English | Telugu

Brahmamudi : రుద్రాణి చెంపచెల్లుమనిపించిన ఇందిరాదేవి.. వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయ్యేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -785 లో.....రాజ్, కావ్య, ఇందిరాదేవి, రేవతి వాళ్ళు మాట్లాడుకుంటారు. అన్ని విషయాలు మీ అమ్మతో చెప్పే నువ్వు.. నీ ప్రేమ విషయం దాచి డైరెక్ట్ పెళ్లి చేసుకొని వచ్చావని రేవతితో అంటుంది ఇందిరాదేవి. ఆ రోజు రుద్రాణి అత్తయ్య సలహా వల్ల అలా చెయ్యాలిసి వచ్చిందని రేవతి అంటుంది. మేమ్ ఒకసారి మాట్లాడుకుంటుండగా రుద్రాణి అత్త చూసి మీరు ఇద్దరు పెళ్లి చేసుకొని రండి అప్పుడు మీ వాళ్ళు తప్పక ఆక్సెప్ట్ చేస్తారని చెప్పిందని రేవతి చెప్తుంది.

అందుకే ఇలా చేసానని రేవతి చెప్పగానే ఆ రుద్రాణి వల్లే ,నీకు ఈ పరిస్థితి వచ్చిందని కావ్య ఇందిరాదేవి ఇద్దరు తనపై కోపంగా ఉంటారు. మరొకవైపు రుద్రాణి పాటలు పెట్టుకొని డాన్స్ చేస్తుంది. మమ్మీ ఏం చేస్తున్నావ్ ఇలా హ్యాపీగా ఫీల్ అవుతే ఇందులో మన హస్తం ఉందనుకుంటారని రాహుల్ అంటాడు. ఆ రోజు నేనే రేవతిని పెళ్లి చేసుకోమని చెప్పి ఈ ఇంటికి దూరం చేసాను.. ఇక రాజ్ ని యామినికి దగ్గర చేసి ఈ ఇంటికి దూరం చేస్తే ఆస్తులు మనవి అవుతాయని రుద్రాణి అంటుంది. అప్పుడే ఇందిరాదేవి వచ్చి రుద్రాణి చెంపచెల్లుమనిపిస్తుంది. ఎందుకు కొట్టావని రుద్రాణి అడుగుతుంది. పదిహేను సంవత్సరాల క్రితం చేసిన తప్పుకి అని ఇందిరాదేవి అంటుంది.

ఆ తర్వాత రేవతి ఇంటికి పిలిస్తే కలుస్తారని రాజ్ ప్లాన్ చెప్పినందుకు రాజ్ పై కావ్య కోపంగా ఉంటుంది. మళ్ళీ రాజ్, కావ్య ఒక ప్లాన్ చేస్తారు. వాళ్ళని గుళ్లో ఎదురుపడేలా చెయ్యాలని చెప్తాడు. దానికి కావ్య సరే అంటుంది. కావ్య, ఇందిరాదేవి ప్లాన్ చేసి అపర్ణ గుడికి వెళ్లేలా చేస్తారు. రాజ్ రేవతి ఇంక బాబు వెళ్లేలా చేస్తాడు. తరువాయి భాగంలో రేవతి బాబు స్వరాజ్ ని అపర్ణ గుడి నుండి ఇంటికి తీసుకొని వస్తుంది. ఈ బాబు గుళ్లో తప్పిపోయి కన్పించాడని అపర్ణ అనగానే.. ఈ బాబుని ఎక్కడో చూసానని స్వప్న, అప్పు అంటుంటే ఎక్కడ చెప్పేస్తారో అని రాజ్, కావ్య టెన్షన్ పడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.