English | Telugu

టెస్టుల‌కు వెళ్లిన డాక్ట‌ర్ బాబు.. దీప‌కు మాయ‌దారి రోగం!

'కార్తీక దీపం'ఈ రోజు 994వ ఎపిసోడ్‌లోకి ఎంట‌ర‌వుతోంది. గ‌త నాలుగేళ్ల నుంచి మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న ఈ పాపుల‌ర్ సీరియ‌ల్ తాజాగా రోజుకో మ‌లుపులు తిరుగుతూ ఎండింగ్‌కి చేరువ అవుతోంది. ఈ రోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చూద్దాం. హిమ దొరికిందంటూ ఓ మెడిక‌ల్ షాప్ వ్య‌క్తి ఫోన్ చేయ‌డంతో మోనిత త‌న కోసం బ‌య‌లుదేరుతుంది.

క‌ట్ చేస్తే .. దీప వంట గ‌దిలో ద‌గ్గుతూ వుంటుంది. "దేవుడా ఈ మాయ‌దారి రోగం న‌న్ను పీల్చి పిప్పి చేస్తోంది. భ‌గ‌వంతుడా నాకు ఏదైనా అయితే.. నేనే పోతే నా పిల్ల‌లు అనాథ‌లైపోతారు. దేవుడా నా ఆరోగ్యం బాగుండాలి." అంటూ ఏడుస్తుంటుంది. ఇంత‌లో పిల్ల‌లు దీప ఏడ్వ‌డం చూసి "ఏంట‌మ్మా ఏడుస్తున్నావ్ నాన్న గుర్తొచ్చాడా?" అంటారు. అప్పుడే సంతాన ల‌క్ష్మి వ‌చ్చి పిల్ల‌ల‌కు స్వీట్స్ ఇచ్చి వెళుతుంది... ఇదిలా వుంటే కార్తీక్ త‌ను టెస్ట్‌కి వెళుతున్న విష‌యం చెప్ప‌డానికి మోనిత ఇంటికి వెళ‌తాడు. ప్రియ‌మ‌ణి వుండ‌టం చూసి మోనిత ఫోన్ చేస్తే విష‌యం చెప్ప‌మంటాడు.

హిమ‌ని మోనిత వెత‌క‌డం మొద‌లుపెడుతుంది. ఇదే స‌మ‌యంలో హిమ‌ని తీసుకుని వార‌ణాసి జాత‌ర‌కు వెళ‌తాడు. మ‌రోవైపు దీపని వెతుక్కుంటూ వెళ్లిన‌ ముర‌ళీకృష్ణ ఓ టిఫిన్ సెంట‌ర్ వ‌ద్ద ఆగి ఇడ్లీ ఆర్డ‌ర్ చేస్తాడు. చెట్ని టేస్ట్ చేయ‌గానే ముర‌ళీకృష్ణ‌కు దీప గుర్తొస్తుంది. వెంట‌నే "ఈ టిఫిన్ సెంట‌ర్ ఎవ‌రిది?" అని అడ‌గ‌డంతో వార‌ణాసి బంధువు అప్పుడే వ‌స్తున్న దీప‌ని చూపిస్తాడు. తండ్రిని చూసిన దీప షాకవుతుంది. ఈ ఇద్ద‌ర్నీ చూసిన మోనిత ఎలా రియాక్ట్ అయింది? .. ఆత‌రువాత ఏం చేసింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.