English | Telugu

Guppedantha Manasu : శైలేంద్ర పాపాల చిట్టా బయటపెట్టిన రిషి...

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu ).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1167 లో.. శైలేంద్రని చంపడానికి మహేంద్ర కోపంగా వస్తుంటే.. శైలేంద్ర ఎదరుపడుతాడు. కోపంగా ఎక్కడికో వెళ్తున్నారని శైలేంద్ర అడుగుతాడు. నీకోసమే వస్తున్నానురా అంటూ తన కాలర్ పట్టుకుంటాడు మహేంద్ర. ముందు నిన్ను ఫినిష్ చేసి తర్వాత వాళ్ళ పని చూస్తానని శైలేంద్ర అనగానే.. మహేంద్ర తన చెంప చెల్లుమనిపిస్తాడు. ఆ తర్వాత కొందరు రౌడీలు మహేంద్రని పట్టుకుంటారు. కర్రతో శైలేంద్ర మహేంద్ర తలపైన కొడుతాడు. బాబాయ్ నీ గురించి తెలిసే నా ప్లాన్ లో నేనున్నానని శైలేంద్ర రౌడీలకి చెప్పి.. మహేంద్రని కిడ్నాప్ చేయిస్తాడు.

ఆ తర్వాత మహేంద్రని ఒక దగ్గరికి తీసుకొని వెళ్లి తాళ్లతో కట్టేస్తాడు. ఇక తను చేసిన దుర్మార్గుల గురించి శైలేంద్ర చెప్తుంటాడు. నా గురించి నీకు ఎలా తెలిసిందని శైలేంద్ర అడుగుతాడు. జగతి నీ పాపాల చిట్టా మొత్తం ఒక లెటర్ లో రాసిందని మహేంద్ర చెప్తాడు. ఆ లెటర్ లో పిన్ని రాయని విషయాలు చాలా ఉన్నాయ్.. నీకు ఒక్కొకటి చెప్తా విను అని శైలేంద్ర అంటాడు. మా అమ్మ పిన్నిని ఇంట్లో నుండి పంపించేసింది. రిషి పై ఎటక్ చేసింది నేనే అని శైలేంద్ర అనగానే.. తెలుసని మహేంద్ర అంటాడు. మొన్న నీ మీద ఎటాక్ చేసింది కూడా నేనే అనగానే.. తెలుసని మహేంద్ర అంటాడు. నీకు తెలియని విషయం చెప్పనా అని మను తండ్రి ఎవరో తెలుసా అని శైలేంద్ర అనగానే.. తెలుసు నేనే మను తండ్రి అని మహేంద్ర అంటాడు. నీకు తెలియని విషయం చెప్పనా మను తల్లి అనుపమ కాదు జగతి. రిషి, మను కవల పిల్లలని మహేంద్ర అనగానే.. శైలేంద్ర షాక్ అవుతాడు. నీకు తెలియని విషయం ఏంటంటే జగతి పిన్ని హాస్పిటల్ నుండి వచ్చాక.. మేమే జ్యూస్ లో విషం కలిపామని శైలేంద్ర చెప్పగానే మహేంద్ర షాక్ అవుతాడు. ఆ తర్వాత రౌడీలతో మహేంద్రని చంపమని చెప్పి శైలేంద్ర వెళ్ళిపోతాడు.

మరొకవైపు వసుధార ఫణీంద్ర వాళ్ళ ఇంటికి వచ్చి.. మావయ్య కన్పించడం లేదు.. ఈ శైలేంద్ర ఏదో చేసాడని అంటుంది. ఆ తర్వాత జగతి రాసిన లెటర్ ఫణీంద్రకి ఇస్తుంది. అది చదివి. ఫణీంద్ర తట్టుకోలేక గుండె పట్టుకుంటాడు. అంతలా ఏముందని దేవయాని అనగానే.. మీ పాపాల చిట్టా అని వసుధార అంటుంది. మేం ఏ తప్పు చెయ్యలేదు.. వాళ్లే కావాలని చేస్తున్నారని శైలేంద్ర అంటుంటే.. లేదు మావయ్య.. అంత వీళ్ళే చేశారు.. ఇన్ని రోజులు మీ గురించి అలోచించి ఏం చెప్పలేదని ధరణి అంటుంది. ఆ తర్వాత రిషి, మహేంద్రలు వస్తారు. అప్పటికే నేనేం తప్పు చెయ్యలేదని శైలేంద్ర అంటుంటే.. శైలేంద్ర మాట్లాడిన మాటలన్నీ వీడియో చూపిస్తాడు మహేంద్ర. ఇప్పుడు కూడా అబద్ధం చెప్తావా అని రిషి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.