English | Telugu

Jayam serial : రుద్రతో పారు డీలింగ్.. ముద్దుపెట్టేసిన గంగ!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -185 లో.....రుద్ర, పారు కలిసి బాక్సింగ్ కాంపిటీషన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటారు. అది చూసి గంగ కుళ్ళుకుంటుంది. రుద్ర చెప్తుంటే పారు తన వంకే చూస్తుంది. రుద్ర చెయ్ పట్టుకొని మాట్లాడుతుంది. దాంతో రుద్ర కోపంగా చూస్తాడు. రుద్ర, పారు వాళ్లిద్దరూ ఒక గదిలో మాట్లాడుకుంటే.. సూర్య, వంశీ స్నేహ, ప్రమీల, ప్రీతీ బయట ఉండి చూస్తారు.

వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినడానికి ముందు సూర్య వెళ్తాడు. ఏదో మాట్లాడాలని వెళ్లి రుద్రతో తిట్లు తిని వెనక్కి వస్తాడు. అలా తర్వాత వంశీ వెళ్తాడు. తను వెళ్లేసరికి పారు, రుద్ర చెయ్ పట్టుకొని ఉంటుంది. దాంతో వంశీ బయటకు వెళ్లి.. వదిన ఆ పారు అన్నయ్య చెయ్ పట్టుకుందని చెప్పగానే గంగ కోపంగా లోపలికి వెళ్తుంది. ఏంటని రుద్ర అనగానే ఏం లేదు సర్ మీకు ఏదైనా కావాలా అని అడగడానికి వచ్చానని గంగ చెప్తుంది. గంగ చూస్తుందని పారు కావాలనే రుద్ర చెయ్ పట్టుకొని ఉంటుంది. సరే వెళ్లి కాఫీ తీసుకొని రమ్మని రుద్ర అనగానే గంగ వెళ్తుంది.

గంగ కోపంగా వాళ్లేమో ఏసీలో ఉంటే నేను మాత్రం కిచెన్ లో వేడికి ఉండాలా అని అంటుంది. వదిన ఆ పారుకి కాఫీలో ఇది కలుపమని కారం పొడి వంశీ ఇస్తాడు. దాంతో ఒక కప్ లో కారం పొడి కలుపుతుంది. ఆ కప్ ని పారు దగ్గర పెడుతుంది. పారుకి డౌట్ వచ్చి రుద్ర దగ్గరున్న కప్ లో ఉన్న కాఫీ తాగుతుంది. కారంపొడి కలిపిన కాఫీ తాగిన రుద్ర మంట, మంట అని అరుస్తాడు. దాంతో గంగ, రుద్రకి కొంగు అడ్డం పెట్టి ముద్దు ఇస్తుంది. అదంతా చూసి పారు కుళ్ళుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య నిజం చెప్తుందేమోనని ప్రేమ టెన్షన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు '(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -386 లో.. రామరాజు హాస్పిటల్ లో ఆ సిచువేషన్ లో ఉంటే భాగ్యం, ఆనందరావు ఇద్దరు భోజనం చేస్తుంటారు. అప్పుడే శ్రీవల్లి వస్తుంది. ఆ విశ్వ గాడు ఏదో మాట్లాడుతా అమూల్యని తీసుకొనిరా అన్నందుకు తీసుకొని వెళ్ళాను కానీ వాడు ఏకంగా పెళ్లి చేసుకొని వచ్చాడు. ఇప్పుడు ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నా పరిస్థితి ఏంటని శ్రీవల్లి కంగారు పడుతుంది. ఏం కాదని భాగ్యం శ్రీవల్లికి టిఫిన్ తినిపిస్తుంటే.. దూరం నుండి నర్మద చూస్తుంది. నర్మద చూసిందని శ్రీవల్లి వెంటనే టేబుల్ కింద దాక్కుంటుంది.

Brahmamudi : మినిస్టర్ ని తక్కువ అంచనా వేసి‌న రాజ్.. చిక్కుల్లోపడ్డ ఫ్యామిలీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -946 లో.....రాజ్, కావ్య మినిస్టర్ ఇంటికి వెళ్తారు. అక్కడ తులసితో మాట్లాడుతారు. వాళ్ళ ప్రాబ్లమ్ త్వరగా సాల్వ్ చేయమని తన భర్తకి తులసి చెప్తుంది. ఒకసారి పాపని ఎత్తుకుంటానని తులసిని కావ్య అడుగుతుంది. సరే అని తులసి పాపని ఇస్తుంది. పాపని ఎత్తుకొని కావ్య ఎమోషనల్ అవుతుంది. తులసి పాపని తీసుకొని లోపలికి వెళ్ళమని మినిస్టర్ అనగానే తులసి పాపని తీసుకొని లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత మినిస్టర్ కి రాజ్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. లోపల దాక్కున్న రుద్రాణి బయటకు వస్తుంది.

Karthika Deepam2 : జ్యోత్స్నకి మళ్ళీ టెస్టులు.. దీప, కార్తీక్ ఏడుపు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'( Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -584 లో... దీప, కార్తీక్ డాక్టర్ గదిలో నుండి బయటకు వస్తారు. అప్పుడే జ్యోత్స్నని తీసుకొని దశరథ్, శివన్నారాయణ వస్తు వాళ్ళకి ఎదురుపడతారు. మీరేంటి ఇక్కడ అని శివన్నారాయణ అడుగగా.. దీపకి టెస్ట్ ల కోసమని వచ్చామని కార్తీక్ చెప్తాడు. మరి దీప కోసం అయితే గైనకాలజీస్ట్ ని కలవాలి గానీ డాక్టర్ హారిక గారి గదిలో నుండి వస్తున్నారని జ్యోత్స్న అడుగుతుంది. అంటే సుమిత్ర అమ్మ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుందామని వచ్చామని దీప అంటుంది.