English | Telugu

Podharillu : నిజం చెప్పేస్తానన్న మహా.. తనని చక్రి ఆపగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -43 లో......మహాని రిసెప్షన్ కి రెడీ అవ్వమని చక్రి రిక్వెస్ట్ చేస్తాడు. అయినా తను ఒప్పుకోదు.. నా అలోచనలు నా గోల్స్ వేరే ఉన్నాయి.. నేను ఇప్పుడు నేను రిసెప్షన్ చేసుకుంటే మీకు పర్మినెంట్ గా భార్యని అయినట్లు ప్రపంచానికి తెలిసినట్లు అని మహా అంటుంది. అప్పుడే మాధవ డోర్ కొడుతాడు. మాధవ లోపలికి వచ్చి వాళ్లిద్దరికి బట్టలు ఇచ్చి రెడీ అవ్వమని చెప్తాడు.

నేను మీ కోసం మీ మెడలో తాళి కట్టి భర్తని అనిపించుకున్నాను.. మీరు నాకోసం ఒక గంట.. నాకు భార్యగా స్టేజ్ మీద ఉండలేరా అని చక్రి రిక్వెస్ట్ చేస్తాడు. ఒక ఆడపిల్ల తన భర్తని మాత్రమే భర్త అనుకుటుంది అని మహా అంటుంది. మా వాళ్ళకి నేను అర్ధం అయ్యేలా చెప్తానని చక్రి వెళ్ళిపోతాడు. మరొక వైపు మహా, చక్రి ఇద్దరు పోలీస్ స్టేషన్ లో పెళ్లి చేసుకున్న వీడియోని తాయారు వాళ్ళకి కేశవ చూపిస్తాడు. దాంతో వాళ్ళు కుళ్ళకుంటారు. రిసెప్షన్ కి అందరు వచ్చి వెయిట్ చేస్తారు. చక్రి టెన్షన్ పడుతాడు. అప్పుడే గాయత్రి వస్తుంది. ఇంకా రెడీ అవ్వలేదా అని అడుగుతుంది.

మహా రూమ్ లో ఉన్న చక్రి బట్టలు గాయత్రి తీసుకొని వెళ్లి చక్రికి ఇస్తుంది. మళ్ళీ మహా దగ్గరికి ఈ బ్లౌజ్ నేనే కుట్టించి తీసుకొని వచ్చాను.. నీకు ఏదైనా అవసరం ఉంటే చెప్పమని గాయత్రి అనగానే ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్లిపోండి అని మహా అంటుంది. దాంతో గాయత్రి వెళ్ళిపోతుంది. చక్రి సూట్ వేసుకొని మహా దగ్గరికి వస్తాడు. మీరు మీ వాళ్ళకి అసలు విషయం చెప్పలేదని నాకూ అర్థం అయిందని మహా అనగానే మీకెలా తెలుసని చక్రి అడుగుతాడు. మీ అత్త కూతురు రెడీ చేస్తానని వచ్చినప్పుడే అర్థం అయింది. నువ్వు వాళ్లకు ఏం చెప్పలేదని.. నేను ఇప్పుడే వెళ్లి నిజం చెప్తానని మహా అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య నిజం చెప్తుందేమోనని ప్రేమ టెన్షన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు '(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -386 లో.. రామరాజు హాస్పిటల్ లో ఆ సిచువేషన్ లో ఉంటే భాగ్యం, ఆనందరావు ఇద్దరు భోజనం చేస్తుంటారు. అప్పుడే శ్రీవల్లి వస్తుంది. ఆ విశ్వ గాడు ఏదో మాట్లాడుతా అమూల్యని తీసుకొనిరా అన్నందుకు తీసుకొని వెళ్ళాను కానీ వాడు ఏకంగా పెళ్లి చేసుకొని వచ్చాడు. ఇప్పుడు ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నా పరిస్థితి ఏంటని శ్రీవల్లి కంగారు పడుతుంది. ఏం కాదని భాగ్యం శ్రీవల్లికి టిఫిన్ తినిపిస్తుంటే.. దూరం నుండి నర్మద చూస్తుంది. నర్మద చూసిందని శ్రీవల్లి వెంటనే టేబుల్ కింద దాక్కుంటుంది.

Brahmamudi : మినిస్టర్ ని తక్కువ అంచనా వేసి‌న రాజ్.. చిక్కుల్లోపడ్డ ఫ్యామిలీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -946 లో.....రాజ్, కావ్య మినిస్టర్ ఇంటికి వెళ్తారు. అక్కడ తులసితో మాట్లాడుతారు. వాళ్ళ ప్రాబ్లమ్ త్వరగా సాల్వ్ చేయమని తన భర్తకి తులసి చెప్తుంది. ఒకసారి పాపని ఎత్తుకుంటానని తులసిని కావ్య అడుగుతుంది. సరే అని తులసి పాపని ఇస్తుంది. పాపని ఎత్తుకొని కావ్య ఎమోషనల్ అవుతుంది. తులసి పాపని తీసుకొని లోపలికి వెళ్ళమని మినిస్టర్ అనగానే తులసి పాపని తీసుకొని లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత మినిస్టర్ కి రాజ్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. లోపల దాక్కున్న రుద్రాణి బయటకు వస్తుంది.

Karthika Deepam2 : జ్యోత్స్నకి మళ్ళీ టెస్టులు.. దీప, కార్తీక్ ఏడుపు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'( Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -584 లో... దీప, కార్తీక్ డాక్టర్ గదిలో నుండి బయటకు వస్తారు. అప్పుడే జ్యోత్స్నని తీసుకొని దశరథ్, శివన్నారాయణ వస్తు వాళ్ళకి ఎదురుపడతారు. మీరేంటి ఇక్కడ అని శివన్నారాయణ అడుగగా.. దీపకి టెస్ట్ ల కోసమని వచ్చామని కార్తీక్ చెప్తాడు. మరి దీప కోసం అయితే గైనకాలజీస్ట్ ని కలవాలి గానీ డాక్టర్ హారిక గారి గదిలో నుండి వస్తున్నారని జ్యోత్స్న అడుగుతుంది. అంటే సుమిత్ర అమ్మ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుందామని వచ్చామని దీప అంటుంది.