెలంగాణ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎలా వాడుకోవాలని చూస్తున్నారో క్లారిటీ ఇచ్చారు. గోదావరి నికర జలాలపై సంపూర్ణ హక్కులు ఏపీకే ఉన్నాయి, మిగులు జలాల్ని ఏదోలా తీసుకునేందుకే తెలంగాణ కొత్త ప్రాజెక్టు ప్రతిపాదనలు పెట్టిందని చెబుతున్నారు.  గోదావరి నికర జలాలపై పూర్తి హక్కు ఉన్నప్పుడు పక్క రాష్ట్రంతో కలిసి పంచుకోవడం ఎందుకనే ప్రశ్న మొదలువుతోంది. కొత్త ప్రాజెక్ట్ పేరు చెప్పి ఏపీ నీటిని తెలంగాణ వాడుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ చేతనే ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ నిర్మించడం అంటే ఎంత తెలివి తక్కువ పనో అర్ధం అవుతుందని అంటున్నారు. జ‌గ‌న్ మాట‌ల‌న్ని ఎలా ఉన్నాయంటే.. ఈ ప్రాజెక్టు లేకపోతే ఏపీకి భ‌విష్యత్తే లేద‌న్న‌ట్లుగా మాట్లాడ‌టం కనిపిస్తుంది. మరి అయన ఎందుకు ఇంతగా సాగిల పడుతున్నారో మరి ?

Trs Mp D Srinivas Meets Bjp President Amit Shah In Delhi

మొన్న టీఆర్ఎస్ భేటీకి...నిన్న అమిత్ షాతో భేటీ...డీఎస్ మార్క్ రాజకీయం !

  మొన్నటికి మొన్న టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ సమావేశానికి హాజరయి వారికి షాక్ ఇచ్చిన డీఎస్, ఇప్పుడు అమిత్ షాతో సుధీర్గ భేటీ జరిపి మళ్ళీ హాట్ టాపిక్ గా మారారు. నిజానికి డీఎస్ అనే ఒక ఎంపీ ఉన్నారని కూడా టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ కూడా మర్చిపోయి ఉండచ్చు, అలాంటిది ఆయన వారి సమావేశానికి వెళ్లి షాక్ ఇచ్చి అక్కడితో ఆగక, నిన్న ఢిల్లీలో అమిత్‌షాను కలిశారు. ఈ ఇద్దరు నేతలు అరగంటకుపైగా సమావేశమైనట్లు సమాచారం.  అయితే తెలంగాణా మీద ఫోకస్ పెట్టిన షాతో ఈయన అంత సేపు భేటీ కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో డీఎస్ కుమారుడు అరవింద్, నిజామాబాద్ నుంచి కేసీఆర్ కుమార్తె కవితపై బీజేపీ టికెట్ పై పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో ఎటూ పార్టీకే దూరంగా ఉన్నాడు కాబట్టి తన కుమారుడికి డీఎస్ మద్దతిచ్చి తన పార్టీకి వ్యతిరేకంగా కొడుకును గెలిపించుకున్నాడు.  నిజానికి డీ శ్రీనివాస్ పై, ఎన్నికలకు ముందే వేటు వేయాలని తన తండ్రి కేసీఆర్ ను కవిత కోరారు. కానీ కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, కానీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అవమానించారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీలోకి డీఎస్ వెళతారని అందరూ అనుకున్నారు. కానీ, పార్టీ మారకపోయినప్పటికీ, గులాబీ గూటికి దూరమయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీ గనుక రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మళ్లీ డీఎస్ కాంగ్రెస్‌లో చక్రం తిప్పుతారని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది.  డి.శ్రీనివాస్ అనుచరులుగా గుర్తింపు తెచ్చుకున్న టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చింది. అయితే అనుచరులను కాంగ్రెస్ పార్టీలోకి పంపిన డీఎస్ తాను మాత్రం అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరితే రాజ్యసభ సభ్యత్వానికి ఇబ్బంది అనే కారణంగా ఆయన ఎక్కడా కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు.  అసెంబ్లీ ఎన్నికలకు ముందు విద్యార్థినిపై లైంగిక దాడి కేసు ఎదుర్కొన్న ఆయన కుమారుడు సంజయ్ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పని చేశారు. అలాంటి సంజయ్ బుధవారం టీఆర్ఎస్ ఎంపీ కవితతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తాజాగా ఎంపీ కవితతో డీఎస్ తనయుడు సంజయ్ భేటీ వెనుక ఆంతర్యం ఏమిటనే దానిపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన టీఆర్ఎస్ లో మళ్ళీ యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారనే విశ్లేషణ కాస్త లాజిక్ ప్రకారం బాగానే ఉంది. కానీ మళ్ళీ ఆయన షాతో భేటీ కావడం మళ్ళీ ఆయన రాజకీయ చతురత మీద అంచనాలు రేపుతోంది. ఈ భేటీతో ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం మొదలయ్యింది. తనను అకారణంగా పక్కన పెట్టిందన్న కారణంతో ఎన్నికలకు ముందు, తన అనుచరులను కాంగ్రెస్ పార్టీలోకి పంపించి టీఆర్ఎస్ ఓట్లు చీల్చడం, తన కుమారుడిని బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేయించడం, టీఆర్ఎస్ అభ్యర్థి కవితకు వ్యతిరేకంగా అరవింద్ కు మద్దతునివ్వడం, ఇప్పుడు పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరవడం, మళ్ళీ అమిత్ షాతో భేటీ కావడం ఇవన్నీ డీఎస్ కాంగ్రెస్ మార్క్ రాజకీయం అని అనుకుంటున్నారు. 

