AIIB Warns Indian Govt about AP Govt

జగన్ దెబ్బకి కేంద్రానికి షాక్....తప్పుకుంటామని హెచ్చరికలు జారీ !

  ఏపీ రాజధాని అమరావతికి రుణ మంజూరుకు మరో బ్యాంక్ వెనుకడుగు వేసిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ప్రపంచ బ్యాంక్ రుణ ప్రతిపాదన విరమించుకున్న నేపథ్యంలో తాజాగా ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇనె్వస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) కూడా నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. అక్కడితో ఆగక ప్రాజెక్టులపై సమీక్షలు, నిలిపివేతల విషయంగా కేంద్రానికి లేఖ కూడా రాసిందని సమాచారం.  జగన్‌ సర్కారు వైఖరిని ప్రస్తావిస్తూ ఇలా చేస్తే మీ దేశంలో ఏ రాష్ట్రానికీ రుణం అందించలేమని తెలిపిందని చెబుతున్నారీ. ఒక ప్రభుత్వం వచ్చి ప్రాజెక్టుల కోసం రుణం తీసుకుంటే అదే స్థానంలో వచ్చ్హిన మరో ప్రభుత్వం ఆ ప్రాజెక్టులను సమీక్షల పేరిట నిలిపివేస్తుందని, ఇది ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్న బ్యాంకు పరిస్థితి ఇలాగే ఉంటే మొత్తం మీ దేశం నుంచే తప్పుకోవాల్సి వస్తుందని కేంద్రాన్ని హెచ్చరించినట్టు సమాచారం.  గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మొదలు పెట్టిన ప్రాజెక్టుల మీద సమీక్షలు, అలాగే పనుల నిలిపివేతలపై  జగన్‌ ప్రభుత్వం  మీద ఏఐఐబీ తీవ్రంగా హెచ్చరికలు చేసినట్టు చెబుతున్నారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ వేదికలపై కూడా చర్చిస్తామని తెలిపింది. తాము ఇచ్చిన రుణాలతో చేపట్టిన ప్రాజెక్టులను సరైన రీతిలో ముందుకు తీసుకెళ్లని పరిస్థితుల్లో నిబంధనల ప్రకారం జరిమానా కూడా విధించే అవకాశం ఉందనే విషయాన్ని గుర్తు చేసినట్టు సమాచారం.  తమ రుణాలతో చేపట్టిన ప్రాజెక్టులు అర్థాంతరంగా ఆగిపోతే తమ పరువు పోతుందని ఏఐఐబీ కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొంది. అయితే ఈ విషయం మీద విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు చర్చించి ఏఐఐబీ లేఖ కాపీని ఏపీ ప్రభుత్వానికి పంపారు. బెంగుళూరు మెట్రో, ముంబైలో రవాణా మెరుగుదల, రోడ్లు, విద్యుత్‌ వసతుల మెరుగుదల వంటి పలు ప్రాజెక్టులకు ఏఐఐబీ రుణం అందిస్తోంది.  మరికొన్ని ప్రతిపాదన దశలో ఉండగా ఇప్పుడు గనుక ఏపీ ప్రభుత్వం సరిగా స్పందించకుంటే ఆ ప్రభావం మిగతా వాటి మీద కూడా పడే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ విషయం మీద ఏపీ ప్రభుత్వం ఏమని సమాధానం ఇస్తుందో ? చంద్రబాబు సర్కార్ ఎలా అయినా అవినీతి చేసిందని నిరూపించడానికి జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు చీవాట్లు పెట్టిస్తున్నాయి. అంతా మనదే ఏమి చేసినా ఇబ్బంది లేదనుకుంటున్న జగన్ సర్కార్ కి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇండియాలో మిగతా ప్రాజెక్ట్ లకి కూడా ఇబ్బంది తలెత్తే ప్రమాదం ఉండడంతో కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యే అవకాశం ఉంది.

Ap Cmo Responds on Aiib Drops Amaravati Project

జగన్ సర్కార్ కి మరో షాక్...కేంద్రమే కారణమంటున్న సీఎంవో !

  అమరావతికి నిర్మాణానికి రుణం ఇచ్చే విషయంలో ప్రపంచ బ్యాంక్ హ్యాండ్ ఇవ్వడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. రుణం ఇవ్వకపోవడానికి మీరంటే మీరు కారణమని అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. అయితే ప్రపంచ బ్యాంక్ హ్యాండ్ ఇచ్చిన వెంటనే మరో బ్యాంకు కూడా హ్యాండ్ ఇవ్వచ్చని ప్రచారం జరగగా ఇప్పుడు ఆ విషయాన్ని నిజం చేస్తూ అమరావతి ప్రాజెక్టుకి ఇస్తామన్న ఋణం విషయంలో తాము  తప్పుకుంటున్నట్లు ఏసియన్ ఇన్‌ఫ్రస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) ప్రకటించింది.  రాజధాని అమరావతికి 200 మిలియన్ డాలర్ల రుణం ప్రతిపాదనను విరమించుకుంటున్నట్లు ఏసియన్ ఇన్‌ఫ్రస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) తెలిపింది. అమరావతిని సుస్థిరమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్‌స్టిట్యూషనల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌గా భావించడం లేదని, అందుకే రుణ ప్రతిపాదన నుంచి వైదొలుగుతున్నామని పేర్కొంది. కాగా ప్రపంచ బ్యాంకు రుణ ప్రతిపాదనను ఉపసంహరించుకున్న వారం రోజుల్లోనే ఏఐఐబీ కూడా రుణ సాయంపై వెనక్కి తగ్గడంతో ప్రభుత్వానికి మరో షాక్ తగిలినట్టు అయ్యింది. అయితే  ఈ ప్రచారంపై ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు మాత్రం ప్రజాసంక్షేమం కోసం శ్రమిస్తున్న ప్రభుత్వంపై కొన్ని మీడియా సంస్థలు కావాలనే వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్లే అమరావతికి ప్రపంచబ్యాంకు తన ప్రతిపాదిత రుణాన్ని నిలిపివేసిందని సీఎంఓ వర్గాలు మరోసారి పేర్కొనగా, అమరావతికి ఋణం ఇచ్చే విషయంలో వరల్డ్‌ బ్యాంకుతో పాటు ఏఐఐబీ కూడా పార్టనర్ అని కేంద్రం తీసుకున్న నిర్ణయం వలన ఈ ప్రాజెక్టులోని భాగస్వాములందరికీ వర్తిస్తుందని సీఎంఓ వర్గాలు పెర్కొనట్టు చెబుతున్నారు. అమరావతిలో మౌలిక వసతులు, సంస్థాగత అభివృద్ధి ప్రాజెక్టు అంచనా వ్యయం 715 మిలియన్‌ డాలర్లు కాగా అందులో ప్రపంచబ్యాంకు 300 మిలియన్‌ డాలర్లు, ఏఐఐబీ 200 మిలియన్‌ డాలర్లు రుణంగా ఇవ్వడానికి ముందుకొచ్చాయి.  మిగతా 215 మిలియన్‌ డాలర్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాలన్నది గత ప్రభుత్వ సమయంలో చేసిన ప్రతిపాదన. అయితే అమరావతికి రుణం విషయంలో చెకింగ్ లు లాంటివి కుదరవని చెప్పడంతో పాటు ఋణం కోసం చేసిన విజ్ఞప్తిని కూడా వెనక్కు తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించడంతో ఆ ప్రతిపాదన విరమించుకున్నట్టు వరల్డ్ బ్యాంకు ఇటీవల ప్రకటించింది. ఆ నేపథ్యంలో ఏఐఐబీ సైతం నిర్ణయం తీసుకుంది. మరి ఈ విషయం మీద పాలకప్రతిపక్షాలు ఏమంటాయో వేచి చూడాలి మరి ?

Karnataka Crisis Kumaraswamy Submits Resignation

మళ్ళీ కర్ణాటక సీఎంగా యడ్డీ....కానీ నిలబడడం కష్టమే ?

