English | Telugu

బంధం సేన బ‌ల‌వంతం.. అనుకి ఆర్య‌వ‌ర్ధ‌న్ తాళి క‌ట్టాడా?

జీ తెలుగులో ప్ర‌సారం అవుతున్న పాపుల‌ర్ టీవీ సీరియ‌ల్ 'ప్రేమ ఎంత మ‌ధురం'. గ‌త కొంత కాలంగా ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. ఆర్యవ‌ర్ధ‌న్‌ని అను నుంచి దూరం చేయాల‌ని అత‌ని ద‌గ్గ‌ర ప‌నిచేసే మీరా మాస్ట‌ర్ ప్లాన్ వేస్తుంది. ప్రేమికుల రోజు అనుని పార్క్‌కి ర‌ప్పించి అదే స‌మ‌యానికి అనుతో క‌లిసి సంప‌త్ వుండేలా చేస్తే నీ కొడుకు పెళ్లి అనుతో జ‌రిగేలా బంధం సేన చూసుకుంటుంద‌ని ర‌ఘురామ్‌కు స‌ల‌హా ఇస్తుంది.

అదే స‌మ‌యంలో అనుకి ఫోన్ చేసి పార్క్‌కి ర‌మ్మ‌ని రాంగ్ ఇన్‌ఫర్మేష‌న్ ఇస్తుంది. అలా ఆర్య‌వ‌ర్ధ‌న్‌కి తెలియ‌కుండా అనుని ప్రేమికుల పార్క్‌కి ర‌ప్పించిన మీరా అదే చోటికి ర‌ఘురామ్ త‌న కొడుకు సంప‌త్‌ని తీసుకొచ్చేలా చేస్తుంది. ఆ వెంట‌నే ర‌ఘురామ్‌తో బంధం సేన‌కు ఫోన్ చేయిస్తుంది మీరా. అయితే మీరా ప్లాన్ తెలియ‌క‌పోయినా మాన్సీ కాఫీలో నెయిల్ పాలిష్ క‌లిపి మీరా ఇల్లు క‌ద‌ల కుండా చేస్తుంది.

అను, ప‌క్క‌నే సంప‌త్ వుండేలా ప్లాన్ చేసిన మీరా, ర‌ఘురామ్.. బంధం సేన ఎంట్రీ ఇవ్వ‌డంతో ఇక ఖ‌చ్చితంగా అనుకి, సంప‌త్‌కి పెళ్లి జ‌ర‌గ‌డం ఖాయ‌మ‌ని సంబ‌ర‌ప‌డిపోతారు. ఇదే స‌మ‌యంలో ఆర్య‌‌వ‌ర్ధ‌న్ పార్క్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డం, సంప‌త్ బ‌య‌టికి రావ‌డంతో ర‌ఘురామ్ షాక్‌కు గుర‌వుతాడు. అను, ఆర్య‌వ‌ర్థ‌న్‌ల‌ని చూసిన బంధం సేన త‌మ‌ ముందే ఇద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌ని, అనుకి తాళికట్టాల‌ని ఫోర్స్ చేస్తుంది. ఈ నేప‌థ్యంలో అనుకి ఆర్య తాళి క‌ట్టాడా లేదా అన్న‌ది తెలియాలంటే ఈ రోజు రాత్రి 9 గంట‌ల‌కు ప్ర‌సారం అయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.