Karnataka Cm Kumaraswamy May Resign Today

తుది అంకానికి కర్-నాటకం...రాజీనామానా...అసెంబ్లీ రద్దా ?

  గత కొన్ని రోజులుగా ఉత్కంఠను రేపిన కర్ణాటక రాజకీయం చివరి అంకానికి చేరినట్టే ? నా అంటే అవుననే అంటున్నారు. ఏడాది క్రితం అట్టహాసంగా ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వానికి కాలం చెల్లిపోయిందని, రెబెల్ ఎమ్మెల్యేలను సముదాయించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవడంతో ముఖ్యమంత్రి కుమారస్వామి రాజీనామా చేసి అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు 11 గంటలకు కుమారస్వామి అత్యవసరంగా మంత్రిర్గ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.  కేబినెట్ మీటింగ్ తర్వాత గవర్నర్ ను కలిసి కుమారస్వామి రాజీనామా పత్రాన్ని అందిస్తారని సమాచారం. ఇప్పటికే ఆయన గవర్నర్ అపాయింట్ మెంట్ కోరారు. నిన్న ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ప్రైవేట్ కారులో బయటకు వెళ్లిన కుమారస్వామి కొన్ని గంటల పాటు పత్తా లేకుండా పోయారు. ఆ తర్వాత జేపీ నగర్‌ లోని తన సొంతింటికి వెళ్లి రాజకీయ పరిణామాలపై తన తండ్రి దేవెగౌడతో చర్చించారు. ఆయనతో చర్చలు జరిపాక ఆయన సలహా మేరకే సీఎం పదవికి రాజీనామా చేయాలని కుమారస్వామి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ ముందుకు వస్తే బయట నుంచి మద్దతు ఇద్దామని దేవెగౌడ చేసిన ప్రతిపాదనను కుమారస్వామి అంగీకరించారని అంటున్నారు. అయితే కుమారస్వామి రాజీనామా చేసి అసెంబ్లీ రద్దుకు పూనుకుంటే తద్వారా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వస్తే ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని బీజేపీ పావులు కదుపుతోంది. కాంగ్రెస్ కూడా అసెంబ్లీని రద్దు చేయవద్దని కోరుతోంది. కుమారస్వామి రాజీనామా చేస్తే మళ్ళీ జేడీఎస్ తో కలిసి కాంగ్రెస్ సర్కార్‌తో ఏర్పాటయ్యే అవకాశాలను అగ్రనేతలు పరిశీలిస్తున్నారు. రెబల్ ఎమెల్యేలందరికీ మంత్రి పదవులిస్తే వారు రాజీనామాలను ఉపసంహరించుకుంటారని, తద్వారా తగిన బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్నారు. చూడాలి మరి ఏమవుతుందో ?

   India lost semi finals in WOrld cup 2019

తానోడి కివీస్ ని ఫైనల్స్ కి పంపిన టీమిండియా...అదే కారణమా ?