  గత కొద్దిరోజులుగా అనేక మలుపులు తిరుగుతూ కర్ణాటకతో పటు దేశం మొత్తాన్ని తీవ్ర ఉత్కంఠ రాజేసిన కర్ణాటక రాజకీయ సంక్షోభానికి తెర పడింది ! నిన్న రాత్రి విశ్వాస పరీక్షలో పరాజయం పాలైన కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ సర్కారు నిన్నటితో కుప్పకూలింది. నిన్న రాత్రి 7.30 గంటల సమయంలో డివిజన్ పద్ధతిలో స్పీకర్ రమేశ్ కుమార్ ఓటింగ్ నిర్వహించారు. విశ్వాస పరీక్షలో కుమారస్వామికి మద్దతుగా 99 ఓట్లు రాగా బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది.  దీంతో సీఎం కుమారస్వామి గవర్నర్‌కు రాజీనామ లేఖను సమర్పించేందుకు కాలినడకన రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఓటింగ్ లో వీగిపోవడంతో ప్రభుత్వ సదుపాయాలను వదులుకొని ఆయన రాజ్ భవన్ కు వెళ్లారు. అక్కడ గవర్నర్‌కు తన రాజీనామ లేఖను అందించారు. రాజీనామ లేఖ అందించిన కాసేపటికే గవర్నర్ కుమారస్వామి రాజీనామాను అమోదిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆయనకు సూచించారు.  మంచి ముహూర్తం చూసుకొని యడ్యూరప్ప సీఎం పదవిని అధిష్టించడమే ఇక తరువాయి. అయితే యడ్డీ ఆనందం ఎక్కువ రోజులు ఉండకపోవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎందుకంటే కర్ణాటక రాజకీయాలు మరోసారి ఇంత కాక రేపే అవకాశం లేకపోలేదు. ఎందుకనే విషయాన్ని విశ్లేషిస్తే కర్ణాటకలో మొత్తం 224 ఎమ్మెల్యే సీట్లు ఉండగా నిన్న విశ్వాస తీర్మానం సందర్భంగా స్పీకర్ సహా 204 మంది మాత్రమే హాజరయ్యారు.  కాంగ్రెస్‌-జేడీయూ కూటమికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు, బీఎస్పీ ఎమ్మెల్యే ఒకరు, ఇద్దరు ఇండిపెండెంట్లు ఇలా 20 మంది ఎమ్మెల్యేలు బలపరీక్షలో పాల్గొనలేదు. రెబల్ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రప్పించేందుకు కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించకపోవడంతో ఈ ఫ్లోర్ టెస్టు జరగడానికి ముందు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు విప్ జారీ చేశారు. రూల్ ప్రకారం విప్ అమల్లో ఉండగా ప్రతి ఎమ్మెల్యే తమ పార్టీ సూచించిన వారికే ఓటెయ్యాలి, అంతేకాక అసెంబ్లీకి గైర్హాజరు కాకూడదు.  కానీ కాంగ్రెస్, జేడీఎస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు సభకు హాజరు కాలేదు. దీంతో ఆయా పార్టీల ఫిర్యాదు మేరకు స్పీకర్ కేఆర్ రమేశ్ వీరిపై అనర్హత వేటు వేయవచ్చు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వీరు అందరూ బీజేపీలో చేరే అవకాశాలు ఉండటంతో వీరి అన్ని స్థానాల్లో ఉప ఎన్నికలు అనివార్యం. ప్రస్తుతం 105 మంది సభ్యుల బలం ఉన్న బీజేపీకి ఎమ్మెల్యేల గైర్హాజరీతో ఇప్పటికైతే సభలో మెజార్టీ నిరూపించుకుంటుంది. కానీ సాధారణ మెజార్టీ రావాలంటే మాత్రం మరో 8 మంది ఎమ్మెల్యేలు అవసరం.  బీఎస్పీ, ఇండిపెండెంట్లకు ఈ అనర్హత వేట్లు పడే అవకాశం లేకపోవడంతో మరో ఐదు సీట్లను బీజేపీ గెలుచుకోవాలి. కానీ ఇప్పుడు జరిగిన ఈ అధికార అపహరణను ప్రజలందరూ చూశారు, సో ఉప ఎన్నికల్లో రాజీనామా చేసిన వారు మళ్ళీ గెలిచే అవకాశాలు తక్కువ, బీజేపీ ఈవీఎం మాయా జాలం చేస్తే తప్ప ! దీంతో సంకీర్ణ సర్కారుకు పట్టిన గతే యడ్యూరప్ప ప్రభుత్వానికి పట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ఓవైపు అండగా బీజేపీ పక్షపాత గవర్నర్, మరోవైపు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న నేపధ్యంలో కర్ణాటకలో యడ్యూరప్ప సర్కారు ఎలాగోలా పనిచేయచ్చు. చూడాలి మరి ఏమవుతుందో ? 

alliance with congress is the big mistake of chandrababu

ఒక పరాజయం 100 తప్పులు.. ఏపీలో టీడీపీ ఓటమికి తెలంగాణలో పునాది!

  తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు ఏపీలో టీడీపీ ఓటమికి పునాది వేసాయా అంటే అవుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణలో కొన ఊపిరితో ఉన్న పార్టీని బ్రతికించడం కోసం బాబు కాంగ్రెస్ తో చేతులు కలిపి.. ఏపీలో కూడా పార్టీని ప్రమాదంలో పడేశారని చెప్పక తప్పదు. అసలు టీడీపీని కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీగా భావిస్తున్నారు. అలాంటిది మహాకూటమి పేరుతో బాబు కాంగ్రెస్ తో దోస్తీ చేయడంతో టీడీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారనేది వాస్తవం. టీడీపీ, కాంగ్రెస్ ల దోస్తీ.. ఇరు పార్టీలకు తెలంగాణలో నష్టం చేయడమే కాకుండా.. ఏపీలో టీడీపీకి తీవ్ర నష్టం చేసిందనే చెప్పాలి. తెలంగాణలో కేసీఆర్ ఆంధ్రా పెత్తనం అంటూ బాబుని కార్నర్ చేసి కాంగ్రెస్ గట్టిదెబ్బ కొట్టారు. మరోవైపు అసలే తెలంగాణ టీడీపీ అంతంత మాత్రం ఉందంటే.. ఈ దోస్తీ మూలంగా మరికొందరు కూడా టీడీపీకి దూరమయ్యారు. ఈ దోస్తీ ఎఫెక్ట్ ఏపీలో కూడా బాగా పనిచేసింది. ఎందరో కార్యకర్తలు టీడీపీకి దూరమయ్యారు. అదేవిధంగా ఏపీ ప్రజల్లో కాంగ్రెస్ మీద విభజన కోపం ఉండటంతో బాబు మీద పడింది. రాష్ట్రాన్ని విభజించి అన్యాయం చేసిన కాంగ్రెస్ తో బాబు చేతులు కలిపారని.. ఏపీ ప్రజల్లో బాబు మీద వ్యతిరేకత ఏర్పడింది.

Peddapalli Ex Mp Gaddam Vivek Likely To Join In Bjp On Tuesday

బీజేపీ చేతికి తెలంగాణాలో పాపులర్ ఛానెల్, పేపర్ !

  ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా తెలుగు రాష్ట్రాలకు నేతలకు బీజేపీ గాలం వేస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ కోట అని ఫీలవుతున్న తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు గెలవడంతో బీజేపీ జోష్‌లో ఉంది. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో ఎలాగైనా బలపడాలని అధికారంలోకి రావాలని కాషాయ దళం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో మాజీ ఎంపీ ఎంపీ గడ్డం వివేక్‌ను పార్టీలోకి ఆహ్వానించింది.  గత లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన ఆయన కూడా బీజేపీలో చేరడానికి పచ్చ జెండా ఊపారట. ఈరోజు బీజేపీ చీఫ్ అమిత్ షా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. వివేక్‌తోపాటు ఆయన సోదరుడు, మాజీ మంత్రి వినోద్ కూడా బీజేపీలో చేరతారని సమాచారం. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసిన వివేక్ అనూహ్యంగా బాల్క సుమన్ చేతిలో ఓడారు.  అనంతర పరిణామాల్లో గులాబీ తీర్ధం పుచ్చుకున్న ఆయనకు ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారు కేసీఆర్. అయితే 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సుమన్‌ చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి పెద్దపల్లి టికెట్‌ తనదేనని వివేక్ భావించారు. కానీ కేసీఆర్ మాత్రం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి బాల్క సుమన్ పై కాంగ్రెస్ అభ్యర్థిగా వెంకటేశ్ నేత పోటీ చేసి ఆ తర్వాత టీఅయేఎస్ లో చేరిన వెంకటేష్ కి టికట్ ఇచ్చారు.  ఆయన అలా ఇవ్వడానికి కారణం సామాజిక వర్గమే అయినా అప్పటి నుండి వివేక్ ఆ పార్టీకి దూరం అయ్యారు.  అలా కొన్నాళ్లుగా సైలెంట్‌గా ఉన్న వివేక్, వినోద్ సోదరులు టీఆర్ఎస్‌ కి కాంగ్రెస్ కంటే కూడా బీజేపీయే సరైన ప్రత్యామ్నయం అని భావించారని అందుకే ఆహ్వానం రాగానే వీరు కాషయ కండువా కప్పుకునేందుకు సిద్దమయినట్టు చేబుతున్నరు. వివేక్ బీజేపీలో చేరితే వినోద్ కంటే భాజ‌పాకే ఎక్కువ లాభం ఉంది.  ఎందుకంటే తెలంగాణ‌లో భాజ‌పాకి సొంత మీడియా అంటూ ఇంత‌వ‌ర‌కూ ఏదీ లేదు. అధికార పార్టీకి కొన్ని మీడియా సంస్థ‌లు తమ సహాకారం అందిస్తుండగా, టీవీ 9 మాజీ సీఈవో పెట్టె కొత్త ఛానల్ బీజేపీకి సపోర్ట్ గా ఉంటుందని అనుకున్నారు. దానితో పాటు ఇప్పుడు వినోద్ రాక‌తో ఒక న్యూస్ ఛానెల్‌, ఒక ప‌త్రిక భాజ‌పాకి అండ‌గా నిలిస్తుందని చెప్పచ్చు. అండగా నిలుస్తుంది అనడం కంటే కూడా బీజేపీ చేతికి తెలంగాణాలో పాపులర్ ఛానెల్ అయిన వీ6 ఛానెల్‌తోపాటు వెలుగు పత్రిక దొరికినట్టే. ఎందుకంటే వీటిని రన్ చేసేది వివేక్ కుటుంబీకులే. ఒకప్పుడు టీఆర్ఎస్ కి మద్దతుగా వార్తలు ప్రచురించిన ఈ రెండూ ఆ తర్వత న్యూట్రల్ గా ఉంటూ వచ్చింది. తాజాగా పరిణామాలతో ఆ రెండూ ఇప్పుడు బీజేపీకి బాకా ఊదనున్నాయన్నమాట !     

