English | Telugu

 హిమ‌తో డ్రీమ్ సాంగ్ వేసుకున్న ప్రేమ్‌!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొంత కాలంగా చిత్ర విచిత్ర‌మైన మ‌లుపుల‌తో సాగుతున్న ఈ సీరియ‌ల్ ప్ర‌స్తుతం కొంత ప‌ట్టుని కోల్పోయింది. వంట‌ల‌క్క కార‌ణంగా టాప్ 1 రేటింగ్ తో రికార్డు సృష్టించిన ఈ సీరియ‌ల్ మ‌ళ్లీ ఆ మార్కుని అందు కోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది కానీ వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు. ఇక తాజా ఎపిసోడ్ వివ‌రాల్లోకి వెళ‌దాం. క‌ళ్లు తిరిగి ప‌డిపోవ‌డంతో శౌర్య‌ని నిరుప‌మ్ ఎత్తుకుని తీసుకెళుతూ వుంటాడు. మ‌ధ్య‌లో క‌ళ్లు తెరిచి చూసిన శౌర్య‌ని నిరుప‌మ్ చూసి ఏంటీ మెల‌కువ వ‌చ్చిందా? అంటాడు.

ఆ త‌రువాత అంతా ఇంటికి వెళ‌తారు. సోఫాపై శౌర్య‌ని నిరుప‌మ్ ప‌డుకోబెడ‌తాడు. వెంట‌నే లేచి కూర్చున్న శౌర్య ఎదురుగా కూర్చున్న నిరుప‌మ్ ని చూస్తుంది. నిన్ను మోసి అల‌సిపోయాడ‌ని సౌంద‌ర్య అంటుంది. బాధ్య‌త‌గా కాకుండా తిడుతూ మోయ‌డం ఎందుకు అంటూ చిరాగ్గా శౌర్య గ‌దిలోకి వెళ్లిపోతుంది. క‌ట్ చేస్తే.. హిమ చీర క‌ట్టుకుని త‌ల స్నానం చేసి కురులు ఆర‌బెట్టుకుంటూ వుంటుంది. అప్పుడే ప్రేమ్ ఎంట్రీ ఇస్తాడు. హిమ‌ని అలా చూసి త‌న‌ని తాను మ‌రిచిపోతాడు. వెంట‌నే డ్రీమ్ లోకి వెళ్లి సాంగ్ వేసుకుంటాడు.

క‌ట్ చేస్తే డాక్ట‌ర్ గా జ‌బ‌ర్ద‌స్త్ ఫేమ్ రైజింగ్ రాజు ఎంట్రీ.. శౌర్య‌కు జ్వ‌రంగా వుంద‌ని పిల‌వ‌డంతో వ‌చ్చి రచ్చ ర‌చ్చ చేస్తాడు. శౌర్య‌కు జ్వ‌రం త‌గ్గిందంటాడు. అయితే హిమ మాత్రం అది వైర‌ల్ ఫీవ‌ర్ అని వారం వ‌ర‌కు త‌గ్గ‌ద‌ని చెబుతుంది. నాక‌న్నా నీకు ఎక్కువ తెలుసా? అంటూ రైజింగ్ రాజు హిమ‌తో గొడ‌వ‌కు దిగుతాడు. నానా యాగీ చేసి అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు.. త‌రువాత హిమ వెళ్లి శౌర్య టెంప‌రేచ‌ర్ చెక్ చేస్తానంటుంది. లేని ప్రేమ‌ని న‌టించ‌డం ఎందుకు అంటూ శౌర్య అన‌డంతో ఫీలైన హిమ బ‌య‌టికి వెళ్లి ఏడుస్తూ వుంటుంది. క‌ట్ చేస్తే నిరుప‌మ్‌, హిమ మాట్లాడుకోవ‌డం గ‌మ‌నించిన శౌర్య ఇంట్లోంచి వెళ్లిపోవాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది. ఆ త‌రువాత ఏంజ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.