English | Telugu

bigg boss 9 Telugu : రీతూ చేసిన తప్పుకి సంజన-ఫ్లోరాలకి శిక్ష.. అదే బిగ్ ట్విస్ట్!

బిగ్ బాస్ సీజన్-9 అయిదో వారం కంటెస్టెంట్స్ ఎమోషన్స్ పీక్స్ కి వెళ్తున్నాయి. కథలో మలుపు, ట్విస్ట్ లు అన్నట్టుగా అయిదో వారం ఆట సాగుతుంది. డీమాన్ పవన్, పవన్ కళ్యాణ్ తమ ఆటతీరు మెరుగుపరుచుకున్బారు. మరోవైపు ఇమ్మాన్యుయల్ ఇరగదీస్తున్నాడు. ఇక రాము రాథోడ్ బెస్ట్ సంఛాలక్ గా చేస్తున్నాడు.

నిన్నటి ఎపిసోడ్ లో.. కంటెస్టెంట్స్ ని టీమ్ లుగా విభజించి కొన్ని టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. భరణి-దివ్య ఒక టీమ్, సంజన-ఫ్లోరా ఒక టీమ్, రీతూ-డీమాన్ పవన్ ఒక టీమ్, తనూజ-కళ్యాణ్, సుమన్-శ్రీజ టీమ్ లుగా ఉన్నారు. ఇక మొదటి టాస్క్ 'పట్టు వదలకు' లో డీమాన్ పవన్-రీతూ టీమ్ గెలిచింది. టాస్క్ లో పర్ఫామెన్స్ ని బట్టి పాయింట్లు ఇచ్చాడు బిగ్ బాస్. మొదటి టాస్క్ లో డీమాన్ పవన్, భరణి చివరి వరకు ఉన్నారు. కానీ చివర్లో భరణి నొప్పి భరించలేక వదిలేశాడు. దాంతో డీమాన్ పవన్ గెలిచాడు. ఇక ఈ టాస్క్ లోని అందరికి వారి పర్ఫామెన్స్ ని బట్టి పాయింట్స్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక రెండో టాస్క్ లో ఈ టీమ్ లు పాల్గొంటాయి. దానికి సంచాలక్ గా ఇమ్మాన్యుయల్, రాము రాథోడ్ ఉన్నారు.

ఇక సెకెండ్ టాస్క్ లో బెలూన్ ఊది గాలిలో ఉంచాలి.. అయిదు నిమిషాలు అయిందని మీకు అనిపిస్తే వెళ్లి గంట కొట్టండి అని టీమ్ లకి బిగ్ బాస్ రూల్స్ చెప్పాడు. అయితే ఈ రూల్స్ ను రీతూ, డిమాన్ కంప్లీట్ గా మిస్ లీడ్ చేశారు. ఇద్దరు ఫౌల్ ఆడుతారు. వాళ్ళని చూసి తనూజ- కళ్యాణ్ అలాగే ఆడుతారు. అలాగే వాళ్ళని చూసి శ్రీజ-సుమన్ శెట్టి ఆడతారు. భరణి- దివ్య ఇద్దరు బాగానే ఆటినా వారికిచ్చిన మూడు బెలూన్లు పగిలిపోవడంతో కౌంట్ అవ్వలేదు. గేమ్ ఫౌల్ లేకుండా పర్ఫెక్ట్ గా ఆడింది మాత్రం సంజన-ఫ్లోరా మాత్రమే. అయితే ఈ బెలూన్ టాస్క్ పూర్తయ్యాక అందరిపై కోప్పడుతాడు బిగ్ బాస్. ఈ స్కూల్ కి నేనే ప్రిన్సిపల్.. నా ముందే మీ వేషాల అన్నట్లు అందరికి మాస్ వార్నింగ్ ఇస్తాడు బిగ్ బాస్. ఆ తర్వాత ఇక మీకు నచ్చింది చేసుకోండి అని బిగ్ బాస్ అనగానే అందరు సారీ చెప్తారు. తప్పు చేసినందుకు మీకు ఇది వరకు టాస్క్ లో వచ్చిన పాయింట్లలో నుండి సగం తీసేస్తున్నాను.. ఒక్క సంజన-ఫ్లోరా టీమ్ కి మాత్రం పాయింట్స్ అలాగే ఉంటాయని బిగ్ బాస్ చెప్తాడు. దాంతో సంజన ఫ్లోరా టీమ్ పాయింట్స్ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లో ఉంటారు.

ఈ టాస్క్ లో గెలుపు దగ్గరిదాకా వచ్చి ఓడిపోయినందుకు సంజన ఎమోషనల్ అవుతుంది. ఎందుకంటే వారు గేమ్ గెలిచారు‌.‌ కానీ రీతూ చేసిన ఫౌల్ వల్ల అందరికి శిక్ష వేశాడు బిగ్ బాస్. ఒక్కరి వల్ల అందరికి శిక్ష వేయడం కరెక్ట్ కాదు బిగ్ బాస్. గెలుపు వరకు వచ్చి ఓడిపోవడం చాలా బాధగా ఉంది. ఇక అప్పుడే ఇమ్మాన్యుయల్, రాము రాథోడ్ వచ్చి సంజనని ఓదారుస్తారు. ప్రతీసారి ఓడిపోతూ ఉండటం నచ్చట్లేదు.‌ ఓడిపోయిన చోట ఎవరుంటారు చెప్పు అంటూ ఇమ్మాన్యుయల్, రాములతో సంజన చెప్పుకుంటూ ఏడుస్తుంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.