English | Telugu

బాలుతో కావ్య రొమాన్స్...జోడిని ఇలా స్క్రీన్ మీద చూడడం ఫస్ట్ టైం



ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్స్ ప్రోమో మస్త్ ఉంది. అందులోనూ ఇందులో కొన్ని కొత్త విషయాలు కూడా తెలిసాయి. బుల్లితెర నటుడు ఆకర్ష్ బైరముడి ఒక ఇంటరెస్టింగ్ విషయం చెప్పాడు. ఆకర్ష్ కి రీసెంట్ గా పెళ్ళైన విషయం తెలిసిందే. ఆయన భార్య పేరు ఐశ్వర్య. ఐతే ఈ ఎపిసోడ్ కి ఆకర్ష్ ఒక రెడ్ జాకెట్ వేసుకొచ్చాడు. దాని మీద ఆర్ అనే లెటర్ ఉండేసరికి శ్రీముఖికి దొరికిపోయాడు. "మీ ఆవిడ పేరు ఐశ్వర్య కదా మరి నీ జాకెట్ మీదకు రోహిణి ఎందుకొచ్చింది" అని అడిగేసింది. "అంటే ఐశ్వర్య నా లైఫ్ లో ఉంది.

రోహిణి నా జాకెట్ మీదైనా ఉంటుంది" అని ఆన్సర్ ఇచ్చాడు. దానికి శ్రీముఖి "అమ్మో రోహిణి ఒకరు గదిలో, ఒకరు మదిలో" అంటా అని హడావిడి చేసింది. తర్వాత అబ్బాయిలకు అమ్మాయిలకు పోటీలు పెట్టింది. ఐతే పవిత్ర, కావ్య మీ ఇద్దరూ ఒక అబ్బాయిని డిసైడ్ చేసుకోండి. అని శ్రీముఖి అడిగేసరికి 'బాలు" అని అన్నారిద్దరూ.. దాంతో అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే నిఖిల్-కావ్య జోడీ అన్న విషయం తెలిసిందే ఐతే నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్ళాడు. ఇప్పుడు కావ్య సింగల్ గా ఉండిపోయింది. ఇక ఇప్పుడు బాలు-కావ్య వచ్చే గేమ్ ఆడారు. ఈ జోడిని ఇలా స్క్రీన్ మీద చూడడం ఫస్ట్ టైం అంటూ శ్రీముఖి అనేసరికి అందరూ నవ్వేశారు. ఇక ఆ గేమ్ లో కావ్య ఓడిపోయింది. ఇక శ్రీముఖి "ఏంటి కావ్య బాయ్స్ కి పాయింట్ ఇద్దామనుకుంటున్నావా" అని అడిగింది. దానికి కావ్య "పది సెకన్లు బాలుతో గేమ్ ఆడేసరికి మైండ్ డిస్ట్రాక్ట్ ఐపోయింది" అని చెప్పింది. దానికి బాలు "అవునా" అని అడగడం భలే క్యూట్ గా అనిపించింది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.