English | Telugu

రూపాయి ఇచ్చినా చాలు.. ర‌ష్మి పిలుపు!

బుల్లితెరపై గ్లామ‌ర‌స్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రష్మీ గౌతమ్.. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తోంది. కానీ ఎక్కువగా బుల్లితెరకే ప్రాధాన్యం ఇస్తోంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సామాజిక అంశాలపై స్పందించడమే కాకుండా.. జంతు రక్షణ కోసం తనవంతు సాయం చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్స్టాగ్రామ్ లో ఒక్క రూపాయి దానం చేయమని అభిమానులను కోరింది. ఓ డాన్స్ షోలో పాల్గొంటున్న కంటెస్టెంట్ కష్టాల్లో ఉందని.. తనకు ఆర్థిక‌ సాయం చేయడం కోసం ముందుకు రావాలని రష్మీ కోరింది.

ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసింది. డాన్సర్ పవిత్ర పరిస్థితి గురించి అందరికీ తెలిసే ఉంటుందని.. ఆమె తల్లితండ్రులకు కరోనా పాజిటివ్ అని తేలిందని.. డబ్బు లేకపోవడంతో ఆమె తండ్రికి సరిగ్గా ట్రీట్మెంట్ చేయించలేకపోయిందని చెప్పింది. దురదృష్టవశాత్తు ఆమె తండ్రి మరణించారని.. ఆర్థికంగా పవిత్ర ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటోందని కాబట్టి ఆమెకి సాయం చేద్దామని రష్మీ కోరింది. తన ఇన్స్టాగ్రామ్ లో 3.3 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారని.. అందరూ ఒక్కో రూపాయి ఇచ్చినా చాలని.. కనీసం రెండు లక్షల మొత్తాన్ని పవిత్ర కుటుంబానికి అందజేద్దామని రష్మీ వేడుకుంది.

రష్మీ తీసుకున్న నిర్ణయానికి ఆమె అభిమానులు అండగా నిలిచారు. తమకు తోచినంత మొత్తాన్ని సాయంగా అందించారు. దీంతో అతి తక్కువ సమయంలోనే రూ.2 లక్షలను రష్మీ పోగు చేయగలిగింది. ఆ మొత్తాన్ని పవిత్ర కుటుంబానికి అందజేసింది. రష్మీ చేసిన ఈ మంచి పనికి అభిమానులు ఆమెని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. తన మాటకు విలువిచ్చి ఓ మంచి పనికి సపోర్ట్ చేసిన అభిమానులకు రష్మీ కృతజ్ఞతలు చెప్పింది.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.