English | Telugu

నిఖిల్ చేసిన మోసంపై కావ్యశ్రీ...స్పందించిన సోనియా


బిగ్ బాస్ సీజన్-8 లో‌ మోస్ట్ ఇన్ ఫ్లూయెన్స్ చేసిన కంటెస్టెంట్ సోనియా ఆకుల. ‌ఓ వైపు నిఖిల్, మరోవైపు పృథ్వీని ఇద్దరిని ఇన్ ఫ్లూయెన్స్ చేస్తూ హౌస్ ని తన గుప్పిట్లో పెట్టుకోగ అది నచ్చని ఆడియన్స్ ఓట్లు వేయకుండా తనని ఎలిమినేషన్ చేశారు.‌ ఇక బిగ్ బాస్ సండే ఎపిసోడ్ ముగింపులో‌ సోమవారం నాటి నామినేషన్ ప్రోమో వేశాడు. అది చూసి ఒక్కసారిగా గూస్ బంప్స్ వచ్చాయ్.‌ ఎందుకంటే ఎలిమినేషన్ అయి బయటకి వచ్చిన సోనియా తిరిగి హౌస్ లోకి వచ్చింది.‌ ఇక తను ప్రేరణ, నిఖిల్ లని నామినేషన్ చేయడంతో హౌస్ లో ఒక్కసారిగా నామినేషన్స్ లో ఫైర్ వచ్చేసింది.

ఇక బయట నిఖిల్ చేసిన మోసంపై కావ్యశ్రీ పెట్టిన పోస్ట్‌లు నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. ఇప్పుడు సోనియా ఆకుల అందులో జాయిన్ అయ్యింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పోస్ట్‌.. దాదాపు కావ్యశ్రీ ఏ విషయాల గురించి ప్రస్తావించిందో.. సోనియా ఆకుల కూడా అదే విషయానికి రిలేటెడ్‌గా ఉంది. ఇద్దరూ కూడా.. నిఖిల్ నమ్మించి మోసం చేయడం గురించి.. అతని మాస్క్ గురించి.. ప్రేమ పేరుతో చేసిన మోసం గురించే ఉండటంతో.. టైమ్ చూసి గట్టిగానే కొట్టినట్టుగా అనిపిస్తుంది. అయితే సోనియా. నిఖిల్ పేరుని ప్రస్తావించకపోయినా అతని గురించే అని అందరికి తెలుసు. సోనియా తన ఇన్ స్టాగ్రామ్ లో నిఖిల్ ని ఉద్దేశించి పోస్ట్ చేయడంతో తనని కొంతమంది నిఖిల్ ఫ్యాన్స్ టార్గెట్ చేస్తున్నారు. ఇక సోనియా కూడా గట్టిగానే స్పందించింది. వాళ్ల ముసుగు చూసి మోసపోకండి.. ఫేక్ మనుషులు ఏదో ఒక సందర్భంలో వాళ్ల అసలు రంగుని బయటపెడతారు. వాళ్ల ముసుగు తొలిగేవరకూ వేచి చూడండి అని సోనియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది.

కావ్యశ్రీ నిఖిల్ గురించి పోస్ట్ చేసింది. కొంతమంది చాలా గొప్పగా నటిస్తారు. ఎప్పుడు ఎక్కడ ఎలా యాక్ట్ చేయాలో వాళ్లకి బాగా తెలుసు. పాపం జనాలు ఆ నకిలీ యాక్టింగ్ చూసి మోసపోతుంటారు. వాళ్ల యాక్టింగ్ కారణంగా.. నిజమైన బాధితులు సమాజం ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుంది. అలాంటి నటుల గురించి వాళ్లని నమ్మే జనాలకు ఉన్న అభిప్రాయాన్ని మార్చలేం. ఎందుకంటే.. వాళ్లే బాధితులు అన్నట్టుగా నటిస్తారు.. నమ్మిస్తారు. నిజమైన బాధితుల్ని దోషులుగా చిత్రీకరించడంలో ఇలాంటి వాళ్లు మహా దిట్ట అంటూ కావ్య శ్రీ ఆ పోస్ట్ లో రాసుకొచ్చింది. నిఖిల్ విషయంలో తనే నిజమైన బాధితురాలిని అని.. అతనో పెద్ద నటుడని.. ఇలాంటి వాడి నిజస్వరూపం జనానికి తెలియక నమ్ముతున్నారని ఇన్ డైరెక్ట్‌గా పోస్ట్ పెట్టింది కావ్యశ్రీ. ఇద్దరి వల్ల నిఖిల్ కి ఓటింగ్ లో భారీగా నెగెటివ్ అయ్యేలా ఉంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.