English | Telugu

పోలీసుల‌కు చిక్కిన జ్వాల, హిమ‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొంత కాలంగా బుల్లితెర వీక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ దేశవ్యాప్తంగా అత్య‌ధిక టీఆర్పీ రేటింగ్ ని సొంతం చేసుకున్న సీరియ‌ల్ గా రికార్డు సాధించింది. అయితే గ‌త కొంత కాలంగా క‌థ గాడి త‌ప్ప‌డంతో ఈ సీరియ‌ల్ పై వున్న క్రేజ్ కాస్త త‌గ్గిపోయింది. దీంతో ప్ర‌ధాన పాత్ర‌లైన వంట‌ల‌క్క‌, డాక్ట‌ర్ బాబు పాత్ర‌ల‌నిఎండ్ చేసేసి కొత్త జ‌న‌రేష‌న్ తో క‌థ‌ని గాడిలో పెట్టాల‌నిద‌ర్శ‌కుడు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు.

కానీ ఈ క‌థ మ‌ళ్లీ గాడిలో ప‌డ‌టం ఇక క‌ష్ట‌మ‌నే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. క‌థ‌. క‌థ‌నాలు ఆక‌ట్టుకునే స్థాయిలో లేక‌పోవ‌డం, మ‌న‌సుని హ‌త్తుకునే పాత్ర‌లు లేక‌పోవ‌డంతో ఈ సీరియ‌ల్ ఏదో న‌డుస్తోంది అంటే న‌డుస్తోంది అన్న‌ట్టుగా సాగుతోంది. హిమ‌, శౌర్య‌ల పాత్ర‌ల‌తో క‌థ‌ని న‌డిపిస్తున్నాడు ద‌ర్శ‌కుడు. ఈ మంగ‌ళ‌వారం ఎపిసోడ్ కాస్త ఆస‌క్తిగా సాగ‌బోతోంది. జ్వాల గా పేరు మార్చుకున్న శౌర్య త‌న‌ని బాగా చూసుకుంటుంద‌ని హిమ సంతోష‌ప‌డుతూ వుంటుంది. అంతే కాకుండా ఐయామ్ తింగ‌రి అంటూ గంతులేస్తూ వుంటుంది.

క‌ట్ చేస్తే.. త‌మ‌ ఇంట్లో నుంచి వెళ్లిపోయిన శౌర్య కోసం హిమ వెతుకుతోంద‌ని, ఆమెకు త‌ను కూడా స‌హాయం చేస్తున్నాన‌ని, మీరు ఎందుకు దీని గురించి ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆనంద‌రావుని నిరుప‌మ్ అడుగుతాడు. శౌర్య మ‌న‌కు దొర‌క‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకుందేమోన‌ని నా అనుమానం అంటాడు. క‌ట్ చేస్తే.. హిమ‌, నిరుప‌మ్ లు జ్వాల ద‌గ్గ‌రికి వ‌స్తారు. 'నీ హుషారు కొంచెం హిమ‌కు కావాలి. అందుకే హిమ‌ని నీతో తిప్పుకో, నీలా మార్చు' అంటాడు. ఇదిలా వుంటే ఆటో రెన్యువ‌ల్ కోసం వెళ్లిన జ్వాల‌, హిమ పోలీసుల‌కు అడ్డంగా దొరికిపోతారు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది?.. వీళ్ల కోసం నిరుప‌మ్ ఏం చేశాడు అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.