English | Telugu

గంట వరకు ఇంద్రజతో లిఫ్ట్ లో గేమ్ ఆడిన నరేష్... పవిత్ర మిసింగ్!

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ ఎపిసోడ్ ని కృష్ణ జన్మాష్టమి స్పెషల్ గా తీర్చిదిద్దారు. ఇక ఈ షోకి నిజంగానే కృష్ణుడిని పట్టుకొచ్చారు అదేనండి సీనియర్ నటుడు, విజయ నిర్మల సుపుత్రుడు నరేష్. ఐతే ఏ షోకైనా నరేష్ తో కలిసి పవిత్ర ఎంట్రీ ఇస్తుంది కానీ ఈ షోలో సింగల్ గా వచ్చాడు నరేష్. వీరాంజనేయులు విహార యాత్ర మూవీ టీమ్ వచ్చింది. ఇక షోలో నరేష్ చేసిన అల్లరి పనులు మాములుగా లేవు సుమీ..షోకి రావడం రావడమే ఇంద్రజని కూడా పడగొట్టే పనిలో పడ్డాడు. నరేష్ తమ్ముడు మహేష్ బాబు నటించిన పోకిరి మూవీలో లిఫ్ట్ సీన్ ని నరేష్, ఇంద్రజ కలిసి రిక్రియేట్ చేశారు. ఇంద్రజ, నరేష్ లిఫ్ట్ లో ఎక్కేసరికి లిఫ్ట్ ఆగిపోతుంది.

గంట వరకు లిఫ్ట్ లోనే ఉండాల్సి వస్తుంది అని చెప్తారు. దాంతో ఇంద్రజ తెగ ఫీలైనట్టు నటించింది. ఇక తర్వాత ఇంద్రజ అడిగింది "ఎవరినైనా లవ్ చేస్తున్నారా అని..మరి నువ్వు" అని రివర్స్ లో అడిగాడు నరేష్. "నచ్చినోళ్ళు ఇంకా దొరకలేదు" అని చెప్పింది " ఎం కావాలేంటి" అని అడిగాడు నరేష్. "బాగా చదువుకుని పెద్ద జాబ్ చేస్తూ మంచివాడిగా ఉండాలి" అని చెప్పింది. ఇక నరేష్ "ఛీ" అన్నాడు. ఇంద్రజ వేసుకొచ్చిన సెంట్ స్మెల్ పీలుస్తూ ఆమె మీదకు వెళ్తుండేసరికి ఇంద్రజ తల దించేసుకుంది. "సెంట్ స్మెల్ బాగుంది" అన్నాడు. "అది హెయిర్ స్ప్రే..నా దగ్గర ఇంకా టు త్రి ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి " అని ఆన్సర్ ఇచ్చింది ఇంద్రజ. "ఒకటిస్తారా..ఒకటిస్తారా" అని అదేపనిగా అడిగాడు నరేష్. అలా ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇంద్రజ, నరేష్ కలిసి ఆడియన్స్ ని అలరించబోతున్నారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.