English | Telugu

"ఆ టైమ్‌లో వీడు నావాడు అనిపించింది".. ఇమ్మానుయేల్‌పై వ‌ర్ష కామెంట్‌!

ఈటీవీలో ప్ర‌సారం అవుతున్న కామెడీ షో 'ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌'. ఇంత వ‌ర‌కు ఈ షోని కొట్టే షో ఇంత వ‌ర‌కు రాక‌పోవ‌డం విశేషం. ఈ షోలో గ‌త ఏడేళ్లుగా టీవీ వీక్ష‌కుల్ని అల‌రిస్తూ ఎంట‌ర్‌టైన్ చేస్తున్నారు సుడిగాలి సుధీర్‌, ర‌ష్మిగౌత‌మ్‌. వీరి ల‌వ్ ట్రాక్ గురించి ఎన్ని సార్లు చ‌ర్చ‌ల్లో నిలిచినా మా ఇద్ద‌రి మ‌ధ్య వున్న‌ది స్నేహం మాత్ర‌మే అని కొట్టి పారేస్తుంటారు సుధీర్‌, ర‌ష్మి‌.

తాజాగా వీరి త‌ర‌హాలోనే వార్త‌ల్లో నిలుస్తున్న మ‌రో జ‌బ‌ర్ద‌స్త్ జోడీ వ‌ర్ష‌, ఇమ్మానుయేల్‌. వీరిద్ద‌రి మ‌ధ్య స్టేజ్‌పై పండే రొమాన్స్ అంతా ఇంతా కాదు. వ‌ర్ష‌ని రోజా అడిగిన ప్ర‌తీసారి "రంగుదేముందు మేడ‌మ్ మ‌న‌సు ముఖ్యం గానీ" అంటూ వ‌ర్ష.. ఇమ్మానుయేల్‌ని స‌పోర్ట్ చేయ‌డం.. ఆ స‌మాధానానికి రోజా షాక్ కావ‌డం జ‌రుగుతూనే వుంది. తాజాగా వ‌ర్ష చెప్పిన ఓ మాట విని ఈ షోకు జ‌డ్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌రోజా మ‌రోసారి షాక్‌కు గురయ్యారు.

"మేడ‌మ్ నేనొక‌టి చెప్పాలి. యూట్యూబ్‌లో ఎవ‌రో చ‌నిపోయార‌ని స్క్రోలింగ్ వ‌చ్చింది." అని వ‌ర్ష చెప్పింది. "వ‌ర్ష బిల్డింగ్ మీద నుంచి దూకి సూసైడ్ చేసుకుంది అని రాశారు." అని ఇమ్మానుయేల్ అందుకున్నాడు. "నైట్ టైమ్ ఫోన్ చేసి, వ‌ర్షా ఎక్క‌డున్నావ్‌? నువ్వు బాగానే ఉన్నావా?.. అని అడిగాడు." అని చెప్పింది వ‌ర్ష‌. "నీ ప్రాణం గిల‌గిల్లాడిపోయిందా?" అన‌డిగారు రోజా.

"కానీ నాకోటి అనిపించింది మేడ‌మ్‌.. నాకోసం వీడు ఇంత ఆలోచించాడా.." అని చెప్పింది వ‌ర్ష‌. "నిజ‌మైన ప్రేమ" అని కాంప్లిమెంట్ ఇచ్చారు రోజా. దాంతో వ‌ర్ష సిగ్గుల మొగ్గ‌యింది. "ఆ టైమ్‌లో వీడు నావాడు అనిపించింది." అని బ‌య‌ట‌పెట్టేసింది. దాంతో "ఆ.." అని ఆశ్చ‌ర్యంగా నోరు తెరిచేశాడు ఇమ్మానుయేల్‌. "అరెరెరే.." అని న‌వ్వారు రోజా. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.