English | Telugu

రూపాయి ఇచ్చినా చాలు.. ర‌ష్మి పిలుపు!

బుల్లితెరపై గ్లామ‌ర‌స్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రష్మీ గౌతమ్.. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తోంది. కానీ ఎక్కువగా బుల్లితెరకే ప్రాధాన్యం ఇస్తోంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సామాజిక అంశాలపై స్పందించడమే కాకుండా.. జంతు రక్షణ కోసం తనవంతు సాయం చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్స్టాగ్రామ్ లో ఒక్క రూపాయి దానం చేయమని అభిమానులను కోరింది. ఓ డాన్స్ షోలో పాల్గొంటున్న కంటెస్టెంట్ కష్టాల్లో ఉందని.. తనకు ఆర్థిక‌ సాయం చేయడం కోసం ముందుకు రావాలని రష్మీ కోరింది.

ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసింది. డాన్సర్ పవిత్ర పరిస్థితి గురించి అందరికీ తెలిసే ఉంటుందని.. ఆమె తల్లితండ్రులకు కరోనా పాజిటివ్ అని తేలిందని.. డబ్బు లేకపోవడంతో ఆమె తండ్రికి సరిగ్గా ట్రీట్మెంట్ చేయించలేకపోయిందని చెప్పింది. దురదృష్టవశాత్తు ఆమె తండ్రి మరణించారని.. ఆర్థికంగా పవిత్ర ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటోందని కాబట్టి ఆమెకి సాయం చేద్దామని రష్మీ కోరింది. తన ఇన్స్టాగ్రామ్ లో 3.3 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారని.. అందరూ ఒక్కో రూపాయి ఇచ్చినా చాలని.. కనీసం రెండు లక్షల మొత్తాన్ని పవిత్ర కుటుంబానికి అందజేద్దామని రష్మీ వేడుకుంది.

రష్మీ తీసుకున్న నిర్ణయానికి ఆమె అభిమానులు అండగా నిలిచారు. తమకు తోచినంత మొత్తాన్ని సాయంగా అందించారు. దీంతో అతి తక్కువ సమయంలోనే రూ.2 లక్షలను రష్మీ పోగు చేయగలిగింది. ఆ మొత్తాన్ని పవిత్ర కుటుంబానికి అందజేసింది. రష్మీ చేసిన ఈ మంచి పనికి అభిమానులు ఆమెని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. తన మాటకు విలువిచ్చి ఓ మంచి పనికి సపోర్ట్ చేసిన అభిమానులకు రష్మీ కృతజ్ఞతలు చెప్పింది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.