English | Telugu

Brahmamudi : భర్తపై రివెంజ్ తీసుకున్న భార్య.. ఆ ఇద్దరు ఎలా ఉన్నారంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi ). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -493 లో.....కళ్యాణ్ ఇంటికి రాగానే అప్పు భోజనం వడ్డీస్తుంది. అది తిని బాగుందని కళ్యాణ్ చెప్తాడు. ఏంటి బాగుందా అని అప్పు తింటుంది. అది తిని ఇది బాగుంది అంటావేంటని అప్పు అంటుంది. అంటే ఎక్కడ బాలేదంటే ఇవన్నీ ఎత్తేస్తావేమోనని కళ్యాణ్ అంటాడు. అంటే నేను కోపిష్టి దాన్ని అంటున్నావా అని అప్పు అంటుంది. అ తర్వాత రెండు రోజుల్లో వంట నేర్చుకుంటా అని అప్పు అంటుంది.

నా దగ్గరున్నా ఆరు వేలల్లో మూడు వేలతో సరుకులు కొనుకొస్తానని కళ్యాణ్ అంటాడు. ఇక నుండి ఇలా మనం పిలుచుకోవద్దు. నేను నిన్ను పొట్టి అని పిలుస్తానని కళ్యాణ్ అనగా... నిన్ను కూచి అంటానని అప్పు అంటుంది. ఆ తర్వాత బంటి ఆకలి అంటూ కనకం దగ్గరికి వస్తాడు. అక్కడ ఉందంటూ కనకం చిరాకు పడుతుంటే.. అప్పు, కళ్యాణ్ లని నేనే నా రూమ్ లో ఉండమని చెప్పాను. వాళ్లు అక్కడే ఉన్నారని చెప్పగానే కనకం, కృష్ణమూర్తిలు హ్యాపీగా ఫీల్ అవుతారు.అ తర్వాత రాజ్ కి కావ్య కాఫీ తీసుకొని వచ్చి.. కాఫీ కీ డబ్బులు ఇవ్వమని అడుగుతుంది. రాత్రి ఏమన్నారు ఆస్తుల కోసం కళ్యాణ్ ని రావద్దని అనుకుంటున్నానని అన్నారు కదా.. మీరు ఏం రాసిచ్చారు.. అందుకే నేను చేసే పనికి ఇక నుండి వెల కడుతానని కావ్య అంటుంది. ఏంటి రివెంజ్ ఆ అని రాజ్ అంటాడు. కావ్య వెళ్లిపోతుంటే నీకు కావలిసింది డబ్బులు కదా ఇస్తానంటూ వంద రూపాయలు ఇచ్చి.. కావ్య తెచ్చిన టీ తాగుతాడు.

మరొకవైపు అప్పుకి కళ్యాణ్ బట్టలు కొనుకుని వస్తాడు. మిగతా మూడు వేలు ఇవ్వు వాటితో సరుకులు తెస్తానని కళ్యాణ్ అనగానే.. మిగతా మూడు వేలతో నేను నీకు బట్టలు తీసుకున్నా అని అప్పు అంటుంది. మరొకవైపు రాజ్ కిందకి వస్తుంటాడు. అప్పుడే ఇందిరాదేవి కాఫీ తీసుకొని రమ్మని అంటుంది. దానికి డబ్బులు కావాలనగానే కావ్యని వచ్చి రాజ్ ఆపుతాడు. అప్పుడే అపర్ణ వచ్చి టీ కావాలి అనగానే.. తనతో కూడ కావ్య అలాగే అంటుంది. ఎక్కడ రాత్రి అన్న మాటలు కావ్య చెప్తుందో కావ్యని బయటకు తీసుకొని వెళ్లి.. నువ్వు ఎదో సరదాగా అంటున్నావనుకున్న అని రాజ్ అంటాడు. తరువాయి భాగంలో ఇంట్లో పూజ చెయ్యాలని ఇందిరాదేవి అంటుంది. మరొకవైపు ఆ అప్పు ఇంటికి వచ్చాక అది ఈ ఇంటికి కరెక్ట్ కోడలు కాదని తెలిసేలా చేస్తానని రుద్రాణితో ధాన్యలక్ష్మి అంటుంది. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.