governor narasimhan is also played a key role in tdp defeat

ఒక పరాజయం 100 తప్పులు.. 'రాజకోట' రహస్యం

  ఓ ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర గవర్నర్ తో సత్సంబంధాలు కలిగి ఉండటం చూస్తుంటాం. అయితే గత ఐదేళ్ళలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గా ఉన్న నరసింహన్ తో బాబు సత్సంబంధాలు కొనసాగించలేదనేది వాస్తవం. నిజానికి నరసింహన్ కాంగ్రెస్ హయాంలో గవర్నర్ గా నియమించబడ్డారు. అయితే 2014 లో బీజేపీ అధికారంలోకి వచ్చినా.. కాంగ్రెస్ నియమించిన ఎందరో గవర్నర్లు మారిపోయారు కానీ.. నరసింహన్ మాత్రం అలాగే కొనసాగారు. అది కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా కొనసాగారు. అప్పుడు బాబు బీజేపీతో దోస్తీ చేస్తున్నారు. నరసింహన్ తమకి అంత అనుకూలంగా లేరని కూడా తెలుసు. అయినా బాబు ఎందుకనో ఏపీకి కొత్త గవర్నర్ ని నియమించండని బీజేపీ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయలేదు. అదే బాబు చేసిన తప్పని కొందరి అభిప్రాయం. తరువాత బాబు బీజేపీకి దూరమయ్యారు. నరసింహన్ మాత్రం బీజేపీకి దగ్గరై గవర్నర్ గా కొనసాగుతూ వచ్చారు. బాబు, గవర్నర్ ల మధ్య దూరం కూడా.. టీడీపీని అధికారానికి దూరం చేసి, ప్రతిపక్షానికి పరిమితం చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో గవర్నర్ తో సన్నిహితంగా ఉండేవారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, బాబుకి దూరమవ్వడంలో గవర్నర్ పాత్ర ఉందని కూడా ప్రచారం జరిగింది. ఓ రకంగా గవర్నర్ బాబుని ఒంటరిని చేసారని కూడా అంటుంటారు. ఈ అంశంపై పూర్తీ విశ్లేషణ కోసం ఈ వీడియో చూడండి.

chandrababu to decide PAC chairman

కేబినెట్ హోదా పదవి కోసం టీడీపీలో తీవ్ర పోటీ...చంద్రబాబు ఏమంటారో ?

  అసెంబ్లీలో నియమించనున్న కమిటీలను ఈరోజు ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించాల్సి ఉంది. పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీకి సభ్యులను జగన్ నియమించినా ఛైర్మన్‌ ను మాత్రం ప్రతిపక్షం నుండి నియమించాల్సి ఉంటుంది. ఈ నేపధ్యంలో  పీఏసీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ) ఛైర్మన్ పదవిపై టీడీపీలో పోటీ మొదలయ్యింది. ఈ పదవి ఎవరికి కట్టబెట్టాలనే అంశంపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారని సమాచారం.  ప్రతిపక్షానికి దక్కే వాటిలో ఇది కీలక పదవి కావడంతో టీడీపీ అధినేత అన్ని రకాలుగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలని భావిస్తున్నారని అంటున్నారు. పీఏసీ ఛైర్మన్ అంటే మంత్రి పదవికి దాదాపు సమానం ఏపీలో ఎక్కడికి వెళ్లినా ప్రోటోకాల్ ఉంటుంది. ప్రాజెక్టుల్లో అవినీతి, భూకేటాయింపులు, ఉద్యోగ నియామకాలు ఇలా అన్ని అంశాల్లో ప్రశ్నించే హక్కు ఉంటుంది. అందుకే కేబినెట్ హోదా ఉండే ఈ పదవి కోసం టీడీపీలో పోటీ ఉందని అంటున్నారు.  ఇంతటి కీలకమైన పదవి కావడంతో టీడీపీ సీనియర్ నేతలు సైతం ఈ పదవి కోసం పోటీపడుతున్నారు. పీఏసీ ఛైర్మన్ పదవి రేసులో నలుగురైదుగురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయట. మాజీమంత్రి అచ్చెన్నాయుడు,  సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, సీనియర్ ఎమ్మెల్యే కరణం బలరామ్, సీనియర్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.  అయితే అధినేత చంద్రబాబు ఎటువైపు మొగ్గు చూపుతారో అన్నది ఆసక్తిగా మారింది. తొలుత తెలుగుఎసం అధిఅకారంలోకి రాగానే వైసీపీ ప్రతిపక్షంలో ఉండి ఈ పదవిని, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రరెడ్డికి ఇచ్చింది, ఆయన పార్టీ ఫిరాయించి తెలుగుదేశంలో చేరాక ప్రస్తుత ఆర్ధిక మంత్రి అప్పటి వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పీఏసీ చైర్మన్‌గా ఉన్నారు. ఆయన ఈ పదవిని అడ్డం పెట్టుకుని టీడీపీ ప్రభుత్వాన్ని చాలా సార్లు కానర్ చేయడానికి చూసారు. అందుకే ఈసారి కూడా కాస్త పదునైన నేతకి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు,

World Bank Statement On Amaravati

అమరావతికి వరల్డ్ బ్యాంక్ హ్యండిచ్చింది కేంద్ర ప్రభుత్వం వల్లనేనట....అందుకేనా ?

  ఏపీ రాజధాని అమరావతికి  ప్రపంచ బ్యాంకు రుణం నిలిపివేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం ఏపీ రాజధాని నిర్మాణానికి 300 మిలియన్ డాలర్ల రుణ ప్రతిపాదన విరమించుకున్నట్టు వరల్డ్ బ్యాంక్ అధికారికంగా ప్రకటించింది. అయితే అలా ఎందుకు ఆపామో ప్రకటించక ముందే ఈ విషయం మీద రాజకీయంగా దుమారం రేగి వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ప్రపంచ బ్యాంకు రుణం విషయంలో వెనక్కు తగ్గిందని టీడీపీ ఆరోపించింది.  మరోపక్క గత ప్రభుత్వ తీరువలన విసిగిపోయి నందువలనే ప్రపంచ  బ్యాంకు ఋణం ఇవ్వడం లేదని వైసీపీ కౌంటరిచ్చింది. అయితే ఎన్ని రాజకీయ ఆరోపణలు చేసుకున్నా ప్రపంచ బ్యాంక్ సహకారం లేకుండా అమరావతి నిర్మించడం దాదాపు అసాధ్యం, అందుకే ఈ విషయం మీద ఏపీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులని వివరణ కోరింది. దీనిపై స్పందించిన ప్రపంచ బ్యాంకు కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంలో అంతగా ఆసక్తి చూపలేదని, కేంద్ర ప్రభుత్వం సూచనతోనే అమరావతికి ఆర్థికసాయాన్ని ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది.  అమరావతి సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన రుణ ప్రతిపాదనను కేంద్రం ఉపసంహరించుకుందని అందుకే తాము తప్పుకున్నామని తెలిపింది. అయితే రుణ సాయం చేయలేకపోయినప్పటికీ ఏపీలో ఆరోగ్యం, వ్యవసాయం, విద్యుత్, డిజాస్టర్ మేనేజ్ మెంట్ విభాగాల్లో ఒక బిలియన్ డాలర్ల రుణ సాయం యధావిధిగా కొనసాగుతోందని పేర్కొంది. వినూత్నమైన ఆలోచనలతో అభివృద్ధికి శ్రీకారం చుట్టారని స్వయం సహాయక బృందాలు వంటి సరికొత్త ఆలోచనతో దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఏపీ కితాబిచ్చిన్న వరల్డ్ బ్యాంక్ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరితే తప్పకుండా సాయం చేస్తామని స్పష్టత ఇచ్చింది.   అయితే కేంద్రం వ్యవహరిచిన తీరు మీద విమర్శలు వస్తున్నాయి. ఏపీతో తమకు అవసరం లేదు కాబట్టే  సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన రుణ ప్రతిపాదనను కేంద్రం ఉపసంహరించుకుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కానీ బీజేపీవాదుల వాదన మరోలా ఉంది, అదేంటంటే ప్రపంచ బ్యాంక్ ఇన్స్పెక్షన్ చేసి నిధులు ఇస్తామని అన్నదని అలంటి సంప్రదాయాన్ని అలవాటు చేస్తే అన్ని చోట్ల అలాగే ఇన్స్పెక్షన్ లు చేస్తారని అందుకే వద్ద్దని కేంద్రం పేర్కొందని అంటున్నారు. అయితే ఎటువంటి అవినీతికి పాల్పడకుండా ప్రపంచ బ్యాంకు ఋణం ద్వారా కట్టే ప్రాజెక్ట్ లు కడుతున్నట్టు అయితే, ఈ బ్యాంక్ ఇన్స్పెక్షన్ లకి భయపడాల్సింది ఏముందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీని మీద కేంద్రం సమాధానం ఏమని చెబుతుందో ? వేచి చూడాలి. 

Akhila Priya Brother to join in BJP

అఖిలప్రియకి ఇంటిపోరు....తమ్ముడితో కూడా పోరాడాలా ?