  ఈ ఏడాది వరల్డ్ కప్ భారత్ దే...ఈ వరల్డ్ కప్ సీజన్ మొదలయిన నాటి నుండే వినిపించిన మాట ఇది. దానికి ఎన్నో ఉదాహరణలు మరెన్నో పోలికలు. అందుకు తగ్గట్టే టీమిండియా కూడా తనదైన ప్రదర్శన కనబరిచింది. క్రికెట్ దిగ్గజం అయిన ఆసీస్ ను సైతం వెనక్కు నెట్టి పాయింట్ల పట్టికలో ముందుంది. ఇంగ్లాండ్ తో ఆట తప్ప మిగతా అన్ని మ్యాచ్లు గెలిచిన ఇండియా  ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవడం, అది కూడా గెలుస్తామని కాన్ఫిడెన్స్ వచ్చాక కాస్త ఇబ్బంది కారణమనే చెప్పాలి. ఆటలు అన్నాక గెలుపోటములు సహజమే. టాపార్డర్ కుప్పకూలగా, జట్టు విజయ తీరాలకు చేర్చేందుకు జడేజా, ధోని చేసిన వీరోచిత పోరాటం వృథా అయ్యింది. దీంతో భారత అభిమానులు నైరాశ్యంలో కూరుకుపోయారు. మొదటి ఐదు పరుగులకే 3 వికెట్లు పడిపోగా మరో 19 రన్స్‌కే మరో వికెట్ పడింది. వారి స్కోరు 1,1,1,6.. ఆ దశలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్(32), హార్దిక్ పాండ్యా(32) వికెట్ పడకుండా కాసేపు అశలు రేకెత్తించారు. ఇద్దరూ అడపాదడపా సింగిల్స్ తీస్తూ కాపాడుకుంటూ వచ్చారు.  అయితే, సాంట్నర్ వీరిద్దరి సహనాన్ని పరీక్షించి బుట్టలో వేసుకున్నాడు. ఈ దశలో గ్రేట్ ఫినిషర్ మహేంద్ర సింగ్ ధోని, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చారు. వీరిద్దరు సింగిల్స్‌కే పరిమితం అవుతూ వచ్చారు. ఈ దశలో రన్ రేట్ 9కి చేరింది. అప్పుడే అసలు ఊహించని విధంగా జడేజా సిక్సుల మీదు సిక్సులు కొడుతూ న్యూజిలాండ్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. ధోని సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేస్తుంటే జడేజా కివీస్ బౌలర్ల భరతం పట్టాడు. అయితే చివర్లో 77 పరుగులు చేసి జడేజా ఔటయ్యాడు. ధోని(50) కూడా రెండో సింగిల్‌కు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు.  మరో 3 బంతులు మిగిలి ఉండగానే 221 పరుగుల వద్ద టీమిండియా ఆలౌట్ అయ్యింది.   ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమికి కారణాలేంటో విశ్లేషిస్తే  ముందుగా మాట్లడుకోవాల్సింది టాస్ గురించే. ఎందుకంటే నాకౌట్ మ్యాచ్‌ల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే టాస్ గెలవగానే విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓకవేళ కోహ్లి టాస్ గెలిచినా ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే వాడే. అల అముందు టాస్ గెలుచుకోవడం అనేది కీలకంగా మారింది.  ఇక వర్షం కూడా ఓటమికి కీలకమగా మారింది మ్యాచ్ జరుగుతున్న మాంచెస్టర్‌లో వర్షం పడకుండా మ్యాచ్ మంగళవారమే మ్యాచ్ ముగిసి ఉంటే ఫలితం వేరీలా ఉండేదేమో. కానీ బ్యాడ్ లక్ వర్షం కారణంగా మ్యాచ్ బుధవారానికి వాయిదా పడింది. ఉదయాన్నే పిచ్ మీద పడిన వర్షం కారణంగా పేస్‌కు అనుకూలించే పరిస్థితులలో కివీస్ పేస్ బౌలర్లు చెలరేగిపోయారు. ఇక భారత్ టాప్ ఆర్డర్ కుప్పకూలడం కూడా మ్యాచ్ ఓటమికి మరో కారణం టాప్ ఆర్డర్ పేక మేడను తలపించింది.  ఒకరి వెనక ఒకరు ఒకరి వెనక ఒకరు అలా వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా టాప్-3 బ్యాట్స్‌మెన్ ఒక్కో పరుగు చొప్పున చేసి అవుటయ్యారు. అప్పుడే భారత్ ఓడిన ఫీలింగ్ వచ్చినా ధోనీ ఏడో స్థానంలో దిగడం కూడా ఓటమికి ఓ రకంగా కారణం కావొచ్చు. దినేశ్ కార్తీక్ స్థానంలో ధోనీని ఐదోస్థానంలో బ్యాటింగ్‌కు పంపిస్తే ఫలితం మరోలా ఉండేదేమోనని వేస్లేషణలు వస్తున్నాయి. ఏదయితేనేమి మనం ఓడాము అంటే పోరాడినట్టే, ఈ పోరాటం ఇలాగే కొనసాగాలని వచ్చే ఏడాది అయినా మనవాళ్ళు ప్రపంచ కప్ కొట్టాలని కోరుకుందాం.

kamma brand is also the reason for tdp defeat

ఒక పరాజయం 100 తప్పులు.. 'కమ్మ' బ్రాండ్ కొంప ముంచిందా?

  టీడీపీ ఘోర పరాజయంలో కమ్మ బ్రాండ్ కీలక పాత్ర పోషించిందా అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ప్లాన్ ప్రకారం పార్టీ మీద కమ్మ ముద్ర వేయడానికి ప్రయత్నించారు. ఆ విషయం ప్రజల్లోకి బలంగా వెళ్తున్నా.. దాన్ని గుర్తించలేకపోయారు, ఒకవేళ గుర్తించినా ఆ ముద్రని పోగొట్టడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని చెప్పాలి. దాదాపు అన్ని పార్టీలకు ఏదొక కుల ముద్ర వేయడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ నిజానికి ఏ కులమూ ఓ పార్టీకి పూర్తిగా మద్దతు తెలపదు, తెలిపిన దాఖలాలు కూడా లేవు. టీడీపీ విషయంలో కూడా అదే జరిగింది. నిజానికి కమ్మ సామాజికవర్గమంతా టీడీపీ వెంటలేదు. అది 2019 ఎన్నికల ఫలితాల్లో కూడా తేలిపోయింది. ఎందుకంటే కమ్మ వారు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా టీడీపీ ఘోర ఓటమిని చవిచూసింది. అంటే ఎన్నికల ముందు టీడీపీ కమ్మ పార్టీ అని చేసిన ప్రచారమంతా కావాలనే చేసిందని అర్ధమవుతోంది. కానీ దీన్ని పసిగట్టడంలో బాబు విఫలమయ్యారు. అప్పట్లో టీడీపీని బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ అనే వారు. కొందరు బీసీల పార్టీ అని కూడా అనేవారు. కానీ ఈ మధ్య కమ్మ పార్టీ అనే ముద్ర పడింది. అసలు నిజానికి బాబు కమ్మ సామాజికవర్గాన్ని కావాలనే దూరం పెడతారని కూడా పార్టీలో చెప్పుకుంటారు. ఎక్కడ కుల ముద్ర పడుతుందేమోనన్న భయంతో.. వారి దగ్గర విషయం, నిజాయితీ ఉన్నా కూడా భయంతో పక్కన పెట్టేవారట. దీంతో కమ్మ వర్గం బాబుకి దూరమవుతూ వచ్చిందట. కుల ముద్ర పడకూడదని ముందు జాగ్రత్త తీసుకున్న బాబు.. తీరా పార్టీ మీద జరిగిన తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడంలో విఫలమయ్యారనే చెప్పాలి. ఓ వైపు కమ్మ వారిని దూరం చేసుకున్నారు, మరోవైపు పార్టీపై పడిన కమ్మ ముద్ర ప్రచారాన్ని తిప్పికొట్టలేక ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్నారు.  

