English | Telugu

Karthika Deepam2 : దీప ప్రెగ్నెంట్.. తండ్రి కాబోతున్న కార్తీక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -523 లో..... స్వప్న, కాశీ ఇద్దరు మాట్లాడుకోవడం లేదని కార్తీక్ కి డౌట్ వస్తుంది. అసలు ఏమైందని కార్తీక్ అడుగుతాడు. కాశీ నన్ను మోసం చేశాడు అన్నయ్య అని స్వప్న చెప్తుంది. జరిగిందంతా స్వప్న చెప్తుంది. అలా అపార్ధం చేసుకోవద్దని ఇద్దరికి కార్తీక్ నచ్చజెప్పుతాడు. అప్పుడే దాస్ వస్తాడు. స్వప్న, కాశీ ని అక్కడ నుండి పంపిస్తాడు. నాకు వీళ్ళ గురించి టెన్షన్ లేదు.. దీప గురించి టెన్షన్ ఉంది.. ఇంకెన్ని రోజు లు జ్యోత్స్న టార్చర్ భరిస్తావని దాస్ అంటాడు.

ఇప్పుడు నేను ముందు చేసే పని ఒకటి ఉంది.. మా అమ్మనాన్నలని కలపాలని కార్తీక్ అంటాడు. మరొకవైపు కాంచన దగ్గరికి శ్రీధర్ వచ్చి మాట్లాడుతాడు. కాంచన బొట్టు పక్కకి వెళ్తుంది. దాంతో శ్రీధర్ బొట్టు పెడుతాడు. అప్పుడే కావేరి వస్తుంది బొట్టు పక్కకి వెళ్తే పెట్టానని శ్రీధర్ అంటాడు. నాకెందుకు చెప్తున్నారని కావేరి అంటుంది. అప్పుడే పారిజాతం ఎంట్రీ ఇచ్చి ఎన్నటికి ఉన్నా అక్క చెల్లెలు ఒక్కటే నువ్వు వేరే అని శ్రీధర్ ని ఉద్దేశ్శించి పారిజాతం అంటుంది. ఆ తర్వాత కాశీ, స్వప్నలని తీసుకొని వెళ్ళమని కావేరిని శ్రీధర్ పంపిస్తాడు. ఆ తర్వాత దీపకి సుమిత్ర జ్యూస్ తాగిస్తుంటే తను వాంథింగ్ చేసుకుంటుంది. దాంతో డాక్టర్ కి ఫోన్ చెయ్యమని శివన్నారాయణ చెప్తాడు.

ఆ తర్వాత రాత్రి అమ్మ కలలోకి వచ్చిందని కాంచన చెప్తుంది. నాక్కూడా వచ్చిందని శివన్నారాయణ అంటాడు. నేను మీ మధ్యకి వస్తున్నానని చెప్పిందని కాంచన చెప్తుంది. రాబోయే సంఘటనలు ఇలా ముందే ఉహగా వస్తాయని పంతులు అంటాడు. అప్పుడే దీపని తీసుకొని సుమిత్ర, డాక్టర్ వస్తారు. కార్తీక్ తండ్రి కాబోతున్నాడు.. ఇప్పుడు దీప ప్రెగ్నెంట్ అని చెప్పగానే.. అందరు సంతోషపడుతారు. జ్యోత్స్న, పారిజాతం షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.