  కర్నూలు జిల్లాలో కీలక నియోజకవర్గం గా పేరొందిన ఆళ్లగడ్డలో రాజకీయాలు పలు కీలక మలుపులు తిరుగుతున్నట్టు చెబుతున్నారు. తల్లి మరణంతో వైసీపీ నుంచి ఏకగ్రీవంగా విజయం సాధించి ఆ తర్వాత పార్టీ ఫిరాయించి తెలుగుదేశం పార్టీలో చేరి తండ్రి మరణంతో మంత్రి పదవి దక్కించుకున్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఈ స్థానం నుండి ఓడిపోయారు. గంగుల ప్రభాకర్ రెడ్డి కుమారుడు గంగుల బిజేంద్ర రెడ్డి చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు.  ఆమె మాత్రమే కాక ఆమె సోదరుడు కూడా నంద్యాల నుండి పోటీ చేసి ఓడిపోవటంతో వారింట ముసలం పుట్టినట్టు ప్రచారం జరుగుతోంది. నిజానికి ఎన్నికల ముందే ఆమె మేనమామ ఎస్వీ మోహన్ రెడ్డి పార్టీ వీడి వైసీపీలో చేరిపోయారు. అలాగే సొంత బాబాయ్ గా భావించే సుబ్బారెడ్డి కూడా తనకు ప్రాధాన్యత తగ్గించిన క్రమంలో వారి కుటుంబానికి దూరం అయ్యారు. భూమా అఖిలప్రియ భార్గవ్ అనే వ్యాపార వేత్తను పెళ్లి చేసుకున్నాక భూమా కుటుంబంలో చీలిక వచ్చినట్టు సమాచారం.  అఖిలప్రియ భర్త అన్నీ తానై వ్యవహరించడం కూడా భూమా వర్గీయులను దూరంగా జరగడానికి కారణమైందని అంటున్నారు. మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు కూతురిని వివాహం చేసుకున్న భార్గవ్ ఆ తర్వాత అఖిల ప్రియతో ప్రేమలో పడి ఆమెకి విడాకులు ఇచ్చి మరీ అఖిల ప్రియను పెళ్లి చేసుకున్నారనే ప్రచారం ఉంది. ఆ విషయం పక్కన పెట్టినా ఆమెను వివాహం చేసుకున్న నాటి నుండే మంత్రి భర్తగా ఆయన తన మార్క్ చూపించే ప్రయత్నం చేశారు.  అధికారిక పర్యటనలు మొదలు పార్టీ పర్యటనల దాకా అఖిల్ వెన్నంటే ఉండేవారు. ఇదే భూమా వర్గీయులకి కోపం తెప్పించిందట. భూమా తర్వాత భూమ వారసుడిగా జగత్ విఖ్యాత్ రెడ్డిని తెరమీదకు తేవాలని భూమా వర్గం భావిస్తోంది, కానీ అఖిలప్రియ భర్త హోదాలో భార్గవ్ తానే భూమా వారసుడిననేలా ప్రవర్తిస్తుండడంతో అఖిలప్రియకు బదులుగా భూమా వర్గాన్ని లీడ్ చేసేందుకు విఖ్యాత్ రెడ్డిని, అలాగే వీరికి సోదరుడు వరసయ్యే కిషోర్ రెడ్డిని తెరపైకి వచ్చారు.  ఇప్పటికే వైసీపీలో గంగుల వర్గం ఉంది కాబట్టి, కిషోర్ రెడ్డి బీజేపీలో చేరి భూమా లీగసీని నిలబెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారట. దీంతో అఖిలప్రియకు ఇప్పుడు ఆమె సోదరుడు కిషోర్ కుమారే పోటీ అని భూమా వర్గం భావిస్తుందట. విఖ్యత్ రెడ్డి ప్రస్తుతం చదువుకుంటున్నాడు, ఆయన లైన్ లోకి వచ్చే దాకా కిషోర్ రెడ్డిని నిలబెట్టాలని చూస్తున్నారని అంటున్నారు.    

Nara Lokesh to be arrested

లోకేష్ కి బిగుస్తున్న ఉచ్చు....అరెస్ట్ చేస్తారా ?

  ఐటీ శాఖలో రూ. 25 వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ గత ఏడాది సెప్టెంబర్ లో అప్పుడు ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు మీదా ఐటీ శాఖామంత్రిగా ఉన్న ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్‌ మీద హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. అవినీతిపై సీబీఐ, ఈడీ విచారణ కోరుతూ మాజీ న్యాయమూర్తి శ్రావణ్‌ కుమార్‌ అప్పట్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. గత టర్మ్ లో ఏపీఎన్‌ఆర్టీ చైర్మన్‌ గా ఉన్న వేమూరి రవికుమార్‌, మాజీ ఐటీ శాఖమంత్రి పల్లె రఘునాధరెడ్డిలకి కూడా ఈ అవినీతి కుంభకోణంలో హస్తం ఉందని ఆయన ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.  దొంగ ఎంవోయూలతో వేల ఎకరాల భూమిని ధారదత్తం చేశారని, దీని ద్వారా లబ్ది పొంది భారీ ఎత్తున ఆస్తులను పెంచుకున్నారని అప్పట్లో పిటిషనర్ పేర్కొన్నారు. కనీస అర్హత కూడా లేని కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని నాలుగేళ్లుగా కార్యకలపాలు చేపట్టలేదని పిటిషన్‌లో వెల్లడించారు. ఐటీ కంపెనీల పేరుతో జరిగిన క్విడ్‌ ప్రోకోపై సీబీఐ, ఈడీ విచారణ జరపాలని ఆయన హైకోర్టును కోరారు. అయితే ఈ విషయం మీద పూర్తి వివరాలతో అంటే ఆరోపణలు చేస్తున్న కంపెనీల పూర్తి వివరాలతో మళ్ళీ రమ్మని కోర్టు పేర్కొనడంతో అసలు ఆర్టీఏ ద్వారా సమాచారం కోరినా తనకు ఆ వివరాలు ఇవ్వడం లేదని పిటిషనర్‌ హైకోర్టుకు విన్నవించుకుని కేసు ఉపసంహరించుకున్నారు.  ఈ విషయం మామూలు వార్తలాగా వచ్చి వెళ్లిపోయింది. అయితే ఇప్పుడు పరిస్థితి అంతామారిపోయి జగన్ సీఎం కావడంతో లోకేష్ అవినీతిని జగన్ సర్కార్ టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఈ మధ్యనే పార్టీ మారి కాషాయం కండువా కప్పుకున్న ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ హైలైట్ చేశారు. లోకేష్‌ మంత్రిగా వ్యవహరించిన ఐటీశాఖలో భారీగా ఎత్తున అవినీతి జరిగిందనే విషయం మీద విచారణ చేపట్టమని కోరేందుకు రెండు మూడు రోజులలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలుస్తానని ఆయన చెప్పారు.  కేంద్రంతో కూడా మాట్లాడి సీబీఐ విచారణ జరమని ఫిర్యాదు చేస్తానని ఆయన అన్నారు. లోకేష్‌ తో కలిసి పనిచేయడం ఇష్టం లేకనే టీడీపీకి రాజీనామా చేశానని చెప్పిన ఆయన లోకేష్‌ కారణంగానే గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలయిందని అన్నారు. ఇక త్వరలో పార్టీ ఖాళీ కాబోతుందని అది కూడా లోకేష్ కారణంగానే జోస్యం చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఇప్పటికే గత ప్రభుత్వ అవినీతి కోసం భూతద్దం వేసుకుని మరీ వెతుకున్న జగన్ కి ఊతం ఇచ్చినట్టు అవుతుంది.  వెదకబోయే తీగ కాలికి తగిలినట్టు జగన్ కి లోకేష్ అవినీతి కేసు దొరికిందని అంటున్నారు విశ్లేషకులు. నిజంగా అవినీతి జరిగిందా ? లేదా అనేది పక్కన పెడితే ఈ విషయం మళ్ళీ హైలైట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్ యంత్రాంగం, బీజేపీ కలిస్తే లోకేష్ ని అరెస్ట్ చేసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే తమకి ఎదురుతిరిగిన వారికి షా-మోడీలు ఎంత వరకూ చుక్కలు చూపిస్తారో లాలూ వంటి వారి విషయంలో చూశాం కదా.  

ycp mlas are unhappy with jagan decision on corruption

జగన్ పట్ల వైసీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి.. ఇందుకేనా గెలిచింది?

  ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన ప్పటి నుండి అవినీతిలేని పాలన అందిస్తానని వాగ్దానాలు చేస్తున్నారు. ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నారు. అయితే తన సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే జగన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ‘ఎన్నికల్లో అప్పులు చేసి మరీ కోట్లు ఖర్చుపెట్టుకున్నాం. తీరా గెలిచాక పైసా తీసుకోవద్దంటున్నారు. ఇలా అయితే ఇక రాజకీయాలు చేసినట్టే.’ అని కొందరు ఎమ్మెల్యేలు తెగ ఫీలై పోతున్నారట. మంత్రులు, ఎమ్మెల్యేలు సహా ఎవరు అవినీతికి పాల్పడినా సహించబోనన్న జగన్ నిర్ణయం వారికి ఇబ్బందికరంగా మారిందట. ముఖ్యంగా ఎప్పటికప్పుడు ఇంటిలిజెన్స్ నివేదికలు తెప్పించుకుంటున్న జగన్.. ఎమ్మెల్యేలు, మంత్రుల లావాదేవీలపై దృష్టిసారిస్తున్నారు. ఇదే క్రమంలో ఉద్యోగుల బదిలీల్లో జోక్యం చేసుకున్న నలుగురు మంత్రులకు జగన్ ఇప్పటికే ఫైనల్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే బాటలో సీఐల బదిలీల్లో రూ.10 లక్షలు తీసుకున్న ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేను తన వద్దకు పిలిపించుకుని మరీ సదరు సీఐకి డబ్బులు వెనక్కి ఇప్పించారు. సీఐల బదిలీల్లో పది లక్షలు రూపాయలు తీసుకున్న ఎమ్మెల్యే నుంచి జగన్ డబ్బులు వెనక్కి ఇప్పించడం ఇప్పుడు ఎమ్మెల్యేల్లో గుబులు రేపుతోందట. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో డబ్బులు లేకుండా ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం అసాధ్యం అన్న వాదన స్ధిరపడిపోయింది. ఏపీలో ఇటీవల ఎన్నికల్లో కూడా సగటున ప్రతీ నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే అభ్యర్ధి దాదాపు 30 నుంచి 40 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినట్లు ఓ అంచనా. చాలా మంది పొలాలు, స్ధలాలు అమ్ముకుని, కొందరైతే అప్పులు చేసి మరీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే తన హయాంలో అవినీతి రహిత పాలన సాగాలన్న జగన్ నిర్ణయం వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోందట. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యాక కాంట్రాక్టులు, పైరవీల ద్వారా ఎంతో కొంత సంపాదించుకుందామనుకుంటున్న సమయంలో.. జగన్ ఇలాంటి అవినీతి రహిత పాలన నిర్ణయం తీసుకోవడం కొందరు ఎమ్మెల్యేలకు రుచించడం లేదట. ఇదే పరిస్ధితి కొనసాగితే ఇక రాజకీయాల్లో కొనసాగడం కూడా కష్టమవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టింది అధికారంలోకి వస్తే తిరిగి సంపాదించుకునేందుకేనని, ఇప్పుడిలా ఆంక్షలు విధిస్తే తమ భవిష్యత్తు ఏం కావాలని వారు ప్రశ్నిస్తున్నారట. మరోవైపు ఇంటిలిజెన్స్ వర్గాలతో తెప్పించుకుంటున్న సమాచారం ఆధారంగా నియోజకవర్గాలతో పాటు సచివాలయంలో సైతం ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు జగన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఐదారుగురు మంత్రులు, వారి వద్ద పనిచేస్తున్న సిబ్బంది చేస్తున్న దందాలు జగన్ దృష్టికి చేరుతున్నట్లు తెలుస్తోంది. దీంతో జగన్ వారి విషయంలో సీరియస్ గా ఉన్నారట. ఇదే పరిస్ధితి కొనసాగితే కఠిన చర్యలకు వెనుకాడేది లేదనే హెచ్చరికలు కూడా పంపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పలువురు ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారట.

Andhra Pradesh government decides to take over retail liquor business

మళ్ళీ 'ప్ర.సా.దు'లను మొదలుపెడుతున్న జగన్ సర్కార్....ప్రయత్నం మంచిదే కానీ ?

  గత ఎన్నికల్లో గెలిచేందుకు వైఎస్ జగన్ ఇచ్చిన హామీలలో ముఖ్యమైన హామీ మద్యపాన నిషేధం. ఈ పధకం నచ్చి ఆడపడుచులు వోట్లు వేశారో లేదో ? తెలీదు కానీ, ఆ పధకం అమలు చేయకుంటే ప్రతిపక్షాల నుండి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తామని చెబుత్నున్నారు. అందులో భాగంగా ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ప్రభుత్వమే స్వయంగా మద్యం వ్యాపారంలోకి ప్రవేశించనుందట.  దానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేసేందుకు వీలుగా చట్ట సవరణ కూడా చేయాలని భావిస్జోంది. ఆ ముసాయిదా బిల్లును మంత్రివర్గం నిన్న ఆమోదించింది. మరో రెండు రోజుల్లో ఈ బిల్లు ఉభయ సభలకు రానుందని అంటున్నారు. చట్ట సవరణ తరువాత అక్టోబర్ 1 నుంచి ఏర్పాటయ్యే నూతన మద్యం పాలసీ ప్రకారం ప్రైవేటు మద్యం దుకాణాల స్ధానంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు అవుతాయి. తొలి దశలో 1,095 మద్యం దుకాణాలు రద్దు చేయాలని క్యాబినెట్ భేటీలో నిర్ణయించారు.  రాష్ట్రంలో ప్రస్తుతం 4,380 మద్యం దుకాణాలకు లైసెన్సులు ఉండగా, వీటిలో 25 శాతం అంటే 1,095 దుకాణాలు రద్దుచేయాలని తీర్మానించింది. దీంతో ఇప్పటి దాకా  బ్రూవరీస్‌ల్లో తయారైన మద్యాన్ని కొనుగోలు చేసి, మద్యం లైసెన్సుదారులకు విక్రయించటానికే పరిమితం అయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బేవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) స్వయంగా మద్యం దుకాణాలను నడపనుంది. ఇక మద్యం ధరలను కూడా పెంచడం ద్వారా ఎక్సైజ్ సుంకం ఆదాయాన్ని రూ. 2,500 కోట్లకు పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.  వ్యాట్‌ రూపంలో వచ్చే ఆదాయం దీనికి అదనం. ధర అధికంగా ఉంటే, తాగేవారి సంఖ్య తగ్గుతుందన్నది ఎక్సైజ్ వర్గాల లాజిక్. అయితే మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించడం ద్వారా లైసెన్సుల రూపంలో వచ్చే ఆదాయం కోల్పోతుంది. కానీ, అదే సమయంలో లైసెన్సుదారులకు ప్రభుత్వం చెల్లించే కమీషన్‌ మొత్తం మిగులుతుందని ప్రభుత్వం భావిస్తోంది.  నిజానికి ఆంధ్రలో 1937లో మొదటిసారి ఎన్నికల ద్వారా ఏర్పాటయిన కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చోట్ల మద్యనిషేధాన్ని అమలు చేసింది.  అయితే 1969లో మద్య నిషేధం తొలగిపోయి ఆంధ్రప్రదేశ్‌ అంతా సారా సామ్రాజ్యంగా ఏర్పడింది. టార్గెట్లు పెట్టి ప్రజల చేత ఎక్కువ తాగించి పన్నులు వసూళ్లు చేసుకునే స్థితికి ఎక్సైజ్‌ శాఖ చేరుకుంది. అలాంటి సమయంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం మద్యం అమ్మకాలను ప్రభుత్వమే నిర్వహించి పన్నుల బదులు, లాభాలు సంపాదించవచ్చుననే ఆలోచనతో వారుణివాహిని అనే సారా తయారుచేసి ప్రభుత్వ సారా దుకాణాల్లో (ప్రసాదు) అమ్మించడం ప్రారంభించింది.  దీంతో కొన్నాళ్ళకి సారా అమ్మకాలు బంద్ చేయాలని 1990లలో ఉద్యమం మొదలైంది. సారా దుకాణాలను తగులబెట్టడం, సారా పారబోయడం వంటి క్రియాశీల పోరాట రూపాలు మొదలయ్యాయి. అప్పుడు ప్రభుత్వం స్వయంగా పోలీసు స్టేషన్లలో, పోలీసులతో సారా అమ్మించడం కూడా చేసింది అంటే ఆలోచించండి. అది ఎంతలా జనాన్ని ప్రాభావితం చేసింది అంటే 1993లో నెల్లూరు జిల్లా దూబగుంటలో రోశమ్మ నాయకత్వాన ప్రారంభమైన మద్యపాన నిషేధం చరిత్రాత్మక పోరాటంగా మారింది.  అదే 1994 ఎన్నికలలో నాటి ఎన్టీఆర్ తెలుగుదేశం నినాదంగా కూడ మారి, కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక మద్యనిషేధం ప్రకటించవలసి వచ్చింది. కానీ ఆదాయ వనరులు సరిపోక చంద్రబాబు నాయుడు 1997 లో ఆ నిషేధాన్ని ఎత్తివేసినప్పటి నుంచీ మళ్లీ ఉమ్మడి రాష్ట్రంలో సారా ఏరులై పారింది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఏడాదికేడాదికీ ఎక్కువ ఆదాయ లక్ష్యాలు నిర్ణయించి ప్రజలచేత మరింతగా తాగించడానికి పూనుకుంది. ఆ ఎక్సైజ్‌ విధానాలనే ఆ తర్వాత రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వాలు కొనసాగించాయి.  కానీ ఇప్పటి జగన్ సర్కార్ ఆదాయం వద్దు, ప్రజల సుఖ సంతోషాలే ముద్దు అని ఆలోచించడం బాగానే ఉంది, కానీ ఆనాటిలా ఇప్పుడు కూడా స్వయంగా పోలీసు స్టేషన్లలో, పోలీసులతో మద్యం అమ్మిస్తే ఏమిటో పరిస్థితి. ఆదాయం చాలదు అనుకున్నప్పుడు అసలు ఇలాంటి హామీలు ఇవ్వకుండా ఉండాల్సింది. కానీ ఇప్పుడు పాతిక వంతున దుకాణాలను రద్దు చేస్తే ఆజనం అంతా మిగతా షాపుల మీద పడతారు. తద్వారా సమయాభావం ఏర్పడి అక్కడే తోపులాటలు కొట్లాటలు వంటి సమస్యలు ఏర్పడినా ఏర్పడవచ్చు. చూద్దాం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంత మేరకు సత్ఫలితాన్ని ఇస్తుందో ?  

World Bank pulling out of Amaravati capital project

జగన్ కి షాకిచ్చిన వరల్డ్ బ్యాంక్...వేలితో కన్ను పొడుచుకున్నట్టయ్యింది !

