English | Telugu

ఒక‌వైపు ఆర్థిక స‌మ‌స్య‌లు.. ఇంకోవైపు బ్యాన్‌.. బుల్లితెర నటి క‌ష్టాలు!

'పసుపు కుంకుమ' సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ భామ పల్లవి గౌడ. ఈ సీరియల్‌లో అంజలి అనే పాత్రలో నటించిన ఈ బ్యూటీ ఆ తరువాత 'సావిత్రి' అనే సీరియల్ చేసింది. అయితే కొద్దిరోజులకే ఆమె సీరియల్ నుండి తప్పుకుంది. దీనికి కారణం ఏంటనే విషయం బయటకు చెప్పలేదు. నిజానికి తాను యానిమేషన్ రంగంలోకి వెళ్లాల‌నుకున్నాన‌నీ కానీ అనుకోకుండా టీవీ రంగంలోకి వచ్చాన‌నీ చెప్పింది. త్వరలోనే మళ్లీ తెలుగు సీరియల్స్ చేస్తానని వెల్లడించింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో తనపై బ్యాన్ విధించిన విషయాన్ని ప్రస్తావించింది. 'సావిత్రి' సీరియల్ చేసే చేసే సమయంలో వేరే ఏ తెలుగు సీరియల్ లో నటించనని అగ్రిమెంట్ చేసుకున్నట్లు వెల్లడించింది. అయితే ఆ సీరియల్ లో నటించినందుకు తనకు పేమెంట్స్ సరిగ్గా ఇవ్వలేదని.. రెండు నెలల పాటు అలానే చేశారని తెలిపింది. అదే సమయంలో తనకు వేరే సీరియల్ లో నటించే అవకాశం వస్తే.. ఒప్పుకుంటానని 'సావిత్రి' నిర్మాతలతో చెబితే వాళ్లు ఒప్పుకోలేదని స్పష్టం చేసింది.

కనీసం పెండింగ్ పేమెంట్ అయినా ఇవ్వమని అడిగానని.. అది కూడా సెటిల్ చేయలేదని చెప్పుకొచ్చింది. ఆర్థిక‌ సమస్యల వలన వేరే సీరియల్ చేస్తానని చెప్పడంతో ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్ లో తనను బ్యాన్ చేశారని చెప్పుకొచ్చింది. మరోపక్క తన వ్యక్తిగత జీవితంలో కూడా పల్లవి చాలా సమ‌స్య‌లు ఎదుర్కొంటోంది. మనస్పర్థల కారణంగా భర్తతో విడిపోయింది. రీసెంట్ గా విడాకులు కూడా తీసుకున్నారు. ప్రస్తుతం తన జీవితంలో జరిగిన చేదు సంఘటనల నుండి బయటపడడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది ప‌ల్ల‌వి.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.