English | Telugu

నాన్న జీరో అంటూ ఏడ్చేసిన శుభలేఖ సుధాకర్

అమ్మంటే ఎంత ఇష్టమో నాన్న అన్నా కూడా అంతే ఇష్టం ఉంటుంది ఎవరికైనా. అమ్మ తొమ్మిది నెలలు మోస్తే నాన్న జీవితాంతం తన భుజాలపై మోస్తాడు. జూన్ లో ఫాదర్స్ డే రాబోతోంది. ఇక ఈ నెలలోనే మ్యూజిక్ డే కూడా వుంది. సంగీతం లేని ప్రపంచాన్ని ఊహించలేం. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలన్నా, మంచి నిద్ర పట్టాలన్నా, స్పెషల్ మూమెంట్స్ ని ఎంజాయ్ చేయాలన్నా మ్యూజిక్ కి ఆల్టర్నేట్ ఇంకోటి లేదు. మరి ఈ టు స్పెషల్ ఈవెంట్స్ ని పురస్కరించుకుని ఒక సూపర్ ప్రోగ్రాంని జీ తెలుగు డిజైన్ చేసింది.

ఇందులో నటుడు గోపీచంద్, రాశిఖన్నా , సాయి పల్లవి, శుభలేఖ సుధాకర్, సురేష్, రాజీవ్ కనకాల, ప్రభాకర్, జబర్దస్త్ కమెడియన్స్ అంతా ఈ షోలో కనిపించి అలరించనున్నారు. "నాన్న హీరో మనకు నచ్చినప్పుడు, నాన్న జీరో మనకు నచ్చనప్పుడు" అని చెప్తూ స్టేజి మీద ఎమోషన్ అయ్యారు శుభలేఖ సుధాకర్. "థ్యాంక్యూ దిల్ సే " అనే ఈ షోకి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యింది. ఇక యాంకర్స్ గా వన్ అండ్ ఓన్లీ సుధీర్ , శ్రీముఖి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనున్నారు. సుధీర్ కోసమే ఈ షో చూడాలి. సుధీర్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంటూ సుధీర్ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.