English | Telugu

"ముందు వంట‌ల‌క్క‌ను ద‌గ్గ‌ర‌కు తీసుకో".. కార్తీక్‌ను ర‌ఫ్ఫాడిన దీప ఫ్యాన్స్‌!

స్టార్ మాలో ప్ర‌సారం అవుతున్న 'కార్తీక దీపం' సీరియ‌ల్ మ‌హిళాలోకాన్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఇందులో న‌టించే నిరుప‌మ్‌, ప్రేమి విశ్వ‌నాథ్‌ల‌ని స్టార్‌ల‌ని చేసింది. మ‌రీ ముఖ్యంగా వంట‌ల‌క్క పాత్ర‌లో న‌టించిన ప్రేమి విశ్వ‌నాథ్ స్టార్ సెల‌బ్రిటీగా మారిపోయింది. సోష‌ల్ మీడియాలో ఆమె కోసం భారీ స్థాయిలో ఫ్యాన్స్ ప‌ని చేస్తున్నారు. ఆమెకు వ్య‌తిరేకంగా ఎలాంటి పోస్ట్ ప‌డినా వెంట‌నే ఏకిపారేస్తున్నారు.

తాజాగా డాక్ట‌ర్ బాబు పాత్ర‌లో న‌టించిన నిరుప‌మ్‌ని కూడా వ‌ద‌ల లేదు. సోమ‌వారం అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా మ‌హిళ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ నిరుప‌మ్ ఓ వీడియోను ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశాడు. "మీరు లేకుండా మేం లేమ‌ని తెలిసినా మిమ్మ‌ల్ని ఎంతో వేధిస్తుంటాం, ఏడిపిస్తూ వుంటాం. మీ ప‌ట్ల జంతువుల్లా ప్ర‌వ‌ర్తిస్తూ వుంటాం. అయినా ఓపిక‌తో భ‌రిస్తారు. ఎంతో స‌హ‌నంతో మ‌మ్మ‌ల్ని మార్చుకుంటారు. మార్పు మాలో రావాలి. మీకు మ‌రింత గౌర‌వం ద‌క్కాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటూ ప్ర‌పంచంలో వున్న వాళ్లంద‌రికీ హ్యాపీ ఉమెన్స్ డే."‌ అని వీడియోను పోస్ట్ చేశాడు నిరుప‌మ్‌.

ఈ వీడియోపై వంట‌ల‌క్క ఫ్యాన్స్ మామూలుగా రెస్పాండ్ అవ‌లేదు. "ముందు వంట‌ల‌క్క‌ని ద‌గ్గ‌ర‌కు తీసుకుని మ‌ళ్లీ మాట్లాడు.. ఇది ఓకే కానీ మీరు దీప‌ని ఎప్పుడు న‌మ్ముతారు? ఆమెను ఎప్పుడు చేర‌దీస్తారు?" అంటూ డాక్ట‌ర్ బాబుపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఈ కామెంట్స్‌కి స‌మాధానం చెప్ప‌లేక నిరుప‌మ్ గ‌ప్‌చుప్‌ అయిపోయాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.