Jagan Crucial decision on Farmer suicide

భలే ప్లాన్ చేసిన జగన్...ముందు ఆ విషయం చూడండి సార్ !

  బాద్యతలు చేపట్టిన నాటి నుండి సంచలనాలకు మారుపేరుగా మారుతున్న ఏపీ సీఎం వైస్ జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సచివాలయంలో నేడు కలెక్టర్, ఎస్పీలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం తదితరులు హాజరయ్యారు. ప్ర‌ధానంగా ఎటువంటి స‌మ‌స్య‌లు మీ దృష్టికి వ‌స్తున్నాయంటూ క‌లెక్ట‌ర్ల‌ను వీడియా కాన్ఫిరెన్స్ లో అడగగా  రైతు ఆత్మ‌హ‌త్యల ప్రస్తావన వచ్చింది.  గత ప్రభుత్వ హాయంలో 1,513 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కానీ 391 మందికి మాత్రమే పరిహారం  ఇచ్చారని తెలిసింది. దీంతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షలు పరిహారం ఇవ్వడమే కాదు, వారికిస్తున్న పరిహారాన్ని వేరొకరు తీసుకోలేని విధంగా ఒక చట్టాన్ని కూడా తీసుకు వస్తున్నామని జగన్ స్పష్టం చేశారు. 2014–2019 వరకూ ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారంపై అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.  డిస్ట్రిక్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో ప్రకారం 1,513 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రికార్డులు చెప్తున్నాయని కానీ 391 మందికి మాత్రమే పరిహారం ఇచ్చినట్టుగా రికార్డులు చెప్తున్నాయని జగన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఈ రైతు కుటుంబాలకు పరిహారాన్ని నిరాకరించినట్టుగా దీన్ని బట్టి అర్థం అవుతోందన్నారు. జిల్లాల్లో పరిశీలించి ఎవరైనా అర్హులున్న రైతు కుటుంబాలు ఉంటే వెంటనే వారికి పరిహారం ఇవ్వాలని కలెక్టర్లను జగన్ ఆదేశించారు.  ఎమ్మెల్యేలతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించాలని జగన్ సూచించారు. ఎక్కడైనా సరే రైతు కుటుంబాల్లో జరగ రానిది జరిగితే వెంటనే కలెక్టర్‌ స్పందించాలని, కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఆ కుటుంబం దగ్గరకు వెళ్ళాలని సూచించారు. చనిపోయిన వారి కుటుంబాల పట్ల సానుభూతితో ఉండాలని, మానవత్వంతో మెలగాలని అన్నారు. మనిషే చనిపోయాడు మనం కూడా తోడుగా లేకపోతే సరైన సందేశం ఇచ్చినట్టు కాదని జగన్ స్పష్టం చేశారు.  నిజానికి ఈ పధకాన్ని కూడా జగన్ ఎన్నికల హామీలలో ఒకటిగా పొందుపరిచారు. ఆంధ్రప్రదేశ్ లో ఏ రైతు ఆత్మహత్య చేసుకున్నా తన ప్రభుత్వం రూ. 7 లక్షల పరిహారాన్ని అతని కుటుంబానికి అందిస్తుందని జగన్ కీలక హామీ ఇచ్చారు. పోలవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కొయ్యలగూడెంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన జగన్, రైతు సంక్షేమానికి దివంగత మహానేత వైఎస్ఆర్ ఎంతో పాటుపడ్డారని గుర్తు చేశారు.  రైతులకు ఆర్థిక సాయం విషయంలో తొలి సభలోనే చట్టాన్ని తెస్తామని అన్నారు. రైతు ఎలా మరణించారని ఎవరూ అడగరని, రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు లేకుండా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇక్కడి దాకా బాగానే ఉంది జగన్ గతంలో చనిపోయిన రైతులకే కాక ఇప్పుడు చనిపోయినా ఇస్తానని ఆయన హామీ ఇచ్చినట్టే. నిజానికి చాలా చోట్లస్ విత్తనాల కొరతతో రైతులు బాధ పడుతుంటే దని గురించి పట్టించుకోకుండా ఈ ప్రకటన చేయడం అంటే ఈ ఆత్నహత్యలను మరగున పడేసే ప్రయత్నమే.  చనిపోయిన రైతులకి పరిహారం ఇవ్వాలి కాదనం, అలాగే మరే రైతూ ఆత్మహత్య చేసుకోకుండా ఆపగలగాలి. ఇంగ్లిష్ లో ఒక సామెత ఉంటుంది Prevention is Better Than Cure అని. జగన్ కూడా అలాంటి నిర్ణయాలు ఏవయినా తీసుకుని ఉంటె బాగుండేది. అసలు రైతులు ఆఅత్మహత్యల జోలికి వెళ్ళకుండా ఉండాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలి. అది ప్రభుత్వం అందించే అవకాశం ఉండదు కాబట్టి బీమా చేయించే అవకాశాన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి.  అంతే కాక రైతుల నుంచి ప్రభుత్వమే పంటను గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేయాలి. ఇవన్నీ చేసినప్పుడే కధ రైతుకు నిజమైన సాయం చేసినట్టు ! అలా కాక ఆయన చనిపోయిన వారికి ఎక్స్ గ్రేషియా ఇస్తామంటే ? రైతుకు ఏమని సందేశం ఇద్దామని ? ప్రభుత్వమో, అధికారులో వెళ్లి డబ్బు ఇస్తే కన్నవారి కడుపుకోత, ఆ పిల్లల ఆక్రందనలు తీరుస్తాయా ? రైతు మరణిస్తే ఇవ్వడం సబబే కానీ వారి జీవితానికి అండగా ఉండేలాగా మరేదైనా చేస్తే ఉపయోగం కదా. మరణించాక ఇచ్చే ఎక్స్ గ్రేషియా కన్నా బ్రతికున్నప్పుడు బ్రతుకు మీద భరోసా ఇస్తే ఆ రైతు కుటుంబం ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా.  అదీ కాక నేటి సమాజంలో ముసల్లోలకి పెన్షన్ ఇవ్వడానికే లంచం అడుగుతున్నప్పుడు వీరికి డబ్బు మంజూరు చేసే అధికారులు ఈ ఏడు లక్షలలో ఏమీ తినరని మీరు గుండెల మీద చేయివేసుకుని చెప్పగలరా ? ఇంకా ఎన్ని రోజులు ఈ సానుభూతి రాజకీయాలు. ఇప్పుడు మీరు చేస్తున్న ఈ విత్తనాల ఆలస్యం వలన తొలకరి నాటికి కూడా అవి అందకపోతే ఇప్పటిదాకా పెట్టిన పెట్టుబడి రాదని ! వారు ఏమైనా చేసుకుంటే అప్పుడు కూడా తెలుగుదేశం మీద నిందలు వేసి ఊరుకుంటారా ? రాజు తలచుకుంటే దెబ్బలకి కొదవా అని ఒక ప్రభుత్వం తలచుకుంటే చేయలేనిది ఏముంది ? మీరు ఈ పరిహార ప్రకటనలు చేసేకంటే విత్తనాలు సంపాదించి పంచిపెట్టండి, రైతులకి ఎంతో మేలు చేసిన వారు అవుతారు.

