English | Telugu

"మీరు తాత".. యాంక‌ర్ ర‌వికి ప‌వ‌న్ కూతురి షాక్‌!

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల ముద్దుల కూతురు ఆద్య.. యాంకర్ రవిల మధ్య జరిగిన సంభాషణ అందరినీ నవ్విస్తోంది. కొన్నాళ్లుగా రేణు బుల్లితెరపై జడ్జ్ గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. జీతెలుగులో ప్రసారమవుతోన్న 'డ్రామా జూనియర్స్' షోకి సింగర్ సునీత, ఎస్వీ కృష్ణారెడ్డిలతో పాటు రేణు దేశాయ్ కూడా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ షోకి ఆద్యను గెస్ట్ గా ఆహ్వానించారు.

మదర్స్ డే సందర్భంగా ఈ స్పెషల్ ఎపిసోడ్ ను డిజైన్ చేశారు. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ క్రమంలో ఆద్యకు యాంకర్ రవి గ్రాండ్ వెల్కమ్ చెప్పగా.. కూతుర్ని స్టేజ్ పై చూసిన రేణు ఆద్య దగ్గరకు వెళ్లి ఆమెని హగ్ చేసుకుంది. ఈ ప్రోమోలో ఆద్యను బాగా హైలైట్ చేశారు. 'వకీల్ సాబ్' బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ తో షోలోకి ఎంట్రీ ఇచ్చిన ఆద్య తనదైన మాటలతో ఆకట్టుకుంది. ఈ షోకి మరో జడ్జ్ అయిన సునీతతో కలిసి గొంతు కలిపి 'నీలి నీలి ఆకాశం' పాటను పాడింది ఆద్య.

ఆ తరువాత యాంకర్ రవి తన గురించి తనే ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ.. "నా పేరు రవి నేను ఇక్కడ హోస్ట్ ను" అని చెప్పాడు. వెంటనే సునీత కలుగజేసుకొని.. "రవి మీ అమ్మను అక్కా అని పిలుస్తాడు. కాబట్టి నువ్ రవిని మామ అని పిలువు" అంటూ ఆద్యకు చెప్పింది. ర‌వి కూడా "ఒక్క‌సారి మావ‌య్యా అని పిలువ‌మ్మా?" అన‌డిగాడు. వెంటనే రియాక్ట్ అయిన ఆద్య.. "మీరు తాతా" అని కౌంటర్ ఇచ్చింది. దీంతో రవి షాక‌వుతూ ఆమెని అలాగే చూస్తుండిపోతే, మిగ‌తావారంతా ప‌డీ ప‌డీ న‌వ్వారు. ఈ ప్రోమో చూసిన నెటిజన్లు పవన్ కూతురు కదా.. ఆ మాత్రం చలాకీతనం ఉంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.