English | Telugu

 రాహుల్ లో మార్పు వచ్చిందని మురిసిపోతున్న స్వప్న.. మరి ఆ డబ్బు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -879 లో.... కావ్యని తీసుకొని రాజ్ క్యాండీలైట్ డిన్నర్ కి వస్తాడు. అక్కడ బేరర్ గా రాహుల్ ఉంటాడు. అతన్ని చూసి కావ్య షాక్ అవుతుంది. నువ్వేంటి ఇక్కడ అని కావ్య అడుగుతుంది. కష్టపడి పని చెయ్యాలని అనుకుంటున్నానని రాహుల్ చెప్తాడు. అలా చెయ్యడానికి ఈ పనే దొరికిందా అని రాజ్ అంటాడు. రాహుల్ ని చూస్తే బాధగా ఉందని కావ్య అంటుంది. ఆ విషయం వదిలేయ్ అని రాజ్ అంటాడు. కావ్య బయటకు వెళ్తుంటే కొందరు రౌడీలు కావ్య ని ఏడిపిస్తారు. ఒరేయ్ మీరు మా ఆయన పంపిస్తే వచ్చిన రౌడీలు అని నాకు తెలుసని కావ్య అంటుంది. వాళ్ళు కావ్యతో తప్పుగా ప్రవర్తిస్తుంటే రాజ్ వస్తాడు. ఒరేయ్ నేను పిలిస్తే వచ్చినోళ్లు ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారని రాజ్ అంటాడు.

మీరు పిలవడడమేంటని రౌడీలు అంటారు. వెంటనే తను చెప్పిన రౌడీలకి రాజ్ ఫోన్ చేస్తాడు. సర్ మేమ్ ఇంకా బయల్దేరలేదని వాళ్ళు చెప్తారు. అప్పుడు వీళ్ళు నిజమైన రౌడీలు అని తెలుసుకొని రాజ్ వాళ్ళని కొడుతాడు. ఆ తర్వాత కావ్యని తీసుకొని రాజ్ అక్కడ నుండి బయల్దేరతాడు. మరొకవైపు స్వప్నకి రాహుల్ నాసిరకం చీర తీసుకొని వస్తాడు. స్వప్న నీకు ఇది నచ్చదు నాకు తెలుసు కానీ నేను కష్టపడి డబ్బు సంపాదించి నీకు ఈ చీర కొన్నాను. బేరర్ గా జాయిన్ అయ్యానని రాహుల్ చెప్తాడు.

రాహుల్ లో వచ్చిన మార్పు చూసి స్వప్న హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ చీర తీసుకొని మురిసిపోతుంది. నాకు కావాల్సింది కూడా ఇదేగా అని రాహుల్ అనుకుంటాడు. మరుసటిరోజు స్వప్న ఆ చీర కట్టుకొని వస్తుంది. అదేంటీ అంత నాసిరకం చీర కట్టుకున్నావ్.. అలాంటివి నీకు నచ్చవ్ కాదా అని ధాన్యలక్ష్మి అంటుంది. తరువాయి భాగంలో రాహుల్ ఈ డబ్బు విత్ డ్రా చేసి ఆఫీస్ కి తీసుకొని వెళ్ళు అని రాజ్ చెప్తాడు. రాహుల్ దగ్గర ఒకతను డబ్బు తీసుకొని పారిపోతాడు. ఇంకా రాహుల్ ఆఫీస్ కి రాలేదని రాజ్ తో ప్రకాష్ చెప్తాడు. అందుకే వాడిని నమ్మొద్దని ఇంట్లో వాళ్ళు అందరు రాహుల్ పై కోపంగా ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.