cbi raids on gst officer bollineni srinivas gandhi

జగన్ ఫిర్యాదు ఎఫెక్టా...లేకా బాబును కార్నర్ చేసే ప్లానా ?

  తెలుగు రాష్ట్రాల మీద ఫోకస్ చేసిన బీజేపీ అందుకు అనుగుణంగా తన పని చేసుకుపోతోంది. ఈ నేపధ్యంలో నాయకులకి సన్నిహితంగా మెలిగిన, మెలిగారని ఆరోపణలు ఉన్న అధికారులను కూడా ఫోకస్ చేస్తోంది. ఈ నేపధ్యంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడుగా చెప్పబడుతోన్న జీఎస్టీ సీనియర్ అధికారి బొల్లినేని శ్రీనివాస్ గాంధీపై నిన్న సీబీఐ సోదాలు జరిపింది.  ఏకకాలంలో విజయవాడ, హైదరాబాద్‌ కార్యాలయాలతో పాటు ఆయన నివాసంలో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించి రూ. 200 కోట్లు అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో అధికారులు దాడులు చేపట్టారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడైన శ్రీనివాస్‌ వద్ద  రూ.4 కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. గాంధీతో పాటు ఆయన భార్య బొల్లినేని శిరీషపై కూడా అధికారులు కేసు నమోదు చేశారు.  అయితే గాంధీ ఇంతకు ముందు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లో పని చేశారు. వైసీపీ అధినేత జగన్, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరిలపై ఈడీ కేసులు నమోదు చేసింది గాంధీనే కావడం ఇప్పుడు పలు చర్చలకు తావిస్తోంది. ఎందుకంటే 2017… ఫిబ్రవరిలో మోడీని కలిసిన అప్పటి ప్రతిపక్ష నేత టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని అప్పటి ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో ఉన్న బొల్లినేని గాంధీతోపాటు ఈడీ జాయింట్ డైరెక్టర్ ఉమాశంకర్ గౌడ్‌ల‌పై జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేశారు.  టీడీపీ ప్రోద్బలంతోనే గాంధీ తనపై తప్పుడు కేసులని బనాయించారని మోడీకి రాసిన లేఖలో జగన్ పేర్కొన్నారు. అంతేకాక ఈడీ కేసులతో ఏమాత్రం సంబంధం లేని తన భార్య భారతికి కూడా నోటీసులు జారీ చేశారని అందుకే ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రధానిని జగన్ కోరారు. అయితే అప్పట్లోనే జగన్ ఆరోపణల కారణంగానే గాంధీ జీఎస్టీకి బదిలీ అయ్యారని అనుకునేవారు. తొలుత డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌లో పదేళ్లపాటు పని చేసిన గాంధీ తర్వాత ఈడీలో ఏడేళ్లపాటు పని చేశారు.  జగన్ కేసు తర్వాత ఆయన జీఎస్టీకి బదిలీ అయ్యారు, ఇక రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి సంబంధించిన కేసులో చంద్రబాబు సూచనల మేరకు పలు ఫైళ్లల్లో మార్పులు చేసినట్టు కూడా ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. గతంలో హైదరాబాద్‌ ఈడీ కార్యాలయం నుంచి బదిలీ అయినా అనధికారికంగా నెలరోజుల పాటు విధుల్లో కొనసాగారని కూడా ఈయన మెడ ఆరోపణలు వచ్చాయి. ఇవన్నీ నోట్ చేసుకుని ఓకే సారి రంగంలోకి దిగింది సీబీఐ. అయితే ఇప్పుడు పొలిటికల్ సర్కిళ్లలో బొల్లినేనిపై సీబీఐ కేసు అనేది తీవ్ర చర్చనీయామాశంగా మారింది, అయితే ఈ సీబీఐ దాడులు ఇక్కడితో ఆగుతాయా ? లేక ఇంకా ఎవరినైనా టార్గెట్ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. 

