English | Telugu

Karthika Deepam 2: కలిసిపోయిన ఆ ఇద్దరు.. శివన్నారాయణ‌ ఒప్పుకుంటాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2 ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -172 లో.....పూజ మా ఇంట్లో జరగాలని సుమిత్ర అనగానే.. మిమ్మల్ని ఇద్దరిని మా ఇంట్లో కలపాలనుకున్న కానీ అమ్మావారి సంకల్పం వేరేలా ఉందని దీప అనుకుంటుంది. అదంతా వింటున్న జ్యోత్స్న, పారిజాతంలు పక్కకి వెళ్లి.. అసలు మళ్ళీ దీప ఏం ప్లాన్ చేసిందనుకుంటారు. ఆ దీప ఏం చేసిందో కచ్చితంగా.‌ నువ్వు తెలుసుకోమని పారిజాతానికి జ్యోత్స్న చెప్తుంది.

ఆ తర్వాత దీపతో అనసూయ మాట్లాడుతుంది. నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావ్ .. ఆ పెద్దాయనకి తెలిస్తే ఊరుకోడని అనసూయ అంటుంది. రోజు రోజుకి దూరం పెరిగిపోతుంది. ఎలాగైనా ఈ కుటుంబాలని కలపాలి దీప అంటుంది. అదంతా కిటికీలో నుండి నరసింహ వింటుంటాడు. ఆ తర్వాత మరుసటి రోజు దీప, సుమిత్ర పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తారు. శౌర్యని బాల త్రిపుర సుందరి దేవీగా సుమిత్ర రెడీ చేస్తుంది. ఇంట్లో ఎవరు లేరా అని దీప అనగానే.. జ్యోత్స్న, అత్తయ్యలు రెడీ అవుతున్నారు. ఆయన మావయ్య బయటకి వెళ్లారని సుమిత్ర అంటుంది. దాంతో తాతయ్య ఇంట్లో లేడని రీలాక్స్ అవుతుంది.అప్పుడే పారిజాతం జ్యోత్స్న ఇద్దరు పూజ దగ్గరికి వస్తారు. ఆ తర్వాత శౌర్యని సుమిత్ర రెడీ చేసి మురిసిపోతుంటే జ్యోత్స్నకి కోపం వస్తుంది.

ఆ తర్వాత దీపని అనసూయ పిలిచి.. కార్తీక్ వాళ్ళు వచ్చారని చెప్తుంది. దాంతో దీప వాళ్లకు ఎదరుగా వెళ్లి.. పూజ మా ఇంట్లో కాదు అక్కడ అని అనగానే.. మేమ్ రామని చెప్తారు. దానికి దీప రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడే శౌర్య వచ్చి పద కార్తీక్ అంటూ తీసుకొని వెళ్తుంది. దీప లోపలికి వెళ్లి నాకు తెలిసిన వాళ్ళని పిలిచానని చెప్తుంది. దాంతో పారిజాతం వెటకారం గా మాట్లాడుతుంది. కార్తీక్ కాంచన లు రావడం చూసిన సుమిత్ర, పారిజాతం, జ్యోత్స్న హ్యాపీగా ఫీల్ అవుతారు. సుమిత్ర, కాంచనలు ప్రేమగా మాట్లాడుకుంటారు. వాళ్ళని పిలిచినందుకు దీపకి థాంక్స్ చెప్తుంది జ్యోత్స్న. ఆ తర్వాత దశరథ్, శివన్నారాయణ లు జ్యోత్స్నకి పెళ్లి సంబంధం మాట్లాడి తిరిగి వస్తుంటారు. ఈ విషయం ఇంటికి వెళ్లి అందరికి చెప్పాలని అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.