English | Telugu

దీపావళి వేడుకల్లో కంటెస్టెంట్స్... కన్నుల విందుగా ప్రోమో!

బిగ్ బాస్ సీజన్-8 జోరుగా సాగుతోంది. హౌస్ లో నామినేషన్ టాస్క్ లతో పాటు దీపావళి సంబరాలు కూడా జరిగాయి. దానికి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేసారు. ఈ రోజు ఎంటర్‌టైన్మెంట్ కి లోటు లేదన్నట్టుగా ఈ ప్రోమో ఉంది.

తాజాగా వచ్చిన ప్రోమో(Biggboss 8 Telugu promo) లో అసలేం ఉందంటే.. ముద్దు గారే యశోద అంటూ పాటని ఆలపించింది హరితేజ. ఇక ఆమెతో పాటు హౌస్ మేట్స్ అంతా భక్తిశ్రద్ధలతో పాటని అనుకరించారు. ఇక పూజ తర్వాత అందరికి బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు.‌ కొన్ని గ్రూప్ లుగా సపరేట్ చేసి దీపావళికి సంబంధించిన కొన్ని డ్రాయింగ్ లని గీయమన్నాడు బిగ్ బాస్.‌ అందులో ఒక టీమ్ కృష్ణుడి బొమ్మగా గీసి కలర్స్ వేయగా, మరొక టీమ్ రాధ బొమ్మని గీసినట్టుగా తెలుస్తుంది.

నిన్న హౌస్ లో పృథ్వీ, నిఖిల్, యష్మీ, ప్రేరణ మధ్య సాగిన ఇష్యూ గురించి పెద్ద చర్చే జరిగినట్టుగా ఉంది. మరోవైపు ఎంటర్‌టైన్మెంట్ పరంగా విష్ణుప్రియ జీరో అని..‌కనీసం ఎంకరేజ్ మెంట్ కూడా లేదంటూ రోహిణి బాధపడింది. ఇక అవినాష్, టేస్టీ తేజని టార్గెట్ చేసి కన్నడ బ్యాచ్ ఆట నుండి తీసేసారు. కన్నడ బ్యాచ్ ఖాతాలో నబీల్ కూడా బలి అయ్యాడు.‌ మరి వీళ్లు ఆడే గ్రూప్ గేమ్ ని వీకెండ్ లో నాగార్జున అడుగుతాడో లేదో చూడాలి. ఇప్పటికైతే నామినేషన్ లో ఉన్నవారిలో నయని పావని, టేస్టీ తేజ, హరితేజ డేంజర్ జోన్ లో ఉన్నారు. మరి ఈ వీకెండ్ ఎవరు ఎలిమినేషన్ అవుతారో కామెంట్ చేయండి.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.