English | Telugu

Brahmamudi : కావ్య ఆ సాక్ష్యం తీసుకురాగలదా.. అత్తని ఆడుకున్న కోడలు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -687 లో..... స్వప్న ఒంటరిగా ఏదో ఆలోచిస్తుంటే అప్పుడే అప్పు వచ్చి ఏమైంది అక్క అంతలా ఆలోచిస్తున్నావంటుంది.. మా అత్త కావ్య పరిస్థితిని వాడుకొని తనని పిచ్చి దానిలాగా చూపించాలనుకుంటుంది. తనకి ఎలా బుద్ది చెప్పాలని ఆలోచిస్తున్నానని స్వప్న అంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నరు కదా వాళ్ళే చూసుకుంటారని అప్పు అంటుంది. ఈ రాహుల్ తోడు ఉండడం వళ్ల మా అత్త ఇంకా రెచ్చిపోతుందని స్వప్న అంటుంది.

రాహుల్ ని బయటకు పంపించి మా అత్త సంగతి చెప్పాలని తన ఫోన్ నుండి రాహుల్ కి ఫోన్ చేసి ఎవరో అమ్మాయిలాగా మాట్లాడుతుంది. నిన్ను కలవాలని అనగానే కలుస్తాను.. నేను సింగిల్ నే అని రాహుల్ ఫోన్ లో ఫ్లర్ట్ చేస్తుంటాడు. ఆ తర్వాత రాహుల్ బయటకు వెళ్తుంటే ఎక్కడికి అని అంటుంది. ఏదో ఒకటి చెప్పి రాహుల్ వెళ్ళిపోతాడు. మాక్కావల్సింది కూడా అదే అని స్వప్న, అప్పు ఇద్దరు అనుకుంటారు. ఆ కళావతి సడెన్ గా ఎందుకు వెళ్ళిందని రాజ్ ఆలోచిస్తాడు . కావ్యకి మెసేజ్ చేస్తాడు. ఇద్దరు కాసేపు చాట్ చేసుకుంటారు. ఆ తర్వాత కాల్ మాట్లాడుకుంటారు. ఫోన్ కట్ చేసి పక్కకి చూసేసరికి యామిని ఉంటుంది. ఏంటి ఇలా సడెన్ గా వచ్చావని రాజ్ అంటాడు. ఇక నీ ప్రైవసీకి అడ్డు రాను.. నీకు నచ్చినట్టు ఉండు.. ఇదిగో కార్ కీస్ అని రాజ్ కి యామిని కీస్ ఇస్తుంది.

కావ్య తమ పెళ్లి ఫోటో చూస్తూ ఏడుస్తుంటుంది. అప్పుడే సుభాష్ వస్తాడు ఏంటి అమ్మ కావ్య ఎన్ని రోజులు ఇలాగే ఉంటావని అడుగుతాడు. అంటే మరి మీరు కూడ రుద్రాణి గారి మాటలు నమ్ముతున్నరా అని కావ్య అంటుంది. రాజ్ ఉంటే ఎక్కడ ఉన్నాడని సుభాష్ అడుగుతాడు. ఇప్పుడు చెప్పలేనని కావ్య అనుకుటుంది. రాజ్ లేడని అనడానికి సాక్ష్యం ఉంది.. ఉన్నాడు అనడానికి సాక్ష్యం ఉందా అని సుభాష్ అడుగుతాడు. ఆ తర్వాత కావ్య, అప్పు ఇద్దరు రుద్రాణి ని ప్రాంక్ చెయ్యడానికి రెడీ అవుతారు. టేబుల్ పై లైవ్ ఫిష్ పెడతారు. అది చూసి రుద్రాణి భయపడుతుంది. చాపల పులుసు బాగుంటుందని ఇద్దరు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.