English | Telugu
దీప కోసం మురళీకృష్ణ తీసుకున్న నిర్ణయం ఏంటీ?
Updated : Mar 24, 2021
`కార్తీక దీపం` రసవత్తర మలుపులు తిరుగుతూ క్రమ క్రమంగా ఎండింగ్ స్టేజ్కి వచ్చేస్తోంది. గత నాలుగేల్లుగా కంటిన్యూ అవుతున్న సస్పెన్స్కి త్వరలో తెర పడబోతోంది. తన భర్తని, తండ్రిని, అత్తని కాదని పిల్లలతో ఊరు వదిలి వెళ్లిన దీప మరో చోట కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. కొత్తగా టిఫిన్ సెంటర్ని ప్రారంభిస్తుంది. దీపని వెతుక్కుంటూ వచ్చిన మురళీకృష్ణ అదే టిఫిన్ పాయింట్ వద్దకు వచ్చి దీప కోసం ఆరా తీస్తాడు.
ఇంతలో దీప ఆటోలో వచ్చి మురళీ కృష్ణకు కనిపిస్తుంది. ఎలాంటి ఇంటి కోడలివి ఇలా వుండటం ఏంటమ్మా. రామ్మా మనింటికి పోదాం అంటాడు మురళీకష్ణ. నాకు ఇల్లు ఎక్కడుంది నాన్నా ఖాలీ చేశానుగా అంటుంది దీప. నీకు పుట్టిల్లుంది, మెట్టినిల్లుంది.. నీకు ఏ ఇల్లు కావాలంటే ఆ ఇంట్లో వుండు.. కానీ నువ్వు రావడమే అందరికి ముఖ్యం` అంటాడు మురళీకృష్ణ. ఆ అందరిలో నా భర్త లేడు కదా నాన్నా అంటుంది దీప. ఇంతలో సౌందర్య.. మురళీకృష్ణకు ఫోన్ చేస్తుంది. దీప కనిపించిందా? కనిపించినా రానంటోందా? అని అడుగుతుంది. ఈ లోగా తను కనిపించిన విషయం సౌందర్యకు చెప్పొద్దని ఒట్టు వేయించుకుంటుంది. దీంతో తను ఇంకా కనిపించలేదని చెబుతాడు మురళీకృష్ణ.
ఏడుస్తూనే ఫోన్ పెట్టేస్తాడు. నా భర్తే స్వయంగా వచ్చి పిలిచేంత వరకు నేను రానని చెబుతుంది దీప. దీంతో మురళీకృష్ణ ఓ నిర్ణయం తీసుకుంటాడు. తను తీసుకున్న నిర్ణయం ఏంటీ? అందుకు దీప ఎలా స్పందించింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.