English | Telugu

Karthika Deepam2: కూపీలాగిన పారిజాతం.. కావేరి తనకి నిజం చెప్పగలదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -326 లో.... దీప దగ్గరికి గౌతమ్ వచ్చి వార్నింగ్ ఇస్తాడు. దీప కూడా తగ్గకుండా మాట్లాడుతుంది. గౌతమ్ వెళ్ళిపోయాక గౌతమ్ ఇలాంటి వాడా అని కాంచన, అనసూయ మాట్లాడుకుంటారు. నువ్వు గౌతమ్ విషయంలో ఏం చేసిన కూడా నాకు చెప్పాలని దీప దగ్గర కాంచన మాట తీసుకుంటుంది. ఇలాంటి వాడిని మళ్ళీ ఆ ఇంటికి అల్లుడు చేసుకోరు కదా అని అనసూయ అంటుంది. లేదు గౌతమ్ తనంతట తనే వద్దనుకున్నాడు కదా మళ్ళీ మా నాన్న ఈ పెళ్లి కి ఒప్పుకోడని కాంచన అంటుంది.

ఆ తర్వాత జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వస్తుంది. అప్పుడే జ్యోత్స్నకి గౌతమ్ మెసేజ్ చేస్తాడు. దాంతో జ్యోత్స్న వెళ్ళిపోతుంది. ఇది నా దగ్గర ఏదో దాస్తుంది.. ముందు అది కనుక్కోవాలని అనుకుటుంది. ఆ తర్వాత పారిజాతం సత్తి పండుని కలుస్తుంది. నువ్వు రమ్య భర్త కాదని తెలుసు.. ఇప్పుడు నిజం చెప్పు అంటూ కొంతడబ్బు ఇస్తుంది. నేను రమ్య భర్త కాదు ఒకరు చెప్పమంటే చెప్పానని సత్తి పండు అంటాడు. ఎవరు వాళ్ళని పారిజాతం అడుగుతుంది. జ్యోత్స్న మేడమ్ అని అతను చెప్పగానే.. పారిజాతం షాక్ అవుతుంది. మరొక వైపు శ్రీధర్, కావేరి ఒక రెస్టారెంట్ కి వస్తారు అదే రెస్టారెంట్ కి జ్యోత్స్న, గౌతమ్ వస్తారు. వాళ్ళని చుసిన కావేరి అదేంటీ పెళ్లి కాన్సిల్ అయింది మళ్ళీ కలిసి వస్తున్నారని అనుకుటుంది. శ్రీధర్ పక్కకి వెళ్లి ఫోన్ మాట్లాడుతాడు. కావేరి కాబిన్ పక్కనే వాళ్ళు కూర్చుంటారు. దీప గురించి మాట్లాడుకుంటారు అప్పుడే పారిజాతం రావడం చుసిన జ్యోత్స్న.. గౌతమ్ ని అక్కడ నుండి పంపిస్తుంది. గౌతమ్ కాల్ చేస్తే చిరాకు పడ్డావ్.. ఇప్పుడు ఏకంగా కలిసావని పారిజాతం అంటుంది. ఇప్పుడే సత్తి పండుని కలిసాను జరిగిందంతా చెప్పాడు అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది.

ఇది రెస్టారెంట్ అంటూ పారిజాతాన్ని పక్కకి తీసుకొని వెళ్తుంది జ్యోత్స్న. వాళ్ళ వెనకాలే కావేరి వెళ్తుంది. గౌతమ్ తప్పు చేసాడు. ఈ పెళ్లి దీప ద్వారా ఆగిపోతే అందరు దీపని తిడతారు. అందుకే గౌతమ్ తప్పు చేసాడని తెలిసిన సైలెంట్ గా ఉన్నానంటూ జరిగింది మొత్తం చెప్తుంది. ఇదంతా ఎందుకని పారిజాతం అడుగుతుంది. బావ జీవితం లో నుండి దీప వెళ్లిపోతుంది.. బావ నాకు మాత్రమే సొంతమని జ్యోత్స్న అంటుంది. ఈలోపు ఇంట్లో వాళ్లకి తెలిస్తే అని పారిజాతం అంటుంది. తెలిసేలోపు అంత అయిపోతుందని జ్యోత్స్న అంటుంది. అదంతా విన్న కావేరి వెంటనే ఈ విషయం దీపకి చెప్పాలనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.