Read more!

English | Telugu

"ఆ టైమ్‌లో వీడు నావాడు అనిపించింది".. ఇమ్మానుయేల్‌పై వ‌ర్ష కామెంట్‌!

 

ఈటీవీలో ప్ర‌సారం అవుతున్న కామెడీ షో 'ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌'. ఇంత వ‌ర‌కు ఈ షోని కొట్టే షో ఇంత వ‌ర‌కు రాక‌పోవ‌డం విశేషం. ఈ షోలో గ‌త ఏడేళ్లుగా టీవీ వీక్ష‌కుల్ని అల‌రిస్తూ ఎంట‌ర్‌టైన్ చేస్తున్నారు సుడిగాలి సుధీర్‌, ర‌ష్మిగౌత‌మ్‌. వీరి ల‌వ్ ట్రాక్ గురించి ఎన్ని సార్లు చ‌ర్చ‌ల్లో నిలిచినా మా ఇద్ద‌రి మ‌ధ్య వున్న‌ది స్నేహం మాత్ర‌మే అని కొట్టి పారేస్తుంటారు సుధీర్‌, ర‌ష్మి‌.

తాజాగా వీరి త‌ర‌హాలోనే వార్త‌ల్లో నిలుస్తున్న మ‌రో జ‌బ‌ర్ద‌స్త్ జోడీ వ‌ర్ష‌, ఇమ్మానుయేల్‌. వీరిద్ద‌రి మ‌ధ్య స్టేజ్‌పై పండే రొమాన్స్ అంతా ఇంతా కాదు. వ‌ర్ష‌ని రోజా అడిగిన ప్ర‌తీసారి "రంగుదేముందు మేడ‌మ్ మ‌న‌సు ముఖ్యం గానీ" అంటూ వ‌ర్ష.. ఇమ్మానుయేల్‌ని స‌పోర్ట్ చేయ‌డం.. ఆ స‌మాధానానికి రోజా షాక్ కావ‌డం జ‌రుగుతూనే వుంది. తాజాగా వ‌ర్ష చెప్పిన ఓ మాట విని ఈ షోకు జ‌డ్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌రోజా మ‌రోసారి షాక్‌కు గురయ్యారు.

"మేడ‌మ్ నేనొక‌టి చెప్పాలి. యూట్యూబ్‌లో ఎవ‌రో చ‌నిపోయార‌ని స్క్రోలింగ్ వ‌చ్చింది." అని వ‌ర్ష చెప్పింది. "వ‌ర్ష బిల్డింగ్ మీద నుంచి దూకి సూసైడ్ చేసుకుంది అని రాశారు." అని ఇమ్మానుయేల్ అందుకున్నాడు. "నైట్ టైమ్ ఫోన్ చేసి, వ‌ర్షా ఎక్క‌డున్నావ్‌? నువ్వు బాగానే ఉన్నావా?.. అని అడిగాడు." అని చెప్పింది వ‌ర్ష‌. "నీ ప్రాణం గిల‌గిల్లాడిపోయిందా?" అన‌డిగారు రోజా. 

"కానీ నాకోటి అనిపించింది మేడ‌మ్‌.. నాకోసం వీడు ఇంత ఆలోచించాడా.." అని చెప్పింది వ‌ర్ష‌. "నిజ‌మైన ప్రేమ" అని కాంప్లిమెంట్ ఇచ్చారు రోజా. దాంతో వ‌ర్ష సిగ్గుల మొగ్గ‌యింది. "ఆ టైమ్‌లో వీడు నావాడు అనిపించింది." అని బ‌య‌ట‌పెట్టేసింది. దాంతో "ఆ.." అని ఆశ్చ‌ర్యంగా నోరు తెరిచేశాడు ఇమ్మానుయేల్‌. "అరెరెరే.." అని న‌వ్వారు రోజా. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైర‌ల్‌గా మారింది.