ఒక పరాజయం 100 తప్పులు.. టీడీపీని ముంచేసిన వారసులు!

  తెలుగుదేశం పార్టీ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అని స్వర్గీయ ఎన్టీఆర్ ఘనంగా ప్రకటించారు. కానీ తరువాత పరిస్థితి మారిపోయింది. కొన్నేళ్లుగా టీడీపీలో వారసుల హవా నడుస్తోంది. టీడీపీకి కూడా వారసత్వ పార్టీ ముద్ర పడింది. ఓ రకంగా టీడీపీ ఘోర పరాజయంలో వారసత్వం కూడా కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు. దాదాపు ప్రతి జిల్లాలో టీడీపీ ఒకటి-రెండు కుటుంబాల చేతిలో బందీ అయిపోయింది. నాయకులు.. తమ సోదరులనో, తనయులనో, బంధువులనో పార్టీలోకి తీసుకొచ్చి.. మిగతా వారిని నాయకులుగా ఎదగనివ్వకుండా చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి కార్యకర్త స్థాయి నుంచి ద్వితీయ శ్రేణి నేత వరకు ఎదిగిన వారు.. వారసుల మూలంగా నాయకులు కాలేకపోతున్నారు. నిజంగా నాయకత్వ లక్షణాలుంటే వారసుడ్ని పరిచయం చేయడంలో తప్పులేదు. అలా కాకుండా 'పాలించడం మా హక్కు, పార్టీ మా సొత్తు అన్నట్టుగా' ఎటువంటి అర్హత లేని వాళ్ళని తీసుకొచ్చి.. పార్టీ మీద, ప్రజల మీద రుద్దాలని చూడకూడదు. కానీ టీడీపీలో కొందరు అదే చేసారు . కేవలం వారసత్వం అనే ట్యాగ్ తో పార్టీలోకి వచ్చి కొందరు టికెట్లు సాధించారు. వారు ఓడిపోయి, పార్టీని ఓడించారు. వారసత్వ రాజకీయాల విషయంలో బాబు కూడా ఏం చేయలేకపోయారు. తన తనయుడు లోకేష్ ని తీసుకొచ్చి డైరెక్ట్ గా మంత్రిని చేసేయడంతో.. మిగతా నేతల వారసులకు కూడా పార్టీలో ప్రాధాన్యత ఇవ్వక తప్పలేదు. లోకేష్ కూడా పార్టీలో యువతికి ప్రాధాన్యం ఇస్తామంటూ.. వారసులకు ఇచ్చారు తప్ప, కొత్తవారిని ఎంకరేజ్ చేసిన దాఖలాలు లేవు. ఇక మహానాడులో వారసుల హడావుడి అంతాఇంతా కాదు. వారే పార్టీ భవిష్యత్ అన్నట్లు ప్రమోట్ చేసేవారు. ఇటువంటి చర్యల వల్ల నిజాయితీగా పార్టీ కోసం కష్టపడిన శ్రేణులు పార్టీకి దూరమయ్యాయి. తరువాత పార్టీ అధికారానికే దూరమైంది.  

లోకేష్ చాలా తెలివైన వాడే...కానీ అదే దెబ్బేసింది....మాజీ నేత విశ్లేషణ !

