English | Telugu

ఒక‌వైపు ఆర్థిక స‌మ‌స్య‌లు.. ఇంకోవైపు బ్యాన్‌.. బుల్లితెర నటి క‌ష్టాలు!

'పసుపు కుంకుమ' సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ భామ పల్లవి గౌడ. ఈ సీరియల్‌లో అంజలి అనే పాత్రలో నటించిన ఈ బ్యూటీ ఆ తరువాత 'సావిత్రి' అనే సీరియల్ చేసింది. అయితే కొద్దిరోజులకే ఆమె సీరియల్ నుండి తప్పుకుంది. దీనికి కారణం ఏంటనే విషయం బయటకు చెప్పలేదు. నిజానికి తాను యానిమేషన్ రంగంలోకి వెళ్లాల‌నుకున్నాన‌నీ కానీ అనుకోకుండా టీవీ రంగంలోకి వచ్చాన‌నీ చెప్పింది. త్వరలోనే మళ్లీ తెలుగు సీరియల్స్ చేస్తానని వెల్లడించింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో తనపై బ్యాన్ విధించిన విషయాన్ని ప్రస్తావించింది. 'సావిత్రి' సీరియల్ చేసే చేసే సమయంలో వేరే ఏ తెలుగు సీరియల్ లో నటించనని అగ్రిమెంట్ చేసుకున్నట్లు వెల్లడించింది. అయితే ఆ సీరియల్ లో నటించినందుకు తనకు పేమెంట్స్ సరిగ్గా ఇవ్వలేదని.. రెండు నెలల పాటు అలానే చేశారని తెలిపింది. అదే సమయంలో తనకు వేరే సీరియల్ లో నటించే అవకాశం వస్తే.. ఒప్పుకుంటానని 'సావిత్రి' నిర్మాతలతో చెబితే వాళ్లు ఒప్పుకోలేదని స్పష్టం చేసింది.

కనీసం పెండింగ్ పేమెంట్ అయినా ఇవ్వమని అడిగానని.. అది కూడా సెటిల్ చేయలేదని చెప్పుకొచ్చింది. ఆర్థిక‌ సమస్యల వలన వేరే సీరియల్ చేస్తానని చెప్పడంతో ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్ లో తనను బ్యాన్ చేశారని చెప్పుకొచ్చింది. మరోపక్క తన వ్యక్తిగత జీవితంలో కూడా పల్లవి చాలా సమ‌స్య‌లు ఎదుర్కొంటోంది. మనస్పర్థల కారణంగా భర్తతో విడిపోయింది. రీసెంట్ గా విడాకులు కూడా తీసుకున్నారు. ప్రస్తుతం తన జీవితంలో జరిగిన చేదు సంఘటనల నుండి బయటపడడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది ప‌ల్ల‌వి.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.