English | Telugu

Brahmamudi: నిజం చెప్పేసిన కావ్య.. రుద్రాణి ప్లాన్ అదే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -950 లో... ధాన్యలక్ష్మికి రుద్రాణి కాల్ చేస్తుంది. నాకెందుకు కాల్ చేసావని ధాన్యలక్ష్మి కోప్పడుతుంది. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అంటుంది. నాకేం అవసరం లేదని ధాన్యలక్ష్మి అంటుంది. నీకు రాబోయే వారసుడికి ప్రమాదం అంటే కూడా వినవా.... రాజ్, కావ్య ఆ మినిస్టర్ తో గొడవపడ్డారు కాబట్టే అతను అందరిపై అలా చేసాడు. రాజ్, కావ్య స్వార్ధానికి వాడితో గొడవ పెట్టుకున్నారు. అలా చేస్తే మినిస్టర్ ఏం చెయ్యడానికి అయినా వెనుకాడడు అని రుద్రాణి అనగానే ధాన్యలక్ష్మి అదంతా నమ్మేస్తుంది.

మరుసటిరోజు రాజ్, కావ్య పాపని తీసుకొని హాస్పిటల్ కి బయల్దేరతారు. పాపకు ఈ రోజు ఆపరేషన్ నాకు భయంగా ఉందని కావ్య అంటుంది. అప్పుడే ధాన్యలక్ష్మి ఎంట్రీ ఇస్తుంది. మీరు ఆ మినిస్టర్ తో ఎందుకు గొడవ పడ్డారని అడుగుతుంది. బిజినెస్ గురించి అని కావ్య అనగానే అబద్ధం అని ధాన్యలక్ష్మి తనకి నచ్చినట్లు మాట్లాడుతుంటుంది. ఆపండి అసలు మినిస్టర్ తో ఎందుకు గొడవ పడ్డామో తెలుసా.. మా కన్న బిడ్డ కోసం.. వాడు పుట్టగానే బిడ్డలని మార్చాడు అని జరిగింది మొత్తం చెప్పగానే అందరు షాక్ అవుతారు. అమ్మ కావ్య నువ్వు చెప్తుంటే మేమ్ పట్టించుకోలేదు పైగా ఎంత చెప్పినా వింటలేవు మూర్ఖురాలివి అంటూ తిట్టాను సారీ అని అపర్ణ అంటుంది. కన్నకూతురు కాకపోయినా తన ప్రాణం కాపాడాలని చూస్తున్నావ్ నువ్వు గొప్ప తల్లివి అని ఇందిరాదేవి అంటుంది. నేను నిజం తెలుసుకోకుండా మాట్లాడాను నన్ను క్షమించు అని ధాన్యలక్ష్మి అంటుంది. ఆ తర్వాత పాపని తీసుకొని రాజ్, కావ్య హాస్పిటల్ కి వెళ్తారు.

మరొకవైపు రుద్రాణికి రేఖ ఫోన్ చేసి జరిగిన విషయం చెప్తుంది. దాంతో ఇంట్లో వాళ్ళకి నిజం తెలిసిపోయిందా అని రుద్రాణి షాక్ అవుతుంది. నువ్వేం టెన్షన్ పడకు కావ్య పాపని, కావ్యని రాజ్ కి దూరం చేసి.. రాజ్ కి నిన్ను దగ్గర చేస్తానని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu: శ్రీవల్లిని ఏకిపారేసిన నర్మద, ప్రేమ.. స్పృహలోకి వచ్చిన రామరాజు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu )'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-388 లో.. అమూల్యతో ప్రేమ, నర్మద మాట్లాడతారు. శ్రీవల్లి చేసిన పనికి అసలు వదలకూడదని ప్రేమ అంటుంది. నాకు మాటిచ్చారని అమూల్య అనగానే అది తిన్నింటి వాసాలు లెక్కపెట్టి నీ జీవితం నాశ చేస్తే ఇంకా మాటని పట్టుకొని వేలాడటం ఏంటి అమూల్య అని ప్రేమ కోపంగా అంటుంది. ఇప్పుడు నిజం చెప్తే శ్రీవల్లి వదిన జీవితం నాశనం అవుతుంది‌. నాన్న ఏరి కోరి తెచ్చిన సంబంధం.. తను ఇలా చేసిందంటే నాన్న తట్టుకోగలడా అని అమూల్య అంటుంది. 

Brahmamudi : చక్రవర్తిని కాపాడిన రాజ్.. గడువులోగా మినిస్టర్ నిజం చెప్తాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -948 లో..... మినిస్టర్ కి రాజ్ ఫోన్ చేస్తాడు‌. డాక్టర్ చక్రవర్తిని తీసుకొని నీ భార్య దగ్గరికి వెళ్తున్నాను.. అతను నీ గురించి నిజం చెప్పేస్తాడని రాజ్ అంటాడు.  రాజ్ అలా అనగానే మినిస్టర్ భయపడతాడు. చక్రవర్తి ని దాచిన ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ చక్రవర్తిని చూసి రిలాక్స్ అవుతాడు. అప్పుడే రాజ్ ఫోన్ చేసి నా ప్లాన్ చేంజ్ చేసుకున్నాను.. నీకు హెల్ప్ చేసిన నర్సు నీలవేణి దగ్గరికి వెళ్లి సాక్ష్యం సంపాదిస్తానని రాజ్ అనగానే మళ్ళీ  నీలవేణి దగ్గరికి వెళ్తాడు మినిస్టర్.