English | Telugu

అన్షుపై విజయ్ బిన్నీ మాస్టర్ ఫైర్.. పండు గెలవాలి అంటూ నెటిజన్స్ కామెంట్స్!

ఢీ 20 లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో ఇప్పుడున్న కంటెస్టెంట్స్ ఎక్స్-కంటెస్టెంట్స్ తో డాన్స్ చేశారు. అందరూ పోటాపోటీగా చేశారు. కానీ అన్షు రెడ్డి విషయానికి వచ్చేసరికి విజయ్ బిన్నీ మాస్టర్ ఆమె మీద ఫుల్ ఫైర్ అయ్యారు. "బొమ్మొలే ఉందిరా పోరి.." సాంగ్ కి డాన్స్ చేసింది. ఐతే అందులో ఆమె డాన్స్ అంతగా లేదని ఫీలయ్యాడు జడ్జ్. దాంతో "నాకు అసలు అన్షు ఎక్కువగా చేయలేదు అన్న ఫీల్ వచ్చింది" అన్నాడు. దాంతో డాన్స్ మాస్టర్ ఏదో చెప్పాడు. "బిహైండ్ కెమెరా సరిగా ప్రాక్టీస్ చేయలేకపోయారు. కాబట్టి ఇది చూడండి మీరు అంటే ప్రోపర్ గా ఉండదు. చాలా మంది ఇలాంటి అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. దీన్ని గ్రాంటెడ్ గా తీసుకోవద్దు " అన్నారు.

లాస్ట్ జతిన్ అలాగే పండు వచ్చి పోటాపోటీగా డాన్స్ చేశారు. దాంతో జడ్జెస్ ఇద్దరూ కూడా చాలా కన్ఫ్యూజన్ లో పడ్డారు అసలు ఎవరికీ ఎం మార్క్స్ ఇవ్వాలా అని. జతిన్ పెర్ఫార్మెన్స్ కి సంకేత్ వచ్చి షూస్ పక్కకు తీసేసి వాళ్ళను విష్ చేసాడు. ఇక పండు ఐతే ప్రేమికుల రోజు మూవీ నుంచి వాలు కనులదాన అనే సాంగ్ కి చేసిన డాన్స్ ఐతే మాములుగా లేదు. విజయ్ బిన్నీ మాస్టర్ ఐతే స్టేజి మీదకు వచ్చి మెచ్చుకున్నాడు. ఇది చాలా టఫ్ డెసిషన్. ఇలా ఉండాలి పోటీ అంటే. మేమిద్దరం ఇలాంటి ఒక రౌండ్ కోసం వెయిట్ చేస్తున్నాం అంటూ చెప్పింది రెజీనా. ఇక నెటిజన్స్ ఐతే అందరూ పండు గెలవాలి అంటూ కామెంట్ చేస్తున్నారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.