  ఏపీ మాజీ సీఎం కుమారుడు ఏపీ మంత్రి నారా లోకేష్ తెలివి తక్కువ వాడని, పప్పు అని అప్పటి ప్రతిపక్ష వైసీపీ గట్టిగా ప్రాజెక్ట్ చేసింది. ఆయన మీద వందల కొద్దీ మార్ఫింగ్ పోస్ట్ లు చేసీ చేసీ ఆయనకు పప్పు అనే పేరు పెట్టేసింది. దానికి తోడు ఆయనకు తెలుగు సరిగా పలకక పోవడంతో జనం అదే నిజమని నమ్మారు. నిజానికి ఆయన తెలివైన వాడు, అది ఆయనతో రాజకీయం చేసిన వారికి మాత్రమే తెలుసు, అది వైసీపీ వారికయినా టీడీపీ వారికయినా కీలక నేతలుగా ఉన్నవారికి. ఈ విషయం చెబితే మీకు నవ్వు రావచ్చు కానీ అదే నిజం. ఇదే విషయాన్ని ఇప్పుడు చెబుతున్నారు ఆ పార్టీ మాజీ నేత ప్రస్తుత బీజేపీ నేత అంబికా కృష్ణ. తాజాగా బీజేపీలో చేరిన ఆయన ఒక ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే నారా లోకేశ్ కు ప్రజల్లో అంత ఆదరణ రాలేదని అందుకే మంగళగిరిలో లోకేశ్ ఓడిపోయారని వ్యాఖ్యానించారు. మంగళగిరిలో ఓడిపోవడం టీడీపీకి, లోకేశ్ కు అపప్రధేనని అభిప్రాయపడ్డారు. లోకేశ్ కొన్ని పద్ధతులను మార్చుకోవాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లోకేశ్ అపాయింట్ మెంట్ కూడా పార్టీ నేతలకు దొరికేది కాదని వ్యాఖ్యానించారు.  చంద్రబాబుతో అపాయింట్మెంట్ కావాలన్నా దొరికేది కానీ లోకేశ్ తో దొరికేది కాదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరికినా లోకేష్ ది దొరకక కొంతమంది మంత్రులు కూడా ఈ విషయంలో చాలా ఫీలయ్యారని చెప్పుకొచ్చారు. నాయకుడి వెనుక లక్షల మంది ఉంటారని, అది అర్థం చేసుకుని వాళ్లకు టైం ఇవ్వాల్సిన బాధ్యత ఉందని కానీ అది తెలియక అపాయింట్మెంట్ ఇవ్వకపోవడమే లోకేష్ చేసిన బ్లండర్ అని అంబికా కృష్ణ చెప్పారు.  నిజానికి లోకేశ్ చాలా తెలివైనవాడనీ, ఆలోచనాపరుడనీ, స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడని అంబికా కృష్ణ తెలిపారు. ‘ఓ విషయాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి? ఓ సమస్యను ఎలా పరిష్కరించాలి? అనే విషయం లోకేశ్ కు బాగా తెలుసనీ, అయితే ఆయన చుట్టూ ఉన్న గ్యాంగ్ సరైన డైరెక్షన్ ఇవ్వలేకపోతుందేమో? అని ఆయన పేర్కొన్నారు. నిజానికి ఇది ఈయన అనుభవం వలన వచ్చిన అభిప్రాయం మాత్రమే కానీ ఈ విషయం చాలా మందికి అర్ధం అయ్యింది. లోకేష్ కి మైనస్ ఏదయినా ఉంది అంటే అది లోకేష్ వెనక ఉన్న టీమ్ మాత్రమే. కిలారు రాజేష్, పెద్ది రామారావు లాంటి వారిని ఆయన ఒక కోటరీగా ఏర్పరచుకుని ప్రజలు కాదు కదా నాయకులను కూడా తన అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయారు. అదే ఆయన కొంప ముంచింది. 

జగన్ రాజధానిని దొనకొండకి మారుస్తారా ?