  అనుకున్నదే అయ్యింది, గతంలో మేము ప్రస్తావించినట్టే అమరావతి నిర్మాణం మీద నీలి నీడలు కమ్ముకున్నాయి. ఏపీ నూతన ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంక్ పెద్ద షాకే ఇచ్చింది. నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతి అభివృద్ధి ప్రాజెక్ట్ విషయంలో చేతులెత్తేసింది. రాజధాని నిర్మాణానికి రుణం కోసం ప్రభుత్వం దరఖాస్తు చేసుకోగా అలాంటిది ఏదీ ఇవ్వమని చెబుతూ రుణ సహాయాన్ని నిలిపివేసింది. ఏపీ ప్రభుత్వం 300 మిలియన్‌ డాలర్ల రుణ సాయాన్ని ప్రపంచ బ్యాంక్ ని కోరగా దాని నుంచి తప్పుకుంటున్నట్లు ప్రపంచ బ్యాంక్ తెలిపింది.  ఈ మేరకు బ్యాంక్ వెబ్‌సైట్‌లో ఈ విషయాన్ని పొందుపరిచారు. ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రపంచబ్యాంకు ఈ నిర్ణయం తీసుకోవడం సర్వత్రా ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజా నిర్ణయంతో అమరావతి రాజధాని నిర్మాణం నుంచి ప్రపంచబ్యాంకు తప్పుకున్నట్టయింది. గత ప్రభుత్వ హయాంలో అమరావతి నిర్మాణం మీద ఇప్పటి ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలోప్ ఉండి సంచలన ఆరోపణలు చేసింది.  అయితే అప్పుడు ప్రపంచబ్యాంకు బృందం అమరావతిని సందర్శించి పూర్తిస్థాయిలో సంతృప్తి చెందడమే కాకుండా మరింతగా ఆర్థికంగా సహాయపడాలని నిర్ణయించింది. ప్రపంచ బ్యాంక్ నుండి అమరావతి నిర్మాణం రూపేణా రుణం కోసం చంద్రబాబు ప్రభుత్వం 2016 నుంచి ప్రయత్నాలు చేస్తోంది. ప్రయత్నాల్లో భాగంగా రాజధాని నిర్మాణానికి అమరావతి అభివృద్ధి కోసం రూ.7200కోట్ల రుణానికి ప్రతిపాదనలు ప్రపంచ బ్యాంకుకి సీఆర్డీయే పంపింది. దీనిలో భాగంగా తొలివిడతగా 3200కోట్లు, రెండో విడతగా మరో 3200కోట్లు తీసుకునేలా ఒప్పందం కుదిరింది.  కానీ అప్పుడే అప్పటి ప్రతిపక్షంలో జగన్ పార్టీ నుండి కొందరు రాజ‌ధాని విష‌యంలో కోర్టుల‌కు, గ్రీన్ ట్రిబ్యూన‌ల్ కి కూడా ఫిర్యాదులు చేశారు. వ‌ర‌ద‌ముప్పు, వివిధ పంట‌లు పండించే ప్రాంతం, సామాజిక‌, ప‌ర్యావ‌ర‌ణ కోణంలో జ‌రిగేన‌ష్టం వంటి అంశాల‌ను ముందుకు తీసుకొచ్చారు. అక్కడితో ఆగక ప్ర‌భుత్వం రాజ‌ధాని విష‌యంలో ప్ర‌జాభిప్రాయానికి భిన్నంగా వెళుతుందంటూ రాజ‌ధాని ప్రాంత రైతుల పేరిట కొంద‌రు 2017 మే 25 నాడు ప్ర‌పంచ‌బ్యాంక్ కి ఈమెయిల్స్ పంపి ఫిర్యాదు చేశారు.  ప్ర‌పంచ‌బ్యాంక్ ప్ర‌తినిధి బృందం స్వ‌యంగా వ‌చ్చి ప‌రిశీల‌న చేయాల‌ని కోరారు. అదే సంవ‌త్స‌రం జూన్ 12నాడు ఫిర్యాదుని స్వీక‌రించిన ప్ర‌పంచ‌బ్యాంక్ బృందం 2017 సెప్టెంబ‌ర్ లో ఇండియాలో ప‌ర్య‌టించింది. ఆ స‌మ‌యంలో ల్యాండ్ ఫూలింగ్ విధానంపై అభ్యంత‌రాల‌తో పాటు స‌మ‌ర్థిస్తున్న రైతులు కూడా ప్ర‌పంచ‌బ్యాంక్ పానెల్ బృందాన్నిక‌లిశారు. ఏపీ ప్ర‌భుత్వ అధికారులు కూడా ప్రపంచ‌బ్యాంక్ బృందం ముందు త‌మ వాద‌న‌ వినిపించారు.  అయితే అమరావతి వచ్చి స‌మ‌గ్ర విచార‌ణ చేయడం అవ‌స‌రమని ప్ర‌పంచ‌బ్యాంక్ బృందం తేల్చింది. అప్పుడు వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు అమరావతి వచ్చి అంతా గమనించి క్లియరెన్స్ ఇచ్చారు. కానీ నిధులు కావాలంటే మరొమారు తనిఖీలు నిర్వహించాల్సిందేనని తేల్చిన ప్రపంచబ్యాంక్ తమ అభిప్రాయాన్ని ఈ నెల 23వ తేదీలోపుగా చెప్పాలని ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. రాజధాని నిర్మాణానికి సంబంధించి బ్యాంక్ ఇన్స్‌పెక్షన్ ప్యానెల్ తనిఖీలు చేయాలని స్పష్టం చేసిన నేపధ్యంలో ఈ మేరకు కేంద్రం నుండి రాష్ట్రానికి వరల్డ్ బ్యాంకు నుండి సమాచారం అందింది.  అయితే ఈ విషయమై తమకు మరింత గడువు కావాలని కేంద్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం లేఖ పంపింది కానీ ఆ లేఖకు ప్రపంచ బ్యాంకు స్పందించలేదు. కానీ కేంద్రం ఈ వ్యవహారంలో తమ నిర్ణయాన్ని రాష్ట్రానికి చెప్పేసింది .ప్రపంచబ్యాంక్ ఇన్స్‌పెక్షన్ ప్యానెల్ తనిఖీలు చేయడం అనేది కొత్త సంప్రదాయమని, అది ఇక్కడ చేయనిస్తే  దేశంలో ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడుతున్న అన్ని ప్రాజెక్టులకు కూడా తనిఖీలు చెయ్యాలని చూస్తారని ఇది ఇబ్బందిగా మారే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది.  ఈ తరుణంలో అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధులను తీసుకెళ్లే ప్రతిపాదనను విరమించుకోవాలని కేంద్రం రాష్ట్రానికి సూచించినట్టుగా తెలుస్తోంది. ఇతర మార్గాల ద్వారా రాజధాని నిర్మాణానికి నిధులను సమీకరించాలని కేంద్రం సూచించినట్టుగా చెబుతున్నారు. కానీ ప్రపంచ బ్యాంకు నుండి నిధుల సేకరణ ఆలోచన విరమించుకోవాలని తెలిపింది. ఆ విధంగా చివ‌ర‌కు తాజాగా ప్రాజెక్ట్ నుంచి వైదొలుగుతున్న‌ట్టు ప్ర‌పంచ‌బ్యాంక్ తేల్చి చెప్ప‌డం గ‌మ‌నార్హం.  ఇప్పుడు ప్రపంచబ్యాంకు నిర్ణయం నేపథ్యంలో ఆసియా డెవలప్ మెంట్ బ్యాంక్ (ఏడీబీ) రుణాల మీద కూడా అనుమానలు ఏర్పడ్డాయి. అమరావతి నిర్మాణం కోసం ఏడీబీ రూ.1400 కోట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఇప్పుడు ప్రపంచబ్యాంకు ఈ నిర్ణయం తీసుకోవడంతో ఏడీబీ కూడా అదే బాటలో పయనిస్తే జగన్ ఏమి చేస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే అప్పటి బాబు సర్కార్ ని ఇబ్బంది పెట్టాలని జగన్ పార్టీ చేసిన ఈమెయిల్స్ ఫిర్యాదులు ఇప్పుడు తమ ప్రభుత్వానికి పెను పరీక్షను తెచ్చిపెట్టాయి.

tdp makes big mistake by joining ycp leaders

ఒక పరాజయం 100 తప్పులు.. టీడీపీ దుంప తెంచిన ఫిరాయింపులు

  అప్పట్లో ఫిరాయింపులకు వ్యతిరేకంగా పోరాడిన టీడీపీ.. 2014 లో అధికారంలోకి వచ్చిన తరువాత ఫిరాయింపులను ప్రోత్సహించి విమర్శలు ఎదుర్కొంది. అటు కార్యకర్తల్లో, ఇటు ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకొని.. పతనం దిశగా అడుగులు వేసింది. ఫిరాయింపుల విషయంలో టీడీపీ తీవ్ర విమర్శలు ఎదుర్కోవడానికి ప్రధాన కారణం ఆ పార్టీ రెండు నాలుకల ధోరణి. ఓ వైపు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ తమ పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్ని కొన్నట్టు కొంటుంది అంటూ గోల చేసిన టీడీపీ.. తీరా ఏపీలో అదే ఫిరాయింపులను ప్రోత్సహించింది. అప్పటి ప్రతిపక్ష వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలను, నేతలను పార్టీలో చేర్చుకొని విమర్శలు ఎదుర్కొంది. అంతేకాదు ఫిరాయింపు నేతలకు పదవులు కట్టబెట్టి ఎప్పటినుంచో పార్టీనే నమ్ముకొని ఉన్న నేతల్లో అసంతృప్తిని కలిగించింది. తమ మీద పోటీ చేసిన నేతలు, ఇప్పుడు తమ పార్టీలోకి వచ్చి తమ మీదే పెత్తనం చెలాయించడం వారు తట్టుకోలేకపోయారు. ఈ ఫిరాయింపుల వల్ల కార్యకర్తల్లో కూడా అసహనం పెరిగింది. మొన్నటివరకు తమ నాయకులను, తమ పార్టీని తిట్టిన వారికి.. ఇప్పుడు తాము జై కొట్టాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేసారు. మరోవైపు ఈ ఫిరాయింపులను వైసీపీ అస్త్రంగా మలుచుకొని ఈ విషయాన్నీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. దీంతో ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. మొత్తానికి ఫిరాయింపులు కూడా ఓ రకంగా టీడీపీ ఓటమికి కారణమయ్యాయనే చెప్పాలి.

