English | Telugu

అనసూయకి నిజం చెప్పేసిన  కార్తీక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -135 లో.... శౌర్య కోసం టాబ్లెట్స్ తీసుకొని వస్తుంది అనసూయ. ఈ టాబ్లెట్స్ చిన్న పిల్లల గుండె సమస్యలు ఉంటే వాడుతారని చెప్పారు. శౌర్యకి ఏం సమస్య ఉందని ఆలోచిస్తూ అనసూయ వస్తుంటే.. అప్పుడే నర్సింహా ఎదరుపడతాడు. నీ కోసమే వస్తున్నాను.. నువ్వే వస్తున్నావని నర్సింహా అంటాడు. మనం ఊరు వెళ్లి, ఇల్లు అమ్మాలి నీకు రెండు లక్షలు ఇస్తాను. మిగతా డబ్బులు ఆ శోభ మోహన కొడతానని నర్సింహా అనగానే.. అది దీప ఇల్లు దానికే హక్కు ఉంటుంది. దాని జోలికి రాకని నర్సింహాకీ అనసూయ వార్నింగ్ ఇస్తుంది.

అప్పుడే కార్తీక్ వచ్చి‌.మ నీకు సిగ్గు అనేదే లేదా అంటూ కోప్పడతాడు. మా మధ్య నువ్వేంటి అంటూ నర్సింహా అంటాడు. మీరు ఎవర్ని చూసుకొని ఇలా చేస్తున్నారో అర్థం అయింది. ఇల్లు ఎలా నా సొంతం చేసుకుంటానో చూడు అంటూ నరసింహా వెళ్ళిపోతాడు. ఈ టాబ్లెట్స్ తీసుకోవడానికి వెళ్ళారా అని కార్తీక్ అడుగుతాడు. ఈ టాబ్లెట్ ఎందుకు వాడుతారు బాబు నిజం చెప్పండి అని అనసూయ అడుగుతుంది. నరసింహకు భయపడి శౌర్య కళ్ళు తిరిగి పడిపోతే.. హాస్పిటల్ లో డాక్టర్ శౌర్య గుండె వీక్ ఉందని చెప్పారని అనగానే అనసూయ షాక్ అవుతుంది. దీనికి పరిష్కారం మందులు వాడడమేనని కార్తీక్ అంటాడు. మరొకవైపు స్వప్న, కాశీలు స్కూటీ పై సరదాగా వెళ్తుంటారు. మన విషయం మీ ఇంట్లో తెలిసింది కదా అని కాశీ అంటాడు. మా అమ్మకి తెలిసిందని స్వప్న అంటుంది. ఇక ఎప్పుడో మీ నాన్నకి కూడా తెలుస్తుందని కాశీ అంటాడు. అప్పుడే స్వప్న, కాశీలని శ్రీధర్ చూస్తాడు.

ఆ తర్వాత అనసూయని తీసుకొని కార్తీక్ ఇంటికి వస్తాడు. మీరు ఈ విషయం దీపకి చెప్పకండి.. శౌర్యని చూసుకునే బ్రతుకుతుందని కార్తీక్ అంటాడు. మీకు దీప ఏమవుతుందని ఇంత అభిమానం చూపిస్తున్నారని అనసూయ అడుగుతుంది. నాకు శౌర్యని చూస్తే ఏదో తెలియని హ్యాపీ.. తన కోసమే ఇదంతా.. తనకి ఎప్పుడు తోడుగా ఉంటానని కార్తీక్ అంటాడు. ఈ విషయం దీపకి చెప్పకండి అని కార్తీక్ అనగానే.. అప్పుడే దీప వచ్చి ఏ విషయమని అడుగుతుంది. దార్లో నరసింహ కలిసాడు.. ఇల్లు కావాలట అని చెప్తుంది. మీరు రేపు ఊరు వెళ్లి.. వెంటనే ఆ ఇల్లు దీప పేరున చెయ్యండి అని కార్తీక్ అనగానే.. అనసూయ సరే అంటుంది. ఆ తర్వాత శౌర్యతో కార్తీక్ సరదాగా మాట్లాడతాడు. అదంతా పై నుండి జ్యోత్స్న చూస్తుంటుంది.. సుమిత్ర దగ్గరికి కార్తీక్ వస్తాడు. మంచి సలహా ఇచ్చావ్ దీపకీ అని సుమిత్ర అంటుంది. అప్పుడే జ్యోత్స్న వచ్చి ఇండైరెక్ట్ గా దీప గురించి మాట్లాడుతుంది. ఆ తర్వాత రేపు త్వరగా రండి అని సుమిత్ర కార్తీక్ కి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.