Read more!

English | Telugu

ర‌విని "జ్వ‌రం కావాలా?" అని అడిగిన లాస్య‌!

 

యాంక‌ర్ ర‌వి, లాస్య ఇద్ద‌రూ క‌లిసి గ‌త కొన్నేళ్ల క్రితం మా మ్యూజిక్‌లో 'స‌మ్‌థింగ్ స్పెష‌ల్‌' ప్రోగ్రామ్ ద్వారా కెరీర్ ప్రారంభించారు. ఆ త‌రువాత కొన్నాళ్ల పాటు వీరి యాంక‌రింగ్ జ‌ర్నీ విజ‌య‌వంతంగా సాగుతూ వ‌చ్చింది. అయితే ఇద్ద‌రి మ‌ధ్య ఏదో జ‌రుగుతోందంటూ వ‌రుస ప్ర‌చారాలు మొద‌లు కావ‌డం.. కొన్ని సంద‌ర్భాల్లో ర‌వి ప్ర‌వ‌ర్త‌న న‌చ్చ‌క‌పోవ‌డంతో ర‌వితో క‌లిసి యాంక‌రింగ్ చేయ‌డానికి నిరాక‌రించి గుడ్ బై చెప్పింది లాస్య.

దాదాపు ఐదేళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ వీరిద్ద‌రు స్టార్ మా కోసం 'ఫ్యామిలీ పార్టీ' షోలో క‌లిశారు. ఇద్ద‌రూ క‌లిసి యాంక‌రింగ్ చేయ‌డం మొద‌లుపెట్టారు. ఆ ఇద్ద‌రి మ్యాజిక్ చిన్నితెర‌పై మ‌రోసారి అల‌రిస్తోంది. తాజాగా ఈ ఆదివారం మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు ప్ర‌సారం కానున్న 'కామెడీ స్టార్స్‌' షోలో పాల్గొంటున్నారు. 'ఉప్పెన‌' థీమ్‌తో సాగే ఈ షోలో "జ‌ల జ‌ల జ‌ల‌పాతం నువ్వు.." అంటూ సాగే పాట‌కు స్టెప్పులేశారు.

"జ్వ‌రం కావాలా ఆశీ" అంటూ ర‌విని అడిగిన లాస్య‌, "మా తా‌త‌య్య‌కు వాడిన సూది ఇది. దీంతో జ్వ‌ర‌మేంటి... ద‌గ్గు, జ‌లుబూ అన్నీ వ‌చ్చేస్తాయి." అన‌గానే ర‌వి బిత్త‌ర బిత్త‌ర‌గా చూడ‌టం.. లాస్య ప‌క ప‌కా న‌వ్వ‌డం ఆక‌ట్టుకుంటోంది. ఈ షోకి సంబంధించిన ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తూ న‌వ్వులు పూయిస్తోంది.