Lokesh plans to make padayatra

జగన్ బాటలోనే లోకేష్...కానీ ?

  ఏపీ సీఎం కావడానికి జగన్ తీసుకున్న నిర్ణయాల్లో ఆయన చేపట్టిన పాదయాత్ర ముఖ్యమైనదని చెప్పాలి. ఆయన ప్రజల్లో మమేకం అవ్వడానికి ఈ పాదయాత్ర బాగా ఉపయోగపడింది. ఈ క్రమంలో ఆయన బాటలో మాజీ మంత్రి నారా లోకేష్ ‌కూడా ఈ పాదయాత్ర చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ నేతలు జంప్ కావడానికి సిద్దంగా ఉన్నారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణుల్లో నమ్మకాన్ని నింపి తన అనుభవం కూడా పెంచుకునే ఉద్దేశంతో నారా లోకేష్ ఈ పాదయాత్ర చేపడుతున్నట్లు పార్టీ వర్గాల నుండి విశ్వసనీయంగా అందుతున్న సమాచారం.  అయితే అది జగన్ మాదిరి సుదీర్ఘ పాదయాత్ర కాకుండా విడతల వారీగా యాత్ర చేయాలనీ చినబాబు ఆలోచిస్తున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న టిడిపి ఒకపక్క అధికార పార్టీ దాడులతో, మరోపక్క బీజేపీలోకి ఫిరాయింపులతో ఊపిరి సలపలేకుండా పోతోంది. బాబు వల్ల కూడా కావడం లేదని, ఇక టీడీపీని కాపాడాలంటే జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాలని కొందరు, లేదు బాలయ్య అండర్ లోకి వెళ్ళాలని మరి కొందరు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు.  మరోపక్క అధికార పాఖం లోకేష్ కి పప్పు అనే నిక్ నేమ్ జనాల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ఈ నేపధ్యంలో తనపై జరిగిన దుష్ప్రచారానికి చెక్ పెట్టడానికి లోకేష్ సంసిద్ధమవుతున్నారని అంటున్నారు. గత 2004 ఎన్నికల ముందు వైఎస్ పాదయాత్ర 2014 ఎన్నికల ముందు అంటే 2012లో చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. మొన్న  2019 ఎన్నికల్లో ప్రజా సంకల్ప యాత్ర చేసి జగన్ ప్రస్తుతం అధికారంలో ఉన్నారు. దీంతో పాదయాత్ర చేసిన వారు అధికారంలోకి వస్తారనే సెంటిమెంట్ ఏర్పడింది.  అందుకే ఇప్పుడు చిన బాబు పాదయాత్రకు శ్రీకారం చుట్టారని అంటున్నారు.  అయితే వారు చెబుతున్న ఈ విడతల వారీ పాదయాత్ర అనేది సరయిన ఫలితాన్ని ఇవ్వదేమో అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే గత వైఎస్ జగన్ పాదయాత్ర అప్పుడు కూడా ఆయన శుక్రవారం అవగానే పాదయాత్రకి బ్రేక్ ఇచ్చి హైదరాబాద్ కోర్టుకు వెళ్ళేవారు. ఇప్పుడు ఈయనకి అలాంటి ఇబ్బందులు ఏవీ లేకున్నా ఎందుకు ఈ బ్రేక్ ఇస్తున్నారో లోకేష్ కే ఎరుక ! అదీ కాక ముచ్చటగా మూడు నెలల పాలన కూడా చూడకుండా ఇప్పుడే దాడి మొదలు పెడితే అది సత్ఫలితాన్ని ఇస్తుందా లేదనా అనే విషయం మీద కూడా తర్కించాల్సిన అవసరం ఉంది.      

ఒక పరాజయం 100 తప్పులు.. అడ్డూ అదుపూలేని దుబారా..!!

  విభజన అనంతరం కొత్త రాష్ట్రానికి అనుభవమున్న చంద్రబాబు సీఎం అయితే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని ఏపీ ప్రజలు భావించారు. అందుకే ఏపీ ప్రజలు 2014 ఎన్నికల్లో బాబుకి పట్టంకట్టారు. కానీ బాబు చేసిన కొన్ని తప్పుల మూలంగా 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కొని ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. గత ఐదేళ్లల్లో బాబు చేసిన తప్పుల్లో దుబారా ఖర్చు ప్రధానమైనదని చెప్పవచ్చు. నూతన రాష్ట్రం, రాజధాని లేదు, లోటు బడ్జెట్.. ఇలా ఎన్నో సమస్యలున్న వేళ సీఎం అయిన బాబు.. అనసరంగా హంగు ఆర్భాటాలకు పోయి ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ప్రమాణ స్వీకారంతో మొదలైన దుబారా.. బాబుని ప్రతిపక్షానికి సాగనంపేలా చేసింది. అసలే లోటు బడ్జెట్ అంటే కోట్లు ఖర్చుతో ప్రమాణ స్వీకారం చేసారు. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ లోని భవనాల మరమత్తులు, ఆధునీకరణ పేరుతో కోట్లు ఖర్చు పెట్టారు. తీరా కొద్ది నెలలు కూడా ఉండకుండానే అమరావతికి మకాం మార్చారు. అక్కడ తాత్కాలిక భవనాలకు కోట్ల ఖర్చు. వీటికితోడు విదేశీ పర్యటనల కోసం ప్రత్యేక విమానాలు. ఇక నవనిర్మాణ దీక్షలు, ధర్మ పోరాట దీక్షలు సరేసరి. దీక్ష అంటే ఓ టెంట్ వేస్తే సరిపోతుంది. కానీ బాబు దీక్షలు మాత్రం.. భారీ స్టేజ్, చుట్టూ క్లాత్ డెకరేషన్, ఏసీలు అబ్బో ఇలా మాములు హడావుడి కాదు. బాబు అనుభవం కొత్త రాష్ట్రానికి ఎంతలా ఉపయోగపడింది అనే దానికంటే.. బాబు చేసిన దుబారా అప్పటి విపక్ష వైసీపీకి మాత్రం మంచి అస్త్రం అయిందనే చెప్పాలి. బాబు దుబారాను వైసీపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. దీంతో ప్రజల్లో బాబు మీద వ్యతిరేకత మొదలై, అది ఎన్నికల్లో ఓడించే వరకు వెళ్లిందనే చెప్పాలి.

ఏపీలో కొత్త పుంతలు తొక్కుతున్న జంపింగ్ పాలిటిక్స్ !

  ఏపీ రాజకీయాలు రకరకాల మలుపులు తిరుగుతున్నాయి. ఎక్కడైనా నాయకులు పార్టీ మారుతున్నారు అంటే అది అధినేతకు చెప్పకుండా సైలెంట్ గా వెళ్ళిపోయి పార్టీలో చేరి పాత అధినేత మీద రకరకాల ఆరోపణలు చేస్తారు. కానీ ఏపీలో మాత్రం పార్టీ మారుతున్నామని పార్టీ అధినేత దగ్గరకి వెళ్లి మరీ చెప్పి వస్తున్నారు. ఈ వింత పరిస్థితి తెలుగు దేశం పార్టీలో నెలకొంది. గత ఎన్నికల ముందు వరకూ మేమే రాజులం మేమే మంత్రులం అన్నట్టు ఏపీలో అధికారాన్ని చెలాయించిన ఆ పార్టీ నేతలు, ఇప్పుడు అధికారం కోల్పోవడంతో ఒక్కసారిగా రోడ్డున పడిపోయిన ఫీలింగ్ లో ఉన్నారు.  దానికి తోడు గత ప్రతిపక్షం ఎక్కడ తమను టార్గెట్ చేస్తుందో అనే భయంలో ఉన్న్నారు. ఇక వ్యాపారాలు ఉన్న నేతల సంగతి వర్ణనాతీతం. అందుకే వారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటున్నారు. ఇప్పాతికే ఆ పార్టీ నుండి నలుగు ఎంపీలు పార్టీ మారి బీజేపీలోకి వెళ్ళగా ఇప్పుడు మరో సీనియర్ నేత కూడా పార్టీ మారే యోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. సీనియ‌ర్ నాయకుడు ప్రస్తుతం టీడీపీ నేత‌గా ఉన్న రాయ‌పాటి సాంబ‌శివ‌రావు టీడీపీ వీడి బీజేపీలో చేరేందుకు రంగం సిద్దమైంది !  రెండు మూడు రోజుల్లో రాయ‌పాటి బీజేపీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా స‌మ‌క్షంలో బీజేపీలో చేర‌నున్నట్లు స‌మాచారం. రాయ‌పాటి బీజేపీలో చేర‌టం ద్వారా ఆయ‌న‌కు గుంటూరు జిల్లాలో ఉన్న అనుచర వ‌ర్గం మొత్తంగా బీజేపీలో చేరే అవ‌కాశం క‌నిపిస్తోంది. దీని పైన రాయ‌పాటి ఒక‌టి రెండు రోజుల్లో అధికారికంగా ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారని అంటున్నారు. ఈ చేరికల విషయంలో కీలక పాత్ర పోషిస్తున్న రామ్ మాధవ్ రాయపాటి ఇంటికి వచ్చి తమ పార్టీలో చేరాలని ఆయనను ఆహ్వానించినట్టు తెలుస్తోంది.  కొద్ది రోజుల్లోనే తాను ఢిల్లీ వస్తానని... అక్కడ మరిన్ని విషయాలు మాట్లాడతానని రాయపాటి రామ్ మాధవ్‌కు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఆయనతో చర్చలు జరుపుతున్న ఫొటోలు సైతం కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తనతో బీజేపీ దూత వచ్చి పార్టీలోకి రావాలని కోరిన విషయాన్ని రాయపాటి సాంబశివరావు స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారని టాక్.  ఢిల్లీలో తాను నివాసం ఉంటున్న ఇంటి వ్యవహారంతో పాటు పోల‌వ‌రం సమస్యలను వివరించి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరాల్సిన ఆవశ్యకత గురించి వివరించినట్లు సమాచారం. పోల‌వ‌రం నిర్మాణం మీద ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి నిపుణుల క‌మిటీ వేయ‌టం..రివ‌ర్స్ టెండ‌రింగ్ దిశ‌గా అడుగులు వేస్తున్న క్ర‌మంలో ఆ కాంట్రాక్ట్ చేస్తున్న తను మ‌రింత‌గా ఆర్దికంగా న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉంద‌ని చెప్పారట. ఈ నేపధ్యంలో రాయ‌పాటి టీడీపీ వీడి బీజేపీలో చేరటం ఖాయ‌మైందని అంటున్నారు.  

