Read more!

English | Telugu

'జ‌‌బ‌ర్ద‌స్త్' షో.. రోజా ప్లేస్‌లో ఇంద్ర‌జ‌!

 

ఈటీవీలో ప్ర‌సారం అవుతున్న మోస్ట్ పాపుల‌ర్ డ‌బ‌ల్‌ కామెడీ షో 'జ‌బ‌ర్ద‌స్త్'. గ‌త ఎనిమిదేళ్ల క్రితం మొద‌లైన ఈ కామెడీ షో విజ‌య‌వంతంగా ర‌న్న‌వుతోంది. ఈ షోకి మొద‌ట‌ రోజాతో క‌లిసి మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు న్యాయ నిర్ణేత‌గా వ్య‌వ‌హ‌రించారు. ఆ త‌రువాత వ్య‌క్తిగ‌త కారణాల‌ దృష్ట్యా జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించిన నాగ‌బాబు త‌ప్పుకున్నారు. అప్ప‌టి నుంచి ఆయ‌న స్థానంలో సింగ‌ర్ మ‌నో జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.  

గ‌త కొంత కాలంగా రోజా, మ‌నో 'జ‌బ‌ర్ద‌స్త్' టీమ్ మెంబ‌ర్స్‌, టీమ్ లీడ‌ర్స్‌పై పంచ్‌లు వేస్తూనే వున్నారు. అయితే ఈ జోడీకి తాజాగా బ్రేక్ ప‌డింది. గ‌త కొన్నేళ్లుగా జంట‌గా కంటెస్టెంట్‌ల‌ని ఎంక‌రేజ్ చేస్తున్న మ‌నో, రోజాల జోడీ తాజాగా విడిపోయింది. రోజాకు ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్త‌డం, ఆమెకు ఇటీవ‌ల చెన్నైలో స‌ర్జ‌రీలు జ‌ర‌గ‌డంతో కొన్ని వారాల పాటు రెస్ట్ అవ‌స‌ర‌మ‌ని డాక్ట‌ర్లు సూచించార‌ట‌.

ఈ నేప‌థ్యంలో రోజా ఈ షో నుంచి తాత్కాలికంగా త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. ఆమె స్థానంలో ఒక‌ప్ప‌టి హీరోయిన్ ఇంద్ర‌జ‌ని రంగంలోకి దింపేశారు. ఇందుకు సంబంబంధించిన ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తోంది. రోజా త‌ర‌హాలో జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్న మ‌నోతో క‌లిసి ఇంద్ర‌జ షోని హుషారెత్తిస్తోంది.