English | Telugu

మా నాయనా రైతు...నేను రైతు బిడ్డను..గీతూ కౌంటర్ 


సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి జబర్దస్త్, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంతా వచ్చారు. పల్లవి ప్రశాంత్, భోలే షావలి, దామిని, గీతూ రాయల్, ఫైమా, కీర్తి భట్ వచ్చారు. సుమ అడ్డాలో ఎప్పుడూ లేనిది ఈసారి మాత్రం గట్టిగానే గొడవయ్యింది. దాంతో సుమ కూడా షాకయ్యింది. ఇక సుమ ఫస్ట్ రౌండ్ కోసం గెస్టులను కూర్చోబెట్టింది.

ఐతే గీతూ, కీర్తి వచ్చి కూర్చున్నారు. దాంతో "ఫైమా నువ్వు రాలేదేంటి" అని అడిగింది సుమ. కీర్తి, గీతూ అనుకుని వెళ్లిపోయారు అని చెప్పింది. "స్కిట్ చేసేటప్పుడు నన్ను కలుపుకున్నావా" అని గీతూ అడిగింది. దాంతో ఇద్దరి మధ్య గొడవయ్యింది. "గట్టిగా అరవద్దు గీతూ నువ్వు తోపువి అని ఫీల్ కాకుండా వెళ్లి ఆడు" అని గట్టిగా ఇచ్చింది. మధ్యలో బోలె షావలి వచ్చేసరికి "నీ టీమ్ కాదుగా సైలెంట్ గా ఉండు" అంటూ గీతూ వార్నింగ్ ఇచ్చింది. "కీర్తి నువ్వు లే" అని సుమ అనేసరికి అంటే "నన్ను అవమానిస్తున్నారా" అంటూ ఫీలయ్యింది. "షో నుంచి వెళ్లిపొమ్మంటే వెళ్ళిపోతా నాకు అవసరం లేదు" అని చెప్పింది గీతూ. "బాబోయ్ ఏమి ఈగోలు రా నాయనా" అంటూ సుమ తలపట్టుకుంది. పల్లవి ప్రశాంత్ కూడా గీతూ మీద కామెంట్స్ చేసేసరికి "బిగ్ బాస్ లో చేసిన గత్తరంతా ఇక్కడ నా ముందు చేయమాకా.. ఇలాంటి కామెంట్స్ తీసుకోలేకపోతే షోకి ఇంకా రామాకు " అని సీరియస్ గా చెప్పింది గీతూ. ఇక పల్లవి ప్రశాంత్ అదే రాగం అందుకున్నాడు. " మా నాయనా రైతు...నేను రైతు కొడుకును" అన్నాడు. "మా నాయనా కలెక్టర్ అయ్యాడని నేను కలెక్టర్ ని కాలేనుగా" అంటూ కౌంటర్ ఇచ్చింది గీతూ.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.