English | Telugu

రుక్మిణిని స‌త్య‌కు ప‌ట్టించింది ఇదే!

శోభ‌న్ బాబు, శ్రీ‌దేవి, జ‌య‌ప్ర‌ద‌ల క‌ల‌యిక‌లో వ‌చ్చిన `దేవ‌త‌` సినిమా స్ఫూర్తితో రూపొందించిన సీరియ‌ల్ `దేవ‌త‌`. అర్జున్ అంబ‌టి, సుహాసిని, వైష్ణ‌వీ రామిరెడ్డి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. గ‌త కొన్ని వారాలుగా ఈ సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ బుధ‌వారం ఈ సీరియ‌ల్ 403వ ఎపిసోడ్‌లోకి ఎంట‌ర‌వుతోంది. ఈ రోజు హైలైట్స్ ఏంటో ఒక‌సారి చూద్దాం. `ఇగో సారూ మీరు రాలేదు కానీ మేమంతా గుడికి వ‌చ్చాం తెలుసా` అంటుంది దేవి ఆదిత్య‌తో..

మీరంతా అంటే ఎవ‌రెవ‌రు వ‌చ్చార‌ని కంగారుగా అడుగుతాడు దేవిని ఆదిత్య‌. అమ్మా, నేను, చిన్మ‌య్‌, నాన‌మ్మ‌` అని చెబుతుంది దేవి. వెంట‌నే ఫోన్ స‌త్య‌కు ఇవ్వు అంటాడు. స‌త్య ఫోన్ తీసుకోవ‌డంతో `నాకు క‌డుపు నొప్పిగా వుంది ఇంటికిరా` అంటాడు ఆదిత్య‌. `దీపాలు పెట్టే వేళ అయింద‌ని ప‌ది నిమిషాల్లో బ‌య‌లుదేర‌తామ‌ని` చెబుతుంది స‌త్య‌. ఫోన్ పెట్టేసిన ఆదిత్య `ఛ‌.. ఇప్పుడు స‌త్య ..రాధ‌ని చూస్తే ప్ర‌మాదం అనుకుంటూ ప‌రుగులు పెడ‌తాడు.

ఆగ‌మేఘాల మీద గుడికి చేరిన ఆదిత్య అక్క‌డ రుక్మిణి, స‌త్య ఒక‌కి ఒక‌రు క‌నిపించేంత దూరంలో దీపాలు పెడుతుంటే చూసి ఆ ఇద్ద‌రికి అడ్డంగా నిల‌బ‌డ‌తాడు. `దీపాలు వ‌దిలేశావ్ క‌దా ఇక ఇంటికి ప‌దా అంటూ స‌త్య‌ని కంగారు పెడ‌తాడు. కారు ఎక్కి స‌త్య‌ని ఎక్క‌మంటాడు. ఈలోగా రుక్మిణి గ‌తంలో ఎక్కి వెళ్లిన కారు క‌నిపిస్తుంది. ఈ కారు ఇక్క‌డ వుందంటే అక్క ఇక్క‌డే వుండివుంటుంది అని ఆదిత్య‌కు చెప్ప‌కుండానే ప‌రుగులు పెడుతుంది. షాక్‌కు గురైన ఆదిత్య‌.. వెంట‌నే స‌త్య వెంట‌ప‌డ‌తాడు. గుడిలో రుక్మిణి కోసం వెతుకుతున్న స‌త్య‌కు తాను ఎదురుప‌డిందా?.. స‌త్య ఏం చేసింది? .. అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.