English | Telugu
'జబర్దస్త్' కమెడియన్స్ పారితోషికాలు మరీ ఇంత తక్కువా?!
Updated : Mar 18, 2021
ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ నలు మూలల్లో వున్న తెలుగు వాళ్లని కడుపుబ్బా నవ్విస్తూ ఎంటర్టైన్ చేస్తున్న షో 'జబర్దస్త్'. ఈ కామెడీని షోని కొట్టే షో ఇంత వరకు రాలేదంటే దీని ప్రత్యేకత ఏంటో అర్థం చేసుకోవచ్చు. అంతలా పాపులారిటీని సొంతం చేసుకుని ఇప్పటికీ టాప్ పొజీషన్లో కొనసాగుతోంది. ఈ షోని చూసి హాయిగా నవ్వుకుని ట్రెస్ రిలీఫ్ ఫీలయ్యే హాస్య ప్రియులు ఎందరో వున్నారు.
ఈ షో వల్ల పాపులర్ అయి సినిమాల్లో అవకాశాల్ని సొంత చేసుకున్న వాళ్లే కాకుండా బిగ్ బాస్ హౌస్లో ప్రవేశించిన వాళ్లూ వున్నారు. గెటప్ శ్రీను, ముక్కు అవినాష్, సుడిగాలి సుధీర్, రామ్ ప్రసాద్, హైపర్ ఆది, షేకింగ్ షేషు, శాంతి స్వరూప్.. ఇలా చాలా మందే వున్నారు. అయితే 'జబర్దస్త్' షో కు భారీ స్థాయిలో టీఆర్పీ వస్తుండటంతో వీరి పారితోషికాలు కూడా భారీ స్థాయిలోనే వుంటాయని బయట టాక్.
అయితే అందులో నిజం లేదని లేడీ క్యారెక్టర్స్తో నవ్వించే శాంతి స్వరూప్ చెబుతున్నాడు. లక్షల్లో పారితోషికాలు అన్నది టీమ్ లీడర్లకి తప్ప మిగతా వారికి లేవని, 5 వేలు, మూడు వేలు, 2500లకు కూడా స్కిట్లు చేస్తున్న వాళ్లు కూడా వున్నారని, ఒక్కో సందర్భంలో టీవీలో కనిపిస్తే చాలని ఫ్రీగా కూడా స్కిట్లు చేసిన వాళ్లు కూడా ఇక్కడ వున్నారని షాకింగ్ నిజాలు తాజాగా బయటపెట్టాడు.