  జగన్ రాజధానిని మారుస్తాడా? ఇప్పుడు ఇదే చర్చ ఏపీని పట్టి కుదిపేస్తోంది. ఇలా చర్చ జరగాడానికి ఒక కారణం జగన్ గద్దె నెక్కిన వెంటనే అమరావతి పనులను ఆపడమే కాక వైసీపీకి చెందిన ముఖ్య నాయకులు - ఎమ్మెల్యేలు దోనకొండ మరియు చుట్టుపక్కల భూములను పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం కూడా ఈ అనుమానాలకు కారణమవుతోంది. జగన్ ప్రణాళికల ప్రకారమే వీరంతా కొంటున్నారనే చర్చ మొదలయ్యింది.  నిజానికి ఉమ్మడి రాష్ట్రం నుంచి ఏపీ విడిపోయినప్పడు ఏపీ రాజధాని కోసం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ దోనకొండను ఏపీ రాజధాని ప్రాంతంగా ఎంపిక చేసింది. అయితే చంద్రబాబు ఈ ప్రభుత్వ భూములున్న ప్రాంతాన్ని కాకుండా అమరావతిని రాజధానిగా ఎంచుకున్నారు. అయితే అత్యదిక ప్రభుత్వ భూములు ఉన్న దోనకొండకి ఇండస్ట్రీయిల్ కారిడార్ పేరిట ఒక సెజ్ కి శంకుస్థాపన చేసి వదిలిపెట్టారు. అయితే జగన్ మొండితనం, ఎన్నికల ముంగిట రాజధాని మార్పు విషయంలో అతడి వైఖరి సందేహాలకు తావిస్తున్నాయి.  ఎన్నికల ముందుఓ జాతీయ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో జగన్‌ను రాజధాని మార్పుపై అడిగితే ఏమీ స్పందించకుండా ఉండిపోయాడు. ఆ మౌనం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వ్యతిరేకత తెచ్చే ప్రమాదం ఉంటుందేమో అన్న సందేహాలున్నప్పటికీ జగన్ ఆనాడు స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఈ నేపథ్యంలో రాజధాని మార్పు యోచన నిజంగానే జగన్‌కు ఉందేమో అన్న డౌట్లు వచ్చాయి. అమరావతిని రాజధానిగా కొనసాగించి అక్కడ ఎంత అభివృద్ధి చేసినా భవిష్యత్తులో టీడీపీ దాని క్రెడిట్ పొందవచ్చు చేసుకోవచ్చు.  తమ ప్రణాళికల్నే జగన్ అమలు చేశాడని చెప్పొచ్చు. కాబట్టి అమరావతిలో ముందు అనుకున్న స్థాయిలో అభివృద్ధి అయితే జరక్కపోవచ్చు. ఇప్పుడే కాక మరోవైపు 2014లో కూడా జగన్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న అంచనాతో ఆయన వర్గీయులు పెద్ద ఎత్తున ప్రకాశం జిల్లా దొనకొండలో భారీగా భూములు కొన్నట్లు సమాచారం. వాళ్ల కోసం జగన్ రాజధాని మార్చొచ్చన్న ప్రచారం కూడా ఉంది. కానీ రాజధాని మార్పు అంత సులువైన వ్యవహారమేమీ కాదు కాబట్టి అధికారికంగా ఇలాంటి మార్పేమీ చేయకుండా అధికార వికేంద్రీకరణ పేరుతో అమరావతిలో యాక్టివిటీ తగ్గించి రాయలసీమ, దొనకొండ ప్రాంతాలలో తమకు కావలసిన హైకోర్టు లాంటివి, అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడం.. క్రమంగా అమరావతి ప్రాధాన్యం తగ్గించడం లాంటివి జగన్ చేయొచ్చన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇది ఎంతవరకూ నిజం అవుతుందో ? తెలీదు కానీ చర్చ మాత్రం జరుగుతోంది.  

కుమారస్వామి సంచలన నిర్ణయం...వారికి ఆ ఆఫర్

  ఎమ్మెల్యేల రాజీనామాతో సంక్షోభంలో కూరుకుపోయిన కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం చివరి ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి కాంగ్రెస్‌ తిరుగుబాటు ఎమ్మెల్యే రామలింగారెడ్డితో సమావేశమై ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. బెంగళూరులోని ఓ రహస్య ప్రదేశంలో వీరిద్దరూ భేటీ అయ్యారు. అయితే మరోపక్క రాజీనామాలను ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని తిరుగుబాటు ఎమ్మెల్యేలు తెగేసి చెబుతున్నారు.  సీఎంను మార్చినా తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని వారు చెబుతున్నారు. అయితే సీఎం పదవి నుంచి వైదొలిగేది లేదని చెబుతున్న కుమారస్వామి ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఇరు పార్టీలకు చెందిన 13 మంది రెబల్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఆఫర్ చేసినట్టు సమాచారం. అయితే, ఈ ఆఫర్‌ను కూడా వారు తిరస్కరించినట్టు సమాచారం. ఇక ఈరోజు నేడు అత్యవసరంగా కేబినెట్ మీటింగ్ నిర్వహించనున్నారు.  ఈ సందర్భంగా కొందరు మంత్రులతో రాజీనామా చేయించి, వాటిని రెబల్ ఎమ్మెల్యేలకు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రాజీనామాల విషయంలో తాను ముందు వరుసలో ఉన్నట్టు కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, జలవనరుల శాఖా మంత్రి డీకే శివకుమార్ తెలిపారు. ఇక ఇప్పటికే డిప్యూటీ సీఎం పరమేశ్వర తన నివాసంలో కాంగ్రెస్‌ పార్టీ మంత్రులకు అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలు, రానున్న రోజుల్లో తీసుకోవాల్సిన భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు.  కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే మంత్రి పదవులు త్యాగం చేయడానికి సిద్ధపడాలని ఈ సమావేశంలో పలువురు మంత్రులు ప్రతిపాదించినట్టు సమాచారం. అయితే ముంబైలోని హోటల్లో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలు పదిమంది కుమారస్వామి ఆఫర్‌ను తిరస్కరించారని చెబుతున్నారు. త్వరలోనే తామంతా బీజేపీలో చేరబోతున్నట్టు రెబల్ ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ పాటిల్ చెబుతున్నారు. ఇక ఇదే మంచి సమాయం అనుకున్న సీఎం ఆశావహులు తమ తమ అభిమానుల చేత సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నారు.  అలా ప్రచారం జరుగుతున్న పేర్లలో డీకే శివ కుమార్, రామలింగారెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కర్ణాటక రాజకీయ సంక్షోభం పార్లమెంటు ముందుకు వచ్చింది. కర్ణాటక రాజకీయ సంక్షోభంపై కాంగ్రెస్‌ పార్టీ లోక్‌ సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ ఆ తీర్మానంలో పేర్కొంది.