గంటా వ్యూహాత్మక మౌనం....కారణం అదేనా ?

  అసెంబ్లీలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం హోరాహోరీగా సాగుతున్న విషయం తెలిసిందే. సభలో టీడీపీ సభ్యుల సంఖ్య తక్కువే అయినా అధికార వైసీపీతో ఢీ అంటే ఢీ అన్నట్టు పోరాడుతోంది. చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నాయకులు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాధవ నాయుడు సహా పలువురు ఎమ్మెల్యేలు వైసీపీకి కౌంటర్ ఇచ్చే విషయంలో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ విషయంలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యే, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు సైలెంట్‌గా ఉండటం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన గంటా శ్రీనివాసరావు కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని బీజేపీలోకి వెళతారని కొద్దిరోజుల క్రితం జోరుగా ప్రచారం జరిగింది. అయితే తాను పార్టీ మారబోనని గంటా శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చారు.  అయినా సరే ఆయన జగన్ పాలన చేపట్టిన నాటి నుండే సైలెంట్ అయ్యారు. ఇప్పటి వరకు టీడీపీ నేతలు జగన్ పాలనపై కాస్తో కూస్తో ఆరోపణలు చేసినా, టీడీపీపై జరుగుతున్న దాడులపై అసహనం ప్రదర్శించినా గంటా మాత్రం చాలా సైలెంట్ గా చూస్తున్నారు. ఒకపక్క ఆయన వైసీపీలో చేరేందుకు కూడా వ్యూహాలు రచిస్తున్నారని, అయితే మంత్రి అనీల్ కుమార్ యాదవ్ అడ్డు పడుతున్నారని కూడా ప్రచారం జరుగుతుంది.  ఇంతకీ గంటా సైలెన్స్ వెనుక బలమైన కారణమే ఉన్నట్టు తెలుస్తుంది. టీడీపీని పూర్తి స్థాయిలో టార్గెట్ చేసిన సీఎం జగన్ గతంలో టిడిపి హయాంలో చేసిన అవినీతిపై దృష్టి పెట్టారు. ఇప్పుడు అవినీతి పుట్టలు బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అవినీతి చేసి కాస్తో కూస్తో వెనకేసుకున్న నాయకులలో టెన్షన్ మొదలైంది. అందులో భాగంగా ఇప్పుడు గతంలో మంత్రిగా పనిచేసిన గంటా శ్రీనివాసరావుకు చెక్ పెట్టే పనిలో జగన్ సర్కార్ ఉన్నట్లుగా సమాచారం.   గడిచిన ఐదేళ్లలో విశాఖ జిల్లాలో భూ దందాలు విపరీతంగా జరిగాయని ,విశాఖ భూ కుంభకోణం లో ఉన్నది టిడిపి నేతలేనని అప్పట్లో వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష హోదాలో వైసిపి నాడు ఎంతో పోరాటం చేసినప్పటికీ నాడు అధికార పార్టీగా ఉన్న టిడిపి ఈ వ్యవహారంపై ఏమాత్రం స్పందించలేదు. గంటా శ్రీనివాసరావు వర్గంగా ఉన్న భీమిలి నేతలే పెద్ద ఎత్తున అక్రమ భూ సేకరణ చేశారని, అందుకే ప్రభుత్వం దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిందని అప్పట్లో పెద్దఎత్తున చర్చ సాగింది.  ఇక ఇప్పుడు జగన్ విశాఖ భూ కుంభకోణాన్ని బయటకు లాగి కుంభకోణానికి కారణమైన బాధ్యులను చట్టరీత్యా శిక్షించాలనే ప్రయత్నాల్లో ఉన్నారు.విశాఖ భూకుంభకోణం పై సమగ్ర దర్యాప్తుకు జగన్ ఆదేశించటంతో ఇప్పుడు గంటా శ్రీనివాసరావుకు, గంటా వర్గానికి టెన్షన్ పట్టుకుంది. అందుకే గంటా సైలెంట్ గా ఉంటున్నారని అంటున్నారు. నిజానికి సొంత మంత్రులే ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడంతో అప్పటి బాబు ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది.  ఈ సిట్ బృందం పలు కోణాల్లో విచారణ చేసి నివేదికను ప్రభుత్వానికి అందించింది. అయితే ఎన్నికల దెబ్బకి ఈ విషయం మరుగున పడింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గంటా ఈ వ్యవహారంలో ఏం చెయ్యాలో అర్ధం కాక సమావేశాలకి కూడా సరిగా రావడం లేదని అంటున్నారు.   

తెలంగాణాకి కూడా కొత్త గవర్నర్ ?

  రాష్ట్ర విభజన అనంతరం సుమారు ఐదేళ్ళ తర్వాత ఏపీకి కొత్త గవర్నర్ ను నియమించారు. ఒడిశాకు చెందిన మాజీ మంత్రి, ప్రముఖ న్యాయవాది బిశ్వ భూషణ్ హరిచందన్ ను గవర్నర్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. వారం రోజుల్లోగా ఏపీ గవర్నర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని గవర్నర్ నివాసంగా మార్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంయుక్త గవర్నర్ గా నరసింహన్ వ్యవహరించారు. ఇక ఇప్పుడు తెలుగురాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న నరసింహన్‌ను తెలంగాణకే పరిమితం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇదిలా ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో 2009 నుండి గవర్నర్ గా ఉన్న నరసింహన్ ని కూడా ఏక్షణంలోనైనా మార్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. రాష్ట్ర విభజన చట్టంలో హైదరాబాద్‌ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పేర్కొన్నా గత ప్రభుత్వం ముందే రాజధానిని అమరావతికి తరలించింది నెమ్మదిగా హైకోర్టు విభజన కూడా పూర్తిచేశారు.  మొన్న జగన్ చొరవతో ఆంధ్రా బిల్డింగ్స్ కూడా తెలంగాణకు ఇచ్చేయగా, సచివాలయంలో ఆంధ్రకు చెందిన బ్లాక్‌లను కూడా తెలంగాణకు కేటాయించారు. ఇక తాజాగా ఉమ్మడి గవర్నర్ వ్యవస్థ కూడా పోయి.. రెండు రాష్ట్రాలకు గవర్నర్‌లు వచ్చారు. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో శాంతి భద్రతలపై చట్టంలో ప్రత్యేకంగా ‘సెక్షన్‌ 8’ను పొందుపరిచారు. సెక్షన్‌-1(7) లో ఉమ్మడి గవర్నర్‌ ప్రస్తావన ఉండగా ఆ తర్వాత సెక్షన్‌-1 (8)(1)లో రాజధానిలో గవర్నర్‌ అధికారాలు, బాధ్యతలు ఉన్నాయి.  సెక్షన్‌-8లో ఉమ్మడి రాజధానిగా ఉన్నంత కాలం ప్రజల రక్షణ, ఆస్తులను కాపాడే అధికారం గవర్నర్‌కు అప్పగించారు. శాంతిభద్రతల పరిరక్షణ, అంతర్గత భద్రత, ఉమ్మడి రాజధానిలోని ప్రభుత్వ భవనాలను ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించడం వంటి బాధ్యతలను గవర్నర్‌కు ఇచ్చారు. ఇప్పటికే ఈ ప్రక్రియ మొత్తం ముగిసిపోయింది. ఏపీకి ప్రత్యేక గవర్నర్‌ నియామకం నేపథ్యంలో నరసింహన్ పదవీకాలం కూడా ముగిసినట్లే అనే ప్రచారం సాగుతోంది. కొన్నాళ్ళ క్రితం ఆయన గవర్నర్ గా తప్పుకుని కేంద్ర హోం శాఖకి వెళ్తారని కూడా ప్రచారం జరిగింది. ఏమి జరగనుందో వేచి చూడాలి ?