English | Telugu

"అది గూండా రాజ్యంలా క‌నిపిస్తోంది".. నటి కస్తూరి ట్వీట్ వైరల్!

ఒకప్పటి హీరోయిన్, నేటి బుల్లితెర నటి కస్తూరి శంకర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. సామాజిక అంశాలు, ప్రజలకు జరిగే అన్యాయాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తుంటారు. రాజకీయ విశ్లేషణలు కూడా చేస్తుంటారు. స్వతహాగా లాయర్ కావడంతో అన్ని విషయాలపై సమగ్ర అవగాహనతో మాట్లాడుతుంటారు. కస్తూరి శంకర్ చేసే కామెంట్స్ ఒక్కోసారి వివాదాలకు దారి తీస్తుంటాయి.

తాజాగా కస్తూరి శంకర్ పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఘటనపై స్పందించారు. బెంగాల్ లో ఎన్నికల తరువాత కూడా హింస యథేచ్ఛగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అక్కడ జరిగే గొడవలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పశ్చిమ మిడ్నాపూర్ లో కేంద్రమంత్రి మురళీధరన్ పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొందరు దుండగులు విదేశాంగశాఖ సహాయమంత్రి కాన్వాయ్ పై రాళ్లతో, కర్రలతో దాడి చేశారు.

ఈ ఘటనపై నటి కస్తూరి ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రమంత్రి పరిస్థితే ఇలా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంతోమంది సెక్యూరిటీతో వచ్చే కేంద్ర మంత్రికే ఇలా జరిగితే.. వారి కింద పని చేసే నాయకులు, పార్టీ కార్యకర్తల పరిస్థితేంటో ఊహించుకోలేకపోతున్నానని అన్నారు. వాళ్లు అసలు మనుషులేనా.. గూండా రాజ్యంలా కనిపిస్తోందంటూ కస్తూరి ఫైర్ అయింది. ప్రస్తుతం ఈమె 'గృహ‌ల‌క్ష్మి' అనే సీరియల్ లో నటిస్తోంది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.