English | Telugu

నాకు లైఫ్ ఇచ్చింది రాకెట్ రాఘవ...ఆర్టిస్ట్ గా గుర్తింపు ఇచ్చింది జబర్దస్త్


జబర్దస్త్ ఒక కామెడీ షో మాత్రమే కాకుండా ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. రైటర్స్ , ఆర్టిస్టులకు మంచి అవకాశం వచ్చింది. ఆ జబర్దస్త్ కారణంగానే సుధీర్, గెటప్ శీను, బులెట్ భాస్కర్, ఇమ్మానుయేల్, రాకింగ్ రాకేష్ ఇలాంటి వాళ్లంతా కూడా ఈ షో ద్వారా బాగా ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. ఇక బులెట్ భాస్కర్ మొదట్లో రైటర్ గా స్టార్ట్ అయ్యి తర్వాత ఆర్టిస్ట్ అయ్యాడు. ఇప్పుడు టీమ్ లీడర్ అయ్యాడు. అలా తన ఎక్స్పీరియన్స్ ని తన జబర్దస్త్ జర్నీని తన మాటల్లోనే..."రాకెట్ రాఘవ గారిని నేను జీవితంలో మరిచిపోలేని వ్యక్తి. జబర్దస్త్ 2013 ఆగష్టులో అలా స్టార్ట్ అయ్యింది. నాకు అప్పటికి ఏమీ తెలీదు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే దానికి కారణం రాఘవ గారు. ఆయన ఆ మాట ఒప్పుకోరు గాని నేను ఒప్పుకోవాలి.

మనం లైఫ్ లో ఎవరినైనా మర్చిపోవచ్చు కానీ మనకు సాయం చేసిన వాళ్ళను మర్చిపోకూడదు. నాకు కొంచెం రైటింగ్ నాలెడ్జ్ ఉందని చేపి రాఘవ గారు నన్ను వెతుక్కుంటూ వచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. ఒక రైటర్ గా ఒక ఆర్టిస్ట్ గా ఫస్ట్ ఆయన స్కిట్ లోనే చేసాను. చేసింది 2 , 3 స్కిట్స్ ఐనా కానీ అసలు గుర్తింపు అంటూ లేని నాకు మంచి గుర్తింపును తెచ్చాయి. ఆ తర్వాత చంటి గారి టీమ్ లోకి వెళ్లాను. ఆయన దగ్గర కూడా స్కిట్స్ రాసాను. ఒక రైటర్ గా, ఒక ఆర్టిస్ట్ గా కూడా అక్కడ నాకు మంచి పేరు వచ్చింది. 2016 జనవరిలో నేను టీమ్ లీడర్ ని అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు టీమ్ లీడర్ గా కంటిన్యూ అవుతూనే ఉన్నాను." అంటూ చెప్పుకొచ్చాడు బులెట్ భాస్కర్.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.