English | Telugu

79 ఏళ్ల వ‌య‌సులో సుమ తల్లి ఏం చేస్తోందో చూశారా..?

యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమెకి మంచి ఫాలోయింగ్ ఉంది. బుల్లితెరపై, సినిమా ఈవెంట్స్ తో సుమ చాలా బిజీగా ఉంటుంది. స్టార్ హీరోలపై కూడా సుమ సెటైర్లు వేస్తుంటుంది. కానీ ఇప్పటివరకు నెగెటివిటీ అనేది ఎప్పుడూ రాలేదు. అలాంటి సుమను ఈ మధ్య నెటిజన్లు ట్రోల్ చేశారు. తనపై వచ్చిన ట్రోలింగ్ పై స్పందిస్తూ సుమ ఘాటు కౌంటర్ ఇచ్చింది. గత వారంలో సుమ ఓ లేగ దూడకు సంబంధించిన వీడియో షేర్ చేయగా.. అందులో ఆ దూడ మూతికి వెదురు బుట్టి కట్టి ఉండడంతో అందరూ సుమను తిట్టారు. ఆవుపాలు దూడకు ఇవ్వకుండా ఇలా ప్రవర్తించడం ఏంటంటూ సుమని ప్రశ్నించారు. దీనిపై సుమ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఆ మేటర్ కి ఫుల్ స్టాప్ పడింది.

తాజాగా సుమ మరో వీడియో షేర్ చేసింది. ఇందులో తన తల్లి గురించి ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు. తన తల్లికి 79 ఏళ్లు వచ్చినా కూడా ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని.. రోజూ ఆమె చేసే వ్యాయామం, అలవాట్ల గురించి వివరించారు. రోజూ ఎలా ఉన్నా కూడా కచ్చితంగా వాకింగ్, సైకిల్ తొక్కడం, వ్యాయామం అన్నీ చేస్తానని సుమ తల్లి చెప్పుకొచ్చింది.

మనసు, మైండ్ ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని.. దానికి ఉదాహరణ తన తల్లేనని చెప్పిన సుమ.. 79 ఏళ్లు వచ్చినా కూడా తన తల్లి ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటారని చెప్పుకొచ్చింది. ప్రతీరోజూ వ్యాయామం చేస్తూ.. ఆరోగ్యకరమైన ఆహరం తీసుకుంటారని.. ఏం జరిగినా కూడా అవి మాత్రం మానదని.. ఆమె నిక్ నేమ్ బేబీ అని చెప్పిన సుమ.. తను షేర్ చేసిన వీడియోలను అమ్మలందరికీ అంకితమని చెప్పుకొచ్చింది.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.