English | Telugu

స‌ర్‌ప్రైజ్ చేసిన రామ్‌.. క‌న్నీరు పెట్టుకున్న సునీత‌!

అవును. ఇది స్టార్ మా చాన‌ల్‌లో ప్రారంభం కానున్న '100% ల‌వ్ షో'లో చోటు చేసుకుంది. ఈ చాన‌ల్ ఇటీవ‌ల ప్రారంభించిన బిగ్ బాస్ ఉత్స‌వం, కామెడీ స్టార్స్ షోల‌కు మంచి టీఆర్పీ ల‌భిస్తోంది. తాజాగా ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని డ‌బుల్ చేయ‌డంలో భాగంగా '100% ల‌వ్'` పేరుతో మ‌రో వినూత్న‌మైన షోని ప్రారంభించ‌బోతోంది. 6 రియ‌ల్ క‌పుల్స్, 6 రీల్ క‌పుల్స్ ఈ షోలో ఎంట‌ర్‌టైన్ చేయ‌బోతున్నారు. ఈ నెల 21 సాయంత్రం 6 గంట‌ల‌కి ఈ షో గ్రాండ్‌గా ప్రారంభం కాబోతోంది. '100% ల‌వ్' మూవీ తీసిన లెక్క‌ల మాస్ట‌ర్ సుకుమార్ ఈ ప్రారంభ షోలో సంద‌డి చేయ‌బోతున్నారు.

అలాగే న్యూ క‌పుల్ సింగ‌ర్ సునీత‌, రామ్ వీర‌ప‌నేని కూడా ఈ షోలో పాల్గొంటున్నారు. తాజాగా విడుద‌ల చేసిన ప్రోమో స్టార్ మా అఫీషియ‌ల్ ట్విట్ట‌ర్ పేజ్‌లో సంద‌డి చేస్తోంది. మొద‌ట ఒంట‌రిగా ఈ షోకి వ‌చ్చిన సునీత మైక్ ప‌ట్టుకొని మాట్లాడుతూ, "రామ్ ఐ రియ‌ల్లీ రియ‌ల్లీ ల‌వ్ యూ" అని చెప్ప‌గానే, వెనుక నుంచి వ‌చ్చి ఆమె వీపు త‌ట్టారు రామ్‌. షాక్‌తో "ఆ.." అని వెన‌క్కి తిరిగి చూసి, రామ్ క‌నిపించేస‌రికి ఒక్క‌సారిగా స‌ర్‌ప్రైజ్ అయ్యారు సునీత‌. ఆ త‌ర్వాత రామ్‌ను హ‌త్తుకున్నారు.

డైరెక్ట‌ర్ సుకుమార్ బెత్తం ప‌ట్టుకుని వ‌చ్చి మాట్లాడుతూ, "ఒక‌ళ్లు ప్రేమిస్తారు, ఇంకొక‌ళ్లు స్పందిస్తారు" అన‌గానే, ఎమోష‌న‌ల్ అయిన సునీత క‌ళ్ల‌ల్లోంచి నీటి బొట్లు ఆమె చెంప‌ల మీదుగా జారాయి. ఈ ఎపిసోడ్‌లో ఏం జ‌రుగుతుందో 21వ తేదీ మ‌నం చూడ‌బోతున్నాం. యాంక‌ర్ ర‌వి, వ‌ర్షిణి సౌంద‌ర‌రాజ‌న్ ఈ షోకు వ్యాఖ్యాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.