English | Telugu

ఆయ‌న త‌ప్పు చేయ‌డు.. భర్త అరెస్ట్ పై శ్యామల రియాక్షన్!

ఓ మహిళను మోసం చేసిన ఛీటింగ్ కేసులో యాంకర్ శ్యామల భర్త నరసింహారెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తన వద్ద కోటి రూపాయలు తీసుకొని లైంగిక వేధింపులకు గురి చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదైంది. అయితే ఈ వ్యవహారంపై యాంకర్ శ్యామల మీడియాతో మాట్లాడారు. తన భర్త తప్పు చేయడని.. ఇది తప్పుడు కేసు అని చెప్పారు. తనకు కూడా అరెస్ట్ విషయం మీడియా ద్వారానే తెలిసిందని.. అయితే ఇవి తప్పుడు ఆరోపణలు అని మాత్రం కచ్చితంగా చెప్పగలనని వెల్లడించారు. కోటి రూపాయల కోసం ఓ ఆడపిల్లను మోసం చేయాల్సిన అవసరం కానీ.. అలాంటి వ్యక్తిత్వం కానీ తన భర్తది కాదని నమ్మకంగా చెప్పారు.

తన పదేళ్ల సంసార జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నానని.. తన భర్త డబ్బుల కోసం అమ్మాయిలతో ఆడుకునే మనిషి కాదని అన్నారు. త్వరలోనే నిజం అందరికీ తెలుస్తుందని.. అప్పటివరకు తప్పుడు ఆరోపణలపై న్యూస్ ప్రసారం చేయొద్దని రిక్వెస్ట్ చేశారు. ఒక అమ్మాయి కేసు పెట్టింది కాబట్టి నిజానిజాలు విచారించకుండా... అరెస్ట్ చేస్తారనే నాలెడ్జ్ తనకు ఉందని.. కానీ నిజమేంటో అందరికీ త్వరలోనే తెలుస్తుందని అన్నారు. తనకు కొంచెం సమయం ఇస్తే జరిగిన విషయాల గురించి తెలుసుకుంటానని.. పోలీసుల వైపు నుండి తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పుకొచ్చారు.

ఏదేమైనా.. తను మాత్రం తన భర్త వైపున నిలబడతానని స్పష్టం చేశారు. ఓ మహిళతో నరసింహకు చాలా కాలంగా సంబంధం ఉందని.. గొడవలు జరుగుతున్నాయని ప్రచారం చేస్తున్నారని.. తనకు ఈ ఇష్యూ గురించి ఇప్పటివరకు తెలియదని వెల్లడించారు. అయితే ఇది తప్పుడు కేసు కాబట్టి పెద్దగా వర్రీ అవ్వడం లేదని.. త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు తెలియజేస్తానని తెలిపారు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.