English | Telugu

జూన్ 13 నుంచి న్యూ సీరియల్ 'కోడళ్ళు మీకు జోహార్లు'

జీ తెలుగులో ప్రసారం కాబోయే కొత్త సీరియల్ "కోడళ్ళు మీకు జోహార్లు " టైమింగ్, లాంచింగ్ డేట్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 3.30 గంటలకు రాబోతోంది. దీపావళి కొందరిని విడదీసింది.. కొందరిని కలిపింది. ఐతే అందర్నీ విడదీసిన దీపావళి 14 ఏళ్ళ తర్వాత వాళ్ళ జీవితాల్లో వెలుగును నింపుతుందా.. సంతోషాన్ని పంచుతుందా చూడాల్సిందే అనే సీరియల్ ప్రోమో సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.

హీరోగా నాగార్జున యాక్ట్ చేస్తున్నాడు. ఇతను ఇంతకుముందు 'కస్తూరి' సీరియల్ లో పరం అనే పాత్రలో నటించి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ సీరియల్ లో కనిపించబోతున్నాడు. హీరోయిన్స్ గా దుర్గశ్రీ, కౌస్తుభ మణి నటిస్తున్నారు. దుర్గశ్రీ ఇది వరకు ఉదయ టీవీలో ప్రసారమైన 'నేత్రావతి' అనే సీరియల్ లో నటించారు. ఇక కౌస్తుభ మణి కలర్స్ కన్నడలో 'నన్నరాసి రాధే' అనే సీరియల్ లో ఇంచరా అనే పాత్రలో యాక్ట్ చేశారు.

ఈ సీరియల్ లో ఇంకా చరణ్ రాజ్ ఒక పాత్రలో కనిపించనున్నాడు. అతను 'వదినమ్మ' సీరియల్ లో భరత్ అనే పాత్రలో యాక్ట్ చేశారు. 'నిన్నే పెళ్ళాడతా', 'స్వర్ణ పేలెస్' అనే సీరియల్స్ లో నటించిన జయరాం పవిత్ర ఈ సీరియల్ లో అత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ సీరియల్ లో మెయిన్ గా ఆనాటి అందాల నటి రాగిణి తల్లి కేరెక్టర్ లో కనిపించనున్నారు. ఈమె గురుంచి చెప్పాలంటే ఎన్నో సినిమాల్లో, సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ప్రేమ్ సాగర్ ఒక రోల్ లో నాగార్జునకు తల్లి పాత్రలో జానకి వర్మనటిస్తున్నారు.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.