English | Telugu

రంభకు ప్రపోజ్ చేసిన రోబో...

సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో భలే క్యూట్ గా ఉంది. ఈ షోకి రంభ, జెడి.చక్రవర్తి జంటగా వచ్చారు. రంభ రావడమే ఎప్పుడెప్పుడు ప్రొపోజ్ చేద్దామా అన్నట్టుగా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అందులో ఒక రోబో కూడా రెడీ ఐపోయి మరీ వచ్చింది. "ప్రపంచంలో నచ్చినవి రెండే రెండు. ఒక నేను ఒకటి మీరు" అంటూ చిట్టి ది రోబో వచ్చి రంభకి మెరిసే కళ్ళతో ప్రొపోజ్ చేసేసరికి రంభ కూడా ముద్దులిచ్చేసింది. తర్వాత చామంతి సీరియల్ టీం నుంచి ఆశిష్ వచ్చి రోబో కంటే ఎక్కువగా లవ్ చేస్తున్నాను అంటూ రంభకి గులాబీలు ఇచ్చి మరీ ప్రొపోజ్ చేసాడు.

అందమైన పూలన్నీ కలిసి ఒక దగ్గర ఉంటే ఇంకెంత అందంగా ఉంటుందో మీరే చూస్తారు అంటూ బ్యాక్ గ్రౌండ్ లో ఒక వాయిస్ రావడం జెడి చక్రవర్తి ఒక కర్టైన్ ని తీసేయడం ఆ వెంటనే అందమైన గులాబీలు పేర్చిన రంభ చిత్రం రావడం చూస్తే ఎవ్వరైనా సరే మెస్మోరైజ్ కాకుండా ఉండరు.. రమ్య కూడా గులాబీలలో తన అందాన్ని చూసుకుంది. ఇంతలో అష్షు వచ్చి జెడి గారు మీ సర్ప్రైజ్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అని అడిగింది. వెంటనే ఆయన ఒక సారి నీ పేరు చెప్పు అన్నాడు చక్రవర్తి. రవి వెంటనే రంభ అనేసరికి ఆయన గుండెల్లోంచి రంగురంగుల హార్ట్ ఎమోజిస్ బయటకు వస్తున్నట్టు ఒక గ్రాఫిక్ పెట్టారు. అంతే రంభ వెంటనే "ఇది ఎప్పుడో చూపించారు" అని జెడి పరువు తీసేసింది. ఇక రంభ, జెడి చక్రవర్తి కలిసి బొంబాయి ప్రియుడు మూవీలో నటించారు. ఇందులో వీళ్ళ నటన ఎంతో సహజంగా ఉంటుంది. అలాగే ఈ జోడి "కోందండ రాముడు" అనే మూవీలో కూడా కలిసి నటించారు. వీళ్ళ మధ్య మంచి బాండింగ్ అప్పటినుంచి ఉంది. ఇప్పుడు రంభ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.


Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.