English | Telugu

దీప తండ్రిపై కార్తీక్ దౌర్జ‌న్యం!

స్టార్ మాలో ప్ర‌సారం అవుతున్న 'కార్తీక దీపం' రోజుకో మ‌లుపు తిరుగుతోంది. ర‌స‌వ‌త్త‌రంగా సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల చేత కంట‌నీరు పెట్టిస్తోంది. డాక్ట‌ర్ బాబు మార‌డ‌ని తెలుసుకున్న దీప త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో సిటీ వ‌దిలి వెళ్లిపోతుంది. ఈ రోజు ఎపిసోడ్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా సాగ‌బోతోంది. వార‌ణాసి బంధువుల స‌హా‌యంతో ఓ పాత ఇంటిలో దీప‌ కొత్త కాపురం మొద‌లుపెడుతుంది.

రోడ్డు ప‌క్క‌న ఇడ్లీ బండి పెట్టుకుని జీవ‌నం సాగించాల‌ని నిర్ణ‌యించుకుంటుంది. ఇదిలా వుంటే దీప త‌న‌కు చెప్ప‌కుండా ఊరు వ‌దిలి వెళ్లిపోయింద‌ని ఆమె తండ్రి ముర‌ళీకృష్ణ క‌న్నీరు మున్నీర‌వుతుంటాడు. ఓ సంద‌ర్భంలో దీప పెళ్లి ఫొటోని క‌నిపించ‌కుండా డాక్ట‌ర్ బాబు ప‌క్క‌న ప‌డేసిన ఫొటోని చూస్తూ ముర‌ళీకృష్ణ బాధ‌ప‌డుతుంటాడు. ఇదే స‌మ‌యంలో అక్క‌డ‌కి ఎంట్రీ ఇచ్చిన డాక్ట‌ర్ బాబు ఫొటోని లాగి కింద‌ప‌డేస్తాడు. దీంతో ఆ ఫొటో అద్దం ముక్క‌ల‌వుతుంది.

ఊహించ‌ని ప‌రిణామానికి షాకైన ముర‌ళీకృష్ణ "డాక్ట‌ర్ బాబు ఏంటీ దైర్జ‌న్యం?" అంటూ ఆవేశంతో ఊగిపోతాడు. "ఆడ‌పిల్ల వాళ్లం క‌దా అని ఎప్పుడు ఏది అన్నా స‌హిస్తామ‌నుకుంటున్నావా.. మా స‌హ‌నానికి కూడా ఓ హ‌ద్దుంటుంది." అంటూ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తాడు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య దీప గురించి వాదోప‌వాదాలు జ‌రుగుతాయి. దీప ఎక్క‌డుందో చెప్ప‌మంటూ డాక్ట‌ర్ బాబు ముర‌ళీకృష్ణ‌ను నిల‌దీస్తాడు. ఎక్క‌డుందో నాకు తెలియ‌ద‌ని చెప్పినా న‌మ్మ‌క‌పోవ‌డంతో భాగ్యం వచ్చి ఆయ‌న చెప్పేది నిజ‌మే అంటుంది.

దాంతో అక్క‌డి నుంచి ఇంటికి వెళ్లిన డాక్ట‌ర్ బాబు ఏం చేశాడు? దీప ద‌గ్గ‌రి నుంచి హిమ డాక్ట‌ర్ బాబు ద‌గ్గ‌రికి వ‌చ్చేసిందా? వంటి విష‌యాలు తెలుసుకోవాంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.